Political News

బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందా?

వివిధ పరిణామాల కారణంగా తెలంగాణాలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ అభ్యర్ధుల ప్రకటన తర్వాత మరింత స్పీడుగా పడిపోతోంది. రెండు వారాల్లోనే 3 శాతం మద్దతు పడిపోయింది. అన్నీపార్టీలకన్నా ముందుగా అభ్యర్ధులను ప్రకటించాలని కేసీయార్ అనుకున్నారు. దీనివల్ల చాలా లాభాలున్నాయనే అలా డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే 119 నియోజకవర్గాల్లో 115 మంది అభ్యర్ధులను ప్రకటించేశారు. అయితే అలా ప్రకటించటమే ముందుముదు చాలా మైనస్ అయ్యేట్లుగా ఉందని ఇపుడు …

Read More »

టార్గెట్ సోనియా?

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఓడించేందుకు బీజేపీ ఇప్పటినుండే వ్యూహం రచిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి పార్లమెంటు స్ధానం నుండి సోనియా అప్రతిహతంగా గెలుస్తునే ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గంలో సోనియాను ఓడించేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేయబోతోంది. బీజేపీ తరపున పోటీచేయించబోయే అభ్యర్ధికోసం గట్టిగా గాలిస్తోంది. ఒక్క సోనియా అనే కాదు ప్రతిపక్షాల్లోని గట్టి అభ్యర్ధులు ఎవరు అనే విషయమై చర్చించేందుకు బీజేపీ ఒక సమావేశం నిర్వహించింది. బీజేపీ …

Read More »

ఎన్టీఆర్ ను చంపిన వారితో నాణెం విడుదలా?:లక్ష్మీ పార్వతి

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే, ఎన్టీఆర్ భార్య హోదాలో తనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని రాష్ట్రపతి ముర్ముకు వైసీపీ నేత లక్ష్మీపార్వతి లేఖ కూడా రాశారు. అయినా సరే, …

Read More »

ఏపీకి హోదా మిస్సయింది ఆ ఐఏఎస్ వల్లే?

ఏపీకి హోదా మిస్సయింది ఆ ఐఏఎస్ వల్లే?ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై విభజన జరిగి దాదాపు పదేళ్ళు కావస్తున్నా ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో నిర్దాక్షిణ్యంగా ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ హోదా ఇస్తామని చెప్పింది. అదే విషయానికి బిజెపి కూడా వంత పాడింది. అయితే, ఆ తర్వాత అధికారాలు తారుమారైనప్పటికీ ఆ పార్టీలు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. కేంద్రంలోని బీజేపీ …

Read More »

స్మారక నాణెం విడుదల..జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ

ఢిల్లీలో ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. అన్నగారి శత జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నగారిపై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ గౌరవార్థం ప్రత్యేక నాణెం విడుదల చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ …

Read More »

లోకేష్ తో కటీఫ్.. బాబుతో దోస్తీ

ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు టీడీపీ ఎంపీలు వ్యవహార శైలి అంతుచిక్కని విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేతతో కలిసి తిరుగుతున్న ఆ ఎంపీలు.. ఆ నాయకుడి కొడుకును మాత్రం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ ఎంపీలే కేశినేని నాని, గల్లా జయదేవ్. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక వంద రూపాయాల నాణెం విడుదల కార్యక్రమం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేశినేని నాని, గల్లా జయదేవ్తో పాటు …

Read More »

తుమ్మలకు రాజ్యసభ సీటు, ఢిల్లీలో అధికారం..

పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగించేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారా? పార్టీలో కొనసాగేలా ఆయనతో బేరసారాలు జరిపేందుకు సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఊపేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేసిన తుమ్మల తన బలాన్ని ప్రదర్శించి పార్టీ మారే సంకేతాలు పంపించారు. దీంతో తుమ్మలను పార్టీలోనే …

Read More »

పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో సానుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉండటంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలకు పార్టీ నాయకులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఖమ్మంలో సభలో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై అమిత్ షా తీవ్ర విమర్శలు …

Read More »

మైనంపల్లి అంటే భయపడుతున్నారా?

మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు అంటే కేసీయార్ భయపడుతున్నారా ? అందుకనే ఆయనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవటానికి వెనకాడుతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. మల్కాజ్ గిరిలో తనకు మెదక్ లో తన కొడుక్కి ఎంఎల్ఏ టికెట్లు కావాలని మొదటినుండి మైనంపల్లి పట్టుబడుతున్నారు. అయితే అందుకు కేసీయార్ అంగీకరించలేదు. మొదటినుండి చెబుతున్నట్లే మల్కాజ్ గిరిలో మాత్రమే మైనంపల్లికి టికెట్ ఇచ్చారు. దాంతో హనుమంతరావు అలిగారు. తన కొడుక్కి …

Read More »

ఈటల పిలిస్తే తుమ్మల వస్తారా?

అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఆయన.. దివంగత ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు, తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు. ఖమ్మం జిల్లాలో ఆయనకు గొప్ప పట్టుంది. తెలంగాణ ఎన్నికలకు ముందు అలాంటి నాయకుడికి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఆ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. పాలేరు టికెట్ దక్కకపోవడంతో అసంత్రుప్తి ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్ ఎలాంటి మార్పులు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. పాలేరు సిట్టింగ్ …

Read More »

కాంగ్రెస్ లో కొత్త సమస్య మొదలైందా?

కాంగ్రెస్ లో కొత్త సమస్య మొదలైందట. అదేమిటంటే పార్టీలో కొత్తగా చేరినవాళ్ళకి టికెట్లు దక్కుతుందా లేదా అని. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీచేయాలన్నా ముందు దరఖాస్తు చేసుకోవాల్సిందే అనే నిబంధన పెట్టారు. దాని ప్రకారం 119 నియోజకవర్గాలకు దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18వ తేదీనుండి 25వ తేదీ వరకు అంటే వారంరోజుల పాటు దరఖాస్తులకు సమయమిచ్చారు. వారం రోజుల్లో సుమారు వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాలకైతే 15 …

Read More »

ఇండియాకు షాకిచ్చిన కేజ్రీవాల్

కొత్తగా ఏర్పడిన ఇండియాకూటమికి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పెద్ద షాకిచ్చారు. బీహార్లో తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆప్ పోటీచేస్తుందని ప్రకటించారు. స్ధానిక సంస్ధల ఎన్నికలతో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న కేజ్రీవాల్ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రకటన ఇండియా కూటమిలో కలకలం రేపుతోంది. కూటమి స్పూర్తిని  కేజ్రీవాల్ దెబ్బతీస్తారా అంటు …

Read More »