జాతీయ స్తాయిలో ఇప్పుడు రెండు కీలక అంశాలపై ఎడతెగని చర్చ నడుస్తోంది. ఈ బిల్లుల విషయంలో అధికార ఎన్డీఏతో పాటు విపక్ష ఇండియా కూటమి తమదైన చర్చలను సాగిస్తున్నాయి. ఇక ఈ రెండు కూటములలో లేని తెలంగాణ విపక్ష పార్టీ బీఆర్ఎస్ తన వైఖరిపై తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లకు ఉద్దేశించిన నారీ శక్తి వందనం బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్… నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోయింది. దక్షిణాది …
Read More »హీటెక్కిన తాడిపత్రి రాజకీయం
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. నిరంతరం రాజకీయ సంఘర్షణలకు ఈ నియోజకవర్గం వేదికగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏ చిన్న తేడా వచ్చినా.. అది రాజకీయ వేడిని రాజేస్తోంది. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య అగ్గిమీద గుగ్గిలంలాగా ఇక్కడ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఈ క్రమంలో గత …
Read More »క్వాంటం కంప్యూటింగ్లో మనదే తొలి అడుగు
అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటింగ్లో తొలి అడుగు విజయవంతంగా పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరంలోని ఓ కేంద్రంలో ఏర్పాటు చేసిన `క్వాంటం టెస్ట్బెడ్స్`ను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్బెడ్స్ను ప్రారంభించిన అనంతరం.. వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి రాజధానిలో క్వాంటం వ్యాలీని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నట్టు …
Read More »సీట్ల పెంపు… ఒకేసారి 300 సీట్లా?
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఓ అవగాహనకు వచ్చింది. ఈ నెల 16న మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాలను ఏ మేరకు పెంచాలన్న అంశంపై కేంద్రం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెరగనున్న సీట్ల సంఖ్య ఏ మేర అన్న వివరాలతో కూడిన బిల్లు …
Read More »టీఆర్ఎస్ బ్రాండ్ కోసం గులాబీ వారసుల వార్…?
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ గూటిలో ఇప్పుడు ఆసక్తికరమైన ఆధిపత్య పోరు మొదలైంది. కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే బ్రాండ్ నేమ్ కోసం కేటీఆర్, కవితల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. పార్టీని బీఆర్ఎస్గా మార్చడం వల్లే తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయామని, గ్రాఫ్ పడిపోయిందని పార్టీ శ్రేణుల్లో ఉన్న నమ్మకాన్ని కేటీఆర్ బలపరిచారు. మనం మళ్లీ టీఆర్ఎస్ కావాలి అని …
Read More »నేతలు హద్దు మీరుతున్నారు జగన్…!
పరిధి.. పరిమితులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవటం కొంతమంది వైసీపీ నేతలకు అలవాటే. దూకుడే తమ ఆయుధం అన్నట్లుగా వ్యవహరించే తీరు మిగిలిన పార్టీలతో పోలిస్తే.. వైసీపీ నేతల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించటం మామూలే. అందుకు భిన్నంగా పవర్ చేతిలో లేనప్పుడు సైతం చెలరేగిపోవటం.. అధికారులపై విరుచుకుపడటం లాంటివి వైసీపీ నేతలకే సాధ్యమయ్యే పనులుగా చెబుతారు. క్రిష్ణా జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఘటన తరహాలో.. జగన్ …
Read More »పుట్టినరోజు.. పెళ్ళి రోజు.. పోలీసులకు సెల రోజే!
వైసీపీ అధినేత జగన్ చేయలేనిది ఇప్పుడు అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రస్థాయి పోలీసులకు కీలకమైన సెలవుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వ్యక్తిగత అవసరాలకు పోలీసులకు సెలవులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పోలీసుల కుటుంబాల్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లిరోజు వేడుకలకు వ్యక్తిగత సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. …
Read More »గెలిచిన 5 నెలల్లోపే సీఎం పదవికి రాజీనామా
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దాదాపు 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసింది. పలు మార్లు కూటములు మార్చుకుంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు …
Read More »షా మాట ఇస్తే సీఎం సీటు కూడా…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా.. ఇచ్చిన మాట.. ఆరు మాసాలు కూడా తిరక్కుండానే వాస్తవంకానుంది. సహజంగా దేశం మొత్తానికి హోం మంత్రి అయిన షా అంతటి నేత మాటిస్తే.. అది నెరవేరకపోవడం.. ఏముంటుందన్న ప్రశ్న వస్తుంది. కానీ, ఆయన మాటిచ్చింది.. ఆషామాషీకాదు. అప్పటికే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండగా.. మరో నాయకుడిని అదే సీటులో కూర్చోబెడతానని!!. అదే.. బీహార్. గత ఏడాది జరిగిన అసెంబ్లీ …
Read More »వైఎస్ అన్నా చెల్లెళ్ళకు చంద్రబాబు లేఖ…
తన రాజకీయ ప్రత్యర్థి వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్లో కీలక బిల్లుకు మద్దతు పలకాలని ఆయన కోరారు. జగన్ కు లేఖ రాయడంతో పాటు మిగతా పార్టీల అధ్యక్షులకు చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. జనసేన అధ్యక్షులు కె పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర …
Read More »వైసీపీలో టెన్షన్… వివేకా కేసు ఏమవుతుంది?
వైసీపీలో తొలిసారి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఏమవుతుందంటూ.. పెద్ద ఎత్తున ఆరా తీయడం గమనార్హం. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. ప్రత్యేకంగా ఒకరిద్దరు నాయకులు హైదరాబాద్కు వెళ్లి మరీ ఈ కేసు విచారణ సమయంలో కోర్టుకు హాజరయ్యారని తెలిసింది. వివేకా కేసు ఏమవుతుంది? మళ్లీ మొదటికి వస్తుందా? అనే విషయాలపై పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు ఆరాతీసినట్టు తెలిసింది. కోర్టు విచారణను కూడా లైవ్లో …
Read More »సర్వేలో షాకులు… బాబు ఏం చేస్తారు?
ఆంధ్రప్రదేశ్లో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పనితీరును చంద్రబాబు మరోసారి రాబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 164 స్థానాల్లో కూటమి పార్టీల నాయకులు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో 134 మంది టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలలో దాదాపు 70 మంది పనితీరు ఏ మాత్రం సరిగా లేదని పలు మార్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. వారి పనితీరును మార్చుకోవాలని కూడా ఆయన పదేపదే విన్నవించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పరిస్థితి మారినప్పటికీ ఇంకా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates