Political News

రేవంత్ వీల్లందరినీ ఎలా కంట్రోల్ చేస్తారు?

తెలంగాణలో రాక రాక వ‌చ్చిన అధికారం.. అనేక ఆశ‌లు, హామీల‌తో చేప‌ట్టిన అధికారం.. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప‌రిపాల‌న‌. అంతా బాగానే ఉంది. విప‌క్షాల దూకుడుకు.. అడ్డుక‌ట్ట వేస్తూ.. మాట‌ల యుద్ధాన్ని, అభివృద్ధి ప‌థాన్ని కూడా కొన‌సాగిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే.. పానకంలో పుడ‌క‌ల్లా.. సొంత పార్టీ నాయ‌కుల నుంచి వ‌స్తున్న ఈటెల్లాంటి మాట‌లు.. ప‌దునైన విమ‌ర్శ‌లు ఇప్పుడు రేవంత్‌రెడ్డికి …

Read More »

ఏపీ కేబినెట్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. సీఆర్ డీఏ ప‌రిధి పెంపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో భేటీ అయిన‌.. కేబినెట్ ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. దీనిలో ప్ర‌ధానంగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిని పెంచుతూ.. విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల ఉన్న ప్రాంతాల‌ను, గుంటూరు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప‌లు ప్రాంతాల‌నుకూడా దీని కింద‌కు తీసుకువ‌స్తూ.. నిర్ణ‌యించింది. మొత్తంగా మ‌రో 8,352 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల మేర‌కు సీఆర్ డీఏ ప‌రిధిని కేబినెట్ పెంచ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా ప్రాంతాలు కూడా రాజ‌ధాని ప‌రిధిలోకి వ‌స్తాయి. …

Read More »

అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా కొనసాగాయి. భారత సంతతికి చెందిన కమలా హరీస్ గెలవాలని చాలామంది ఇండియన్స్ కోరుకున్నారు. నిజానికి ఆమె గెలిస్తే ఒక చరిత్ర అయ్యేది. ఇక అమెరికా రాజకీయాల్లో మన తెలుగు కనెక్షన్లు ఉండడం మరింత విశేషం. మొత్తానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఆయన మరోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన …

Read More »

భీమ‌వ‌రంలో ఐటీ దాడులు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కాపు నేత‌, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలోని శ్రీనివాస్ నివాసంలో బుధ‌వారం ఉదయం 10 గంట‌ల నుంచి త‌నిఖీలు చేప‌ట్టారు. లోప‌ల ఉన్న‌వారిని లోప‌లే ఉంచేసి.. బ‌య‌ట నుంచి ఎవ‌రూ రాకుండా కాప‌లా పెట్టి మ‌రీ ఈ తనిఖీలు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఒక్క గ్రంధి శ్రీనివాస్ ఇల్లే కాకుండా.. ఆయ‌న‌కు సంబంధించిన …

Read More »

రోడ్డెక్కిన ష‌ర్మిల‌.. ఈసారి రీజ‌న్ ఇదే!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ఫైర్‌బ్రాండ్ ష‌ర్మిల మ‌రోసారి రోడ్డెక్కారు. అయితే.. ఈ ద‌ఫా త‌న‌కు, త‌న కుటుంబానికీ త‌న సోద‌రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్యాయం చేశార‌ని, ఆస్తులు ఇవ్వకుండా ఎగ్గొట్టార‌ని మాత్రం కాదు. కూట‌మి స‌ర్కారు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీల‌ను కార్న‌ర్ చేసుకుని ఉద్య‌మించేం దుకు ఆమె విజ‌య‌వాడ‌లోని ధ‌ర్నా చౌక్‌లో రోడ్డుపై కూర్చున్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు 17 వేల కోట్లను వెంటనే రద్దు …

Read More »

పవన్ ఎఫెక్ట్.. పోలీసులు అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం గురించి ప్రస్తావిస్తూ హోం మంత్రి అనిత చురుగ్గా వ్యవహరించకపోతే ఆ శాఖను తాను చేపట్టాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు. ఈ వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతర్గతంగా చర్చించాల్సిన విషయాల గురించి పవన్ ఇలా ఓపెన్‌గా మాట్లాడడాన్ని కొందరు …

Read More »

పిఠాపురంలో భూమి కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. రీజ‌నేంటి?

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో తాజాగా 12 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. పిఠాపురం మండ‌లంలోని ఇల్లింద్రాడ రెవెన్యూ ప‌రిధిలో ఉన్న భోగాపురంలో ఆయ‌న 12 ఎక‌రాల‌ను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాలు తాజాగా పూర్తి చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌ఫున పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న జ‌న‌సేన నాయ‌కుడు తోట సుధీర్ రిజిస్ట్రేష‌న్ …

Read More »

‘పంచ్’ ప‌డుతోంది… ప్ర‌భాక‌ర్‌పై కేసు!

పంచ్ ప్ర‌భాక‌ర్‌.. ఈ పేరు గ‌త వైసీపీ హ‌యాంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికా, భార‌త్‌లోనూ పెద్ద ఎత్తున వినిపించింది. హైకోర్టులోనూ కేసులు విచార‌ణ ప‌రిధిలో ఉన్నాయి. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ అండ‌తో ఆయ‌న త‌ప్పించుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం కూట‌మి స‌ర్కారు క‌న్నెర్ర చేస్తోంది. దీంతో పంచ్ ప్ర‌భాక‌ర్‌కు పంచ్ ప‌డే స‌మ‌యం వ‌చ్చేసింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎక్క‌డున్నా ప్ర‌భాక‌ర్‌ను ఏపీకి తీసుకువ‌స్తామ‌ని.. డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల …

Read More »

రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేస్తాం: రాహుల్‌

దేశంలో రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి 50 శాతంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏ రిజ‌ర్వేష‌న్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వ‌డానికి వీల్లేదు. దీనిపైకోర్టు తీర్పులు, రాజ్యాంగ ప‌రిమితులు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితిని ఎత్తేయనున్న‌ట్టు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. బుధ‌వారం(న‌వంబ‌రు 6) నుంచి రాష్ట్రంలో కుల …

Read More »

అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందే.. టీడీపీ స్ట్రాట‌జిక్ స్టెప్‌!

మ‌రో వారంలో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి పూర్తిగా బ‌డ్జెట్ స‌మావేశాలేన‌ని కూట‌మి స‌ర్కారు చెబుతోంది. వ‌చ్చే మార్చి వ‌ర‌కు అంటే ఐదు మాసాల‌కు సంబంధించి 90- ల‌క్ష కోట్ల రూపాయ‌ల తో ఈ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అయితే.. ఈ స‌మావేశాల‌కు వైసీపీ వ‌స్తుందా? రాదా? అనేది ఒక‌వైపు చ‌ర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. ఈ స‌మావేశాల‌కు ముందే.. వైసీపీకి భారీ షాక్ ఇచ్చేందుకు టీడీపీ రెడీ అవుతున్న‌ట్టు …

Read More »

‘ప్ర‌జ‌ల ఆస్తులు దోచుకుని… ‘

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్నాళ్లుగా జ‌గ‌న్‌, ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల మ‌ధ్య ఆస్తుల వివాదాలు ర‌గులుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలోనూ చ‌ర్చ సాగింది. ఈ విష‌యాల‌ను తాజాగా ప్ర‌స్తావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌జ‌ల ఆస్తులు దోచుకుని, వాటిని తమ సొంత ఆస్తులు అంటూ వైఎస్ కుటుంబ స‌భ్యులు కోట్లాడుకుంటున్నారు.. అని వ్యాఖ్యానించారు. …

Read More »

బీఆర్ఎస్ భ‌లే స్కెచ్.. రాహుల్ ను ఆడుకుంటోందిగా

రాజ‌కీయాల్లో త‌ప్పొప్పులు అనేవి ఉండ‌వు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయ‌కుడికి… త‌దుప‌రి అదే ప‌నిని త‌న ప్ర‌త్య‌ర్థి చేస్తే ఏ మాత్రం జీర్ణించుకోలేరు. పైగా నీతి వాక్యాలు, రాజ్యాంగ సూత్రాలు, సామాజిక అంశాలు, అనుబంధాలు, ఆత్మీయ‌త‌లు వంటి ఎన్నో అంశాలు ప్ర‌వ‌చిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పాల‌న‌, బీఆర్ఎస్ కౌంట‌ర్లు చూస్తున్న వారికి స‌రిగ్గా ఇలాంటి ఫీలింగే క‌లుగుతోంది. ఒక‌పార్టీ చేసింది త‌ప్పుప‌ట్టిన పార్టీ తిరిగి …

Read More »