Political News

అసత్య కథనంపై అలుపెరగని పోరాటం

తనపై వచ్చిన అసత్య కథనంపై ఏపీ మంత్రి నారా లోకేష్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సాక్షి పత్రికపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసుకు సంబంధించి ఈరోజు ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ పూర్తికాగా, మూడోసారి క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే శీర్షికతో 2019 …

Read More »

భారీ టాస్క్ భుజాన వేసుకున్న ప‌వ‌న్.. స‌క్సెస్ అయ్యేనా.. ?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పాల‌న ప‌రంగా భారీ టాస్కులు భుజాన వేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల‌ను అభివృద్ధి చేయ‌డంతోపాటు.. గిరిజ‌న ప్రాంతాల్లో ర‌హ‌దారులు కూడా నిర్మిస్తున్నారు. ఇక‌, ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. మ‌రోవైపు.. తాజాగా ఆయ‌న తీర ప్రాంత ప‌రిర‌క్ష‌ణ స‌హా ప‌చ్చద‌నం పెంచేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన ఆయ‌న …

Read More »

జనవరి వచ్చిందంటూ గుర్తుచేస్తున్న షర్మిల

ఏటా జనవరి వస్తోంది.. పోతుంది… సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని సరిపెట్టుకోవడం కాదండీ.. జనవరి వచ్చింది. ఫస్ట్ తారీఖున ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్  ఏదీ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా గత వైసీపీపై కూడా ఆమె సెటైర్లు వేశారు. ఐదేళ్లపాటు జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ పార్టీ యువత చెవుల్లో …

Read More »

ముగిసిన `మండ‌లి`- క‌విత స్పీచే రికార్డ్‌!

తెలంగాణ శాస‌న మండ‌లి శీతాకాల‌ స‌మావేశాలు ముగిశాయి. ఈ సీజ‌న్‌లో మొత్తం 5 రోజుల పాటు మాత్ర‌మే ఈ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ(బీఏసీ) నిర్ణ‌యంతో ఐదు రోజుల పాటు జ‌రిగిన స‌మావేశాలు మంగ‌ళ‌వారం సాయంత్రంతో ముగిసిన‌ట్టు చైర్మ‌న్ ప్ర‌క‌టించారు. అనంత‌రం.. నిర‌వ‌ధికంగా మండ‌లిని వాయిదా వేశారు. ఈ ఐదు రోజుల్లో మొత్తం దాదాపు 20 గంట‌ల పాటు మండ‌లి కార్య‌క‌లాపాలు సాగాయి. వాస్త‌వ స‌మ‌యం 19 గంట‌ల …

Read More »

పోలవరం పరుగులు పెడుతుందండోయ్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు, వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులు 13 శాతం మేర పూర్తికాగా, మొత్తం నిర్మాణం ఇప్పటివరకు 87.8 శాతానికి చేరుకుంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే సివిల్ పనులు 72 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో కనీసం 2 శాతం పనులు కూడా ముందుకు …

Read More »

హద్దు దాటిన రోజా: ‘పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి’

నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట తీస్తా, తోలు తీస్తా, సప్త సముద్రాలకు అవతల ఉన్నా తీసుకువచ్చి శిక్షలు వేస్తా అంటూ జగన్ హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకురాలు జబర్దస్త్ రోజా ఎంట్రీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు. వచ్చీ రాగానే అధికారులపై విరుచుకుపడ్డారు. …

Read More »

మాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజం

పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030 నాటికి ఆసియాలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రణాళికలు తయారు చేస్తుంది. సూర్యలంకతో పాటు సూళ్లూరు పేట వద్ద ఉన్న చిన్ని చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు భావన. మాల్దీవ్స్ తరహాలో ఐ ల్యాండ్ …

Read More »

రాజధాని రైతులు కోరుకున్నట్టు వాస్తు ప్రకారమే..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల విష‌యంలో మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు త‌న మ‌న‌సు చాటుకున్నారు. రైతుల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను ఆయ‌న ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో భాగంగా రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకరించారు. నిజానికి ఈ స‌మ‌స్య పై గ‌తంలో రైతుల నుంచిపెద్ద ఎత్తున ఫిర్యాదులు, విన్న‌పాలు వ‌చ్చాయి. వీటిని …

Read More »

క‌ష్టాల్లో కానిస్టేబుల్ త‌ల్లి… వెంటనే స్పందించిన లోకేష్‌!

ఏపీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి త‌న మ‌న‌సు చాటుకున్నారు. లోక‌ల్‌గానే కాదు… విదేశాల్లో కూడా ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నార‌ని తెలిస్తే.. వెంట‌నే ఆయ‌న రియాక్ట్ అవుతున్నారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌తంలో అనేక మందిని కువైత్‌, దుబాయ్ స‌హా ఎడారి దేశాల నుంచి తీసుకువ‌చ్చారు. ఆయా వ్య‌క్తులు.. ఏదో ఒక ప‌నిపై అక్క‌డ‌కు వెళ్ల‌డం. . ఏజెంట్ల చేతిలో న‌ష్ట‌పోవ‌డం వంటివి కామ‌న్‌గా మారింది. క‌ష్టాల్లో ఉన్న‌త‌మ‌ను …

Read More »

అమిత్ షాతో బాబు భేటీ, చాలా కీలకం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ ఏడాదిలో తొలిసారి బుధ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో అధికారులు వివ‌రించారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో బాబు భేటీకానున్నారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌లిసే అవ‌కాశం కూడా ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అమిత్‌షా అప్పాయింట్‌మెంటు మాత్రమే ఖ‌రారైన‌ట్టు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు.. కొత్త‌గా ఏర్పాటు …

Read More »

ఏపీలో కొత్తగా 11,753 ఉద్యోగ అవకాశాలు..

ఏపీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం14వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించింది. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు …

Read More »

రాహుల్ గాంధీని ఉరి తియ్యాలంటున్న కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాల్లో కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని హౌలా అని, ఆ హౌలాగాణ్ణి ఉరితీయాలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »