ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ తరపున 2.15 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ఇక ఈ డబ్బులు వ్యూస్ ప్రకారం చెల్లించాలన్న ఒప్పందం మేరకు చెల్లింపులు జరిగాయని చెప్పారు. అయితే, ఆ సినిమాకు …
Read More »పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, కొన్నిసార్లు తన దూకుడుకు కళ్లెం వేయలేక అంబటి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఇదే దూకుడు చూపించిన అంబటిపై గుంటూరు పోలీసులు కేసు పెట్టారు. తాము ఇచ్చిన కంప్లయింట్ లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ పట్టాభిపురం పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగడంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రతిపక్ష …
Read More »రాహుల్తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గురువారం పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో సారంగి కిందపడి తలకు గాయమైంది. సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. సారంగి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ …
Read More »అమిత్ షాకు షర్మిల కౌంటర్
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ పేరు పదే పదే ప్రస్తావించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందని, దాని బదులు ఏదైనా భగవంతుడి పేరు స్మరిస్తే మోక్షం లభిస్తుందని షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే షా వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంబేద్కర్ అమిత్ …
Read More »పార్లమెంటు ముందే అధికార-ప్రతిపక్షాల నిరసన
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన.. అందరూ విచారించాల్సిన ఘటన చోటు చేసుకుంది. భారత పార్లమెంటు ముందు.. భవనం పైకి కూడా ఎక్కి అధికార-ప్రతిపక్షాల సభ్యులు పోటా పోటీగా నిరసనకు, ఆందోళనకు దిగారు. ఇలా జరగడం 75 సంవత్సరాల పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా ప్రభుత్వ పక్షాన్ని విమర్శిస్తూ.. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతాయి. కానీ, …
Read More »ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై అలాగే ప్రజాప్రతినిధుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివక్ష చూపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, వివక్షతో వ్యవహరించడం సరికాదని స్పష్టంగా చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కల్పించిన సౌకర్యాలను ఇప్పుడు టీటీడీ ఉపేక్షించడంతో తీవ్ర అసంతృప్తి …
Read More »వైసీపీని ఎవరు నమ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంలో కాకుండా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో కనుక ఇండియా కూటమి ఉంటే.. తమ ఆలోచన ఆదిశగా మళ్లడం తప్పులేదని కూడా చెప్పారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ వైఖరిపై చర్చ …
Read More »‘టీడీపీ తలుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్.. అధికార పార్టీ నేతలు.. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషలతో కలిసి పాల్గొన్న కార్యక్రమం రాజకీయంగా మంటలు పుట్టించిన విషయం తెలిసిందే. దీని నుంచి ఇంకా బయటకు రాకముందే.. తాజాగా మరో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన …
Read More »18 ఏళ్ల తర్వాత పరిటాల రవి హత్య కేసులో బెయిల్
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు. కొందరు ఆయన మావోయిస్టులతోనూ పనిచేశారని చెప్పుకొనేవారు. దీనిని ఆయన కూడా దృవీకరించారు. అయితే.. వారి విధానాలు నచ్చక.. తాను ప్రజల కోసం బయటకు వచ్చానని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పరిటాల రవి సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లాలోని …
Read More »ఎమ్మెల్యేలకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీకి వచ్చే ముందు సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీష్ …
Read More »విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేశాం: కేంద్రం
ఆర్థిక నేరస్తుడు.. ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త.. కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు.. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. బుధవారం లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. విజయ్ మాల్యా.. ఆర్థిక నేరాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని తెలిపారు. వివిధ బ్యాంకులకు ఆయన ఎగవేసిన విషయం వాస్తవమేనని తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా ఆస్తులను అమ్మేసి.. …
Read More »రోడ్డెక్కిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో చిత్రమైన రాజకీయం తెరమీదికి వచ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయకులు మంత్రులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అంతేకాదు.. పాదయాత్ర కూడా చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. భారీ బ్యానర్లతో నాయకులు, మంత్రులు ముందుకు కదలిలారు. ఈ పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రముఖ పారిశ్రామిక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates