వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో చిరకాల వైరం కొనసాగిస్తున్న దువ్వాడ శ్రీనివాస్పై జగన్ విపరీతమైన నమ్మకం పెట్టుకున్నారు. కానీ, నియోజకవర్గంలోని మిగతా వైసీపీ నేతలే దువ్వాడకు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. దీంతో కొండ లాంటి అచ్చెన్నను దువ్వాడ ఢీకొట్టగలరా? ఆయన్ను ఓడించడం దువ్వాడకు సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ …
Read More »మహారాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..
బీఆర్ఎస్ అధినేత పక్కా ప్లానింగుతో ముందుకెళ్తున్నట్లుగా చెప్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఆయన తెలంగాణ బయట లోక్ సభ సీట్లు గెలవడం గ్యారంటీ అని.. అందుకోసం ఆయన ఇప్పటికే స్థానాలను ఎంపిక చేయడంతో పాటు అక్కడ అభ్యర్థులను కూడా గుర్తించారని, తెలంగాణకు చెందిన కొందరు నేతలను పొరుగు రాష్ట్రాలలో పోటీ చేయించబోతున్నారని తెలుస్తోంది. ఇక్కడి నేతలను పొరుగు రాష్ట్రాలలో పోటీ చేయించి అక్కడి నాయకుల …
Read More »‘ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తా’ ఏపీ మంత్రి
అధికారం అహంకారాన్ని ఇవ్వకూడదు. బాధ్యతను పెంచాలి. ఈ విషయాన్ని కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఎలా మరిచిపోతారు? తామున్నదే ప్రజలకు సేవ చేయటానికి అంటూ ఓట్లు వేయమని అడిగి మరీ ఎన్నికైన వారు.. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ.. నోరు పారేసుకోకూడదు. కానీ.. కొందరు నేతల తీరు చూస్తే.. మరీ ఇంత అహంకారం అవసరమా? అన్న భావన కలిగేలా ఉంటుంది. తాజాగా ఏపీకి చెందిన మంత్రి కారుమూరి …
Read More »రాష్ట్రపతి పాల్గొన్న ప్రోగ్రాంలో 9 నిమిషాలు కరెంటు లేకపోవటమా?
దేశ మొదటి పౌరుడిగా వ్యవహరించే రాష్ట్రపతి పాల్గొనే ప్రోగ్రాం అంటే అందుకు తీసుకునే చర్యలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. రాష్ట్రపతి పాల్గొన్న సమావేశంలో కరెంటు పోవటమే ఒక సంచలనం అయితే.. కరెంటుపోయిన తర్వాత తిరిగి వచ్చేందుకు ఏకంగా 9 నిమిషాల పాటు కరెంటు లేక చీకట్లలో ఉండిపోయిన వైనం షాకింగ్ గా మారింది. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం తెలిస్తే.. నోట …
Read More »కేటీఆర్ మాటలు వినిపించాయా.. జగన్!!
పోతే కానీ.. ఒక వ్యక్తి.. జార విడుచుకుంటే కానీ.. ఒక వస్తువు విలువ తెలియదని అంటారు. కానీ, చేజేతులా ఒక పరిశ్రమను రాష్ట్ర సరిహద్దులు దాటించేసినా.. దాని విలువ ఏపీ సర్కారుకు తెలియడం లేదు. అదే.. అమరరాజా కంపెనీ. బ్యాటరీల తయారీ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న ఈ సంస్థ మరో నూతన విభాగాన్ని తాజాగా తెలంగాణలోని మహబూబ్నగర్లో ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన …
Read More »నాగబాబు మాస్టర్ మైండ్.. రెండు వ్యూహాలతో రాజకీయం..!
జనసేన అధినేత పవన్ సోదరుడు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కారద్యర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నాగ బాబు.. చేస్తున్న వ్యాఖ్యలు.. పార్టీలోనూ.. పొత్తుల విషయాల్లోనూ కాక రేపుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. పొత్తుల విషయాన్ని ఒకవైపు పరిశీలిస్తూనే మరోవైపు.. పవన్ సిఎం అవుతారని.. పవన్ ముఖ్య మంత్రి పీఠం ఎక్కగానే.. హిందూ సంస్థలను గాడిలో పెడతారని నాగబాబు వ్యాఖ్యానించారు. అయితే.. నిజానికి పొత్తులు అంటే.. సీఎం పీఠాన్ని టీడీపీకి ఇచ్చేయాలనే విషయం …
Read More »చంద్రన్న నోట ఆ ఒక్క మాట కోసం ఎదురుచూపు…
వైసీపీ నుంచి సస్పెండైన దగ్గర నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెబెల్ స్టార్ గా మారిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకుని పోరాటాలు కొనసాగిస్తున్నారు. దానికి తోడు చాలా మంది అధికార పార్టీ నేతలు కోటంరెడ్డితో టచ్ లో ఉన్నారు.. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి ఇప్పుడు కోటంరెడ్డి వర్గంలో చేరారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నింటికీ హాజరవుతున్నారు. కోటంరెడ్డి వర్గం నెల్లూరు …
Read More »పెద్దలతో కష్టం..పిల్లల్ని నమ్మలేం..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందరికంటే ఎక్కువ సమయం పార్టీ కోసం కేటాయిస్తున్నారు. నెలకు ముూడు సార్లైన జిల్లాల పర్యటనలకు వెళ్తూ అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహిస్తూ విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. మరో ఏడాది తిరక్కుండానే జరిగే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా కొన్ని నియోజకవర్గంలో దిక్కుతోచని పరిస్థితి ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఎలా చేయాలి, ఎవరికీ కోపం రాకుండా మేనేజ్ …
Read More »పొంగులేటితో కమలం కొత్త ఆట
తెలంగాణలో డైరెక్ట్ గేమ్ ఆడితే కుదరదని బీజేపీకి అర్థపోయింది. ఇప్పుడు పరోక్షంగా కొట్టాలని డిసైడైంది. పొంగులేటి లాంటి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సామంత రాజులను వాడుకోవాలనుకుంటోంది. పొంగులేటిని బీజేపీలో చేర్చుకుని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు వ్యూహం పన్నిన్నట్లు చాలా మంది భావించారు. అందుకే ఈటల సహా బీజేపీ నేతలంతా పొంగులేటితో భేటీ అయ్యారని అనుకున్నారు. అసలు గేమ్ ప్లాన్ బయట పడేందుకు మాత్రం 24 గంటలు పట్టింది. …
Read More »బండి సంజయ్ను గెలిపించడానికి అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తొలి ఎంపీ అభ్యర్థిని కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆశ్వీరాద సభలో పాల్గొన్న కేటీఆర్ సభా వేదిక నుంచే కీలక ప్రకటన చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థులలో తొలి టికెట్ ప్రకటించినట్లయింది. కాగా కేటీఆర్ …
Read More »ప్రకాశంలో వైసీపీ తుఫాను ఆగినట్టేనా?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెలరేగిన వైసీపీ తుఫాను సర్దుకున్నట్టేనా? కీలక నేత, సీఎం జగన్కు దూరపు బంధువు కూడా బాలినేనిశ్రీనివాసరెడ్డి లైన్లోకి వచ్చినట్టేనా? అంటే.. ప్రస్తుత పరిణామాలను గమని స్తున్నవారు… నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైవీ కంటే కూడా బాలినేని అవసరం ఎక్కువగా ఉందని అందరికీ తెలిసిందే. వైవీకి పగ్గాలు అప్పగించిన ప్రాంతాల్లో పార్టీ ఇబ్బందుల్లో పడు తోందని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఇటీవల తలెత్తిన వివాదంలోపాతిక …
Read More »చంద్రబాబు తెలుసుకోవాల్సిన సత్యం ఇదే!
పైకి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ను తిట్టిపోస్తున్నారు. మీడియాలో ఫస్ట్ పేజీల్లో హైలెట్ అవుతున్నారు. అయితే.. ఇది సరిపోతుందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా? అనేది ఇప్పుడు ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలుసుకోవాల్సిన సత్యం అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చంద్రబాబు చెబుతున్నట్టుగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికీ నిజం. పైకి అంతా బాగుందని ఎంత చెప్పుకొన్నా.. మేడిపండు చందంగానే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని …
Read More »