తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్ మాదిరిగానే ఉంటోంది. ఏ పార్టీలో ఉన్నా తనదైన మార్కు రాజకీయం, తనదైన మార్కు వ్యవహారంతో మల్లారెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న మల్లారెడ్డి… ఆ పార్టీని వీడతారంటూ చాన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వాదనలను కొట్టిపారేస్తున్న సీనియర్ నేత… మళ్లీ …
Read More »భోగాపురానికి రెక్కలు వచ్చేశాయండోయ్
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆగస్టు 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తు న్నారని.. ఆయన చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్టు తాజాగా చంద్రబాబు ప్రకటించారు. చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవం జరగాలన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, కొత్త ఎయిర్ పోర్టు కొత్త అవకాశాలు తీసుకొస్తుందని చంద్రబాబు …
Read More »వైసీపీకి వచ్చేది తక్కువ… పోయేది ఎక్కువ!
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా.. వైసీపీకి మాత్రం ఇంకా బోధపడలేదు. దీంతో ఇటు పార్టీలోను, అటు నాయకుల్లోనూ మార్పు కనిపించడం లేదన్న వాదన ఉంది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు కామనే అయినా.. కారణాలు తెలుసుకుని ముందుకు సాగాల్సిన అవసరం పార్టీలపై ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేస్తున్నారు.. ? ప్రస్తుత …
Read More »బుల్లెట్ రైలుకు `రాజకీయ` రెడ్ సిగ్నల్?!
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-ముంబైల మధ్య ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. అంతేకాదు.. ఒకే రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైళ్లను ప్రకటించడం కూడా విశేషం. ఇప్పటి వరకు ఒకే రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైళ్లను ప్రకటించలేదు. అలాంటిది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుల్లెట్ …
Read More »ప్రధాని మోడీకి కాక్రోచ్ సెగ తగులుతుందా?
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో అత్యవసర సమావేశానికి ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఏక్షణంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనన్న ఉత్కంఠ తెరమీదికి వచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాల కంటే కూడా.. ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ నుంచి భారీ ఎత్తున …
Read More »ప్రియాంకా, రాహుల్, రేవంత్ లకు డెత్ డిక్లరేషన్: కేటీఆర్
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరూర్నగర్లో నిర్వహించిన యువ సంగ్రా మ సదస్సు(సభ)లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కు అధికార పీఠం దక్కితే..యువతకు బలిపీఠం వేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి నోటిఫికేషన్లు రావని.. కేవలం లూటిఫికేషన్లకు మాత్రమే అవకాశం ఉంటుందని …
Read More »మహిళల జోలికి వస్తే ఎవరైనా ఒకటే
గుంటూరులో మహిళపై దాడి చేసి, నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుబంధం లేదా పార్టీ సభ్యత్వం రక్షిస్తుందని ఎవరైనా భావిస్తే అది పెద్ద పొరపాటేనని స్పష్టం చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఈ నెల 15న ఇంటి ముందు మోటార్తో నీరు పట్టుకుంటున్న మహిళతో 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి వాగ్వాదానికి …
Read More »విజయ్ అడుగుజాడల్లో జగన్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గానీ, అభిమానులు గానీ… ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ఏవైనా ఏ ఒక్క పార్టీతో పొత్తు అన్న మాటే లేకుండా ఒంటరిగా పోటీకి దిగుతారని… సింహం సింగిల్ గా వస్తుందంటూ వారు చెబుతూ ఉంటారు. అదే సమయంలో ఎవరైనా జగన్ అడుగుజాడల్లో నడవాల్సిందే గానీ… ఆయన ఏ …
Read More »అభిమానం సరే… పవన్ కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్!
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ నుంచి పదుల సంఖ్యలో ముఖ్య నాయకులు, పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారి నుంచి ఆయన పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే. అతి మొహమాటస్తుడైన పవన్ కల్యాణ్ ఎవరినీ కాదనలేని పరిస్థితిలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఈ నేపథ్యంలో పరోక్షంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీ నాయకులు “ …
Read More »20వ రోజుకు చేరిన దీక్ష… సోనమ్ పరిస్థితేంటి?
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసిన నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేబినెట్ నుంచి తొలగించాలన్న డిమాండ్ తో వాంగ్ చుక్ దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న …
Read More »మరోసారి హామీల ప్రస్తావన తెచ్చిన సీఎం
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనం అయిందన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని బాగు చేస్తామని, అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చామని .. ప్రజలు నమ్మి తమను అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీని అడుగడుగునా నిలబెట్టుకుంటున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను …
Read More »స్థానికంలో లెక్కలు వేరుగా ఉంటాయి: జనసేన
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆశావహులను నిరాశపరిచే ప్రసక్తి లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో పనిచేసేందుకు ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సంసిద్ధులు కావాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పార్టీ బలంగా ఉన్న చోట ఎన్ని స్థానాల్లో అయినా పోటీ చేసేందుకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates