ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీలతో్ కూడిన కూటమి నాటి అధికార పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించింది. ఈ ఓటమితో షాక్ తిన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కాలం పాటు బయటకే రాలేదు. ఏదో స్పందించాలి కాబట్టి స్పందిస్తున్నాం అన్న రీతిలో సాగిన జగన్… …
Read More »సీబీఎన్ @ 361 డిగ్రీస్..!
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ.. రూపొందించిన సీబీఎన్ @ 361 డిగ్రీస్ పుస్తకాన్ని స్వయంగా చంద్రబాబే ఆవిష్కరించారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన.. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీబీఎన్ @ 361 డిగ్రీస్.. పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతులను సింగపూర్లోని భారత …
Read More »పవన్ కొత్త టార్గెట్ ఇదే!
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేనను గెలిపించిన పవన్ కల్యాణ్…ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ తన మార్క్ చూపించారు. అదే సమయంలో ఏపీతో పాటు తెలంగాణలోనూ జనసేనను సంస్థాగతంగా …
Read More »`అన్నలు` నా పార్టీలోనే ఉన్నారు: కవిత షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా వ్యవహరిస్తారు. తన మాటలతోనే అందరినీ ఆకర్షిస్తారు. ఎక్కడా వివాదం అన్నది ఇప్పటి వరకు.. కవిత మాటల్లో దొర్లలేదు. పార్టీ ఆవిర్భావ సభలో అయినా.. దీనికి ముందు అయినా.. కవిత చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటికి ఆకర్షితులయ్యేవారు.. కొందరు ఉండగా, …
Read More »అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అమర్ నాథ్ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను అమర్ నాథ్ వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాను మహిళలందరినీ ఉద్దేశించి విమర్శలు చేయలేదని, …
Read More »చిన్నారి కోరికపై వరంగల్కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ చివరి కోరిక మేరకు అతడిని పరామర్శించేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. అభిమాన నాయకుడిని ఒక్కసారి కలవాలన్న చిన్నారి ఆకాంక్షను నెరవేర్చేందుకు పవన్ స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చిన్నారిని పరామర్శించిన అనంతరం స్థానిక జనసేన నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ పర్యటనకు రాజకీయ …
Read More »ఏపీలో ప్రభుత్వం మారదు: చంద్రబాబు
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ విధంగా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి-సం క్షేమం-సాంకేతికతలకు ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నామన్నా రు. యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. తద్వారా.. రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం కొనసాగేలా చూస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. సింగపూర్లో …
Read More »హోమంత్రి కట్టుబొట్టుపై వ్యాఖ్యలు.. ఎవరూ సహించరు
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్.. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. మహిళ అని చూడకుండా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరి విమర్శలకు గురవుతున్నాయి. ఇటీవల తమ కార్యకర్తల సమావేశంలో గుడివాడ అమర్నాథ్.. …
Read More »జలసంధి తెరిచారు.. ధరలు తగ్గాయి.. అయినా కష్టాలే!
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా.. దిగుమతులు కూడా తగ్గాయి. ఇక, గ్యాస్ కష్టాలు కూడా.. అనేక దేశాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కష్టాలు మన దేశంలో కూడా కనిపించాయి. ఇప్పటికే చమురు ధరలను దేశవ్యాప్తంగా పెంచారు. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి. దీనంతటికీ కారణం.. అమెరికా-ఇరాన్ల మధ్య జరిగిన యుద్ధం. …
Read More »‘బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో నాయకులు గద్దెనెక్కారు’
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ సమగ్రత.. సేనా దళం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలు సందర్భాల్లో మాట్లాడారు. తెలంగాణపై స్పందిస్తూ.. తాను ఈనెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ పట్టాలని చూసినట్టు తెలిపారు. దీనికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. పోనీ.. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి..వెనుదిరుగుతానని పోలీసులకు …
Read More »ఆపరేషన్ టైగర్… బీజేపీ దూకుడు!
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల దూకుడుకు మరింతగా బ్రేకులు వేయాలని భావిస్తున్నారా? అంటే .. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన.. ఐదు రాష్ట్రాల్లో కీలకమైన తమిళనాడు, పశ్చిమబెంగాల్లలో ప్రభుత్వ పార్టీలు ఓడిపోయాయి. ఈ క్రమంలో బెంగాల్లో బీజేపీ సర్కారు ఏర్పడింది. దీంతో బెంగాల్లో 80 స్థానాలు దక్కించుకున్న …
Read More »అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో అమరావతి రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో సింగపూర్ ప్రధాని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates