ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి ప్రాణం రాగా… ఆ తర్వాత అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల లభ్యతకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించిన దాని కంటే మంచి మద్దతు లభించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణానికి కేంద్రం గ్యారెంటీ ఇవ్వగా… కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హడ్కో నుంచి రూ.11 వేల …
Read More »దావోస్ లో కాలి నడకన నారా లోకేశ్
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడికి చేరాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల వారూ అక్కడికి వచ్చారు. నాలుగు రోజులు మాత్రమే జరిగే ఈ సమావేశాల్లో ఒక్కో క్షణం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు ట్రాఫిక్ జాం అయితే…గుండెలు గుబగుబలాడటం ఖాయమే. …
Read More »మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్కు చంద్రబాబు ఆహ్వానం
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తాజాగా భేటీ అయ్యారు. భారత కాల మానం ప్రకారం బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో స్విట్జర్లాండ్ లోని దావోస్లో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఏపీకి, ముఖ్యంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేకం కావడం విశేషం. ఈ క్రమంలో బిల్ గేట్స్తో తనకు …
Read More »శారదా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ అనేక రాజకీయాలు సాగాయి. వైసీపీ అధినేత జగన్ సైతం ఆయన కనుసన్నల్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలా.. వైసీపీ స్వామిగా పేరొందిన స్వరూపానందేంద్రకు తాజాగా హైకోర్టు లో భారీ షాక్ తగిలింది. తిరుమలలో ఆయనకు వైసీపీ హయాంలో కేటాయించి భూమి విషయంపై హైకోర్టు తీవ్రంగా …
Read More »ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా సత్తా చాటిన యంగ్ పొలిటీషియన్ గానూ మనందరికీ చిర పరచితులే. సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబుకు రాజకీయ విరోధిగా సాగిన గల్లా అరుణ కుమారి కుమారుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయదేవ్.,.. తన ఫ్యామిలీని టీడీపీకి చేరువ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ …
Read More »బాబు, రేవంత్ మరో సీఎం.. ఫోటో వైరల్
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఈ సమావేశాలకు హాజరు అవుతూ పెట్టుబడుల వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సీఎంలు దావోస్లో సమావేశం కూడా అయ్యారు. అయితే, తాజాగా ఈ ఇద్దరితో పాటు మరో సీఎం సమావేశమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దావోస్ లో …
Read More »కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని కమిషన్ ముందు వెల్లడించారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ అంశంపై విచారణ చేపట్టగా, వి.ప్రకాశ్ 101వ సాక్షిగా హాజరై తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయించారు. తన వద్ద ఉన్న కీలక సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా గతంలోనే స్టేట్మెంట్, నోట్ సమర్పించినట్లు వెల్లడించిన ప్రకాశ్, ప్రాజెక్టు ప్రణాళికలు, …
Read More »తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ న్యాయ విచారణ జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి… 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు …
Read More »హిందూపురం సర్వతోముఖాభివృద్ధికి కృషి: బాలయ్య
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులకు మంచి మాస్ మసాలాతో అలరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అఖండ సీక్వెల్ కోసమూ రెడీ అయిపోతున్న బాలయ్య,.. కాస్తంత గ్యాప్ దొరకబుచ్చుకుని తన సొంత నియోజకవర్గం హిందూపురం వచ్చారు. మంగళవారం ఉదయానికే హిందూపురం చేరిన ఆయన బుధవారం రెండో రోజు కూడా …
Read More »రాహుల్ వర్సెస్ ఖర్గే.. కాంగ్రెస్లో కలకలం!
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. వారే.. ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే.. మరొకరు పార్టీ అగ్రనేత, పార్లమెంటు లో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇద్దరి మధ్య గత రెండు మాసాలుగా పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్న మాట వాస్తవమే. …
Read More »‘షా’ మాటలు హుష్.. బీజేపీ నేతలు మారరా?
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ సమీపంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్తో చర్చించారు. ఇదేసమయంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులతోనూ మాట్లాడారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. కానీ, ఈ విషయం ఇంకా బీజేపీ …
Read More »వలసలపై ట్రంప్ నిర్ణయం.. అమెరికాకు చేటేనా?
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ఏం చేసినా చెల్లుతుంది. కానీ, అధికారంలోకి వచ్చాక.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ, ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం.. సొంత దేశానికి చేటు తేవడం ఖాయమని అంటున్నారు అదే దేశానికి చెందిన ఆర్థిక నిపుణులు. అక్రమ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates