Political News

ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. గడచిన మూడు, నాలుగు రోజులుగా ఈ వివాదం ఏపీలో పెను కలకలాన్నే రేపుతోంది. బుధవారం కూడా ఈ వివాదాన్ని మరింతగా పెద్దది చేసేలా అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దుబాటు ధోరణిలో మాట్లాడటానికి …

Read More »

సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ యువకుడిపై పలు కేసులున్నాయని, ఈ క్రమంలోనే మే 9వ తేదీన అతడిని పోలీసులు తీసుకుపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆ యువకుడు ఇంటికి రాలేదని, ఆ యువకుడు లాకప్ డెత్ కావడంతో పోలీసులే అతడి శవాన్ని తగులబెట్టారని కొందరు వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు …

Read More »

అమెరికా గ‌ట్టి స‌వాల్… ఇప్పుడైనా మోడీ నోరువిప్పేనా?

అమెరికానుంచి త‌ర‌చుగా భార‌త్‌కు అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. వ‌ల‌స విధానానికి సంబంధించి, హెచ్‌-1బీ వీసాల‌కు సంబంధించి కూడా భార‌త్‌కు అమెరికా నుంచి స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. ఇక‌, ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలోనూ.. సుంకాల విష‌యంలో ట్రంప్ మొండివాద‌న వినిపిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. భార‌త్ ఎక్క‌డా అమెరికాకు స‌మాధానం ఇవ్వ‌లేక‌పోతోంది. ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ ప‌న్నెత్తు మాట కూడా అనలేక పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా.. ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారిని.. శ‌త్రు దేశాల‌తో …

Read More »

ఇలాగైతే వైసీపీని దేవుడు కూడా కాపాడలేడు

ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా… తాము కాకుండా మరెవ్వరూ చేయరాదన్న రీతిలో వైసీపీ నేతలు ఓ రేంజిలో ఫైరైపోతున్నారు. ఒక్కో పార్టీకి ఒక్కో ఐడియాలజీ ఉంటుందన్న కామన్ సూత్రాన్నీ వారు మరుస్తున్నారు. తమ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అన్నీ చేయగలరని… ఆయనలా మరొకరు ఏ పనీ చేయలేరని వారు …

Read More »

మంగళగిరి మాట నెరవేర్చిన లోకేష్

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌గిరిలోని ప్ర‌తి వీధిలోనూ ప‌ర్య‌టించిన నారా లోకేష్‌.. అక్క‌డి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల‌లోనే ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. అదే.. మురుగునీటి స‌మ‌స్య‌. చిన్న చినుకుప‌డ్డా.. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌ధాన ర‌హ‌దారులు స‌హా.. అన్ని ప్రాంతాలు.. కాలువ‌ల‌ను త‌ల‌పిస్తాయి. ఇక‌, ముర‌గునీరుతో ప్రాంతాలుదుర్గంధం వెద‌జ‌ల్లు తుంటాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు ప‌డ‌డమే కాకుండా.. అనారోగ్యాల పాల‌వుతున్నారు. రెండుసార్లు.. ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామ‌కృష్నారెడ్డి …

Read More »

తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు చేరుకున్న ఆయ‌న‌.. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో వ‌రంగ‌ల్ జిల్లాలోని హ‌నుమ‌కొండ‌కు వ‌చ్చారు. త‌న‌ను ఎన్నోళ్ల నుంచో చూడాల‌ని క‌ల‌వ‌రిస్తున్న 17 ఏళ్ల బాలుడిని ప‌వ‌న్ ప‌రామ‌ర్శించారు. హ‌నుమ‌కొండ‌లోని హ‌నుమాన్‌న‌గ‌ర్‌కు చెందిన నిరంజన్‌(15) కొన్నాళ్లుగా న‌రాల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటూ.. మంచానికే ప‌రిమితం అయ్యాడు. అత‌నికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే.. …

Read More »

హన్మకొండలో పవన్… చోటా గబ్బర్ సింగ్ కు పరామర్శ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ పట్టణానికి వెళ్లిన పవన్… ఆ పట్టణానికి చెందిన తన వీరాభిమాని అయిన ఓ చిన్నారిని పరామర్శించారు. కేవలం తనను చూడాలని ఉందన్న తన అబిమాని చివరి కోరికను తీర్చేందుకే పవన్ హన్మకొండ వెళ్లారు. ఈ సందర్భంగా తాను కనిపించి తన అభిమానికి ఆయన మరపురాని అనుభూతిని కలిగించారు. అంతేకాకుండా …

Read More »

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇద్దరిదీ ఒకే బాట. బాండింగ్ లో అయినా.. బ్రాండింగ్ లో అయినా కూడా వీరిద్దరి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు తాము ఎంచుకున్న అంశానికి ఏ మేర ప్రాధాన్యత ఉందన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు. అంతేకాదండోయ్… ఆ అంశానికి ఎనలేని …

Read More »

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… తాజాగా రాష్ట్రానికి ఆరు పులుల‌ను పంపాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో పులుల సంత‌తి త‌గ్గిపోతోంద‌ని.. వీటిని పెంచేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఆరు ఆడ‌పులుల‌ను పంపిస్తే.. రాష్ట్రంలో పెరిగే పులుల సంత‌తిని.. దేశ‌వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. రాష్ట్రంలోని న‌ల్ల‌మ‌ల‌లో పులుల సంచారం …

Read More »

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి కాంగ్రెస్ మద్దతునిచ్చింది. దీంతో, డీఎంకే, కాంగ్రెస్ ల మధ్య బంధం తెగిపోయింది. ఇండీ కూటమి నుంచి కూడా డీఎంకే బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి కాంగ్రెస్, డీఎంకేల మధ్య మాటల …

Read More »

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఏదో జరిగిందని, కానీ, ఆధారాలు లేవని, ఓట్ల చోరీ, ఈవీఎంల వల్ల కూటమి గెలిచిందని పరోక్షంగా జగన్ చేసిన కామెంట్లు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శలు వచ్చాయి. ఆ కామెంట్లు చేసి రెండేళ్లు గడిచినా…జగన్ మారలేదు. తాజాగా ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ …

Read More »

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ నిలిస్తే…మధ్యలో అధికార కాంగ్రెస్ నిలిచి ఓ రేంజిలో కొట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే… రేవంత్ చేస్తున్న ఆరోపణలను ఖండించేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి,కిషన్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. ఇక తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా ఈ బరిలోకి …

Read More »