Political News

మళ్లీ జగన్ సీఎం అవ్వలంటే యాగం చెయ్యాల్సిందేనా?

jagan

జగన్ మళ్లీ అధికారానికి రావాలి. ఏదోటి చేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. దీని కోసం ఇప్పుడాయన కొత్త రూటు వెదుక్కున్నారు. అదే దేవుడ్ని నమ్ముకున్న రూటు. యాగాల రూటు.. ఏపి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 12 నుండి 17 వరకూ నిర్వహిస్తన్న రాజశ్యామల యాగంపై విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తన్నాయి. ఆ యాగాన్ని రాష్ట్రం పాడిపంటలతో సుభీక్షంగా ఉండేందుకు చేస్తున్నామని చెపుతున్నా… జగన్ …

Read More »

దానం నాగేందర్ కు షాక్ తప్పదా ?

అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ప్లానింగ్ తుది దశకు చేరుకుంది. కొన్ని చోట్ల సిట్టింగుల వైపే మొగ్గు చూపుతున్న పార్టీ అధినేత కేసీఆర్ మరికొన్ని చోట్ల మాత్రం వారికి ఝలక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇటీవలే పార్టీ మీటింగులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సిట్టింగుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారని వారిని సహించేది లేదని కేసీఆర్ తేల్చేశారు. పద్ధతి మార్చుకోకపోతే టికెట్ దక్కదని హెచ్చరించారు. కేసీఆర్ పునరాలోచనలో …

Read More »

ఒక్క సీటు కూడా గెలవం – మోదీకే చెప్పేసిన నేతలు

ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మొదటి నుంచి ఆగమ్య గోచరంగానే ఉంది. ఎవరి పంచనో చేరి నాలుగు సీట్లు సంపాందించుకుని ఎంజాయ్ చేయడం మినహా సొంత బలం పై ఎప్పుడూ గెలిచింది లేదు. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు. ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ప్రస్తుతం ఒక సీటు కూడా లేదు కదా…. 2024 ఎన్నికల్లో ఎంత మంది …

Read More »

గవర్నర్ పై డోసు పెంచుతున్న బీఆర్ఎస్

గవర్నర్ తమిళిసై పై మంత్రులు, బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఆరోపణల తీవ్రతను పెంచుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ గవర్నర్ ను డైరెక్టు ఎటాక్ చేస్తుండటం గమనార్హం. తాజాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ తరపున పోటీ చేయమని సూచించారు. పైగా సిద్దిపేటలోనే పోటీ చేయమని చాలెంజ్ కూడా చేశారు. హరీష్ సూచన, చాలెంజ్ లోనే తీవ్రత ఏమిటో అర్ధమవుతోంది. గవర్నర్ గా ఉన్నపుడు రాజకీయాలకు అతీతంగా ఉండాలని …

Read More »

హీరోలకు సమ్మర్ భయం

కొన్ని సీజన్స్ షూటింగ్స్ కి ఇబ్బందే. వాటిలో వర్షాకాలం సంగతి చెప్పనక్కర్లేదు. అంతా రెడీ అనుకునే లోపు వర్షాలు కొంప ముంచేస్తాయి. సమ్మర్ కూడా అంతే. యాక్టర్స్ వేడిని తట్టుకుంటూ ఏసీలు లేకుండా అవుట్ డోర్ షూటింగ్స్ చేయలేరు. ఇప్పుడు స్టార్ హీరోలంతా అదే భయంతో ఉన్నారు. మొన్న నాలుగు రోజులు ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడంతో అల్మోస్ట్ హీరోలంతా బ్రేక్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఇక మహేష్ బాబు …

Read More »

బీజేపీ ఓటుబ్యాంకుపై కాంగ్రెస్ కన్ను

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓటుబ్యాంకుపై గట్టిగానే కన్నేసింది. బీజేపీకి ముంబై కర్నాటక ప్రాంతం చాలా కీలకం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏడు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే లింగాయతుల ఓటు బ్యాంకే. పై 50 నియోజకవర్గాల్లో లింగాయతులే గెలుపోటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. లింగాయతులు ఎవరికి ఓట్లేస్తే ఆ పార్టీయే గెలుస్తుందనటంలో సందేహంలేదు. మొదట్లో లింగాయతులు …

Read More »

జూనియర్ ఎన్టీఆర్‌పై లోకేష్ కామెంట్ వైరల్

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి, నారా కుటుంబాలు వ్యవహరించే తీరు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుంటుంది. హరికృష్ణ రెండో భార్య కొడుకైన తారక్‌ను మొదట్లో ఈ రెండు కుటుంబాలూ దూరంగానే పెట్టినట్లు కనిపించేది. కానీ తర్వాత అతను అందరికీ దగ్గరయ్యాడు. ఇటు బాలయ్యతో, అటు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగాడు. 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో కొంత కాలం క్రియాశీలంగా వ్యవహరించాడు. పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాడు. కానీ …

Read More »

షర్మిలకు చాలా కష్టంగా ఉందట

తెలంగాణాలో ఎంట్రీ ద్వారా ఏదో అద్భుతాలు చేసేద్దామని అనుకుని వైఎస్ షర్మిల చాలా ప్లాన్లు వేసుకున్నారు. అయితే కాలం గడిచేకొద్దీ ఆమె ప్లాన్లు ఏవీ వర్కవుటవుతున్నట్లు లేదు. ఎందుకంటే షర్మిల పార్టీ పెట్టి ఏడాది దాటిపోయినా ఇంతవరకు గట్టి లీడర్ అని చెప్పుకునేందుకు రెండో వ్యక్తేలేరు. నిజానికి షర్మిల కూడా గట్టి నేతేమీ కారు. కాకపోతే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు చెప్పుకుని జనాల్లో తిరుగుతున్నారు. కాబట్టి …

Read More »

పోటీపై కేసీయార్ సంచలన నిర్ణయం ?

రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై కేసీయార్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే రెండు నియోజకవర్గాల్లో పోటీచేసే విషయమై ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం కేసీయార్ గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గజ్వేల్ నుండి కాకుండా వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోటీచేస్తే ఎలాగుంటుందనే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. గజ్వేలుతో పాటు మరో కొత్త నియోజకవర్గమా ? లేకపోతే …

Read More »

దేశాధినేతల్ని కలవొచ్చు.. కేసీఆర్ కలవలేం: గవర్నర్ సంచలనం

సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్. భారతదేశానికి వచ్చే దేశాధినేతల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ.. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేం. ఇదో దురదృష్టకరమైన పరిస్థితి. కొన్ని దేశాలు దగ్గర కావొచ్చు. తెలంగాణలో రాజ్ భవన్.. ప్రగతిభవన్ మాత్రం దగ్గరకు కాలేవు. ఇటీవల పెద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కానీ.. రాష్ట్ర ప్రథమ పౌరురాలికి మాత్రం ఆహ్వానం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గవర్నర్ …

Read More »

ఇక‌, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ దూకుడు.. ఢిల్లీకి కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. గురువారం ఆయ‌న ఢిల్లీకి చేరుకుని ఇక్క‌డ నిర్మించిన బీఆర్ ఎస్ జాతీయ భ‌వ‌నాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు క‌దుపుతున్న కేసీఆర్ దీనికి అనుగుణంగా ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయ భవనాన్ని నిర్మించారు. ఇందుకోసం సీఎం గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్(బీఆర్ఎస్ కార్యాలయం)ను ప్రారంభిస్తారు. తొలుత కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు. …

Read More »

సాధార‌ణ మ‌హిళ‌కు ఉన్న జ్ఞానం.. జ‌గ‌న్‌కు లేదా? : చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం ఎటు పోతోందో? ఏమ‌వుతోందో ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌కు ఏమాత్ర‌మైనా తెలుస్తోందా? అని ప్ర‌శ్నించారు. టీడీపీ హ‌యాంలో స‌న్‌రైజ్ రాష్ట్రం గా ఉన్న‌ ఏపీ.. ఇప్పుడు స‌న్ సెట్ రాష్ట్రంగా మారుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సాధారణ మహిళకు ఉండే జ్ఞానం సీఎం జ‌గ‌న్‌కు కానీ, వైసీపీ పేటీఎం బ్యాచ్కు కానీ ఉందా? అని ప్ర‌శ్నించారు. …

Read More »