కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ హయాంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి భాషతో ఛీత్కారానికి గురయ్యారు. అయినా నాయకుల్లో మార్పు కనిపించడం లేదు. ఇటీవల కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా జనసేన ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడు, వుడా చైర్మన్ షేక్ రియాజ్ బూతులు మాట్లాడటం పట్ల …
Read More »పవన్ సతీమణి సింప్లిసిటీ… రైలులో పిఠాపురం వరకు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన భర్త పనితీరును మెచ్చుకోవడంతోపాటు.. ఆయన భార్యగా తాను ఎంతో గర్విస్తున్నట్టు కూడా పేర్కొంటున్నారు. అలానే తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం.. తలనీలాలు సమర్పించడం కూడా తెలిసిందే. ఇవన్నీ అన్నా కొణిదెల వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనికి నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ …
Read More »రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ మాట తప్పిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా రాజగోపాల్ రెడ్డి పలుమార్లు విమర్శలు గుప్పించారు. అయినా సరే రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అయితే, …
Read More »రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!
ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక, సోషల్ మీడియాలో నేతలంతా యాక్టివ్ గా ఉండాలని అన్ని పార్టీల అధినేతలు నిక్కచ్చిగా చెబుతున్నారంటే పబ్లిసిటీ, ప్రమోషన్, సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రజలపై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ముఖ్యంగా రాజకీయ నేతలు తమను తాము ప్రచారం చేసుకునేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. …
Read More »జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను అవమానించారని చెప్పడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. జైలు వద్ద జగన్ కు ఎలాంటి అవమానం జరగలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహారించామని జైలు సిబ్బంది వివరణ ఇచ్చారు. అధికార కూటమి ప్రభుత్వం కూడా జగన్ ప్రకటనను ఖండించింది. ఎమ్మెల్యే విరూపాక్షిని పరమార్శించేందుకు జగన్ కర్నూలు వెళ్లారు. …
Read More »సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆరవ్ చిన్న పిల్లాడని, తెలియక యాక్సిడెంట్ చేస్తే క్రిమినల్ కేసు పెడతారా అంటూ జగన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇక, ఈ కేసు నుంచి తన కుమారుడు ఆరవ్ ను తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించేందుకు సాక్షాలు తారుమారు చేశారని ఆరోపణలు రావడం …
Read More »ఎమ్మెల్యే క్వార్టర్లపై నోరు జారిన పేర్ని నాని
అమరావతిలో ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 6 సంవత్సరాలపాటు కట్టిన 9 అంతస్తుల క్వార్టర్లలో ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి ఉంటారా అని నాని ప్రశ్నించారు. అంతేకాదు, ఆ క్వార్టర్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డ్రైవర్లకు ఇస్తారని, వాళ్లు కూడా అందులో ఉండకపోతే అసాంఘిక కార్యకలాపాలకు ఆ క్వార్టర్లు అడ్డాగా మారతాయని నాని షాకింగ్ …
Read More »పెనమలూరులో బోడేదే పైచేయి…!
పార్టీ ఒకటే కానీ.. అంతర్గత కూటములు చాలానే ఉన్నాయి. ఆ నియోజకవర్గం స్పెషల్ అదే. ఇతర నియోజక వర్గాల్లోనూ నాయకుల మధ్య వివాదాలు, విభేదాలు ఉన్నా.. ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో మాత్రం ఇవి మరింత భిన్నంగా ఉంటున్నాయి. గత 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి.. మండలాలను పంచేసుకున్నారు. ఫలితంగా ఎగస్పార్టీ పెరిగి.. పార్టీలో ఐక్యత సన్నగిల్లి ఓటమికి దారితీసింది. బలమైన టీడీపీ కంచుకోటగా గుర్తింపు …
Read More »వెనుకాడొద్దు… వెంటాడండి: మంత్రులకు బాబు హుకుం!
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన దిశానిర్దేశం చేశారు. వెంటాడాల్సిందేనని.. వైసీపీ చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. వైసీపీ నాయకులు తమ పాలనలో జరిగిన తప్పులను మరిచిపోయి.. ఇప్పుడు ఏమీ జరగకపోయినా.. ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీని వెంటాడాల్సిందేనని మంత్రులకు తేల్చి …
Read More »న్యూయార్క్ టైమ్స్ లో చంద్రబాబు విజన్
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం దేశ రాజకీయ, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ది టైమ్స్ పత్రిక దక్షిణాసియా బ్యూరో చీఫ్ ముజిబ్ మషాల్, న్యూఢిల్లీ కేంద్రంగా భారతదేశ వార్తలను అందించే హరి కుమార్ ఈ వార్తా కథనాన్ని రాశారు. ఇందులో అమరావతి నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులను, దానికోసం సీఎం చంద్రబాబు పడుతున్న తపనను …
Read More »మాజీ ఎంపీ ఐతే జైళ్లో ఫోన్ వాడుకోవచ్చా?
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో సౌకర్యాలు పొందుతున్న బడాబాబులు ఎందరో వార్తల్లో నిలిచారు. పనిమనిషిని రేప్ చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఆ కోవలోకే వస్తారు. జైలులో రేవణ్ణ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని, అందులో ఓటీటీలు, మెసెంజర్ వంటి …
Read More »వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై… ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. తాజాగా చంద్రబాబుపై రాళ్లు రువ్విన ఘటన సుప్రీంకోర్టు వరకు చేరింది. నిందితులను విచారించేందుకు.. సుప్రీకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలోకి తీసుకోకుండానే.. వారిని విచారించాలని తేల్చి చెప్పింది. ఈ పరిణామం మొత్తం వైసీపీ నాయకులపై ప్రభావం చూపిస్తోంది. తద్వారా.. ప్రస్తుత రాజకీయాలపై కేసుల ఎఫెక్ట్ పడుతోందని అంటున్నారు. టీడీపీలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates