ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంది. పోటీ చేసింది ఒకే ఒక్క అభ్యర్థి అయినప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కడం.. అందునా 22 ఓట్లు వస్తే.. సరిపోతుందని భావించినా.. ఏకంగా 23 ఓట్లు దక్కించుకోవడం.. వంటివి.. టీడీపీ శిబిరంలో భారీ ఎత్తున జోష్ నింపిందనే చెప్పాలి. ఇదంతా.. చంద్రబాబు విజన్కు దర్పణంగా నిలిచిందని అంటున్నారు. వాస్తవానికి ఏమాత్రం అంచనాలు లేకుండానే టీడీపీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్.. టీడీపీలో సంబరాలు..
ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న టీడీపీ కార్యాలయాల్లో సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేయడమే ఎక్కువ అనే స్థాయి నుంచి విజయం దక్కించుకునే పరిస్థితి కి పార్టీ చేరడం అంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీకి భారీ ఎత్తున ఆక్సిజన్ అందించినట్టుగానే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా.. పార్టీ రంగంలోకి దగింది. భారీ ఎత్తున ఓట్లు …
Read More »సొంత ఎమ్మెల్యేలే షాక్.. తీవ్ర సంకటంలో వైసీపీ!
ఔను.. ఈ పరిస్థితిని వైసీపీ అధినేత, సీఎం జగన్ అస్సలు ఊహించి ఉండరు. ఎందుకంటే.. ఇటీవలే ఉత్తరాంధ్ర, రాయలసీమ తూర్పు, పశ్చిమ ప్రాంతాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే.. దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. ఇది అసలు ఎన్నికే కాదని… తమ నుంచి పథకాలు అందుకుంటున్న ప్రజలు తమకు అనుకూలంగానే ఉన్నారని.. వైసీపీ నేతలు భాష్యం చెప్పారు. దీంతో సరేలే.. వైసీపీ చెప్పిన దానిలోనూ …
Read More »వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు ను కూడా కోల్పోయేది లేదని పేర్కొంటూ వచ్చిన వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. సాధారణంగా అభ్యర్థి గెలుపునకు 22 ఓట్లు సరిపోతుండగా.. టీడీపీకి ఇప్పటి వరకు 23 ఓట్లు రావడం గమనార్హం. అదేసమయంలో వైసీపీ అభ్యర్థులకు కేవలం 22 ఇద్దరికి 21 చొప్పున …
Read More »అప్పుడు.. ఇప్పుడు సేమ్ టు సేమ్.. పంచుమర్తి విజయం వెనుక!
నిజమే.. ఏపీలో ఇప్పుడు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే.. రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడుకుంటే.. టీడీపీ తరపున 23 ఓట్లు సాధించిన భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పంచుమర్తి అనురాధకు న్యాయం జరిగిందని అంటున్నారు పరిశీలకులు. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అన్నట్టుగా.. ఆమె ఎప్పటి నుంచో ఒక టర్న్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఇప్పటి దాకా ఎదురు చూపులే సరిపోయాయి. ఇక, ఇప్పుడు ఆమెకు …
Read More »రెంటికి చెడ్డ రేవళ్లు..
రాజకీయాల్లో ఉన్న వారికి ఆశ ఎక్కువగా ఉంటుంది. పదవుల కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. పార్టీలు మారైనా రాజకీయంగానూ, ఆర్థికంగానూ లబ్ధిపొందాలనుకుంటారు. ప్రతీ సారి జరిగేది అదే అయినా ఈసారి ఏపీలో మాత్రం కొందరి ఆశలు ఆవిరైపోయాయి. అనుకున్నదొక్కటీ.. ఐనదొక్కటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన …
Read More »దిల్లీ వెళ్లేందుకు కేసీఆర్ భయపడుతున్నారా?
కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ అధినేతగా మారినా కూడా తన ఫాంహౌస్ను, హైదరాబాద్ను వదిలి దూరం వెళ్లడం లేదు. ముఖ్యంగా దేశ రాజకీయాలను మార్చేస్తానంటున్న ఆయన దేశ రాజధాని దిల్లీ వెళ్లేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. అక్కడ తమ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పనులు జోరుగా సాగుతున్నా… తనతో కలిసి నడుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో శాంతిభద్రతల సమస్య తలెత్తినా అటువైపు చూడడం లేదు.. దేశ రాజకీయాల …
Read More »మంత్రులపై జగన్ ఆగ్రహం
వైసీపీ నేతలు ఎంత మరిచిపోదామనుకున్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బాధను పంటి బిగువున నొక్కేసుకుంటున్నారు. పైగా ఎన్నికల తర్వాత టీడీపీ స్పీడ్ పెంచడంతో పుండు మీద కారం చల్లినట్లవుతోంది. పైగా వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రచారం బెడిసి కొట్టిందని కూడా టాక్ నడుస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో 7 లక్షల 70 వేల మంది ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికలు సెమీ …
Read More »రాహుల్కు రెండేళ్ల జైలు..
కాంగ్రెస్ ముఖ్య నేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి, రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 ప్రకారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తున్నట్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్. హెచ్ వర్మ …
Read More »స్పీకర్ తమ్మినేని ఆ మరక అంటించుకుంటారా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ స్పీకర్ ఒక టీడీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన పాత రాజీనామా లేఖను ఆమోదించారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలాకాలం కిందట టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే.. ఉప ఎన్నిక వస్తే తమకు ఇబ్బంది అనే కోణంలో అప్పట్లో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ …
Read More »అర్ధరాత్రి హోటల్ నుంచి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్మేలు..
ఎమ్మెల్సీ ఎన్నికలు పాలక వైసీపీకి పీడకలగా మారేలా ఉన్నాయి. ఇప్పటికే పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు మూడూ పోగొట్టుకున్న పాలక వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికలోనూ ఏడో సీటును టీడీపీకి అప్పగించేలా కనిపిస్తోంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటూ తమ ఎమ్మెల్యేలందరినీ విజయవాడలో హోటళ్లలో ఉంచి కట్టుదిట్టమైన కాపలా పెట్టారు. అయినా కూడా గత అర్ధరాత్రి నలుగురు ఎమ్మెల్యేలు హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ తరువాత వారి …
Read More »టీడీపీకి ఓటేయనున్న 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు?
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. 151 మంది సొంత ఎమ్మెల్యేలు, అయిదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో 156 మంది బలగంతో ఏడుకు ఏడు ఎమ్మెల్సీ సీట్లూ గెలవాలని వైసీపీ పట్టుదలగా ఉండగా… ఒక్క సీటు తాము గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటేయకుండా టీడీపీ ఆపగలదా… అలాగే వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు తమకు దెబ్బేయకుండా వైసీపీ ఆపగలదా అనేది చర్చనీయమవుతోంది. …
Read More »