Political News

‘జ‌గ‌న్ ఈ రోజు నాలుగు టీవీలు ప‌గ‌ల‌గొడ‌తాడు’

చంద్రబాబు స్పీచుల్లో మొత్తం మారిపోయింది. గతంలో చెప్పిందే చెప్పి బోర్ కొట్టించే చంద్రబాబు… ఇపుడు ప్రతి చోటా కొత్త సబ్జెక్టు, కొత్తపంచులతో అలరిస్తున్నారు. ఈమార్పుపై కేడర్ ఫుల్ హ్యాపీ. విశ్లేషకులు కూడా చంద్రబాబులో రావల్సిన మార్పు ఇదే అంటున్నారు. తాజాగా ఈరోజు రెండు మూడు చోట్ల చంద్రబాబు మాట్లాడితే అన్ని చోట్లా సబ్జెక్ట్ మారింది. ఉదాహరణకు ఒక చోట బాబు మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ ఈ రోజు నాలుగు టీవీల‌ను ప‌గ‌ల‌గొడ‌తాడ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. కూట‌మి పార్టీల ఉమ్మ‌డి స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాల‌ను చూసి.. జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌న్నారు. రాజ‌ధాని ప్రాంత‌మైన తాడికొండ‌లో నిర్వ‌హించిన స‌భ‌కు జ‌నం పోటెత్తార‌ని.. వీరిని చూసి జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌ద‌ని, అదేవిధంగా ఫ్రెస్ట్రేష‌న్ త‌ట్టుకోలేక‌ నాలుగు టీవీల‌ను కూడా ప‌గ‌ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు.

Read More »

మేన‌త్త గుట్టు బ‌య‌ట‌పెట్టిన ష‌ర్మిళ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌గా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని న‌డిపించే వైఎస్ కుటుంబంలో అంత‌ర్గ‌త విభేదాలు తార స్థాయికి చేరుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న సొంత సోద‌రి ష‌ర్మిళ‌, బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ వివేకా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని జ‌గ‌నే కాపాడుతున్నాడ‌ని, వివేకాను చంపించిన అవినాష్‌కు మ‌ద్దతిస్తారా న్యాయం …

Read More »

సీఎం జగన్‌ పై రాళ్ల దాడి

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మేమంతా సిద్ధం  పేరుతో నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చార బ‌స్సు యాత్ర‌లో క‌ల‌క‌లం రేగింది. తాజాగా ఈ యాత్ర విజ‌య‌వాడ శివారు ప్రాంత‌మైన సింగ్‌న‌గ‌ర్ మీదుగా సాగింది. ఇక్క‌డి పైపుల్ రోడ్డు సెంట‌ర్‌లో నాలుగు రోడ్ల కూడ‌లి వ‌ద్ద సీఎం జ‌గ‌న్ బ‌స్సుపై నుంచి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌పై రాయితో దాడి జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బ‌లంగా విసిరిన రాయి.. దాదాపు 7 అడుగుల ఎత్తున ఉన్న సీఎం జ‌గ‌న్ నుదుటిపై తాకింది.దీంతో ఎడమ కంటి క‌నుబొమ ద‌గ్గర గాయ‌మైంది. కొద్దిగా ర‌క్తస్రావం కూడా జ‌రిగింది. అయితే.. భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి రావ‌డంతో రాయిని ఎవ‌రు విసిరార‌నే విష‌యంపై అస్ప‌ష్ట‌త నెల‌కొంది. అయితే వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వీరే విసిరారా?  లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. రాయితో దాడి అనంత రం.. కూడా జ‌గ‌న్‌త‌న యాత్ర‌ను కొన‌సాగించారు. బ‌స్సులోనే ఉన్న ప్ర‌త్యేక వైద్యుడు ఒక‌రు జ‌గ‌న్‌కు ప్రాథ‌మిక చికిత్స చేశారు. త‌ల‌కు బ్యాండ్ ఎయిడ్ వేశారు. అదేవిధంగా ఫ్లూయిడ్ అందించారు.అనంత‌రం.. యాత్ర‌ను కొన‌సాగించారు. అయితే.. గ‌త నెల‌లో కూడా సీఎం జ‌గ‌న్‌పై దాడి జ‌రిగింది. అప్ప‌ట్లో క‌ర్నూలులో నిర్వ‌హించిన యాత్ర‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చెప్పు విసిరాడు. అయితే.. ఇది జ‌గ‌న్‌కు తృటిలో త‌ప్పించి.. ప‌క్క‌న ప‌డింది. అప్ప‌ట్లోనూ దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. తాజాగా జ‌రిగిన రాయి ఘ‌ట‌న వెనుక రెండో వాద‌న కూడా వినిపిస్తోంది. రాయి కాద‌ని.. అది క్యాట్ బాల‌ని కొంద‌రు చెబుతున్నారు. ఇక‌, అంత పెద్ద సెక్యూరిటీ ఉండి కూడా.. ప‌ట్టించుకోలేదా? అనేది కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది. దీని వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉంది. కానీ, ఏలూరు దిశ‌గా జ‌గ‌న్ త‌న యాత్ర‌ను కొన‌సాగించారు.

Read More »

బాలయ్య వచ్చాడు.. కొట్టాడు

నందమూరి బాలకృష్ణ పబ్లిక్‌లోకి వచ్చాడంటే చాలు.. అక్కడ్నుంచి ఒక వార్త కామన్. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం.. వారి మీద బాయల్య చేయి చేసుకోవడం మామూలే. ఇప్పటికే ఇలా చాలాసార్లు జరిగింది. ఇంకో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య బస్సు యాత్రకు రెడీ అయ్యారు. బాలయ్య అన్‌స్టాపబుల్ అని బస్సు మీద రాయించి.. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఆయన ఎన్నికల ప్రచారానికి రెడీ …

Read More »

అన్న‌కు షాకిచ్చి.. చెల్లికి జై కొట్టి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల దూసుకెళ్తున్నారు. క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తూ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ప‌దునైన మాట‌ల‌తో సాగిపోతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్ర‌జ‌లకు చేరువ చేస్తూనే.. మ‌రోవైపు పార్టీ బ‌లాన్ని కూడా పెంచే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా అన్న జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరేలా ష‌ర్మిల ప‌టిష్ఠ‌మైన వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీ అసెంబ్లీ …

Read More »

వైఎస్ కుటుంబ ప‌రువును రోడ్డున ప‌డేస్తున్నారు..

క‌డ‌ప‌లో కొన్ని ద‌శాబ్దాలుగా పెంచుకున్న వైఎస్ కుటుంబం ప‌రువును ఆ ఇంటి ఆడ‌ప‌డుచులు.. వైఎస్ ష‌ర్మిల‌, సునీత‌లు రోడ్డున ప‌డేస్తున్నార‌ని.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, వివేకానంద‌రెడ్డిల సోద‌రి వైఎస్ విమ‌లారెడ్డి విమ‌ర్శించారు. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య విష‌యంపై త‌మ కుటుంబం చింతిస్తూనే ఉన్న‌ద‌న్నారు. అయితే.. దీనిని చిన్న‌వాడైన ఎంపీ అవినాష్‌పైకి నెట్టేసి.. హంత‌కుడు.. హంత‌కుడు అని ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనివ‌ల్ల రాష్ట్రంలో వైసీపీ స‌హా సీఎం జ‌గ‌న్‌పైనా ప్ర‌భావం ప‌డుతోంద‌ని, …

Read More »

గ్లాసును బకెట్ తన్నేస్తుందా ?

పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలవడం తప్పనిసరి పరిస్థితి. అయితే రాజకీయాలు అంటేనే ఎత్తులు, పై ఎత్తులు. పిఠాపురం ఎన్నికల్లో పవన్ గెలుపుకు నవరంగ్ నేషనల్ …

Read More »

ఆలు లేదు చూలు లేదు.. టెస్లాపై కామెడీ రాజ‌కీయం

ప్ర‌ఖ్యాత కార్ల త‌యీరీ సంస్థ టెస్లా ఇండియాలో ఓ ప్లాంటు పెట్టాల‌ని కొన్నేళ్ల నుంచి ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌య‌త్నాల‌ను ఇప్పుడు ముమ్మ‌రం చేసింద‌ని.. త్వ‌ర‌లోనే సంస్థ అధినేత‌ ఎలాన్ మ‌స్క్ ఆధ్వ‌ర్యంలో ఓ బృందం ఇండియాకు వ‌స్తుంద‌ని.. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ప్లాంటు పెట్టే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఐతే ప‌రిశీల‌న కోసం ఏపీకి రావ‌డం కూడా నిజ‌మో కాదో తెలియ‌దు. ఈలోపే టెస్లా …

Read More »

ర‌ఘురామ‌కు న‌ర‌సాపురం టికెట్టే.. ప‌ట్టు బ‌ట్టిన బాబు

వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం మీడియా ముందుకు వ‌చ్చి విమ‌ర్శ‌లు గుప్పించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కోసం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త్యాగాల బాట ప‌ట్టారు. తాజాగా జ‌రిగిన కూట‌మి(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) స‌మావేశంలోనూ ర‌ఘురామ కేంద్రంగానే చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చితీరాల‌ని చంద్ర‌బాబు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. అంతేకాదు.. న‌ర‌సాపురం టికెట్‌ను బీజేపీకి కేటాయించింది కూడా.. కేవ‌లం ర‌ఘురామను దృష్టిలో పెట్టుకునే చేశామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. అయిందేదో అయిపోయిందని.. న‌ర‌సాపురం టికెట్‌ను త‌మ‌కు …

Read More »

దేనికైనా రెడీ – కేటీఆర్

తెలంగాణ‌లో చిన్న‌సారుగా ప్ర‌చారంలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌.. పెద్ద స‌వాలే రువ్వారు. ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని, బీఆర్ ఎస్ పార్టీని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై కేటీఆర్ స్పందించారు. తాను ఈ విష‌యంలో నార్కో ఎనాలిసిస్ టెస్టుకు సిద్ధ‌మని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కుడు కిష‌న్‌రెడ్డి, ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డిలు కూడా సిద్ధ‌మేనా? అని గ‌ట్టి స‌వాల్ విసిరారు. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన …

Read More »

జ‌గ‌న్‌కు స‌వాలుగా నెల్లూరు

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగులేని రికార్డుంది. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ మెరుగైన ఫ‌లితాలు సాధించింది. కానీ ఈ సారి మాత్రం జ‌గ‌న్‌కు స‌వాలు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి అనుకూలంగా మారుతుంద‌నే అభిప్రాయాలున్నాయి. దీంతో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మెజారిటీ స్థానాలు కూట‌మి ఖాతాలోకి …

Read More »

నారా లోకేష్ ఐఫోన్ ట్యాప్‌.. నిజ‌మేనా?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వినియోగిస్తున్న ఐఫోన్ ట్యాపింగ్‌కు గురైందంటూ.. వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఐఫోన్ కంపెనీ యాపిల్‌… ఈ మేర‌కు ఆయ‌న ఫోన్‌కు సందేశాలు పంపించి న‌ట్టు టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో హ్యాకింగ్‌కు కూడా గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని నారా లోకేష్ కు ఫోన్ సందేశాలు అదేవిధం మెయిల్‌కు కూడా సందేశాలు అందాయని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. దీనివెనుక వైసీపీ నేతల హ‌స్తం …

Read More »