Political News

లోకేష్ పుట్టిన రోజు.. ఓ మంచి పని

టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈ నెల 23న. అప్పటికి ఆయనకు 42 ఏళ్లు నిండి, 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన పుట్టిన రోజులు ఎలా చేసుకున్నా, ఈ ఏడాది నిర్వహించుకునే పుట్టిన రోజు ప్రజలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ …

Read More »

ఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది. తాజాగా దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి అల్ మార్రీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, దుబాయ్‌ల మధ్య ఉన్న ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని చంద్రబాబు చేసిన సూచనలను …

Read More »

‘రేవంత్ కి దమ్ముంటే విచారణ వీడియో బయట పెట్టాలి’

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు నేడు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు హరీశ్ రావును విచారణ జరిపారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీశ్ రావు…రేవంత్ రెడ్డిపై, ఆయన బావమరిదిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణం గురించి తాను బయటపెట్టిన రోజే తనకు …

Read More »

నాడు జగన్ నేడు కేటీఆర్… సేమ్ టు సేమ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు మధ్య హరీశ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితోపాటు పోలీసులకు, అధికారులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటారో చేసుకోవాలని, ఆయనను వదిలిపెట్టబోమని …

Read More »

జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది కానీ…

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇద్దరూ గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అయితే మరో కేసు పెండింగ్‌లో ఉండటంతో, బెయిల్ వచ్చినప్పటికీ జైలు నుంచి వెంటనే విడుదలయ్యే పరిస్థితి …

Read More »

తన బాస్ ఎవరో చెప్పిన మోడీ

“ఆయ‌నే నా బాస్‌. పార్టీలో నేను ఆయ‌న కింద ప‌నిచేస్తాను.“ అంటూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆస‌క్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా బీహార్‌కు చెందిన నిత‌న్ న‌బీన్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అధికారికంగా బీజేపీ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అనంత‌రం.. నితిన్‌.. ఢిల్లీలోని ప్ర‌ధాని నివాసానికి వెళ్లి.. ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ నితిన్‌ను అభినందించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని స్పందిస్తూ.. త‌న …

Read More »

విచారణ వేళ విజయసాయి ట్వీట్‌… బీజేపీపై ప్రశంసలు!

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఇటీవల ‘కోటరీలు’, ‘వెనిజులా అధ్యక్షుడు’ అంటూ చేసిన ట్వీట్‌ ద్వారా వైఎస్ జగన్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. కోటరీల ప్రస్తావన ఇది తొలిసారి కాకపోవడంతో, ఆయన ఎవరిని ఉద్దేశించారన్న దానిపై రాజకీయంగా విస్తృత చర్చ సాగింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ …

Read More »

2 వారాల్లో తేలిపోనున్న వివేకా మ‌ర్డ‌ర్ కేసు?

ఎస్‌! నిజ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు దాగుడుమూత‌లుగా ఉన్న ఈ కీల‌క కేసులో రెండు వారాల్లో కీల‌క నిర్ణ‌యం వెలుగు చూడ‌నుంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ కేసు విచార‌ణ అనేక మ‌లుపుల త‌ర్వాత‌.. సీబీఐ చేప‌ట్టింది. అయితే.. విచార‌ణ పూర్త‌యిన‌ట్టుగా కొన్నాళ్ల కింద‌టే సిబీఐ కోర్టు.. తెలంగాణ హైకోర్టుకు విన్న‌వించింది. కానీ, త‌మ‌కు అనుమానాలు …

Read More »

కమలదళపతిగా నితిన్‌ నబీన్‌ బాధ్యతల స్వీకారం

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.  బిహార్‌కు చెందిన 45 …

Read More »

అసెంబ్లీలో రగడ… గవర్నర్ వాక్ అవుట్ !

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం పోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చారు. తొలుత తమిళనాడు రాష్ట్ర గీతం ఆలపించగా, ఆ తర్వాత జాతీయ గీతాన్ని కూడా పాడాలని గవర్నర్ సూచించారు. అయితే సభ ప్రారంభంలో ‘తమిళ్ తాయి వాజ్తు’ మాత్రమే ఆలపించడమే …

Read More »

ఆ 11 ఎమ్మెల్యేల‌ను ఏం చేస్తారు?

వైసీపీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపై మ‌రోసారి క‌థ మొద‌టికి వ‌చ్చింది. అసెంబ్లీకి హాజ‌రు కాకుండానే జీతాలు, భ‌త్యాలు తీసుకుంటున్నార‌న్న‌ది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌పై ఉన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. బ‌య‌ట నుంచి వ‌చ్చి.. రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేసి వెళ్లిపోతున్నార‌ని.. స‌భా కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావ‌డం లేద‌న్న‌ది వైసీపీ ఎమ్మెల్యేల‌పై గ‌తంలో స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కూడా వ్యాఖ్యానించారు. ఒక్క జ‌గ‌న్ మిన‌హా అంద‌రూ వేత‌నాలు తీసుకుంటున్నార‌ని.. మ‌రికొంద‌రు ప్ర‌యాణ ఖ‌ర్చుల‌(టీఏ)ను కూడా తీసుకుంటున్నార‌ని తెలిపారు. …

Read More »

నైనీ వివాదంపై ‘సీబీఐ విచారణ’ కోసం డిమాండ్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయ‌కుల మాటల దాడి ఆగ‌డం లేదు. రెండు రోజుల కింద‌ట బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. కేటీఆర్‌.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తుగ్ల‌క్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. ఆయ‌న ఏం చేస్తున్నాడో ఆయ‌న‌కే తెలియ‌డం లేద‌న్నారు. ఇక‌, తాజాగా అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీష్‌రావు కూడా సీఎంపై విరుచుకుప‌డ్డారు. `ఔట్ సోర్సింగ్ సీఎం` …

Read More »