Political News

పవన్ ను ఇరికించబోయి జగన్ ఇరుక్కున్నారా?

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు అన్న సామెత ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీకి సూటిగా సరిపోతుందని చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపించి.. ఎన్నికల్లో ఇక ఆయన ప్రస్తావన లేకుండా చేద్దామని కూటమి పార్టీలు ఆలోచిస్తున్నాయని, అందులో భాగంగా కేంద్రంలోని ఎన్డీఏ రథసారథి బీజేపీకి చెందిన కీలక నేతలతో కూటమి పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారని, అయితే ఆ చర్చలు అంతగా ఫలప్రదం కావడం …

Read More »

టీడీపీలో ఈ గోల ఏంటి బాబూ…?

ఏపీలో అధికార కూటమి రథసారధిగా ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో గత కొంతకాలంగా ఓ వినూత్న గోల తరచూ వినబడుతోంది. తాము అణగారిన వర్గాలమని చెబుతున్న రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు… తాము చేసిన తప్పు ఇతరులూ చేస్తున్నారని… వారిని వదిలేసి తమను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ సాగుతున్న ఈ గోల ఇటీవల మరింతగా ఎక్కువైందనే చెప్పాలి. తాము తప్పు చేయడం లేదన్న మాటను అంతగా ప్రస్తావించని సదరు …

Read More »

ఏపీ స్పీడును అందుకోవడం కష్టమే!

ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్టాన్ని జెట్ స్పీడుతో అభివృద్ది చేస్తోందంటూ టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబితే… ఏదో అనుకున్నాం గానీ… వాస్తవాలు చూస్తుంటే… ఆయన చెప్పిన స్పీడును అందుకోవడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదని ఘంటాపథంగా చెప్పవచ్చు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత కరువు సీమగా ముద్రపడిన రాష్ట్రంలోని రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. ఆ ప్రాంతాన్ని నిజంగానే రతనాల సీమగా తీర్చిదిద్దుతోంది. …

Read More »

సీఎం విజ‌య్‌పై ఉద్యోగుల తిరుగుబాటు?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ప‌ట్టుమని ప‌ది రోజులు కూడా కాక‌ముందే.. ఇటు రాజకీయంగా .. అటు పాల‌న ప‌రంగా.. తాను తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. విజ‌య్‌కు ప్ర‌తిబంధ‌కంగా మారుతున్నాయి. రాజ‌కీయంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం డీఎంకే నుంచి.. అదేవిధంగా మిత్ర‌పక్షం సీపీఎం నుంచి కూడా ఆయ‌న‌కు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విజ‌య్ ప్ర‌భుత్వం రీల్స్ స‌ర్కారు అంటూ.. స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీశాయి. మ‌రోవైపు.. సీపీఎం కూడా త‌మ …

Read More »

వైసీపీ క‌న్నా ఎక్కువే ఇస్తున్నాం: పవ‌న్‌

వైసీపీ ప్ర‌భుత్వం ఇచ్చిన దానికంటే కూడా.. సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత పెంచి ఇస్తున్నామ‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. తాజాగా మ‌త్స్య‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో భాగంగా వేట నిషేధ స‌మ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క కుటుంబానికీ రూ.20 వేల చొప్పున ఇచ్చామ‌ని తెలిపారు. ఇది వైసీపీ హ‌యాంలో 10 వేల రూపాయ‌లుగా మాత్ర‌మే ఉంద‌న్నారు. తాము సంక్షేమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో.. ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం …

Read More »

ఎవ‌రిది ఏ కుల‌మో తెలియ‌క్క‌ర్లేదా?

ఎవ‌రిది ఏ కుల‌మో తెలియ‌క్క‌ర్లేదా? అని సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న‌ను చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించింది. ఆర్టిక‌ల్ 14 ప్ర‌కారం అంద‌రూ స‌మానులే అయినా.. ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌క్ర‌మంగా అందించేందుకు, అర్హుల‌కు అవి చేరేందుకు కులాల ప్రాతిప‌దిక‌న జాబితా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ ప్ర‌క్రియ‌లో త‌ప్పులు వెత‌కాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం.. గృహ గ‌ణ‌న …

Read More »

అవినీతిని పట్టిస్తే… విజయ్ లక్ష ఇస్తారట!

సినిమాల్లో నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారే సీఎం కుర్చీని దక్కించుకున్న దళపతి విజయ్ పెను సంచలనమే రేపారు. ఎన్నికల్లో అసలు డబ్బు మాట ఎత్తకుండా… సీఎంగా అవకాశం ఇస్తే తానేం చేస్తానన్న విషయాలనే పదే పదే చెబుతూ వచ్చిన విజయ్… తాను అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకున్నారు. మొత్తంగా జనానికి నచ్చిన విషయాలనే పట్టేసిన విజయ్.. సీఎం హోదాలోనూ జనం మెచ్చిన నాయకుడిగానే సాగుతున్నారు. అవినీతిపై పోరాటం మొదలెట్టిన …

Read More »

బీజేపీ మంత్రికి మూకుమ్మడి సెగ

బీజేపీ సీనియర్ నేత, ఏపీ కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న సత్యకుమార్ కు ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతల నుంచే సవాల్ లు వినిపిస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. సత్యకుమార్ కు దమ్ముంటే రాజీనామా చేయాలని, పార్టీ తరఫున పోటీ చేస్తావో, లేదంటే సొంతంగానే పోటీ చేస్తావో చేయమని… ఎలా పోటీ చేసినా ఓడించి తీరతానని బీజేపీకి చెందిన ధర్మవరం స్థానిక నేత సుదర్శన్ …

Read More »

రోడ్డు పక్కన తాటిముంజలు తిన్న సీఎం దంపతులు

ఏపీలో భానుడు భగభగ మండుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తింటూ గ్రామీణ జీవన శైలిని గుర్తుచేసుకున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు సమీపంలో కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించిన సీఎం దంపతులు అక్కడే ఆగారు. ఈ సందర్భంగా తాజాగా తీసిన తాటి …

Read More »

మ‌ళ్లీ `ఇన్‌ఫ్లేష‌న్` భూతం… జేబుల‌కు చిల్లే!

దేశంలో గ‌త ఆరు మాసాలుగా ఒకింత అదుపులో ఉన్న ద్రవ్యోల్బ‌ణం(ఇన్‌ఫ్లేష‌న్‌) ప్ర‌స్తుతం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ కూడా ఇదే మాట చెబుతోంది. దీంతో త్వ‌ర‌లోనే అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌ల‌తోపాటు.. గృహ‌రుణాల‌పై వ‌డ్డీలు, ప‌ర్స‌న‌ల్ లోన్ల‌పైనా.. వాహ‌న రుణాల‌పైనా వ‌డ్డీలు మ‌రింత పెరగ‌నున్నాయ‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఏంటీ ద్ర‌వ్యోల్బ‌ణం? ద్రవ్యోల్బణం…. ఒక నిర్దిష్ట కాలంలో వస్తువులు, సేవల ధరలు నిరంతరంగా పెరిగి, ప్ర‌జ‌ల‌ కొనుగోలు శక్తి తగ్గిపోవడమే …

Read More »

మంచు కోడలి పోటీ… పార్టీ… ప్లేస్… ఎక్కడ?

భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా శోభా నాగిరెడ్డి మరణించడం ఆ కుటుంబాన్ని రాజకీయంగా పెద్ద దెబ్బే కొట్టింది. అయితే భూమా వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన భూమా అఖిల ప్రియారెడ్డి అనతికాలంలోనే తిరిగి పుంజుకోగలిగారు. తాజాగా ఆ కుటుంబం నుంచి మరో నేత ఎంట్రీకి రంగం సిద్ధమైంది. భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికా …

Read More »

కాపుల‌ను త‌ట‌స్థం చేయ‌డ‌మే వైసీపీ ల‌క్ష్య‌మా?

కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌ట‌స్థం చేయాల‌న్న దిశ‌గా వైసీపీ అడుగులు వేగంగా ప‌డుతున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం కాపులు.. ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నారు. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధాంతాలు న‌చ్చిన వారు కొంద‌రు.. పార్టీలో ఉండాల‌ని.. త‌మకంటూ ఓ వేదిక ఉంద‌ని అభిప్రాయ‌ప‌డే వారు కొంద‌రు. ఇలా.. మొత్తంగా కాపులు.. జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నారు. అయితే.. ఇలా వారంతా ఐక్యంగా ఉంటే.. …

Read More »