వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో బలమైన నేత కోసం వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బలమైన ఆర్థిక స్థాయి ఉండి, సామాజిక వర్గం పరంగా కూడా బలంగా ఉన్నవారి కోసం వెతుకుతోంది. గత మూడు నెలలుగా గుడివాడ నియోజకవర్గంపై వైసీపీ ఇదే దృష్టితో ఉంది. దీనికి కారణం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించిన నేపథ్యమే. గత ఎన్నికల్లోనే ఆయన ఈ …
Read More »నంది అవార్డులపై మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా అవతరించాక నంది అవార్డులకు ప్రాధాన్యం తగ్గిపోవడం గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. తెలంగాణలో గద్దర్ అవార్డులను ప్రకటించి వరుసగా రెండేళ్లు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఏపీలోనూ నంది అవార్డులు ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లు గట్టిగా గళం వినిపించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించినట్లుగా ఈ ముగ్గురూ మాట్లాడడం మీద …
Read More »అసెంబ్లీ టికెట్ కోసం సీఎంతో ఇంటర్వ్యూ
ఔను!. నిజమే.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కావాలంటే ముందుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఈ ఇంటర్వ్యూలో పాల్గొనాలంటే.. ఎంట్రన్స్ ఫీజును చెల్లించాలి. ఈ ఫీజు నాన్ రిఫండబుల్. ఒక వేళ ఇంటర్వ్యూలో విఫలమై.. సీటు రాకపోతే దీనిని యాగీ చేయడానికి, న్యాయపరమైన పోరాటం చేయడానికి కూడా వీల్లేదు. అంతేకాదు.. ఇంటర్వ్యూకు వచ్చేవారు.. తమ సొంత ఖర్చులతో రావాలి.. సొంత బస ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని రోజులైనా వేచి ఉండాలి. ఇంటర్వ్యూ అయ్యాక.. …
Read More »ఫలించని బిజ్జగింపులు.. జీవన్ రెడ్డి `పంతం` ఇదే!
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. పార్టీని వీడేందుకే సిద్ధమయ్యారు. త్వరలోనే ఆయన బీఆర్ ఎస్ పార్టీలో చేరనున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ ఎస్ పార్టీ కూడా ఆయనతో చర్చలు పూర్తి చేసిందని.. కేసీఆర్ కీలక పదవిని ఆఫర్ చేశారని.. మళ్లీప్రభుత్వం ఏర్పడితే.. మంత్రిపదవిని కూడా ఆఫర్ చేసినట్టు తెలిసింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం.. తొలుత జీవన్ రెడ్డి …
Read More »వడివడిగా ఉద్యోగాలు.. `కూటమి` లెక్క ఇదీ!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనలలో వడివడిగా ముందుకు సాగుతోంది. ఎక్కడ ఏ చిన్న అవకాశం చిక్కినా.. ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు అంటే.. 21 మాసాల్లో ఏకంగా.. 6 లక్షల మంది పైచిలుకు నిరుద్యోగులకు.. ఉపాధి, ఉద్యోగ కల్పనలు చేసింది. గత 2024 ఎన్నికలకు ముందు.. 20 లక్షల మందికి ఐదేళ్లలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ …
Read More »తిరుమలలో లడ్డూ నాణ్యతపై సీఎం బాబు ఆరా
తన మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. శనివారం ఉదయమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం.. శ్రీవారి ప్రసాదాన్ని రుచి చూశారు. ఆ తర్వాత.. ఫ్యామిలీ అంతా గెస్ట్ హౌస్కు వెళ్లిపోగా.. సీఎం చంద్రబాబు సహా తిరుమల బోర్డు చైర్మన్ నాయుడు, అధికారులతో కలిసి.. ఆయన క్యూలైన్లను పర్యవేక్షించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా …
Read More »శ్రీవారి ఆలయానికి సాధారణ భక్తుడిలా.. చంద్రబాబు!
ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఒక్కసారి కాదు, నాలుగోసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక ప్రవేశం ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి …
Read More »బాబు బెంగాల్కు.. లోకేష్ అస్సాం?
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు మంచి అవకాశమే దక్కిందా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు వారికి ఆహ్వానం అందిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ అధిష్టానం సూచనల మేరకు చంద్రబాబు పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేయనున్నారు. అదే సమయంలో నారా లోకేష్ అస్సాంలో ప్రచారం చేయనున్నారు. బెంగాలే ఎందుకు..? చంద్రబాబుకు బెంగాల్ బాధ్యతలు …
Read More »పంతం నెగ్గించుకున్న మంత్రి.. ఏం జరిగిందంటే..!
సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో మౌనంగా ఉంటూ పనులు చక్కబెట్టే మంత్రిగా నారాయణకు మంచి పేరుంది. అందుకే ఆయనకు కీలకమైన రాజధాని పనులను అప్పగించారు. ఒకవైపు పురపాలక శాఖ మంత్రిగా ఉంటూనే మరోవైపు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ అమరావతి నిర్మాణం, కాంట్రాక్ట్ సంస్థల ఎంపికపై దృష్టి పెట్టుతున్నారు. పనులు వేగంగా సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో సీఆర్డీఏ కమిషనర్లకు, మంత్రికి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఏరికోరి తీసుకొచ్చిన సీఆర్డీఏ …
Read More »10 మంది మంత్రులకు శ్రీముఖమా?
సీఎం చంద్రబాబు మంత్రి విస్తరణపై తరచుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్న ప్రతిసారీ ఈ అంశంపై చర్చ నడుస్తోంది. మంత్రి వర్గ ప్రక్షాళనలో వీరిని ఇంటికి పంపిస్తారు, వారిని పంపిస్తారు అంటూ ప్రధాన మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా మరో ఆసక్తికర ప్రచారం కూడా వినిపిస్తోంది. ఏకంగా 10 మంది మంత్రులకు చంద్రబాబు శ్రీముఖం ఇవ్వనున్నారు, వారిని తప్పిస్తారని అంటున్నారు. అయితే ఇందులో …
Read More »విజయన్.. మూడోసారి విజయం.. పక్కానా?
కేరళం(ఇటీవలే పేరు మార్చారు).. ప్రకృతి శోయగాలకు ఆలవాలమైన దేవుని భూమిగా పేరొందిన ఇక్కడ వచ్చే ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచార పర్వానికి కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్ 9వ తేదీ ఇక్కడ పోలింగ్ జరగనుంది. సో.. ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి.? ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీ ఎలా ముందుకు సాగుతోంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. వాస్తవానికి.. కేరళంలో ప్రతి ఐదేళ్లకు …
Read More »అసలు ఆస్తులే పంచలేదంటున్న విజయమ్మ…
దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల వై.ఎస్. షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత రాజకీయ, కుటుంబ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ విజయమ్మ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ విజయమ్మ స్పష్టంచేసిన ప్రకారం., 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు కుటుంబ ఆస్తుల పంపకం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates