Political News

టార్గెట్‌ చేస్తే దేశాన్ని షేక్‌ చేస్తా..: బీజేపీపై దీదీ ఫైర్

“బెంగాల్‌లో నన్ను లక్ష్యంగా చేస్తే, నా ప్రజలపై దాడి వ్యక్తిగత దాడిగానే పరిగణిస్తాను. ఎన్నికల తర్వాత దేశం మొత్తం తిరుగుతూ పెద్ద ఎత్తున పోరాడుతాను,” అని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ప్రభావం చూపుతోందని ఆరోపించిన మమతా, రాబోయే ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అసలైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ స్పెషల్ …

Read More »

జగన్ పై ఏఐ వీడియో… స్పందించిన లోకేష్!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఒక వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. నడుస్తూ వెళ్తుండగా ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అంటూ జగన్ ప్లకార్డు పట్టుకుని అడుగుతున్నట్లు ఉన్న వీడియో వైరల్ గా మారింది. ట్విట్టర్లో ఉన్న ఆ పోస్టుకు …

Read More »

ఇక‌ రైతు బాబు.. ఈ చంద్ర‌బాబు… !

రైతుల ప‌క్ష‌పాతిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఉన్న పేరు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న హ‌యాం చిన్న‌దే అయినా.. ఎక్కువ‌గా రైతుల‌కు మేలు చేశార‌న్న వాద‌న ఉంది. ఇది.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశంగా మారింది. 2004-09 మ‌ధ్య తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు.. 2009లో కూడా క‌లిసి వ‌చ్చాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అదే త‌ర‌హాలో అన్న‌దాత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్న నాయ‌కులు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత మేర‌కు …

Read More »

సాయిరెడ్డి మనసులో మాట ఇదేనా?

వైసీపీ మాజీ నాయకుడు మరియు రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి రాజకీయ ఆలోచనలు ఇప్పుడు ఏ దిశలో ఉన్నాయి? ఆయన మళ్లీ వైసీపీలోకి రావాలనుకుంటున్నారు? లేక జనసేనలోకి వెళ్లే వ్యూహం చేస్తున్నారా? ఇవే ప్రస్తుతం జరుగుతున్న ముఖ్యమైన చర్చలు. సాయిరెడ్డి స్పష్టంగా ఏ విషయాన్ని బయటపెట్టే వ్యక్తి కాదని, ఆయన లెక్కలు మరియు నిర్ణయాల్లో ఒక అర్థం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళంలో జరిగిన రెడ్డి సామాజిక …

Read More »

ఇక ఏపీ 26 కాదు 29 జిల్లాలు.. ఫైనల్ చేసిన సీఎం

ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నూతనంగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పడనుంది. ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. సచివాలయంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్షించారు. సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వి.అనిత, పి. నారాయణ, బీసీ …

Read More »

పులివెందులలో ప్రజాదర్బార్… జగన్ ప్లాన్ ఏంటి?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ నేటి నుంచి మూడు రోజులు పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం మూడు రోజుల షెడ్యూల్ విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించి ప్రజలతో మమేకం కానున్నారు. అదే సమయంలో క్యాడర్ పైన ఆయన ఫోకస్ పెడతారు అని భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 …

Read More »

ఏపీకి మరో తుఫాను గండం? ఆ జిల్లాలపైనే..

మోంథా తుఫాన్ ను మరువక ముందే ఏపీ మరో తుఫాను గండం దూసుకు వస్తోంది. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని రేపటికి తుపాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుపాన్‌గా మారాక దీనికి ‘సెన్యార్’గా నామకరణం చేస్తారు. పశ్చిమ వాయువ్య దిశగా 2 వేల కిమీ దూరంలో వాయుగుండం కదులుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని …

Read More »

‘మిషన్ బెంగాల్’ టార్గెట్ 160: దీదీపై బీజేపీ కొత్త అస్త్రం

ఢిల్లీలో గెలిచారు, బీహార్‌లో స్వీప్ చేశారు.. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కమలం పార్టీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోంది. బీహార్‌లో వర్కవుట్ అయిన ఫార్ములాను బెంగాల్‌లో ఇంప్లిమెంట్ చేసి మమతా బెనర్జీ (దీదీ) కోటను బద్దలు కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈసారి బీజేపీ స్ట్రాటజీ పూర్తిగా మారింది. వారి టార్గెట్ మమత కాదు, ఆమె …

Read More »

ఎమ్మెల్యే తమ్ముడి 80 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసిన ఈడీ

తెలంగాణ‌లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. బీఆర్ ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి సోద‌రుడు గూడెం మ‌ధుసూద‌న్ రెడ్డి ఇళ్లు, కార్యాల‌యాల‌పై సోమ‌వారం ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. ఈ క్ర‌మంలో మ‌ధుసూద‌న్ రెడ్డికి చెందిన సుమారు 80 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆస్తుల‌ను ఈడీ అటాచ్‌(స్వాధీనం) చేసుకున్న‌ట్టు అధికారులు తెలిపారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు …

Read More »

ప్రజల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కమిటీ

ఏపీ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని సంర‌క్షించేందుకు సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తూనే.. యూనివ‌ర్సల్ హెల్త్ స్కీంను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు. దీంతో పాటుకేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని కూడా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. వీటిలో 2 ల‌క్ష‌ల నుంచి రూ.20ల‌క్ష‌ల వ‌ర‌కు రోగుల‌కు ప్ర‌భుత్వం నుంచి బీమా స‌దుపాయం అందుబాటులోకి రానుంది. అయితే.. ఈ విష‌యంలో మ‌రింత …

Read More »

కోకాపేట రేటు అదిరిపోయింది

తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు మొలుస్తున్నాయి. ఒక ప్రాంతాన్ని మించి మరో ప్రాంతం దూసుకుపోవడానికి పోటీ పడుతోంది. తాజాగా కోకాపేట భూములకు ప్రభుత్వం వేలం నిర్వహించగా ఇక్కడి భూములు రాయదుర్గంతో పోటీ పడుతున్నాయనేలా రికార్డు ధరలు పలికాయి. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వంలో ఆనందం వ్యక్తమవుతోంది. తాజాగా కోకాపేటలో 5 ఎకరాలను వేలం ద్వారా విక్రయించారు. అయితే ఊహించిన ధర కంటే ఎక్కువగా సొమ్ము రావడం గమనార్హం. …

Read More »

భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు: పవన్ కళ్యాణ్

వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి వ్యవహరించిన తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని, కోట్ల మంది హిందువుల విశ్వాసాలను వమ్ము చేశారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అప్పటి పాలక మండలి నకిలీ నెయ్యిని అనుమతించడం, దానితోనే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తయారు చేయడం వంటివి తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. …

Read More »