Political News

జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న స్టార్ట్‌.. అంతా ఉత్కంఠే..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. రేపు(శ‌నివారం) ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదంతా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిందన్న ప్రభుత్వ ప్రచారం, కొన్ని రిపోర్టులు, అధికారుల వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న పర్యటన కావడం గ‌మ‌నార్హం. పైగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తొలిసారి తిరుమలకు వెళ్లడం ఉత్కంఠ‌గా మారింది. తిరుమల అపవిత్రం అయిందన్న వార్తల నేపథ్యంలో హిందూ సంఘాలు, బిజెపి నేతల నుంచి తీవ్రస్థాయిలో …

Read More »

ప్రభుత్వ మద్యం షాపులు రద్దుకు ఆర్డినెన్స్

వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం అంటూ నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల నుంచి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అదీగాక, వైసీపీ నేతలకు చెందిన మద్యం కంపెనీల నుంచి నాసిరకం మద్యాన్ని…ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. అంతేకాదు, మద్యం అమ్మకాలకు చెందిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి. …

Read More »

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న జగన్?

వైసీపీ హయాంలో తిరుమల లడ్డు నాణ్యత దెబ్బ తినడం, నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసినపుడు ఈ విషయం ఇంత చర్చనీయాంశం అవుతుందని ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ అది జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారి తీసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో భక్తితో కొలిచే వేంకటేశ్వరస్వామికి సంబంధించిన ప్రసాదం విషయంలో తప్పు జరిగిందనేసరికి భాష, ప్రాంత భేదం లేకుండా హిందూ …

Read More »

సాయిరెడ్డికి అచ్చెన్న కౌంటర్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. సాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారని అచ్చెన్న సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే అచ్చెన్నపై సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడుకు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% దేవుడు ఇచ్చాడంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. మోకాలికి, బోడి గుండుకు …

Read More »

బాలినేనిని పవన్ కాపాడలేరు: దామచర్ల

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరబోతున్న నేపథ్యంలో ఒంగోలులో ఫ్లెక్సీ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు బాలినేని ఫ్లెక్సీలు కలిపి వేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు చింపి వేశాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా బాలినేనికి మరో షాక్ తగిలింది. జనసేనలో చేరినా బాలినేనిని వదిలిపెట్టమబోమంటూ దామచర్ల …

Read More »

ఆర్పీ నోటికి తాళాలు వేయాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముంగిట, తర్వాత కూటమి తరఫున బలంగా వాయిస్ వినిపించడం ద్వారా పాపులర్ అయిన వ్యక్తులు కిర్రాక్ ఆర్పీ ఒకడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి.. ఆ తర్వాత నెల్లూరు చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్లు తెరిచి పాపులర్ అయ్యాడు ఆర్పీ. ఎన్నికల ముంగిట అతను తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆ పార్టీతో పాటు జనసేనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాడు. మాజీ మంత్రి రోజాతో …

Read More »

‘దీక్షా’ దక్షుడు.. ప‌వ‌న్‌కు పెరిగిన గ్రాఫెంత‌..?

ప్రాయ‌శ్చిత్త దీక్ష‌తో తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ వ్య‌వ‌హారాన్ని ద‌శ దిశ‌ల‌కూ తీసుకువెళ్లే ప్ర‌య త్నం చేశారు.. జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదంలో అత్యంత దారుణ‌మైన క‌ల్తీ జ‌రిగింద‌న్న ప్ర‌భుత్వ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో దీనిపై కార్యాచ‌ర‌ణ‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రూపొందించుకు న్న ప‌వ‌న్ ఆవెంట‌నే దీక్ష‌కు దిగారు. అయితే.. ఈ దీక్ష‌పై రెండు రూపాల్లో స్పంద‌న వ‌చ్చింది. కొంద‌రు దీనికి అనుకూలంగా మాట్లాడారు. ఇదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు …

Read More »

తొందరపడొద్దు..ఆ నేతలకు చంద్రబాబు పిలుపు

నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలకు చెందిన ఆశావహులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వర్గాలు, సామాజిక సమీకరణాలు పార్టీలు పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు నిన్న నామినేటెడ్ పదవుల కేటాయింపులను ప్రకటించారు. 99 మందికి నామినేటెడ్ పదవులు కేటాయించగా…20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు చంద్రబాబు. అయితే, తమకు పదవులు దక్కకపోవడంతో కొంతమంది ఆశావహులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే వారిని …

Read More »

బాబు బ్రాండ్ పవర్‌ ఇది.. మరి జగన్ ఉంటే?

విజయవాడను వరదలు ముంచెత్తి నెల రోజులు కావస్తోంది. వరదల సమయంలో భారీగా ఆస్తినష్టం చోటు చేసకుంది. ప్రాణనష్టమూ జరిగింది. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడిందో అందరూ చూశారు. 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు పగలూ రాత్రి తేడా లేకుండా గ్రౌండ్లో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. విజయవాడ కోలుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేశారు. ఎ న్నడూ లేని స్థాయిలో నష్టపరిహార ప్యాకేజీని కూడా …

Read More »

పోల్ దెబ్బకు.. రోజా గుడ్‌బై

గత ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలందరికీ ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. అధికారంలో ఉండగా విర్రవీగి ప్రవర్తించడంతో జనాలకు వాళ్ల మీద వెగటు పుట్టింది. దీంతో ఎన్నికల్లో వారికి దిమ్మదిరిగే ఫలితాన్ని అందించారు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా వైసీపీ మీద వ్యతిరేకత ఏమీ తగ్గిన సంకేతాలు కనిపించడం లేదు. వైసీపీ హయాంలో విపరీతమైన నెగెటివిటీ తెచ్చుకున్న నేతల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ …

Read More »

జగన్ కు మరో షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన వైసీపీ అధినేత జగన్…అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకు కూడా మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే మునిగిపోతున్న నావ వంటి వైసీపీ నుంచి బయట పడేందుకు చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పార్టీకి, రాజ్యసభ సభ్యత్వాలకు …

Read More »

వరద బాధితుల ఖాతాల్లో పరిహారం జమ: చంద్రబాబు

భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల‌ వల్ల విజయవాడ నగరం కొద్ది రోజుల క్రితం చిగురుటాకులా వణికి పోయిన సంగతి తెలిసిందే. వరదలకు తోడు బుడమేరు వాగు పొంగడంతో బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. అయితే, అంత కష్టంలో ఉన్న తన ప్రజలను కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడం, ఏడు పదుల వయసులోనూ వరద నీటిలో దిగి బాధితులకు నేనున్నాను అని భరోసానివ్వడంతో వారంతా ధైర్యంతో ఆ విపత్తును ఎదుర్కొన్నారు. …

Read More »