ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు వ్యంగ్యాస్త్రాలు వేస్తూనే మరోవైపు సీరియస్ పాలిటిక్స్ దిశగా కూడా ఇది పయనిస్తోంది. సోషల్ మీడియాలో పెను దుమారం కూడా సృష్టించింది. తాజాగా తెలంగాణలోని తెలంగాణ థింకర్స్ ఫోరమ్ సోషల్ మీడియాలో కొత్త ఉద్యమానికి తెరదీసింది. ఏపీ నేతల విగ్రహాలను తెలంగాణలో పెడుతున్నారని.. మరి తెలంగాణ నేతల విగ్రహాలనుకూడా ఏపీలో …
Read More »పీఏ అక్రమాలు… గట్టిగా వినిపిస్తున్న జగన్ పేరు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో ప్రధానంగా 3500 కోట్ల రూపాయల మేరకు దోచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ మద్యం వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. తాజాగా అప్పటి ముఖ్యమంత్రి జగన్కు పర్సనల్ అసిస్టెంట్గా వ్యవహరించిన కె.నాగేశ్వరరెడ్డి(కేఎన్ …
Read More »కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారని, ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులన్నమాటే వినిపించదని ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ కేబినెట్ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మాన్ సర్కారు తీసుకున్న ఫలితంగా పంజాబ్ …
Read More »వైసీపీ మెడకే చుట్టుకున్న వైఎస్ విగ్రహ ధ్వంసం!
ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. పట్టపగలే… అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. విగ్రహాన్ని ద్వంసం చేసిన వ్యక్తి పేరు జమ్ములయ్య అని, అతడు వైసీపీ నేతలకు అనుచరుడు అని నిర్ధారణ అయ్యిందని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక …
Read More »లెక్కలన్నీ ఆరోజు తేలుస్తారా పవన్?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా? భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారా..? ఇటీవల ఆయన చుట్టూ నెలకొన్న వివాదాలు, విమర్శల మధ్య జూన్ 2న తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో హైదరాబాదులో సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ …
Read More »ఎన్నికల్లో ఓటమి ఊరికే రాదు..!
అక్క చెల్లెమ్మలకు.. 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాం. జగనన్న తోడు, భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి.. ఇన్ని ఇచ్చాం.. ఇవన్నీ ఎటు పోయాయో!. ఏం జరిగిందో! 2024 మేలో వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లు ఇవి. దీనికి కారణం.. ఆనాటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. మేం ఓడిపోలేదు. ఇది ఎన్నికల సంఘంతో జరిగిన …
Read More »ఎమ్మెల్యేలపై రేవంత్ ఆవేదన…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు.. పార్టీలో అంతర్గత పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో జమీందార్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ప్రజలను కలుసుకోవడం లేదని.. ప్రత్యేక సామ్రాజ్యాలను నిర్మించుకున్నట్టుగా ఫీలవుతున్నా రని.. గతంలోనూ సీఎం వ్యాఖ్యానించారు. ఎప్పటికప్పుడు.. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు …
Read More »తెలంగాణను అవమానించొద్దు ‘తమ్ముళ్ళు’
తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ నాయకుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఉందో లేదో ఆయన చూశాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాదులను, తెలంగాణ సమాజాన్ని ఎవరూ అవమానించడానికి వీల్లేదని.. ప్రాంతాలు వేరైనప్పటికీ.. తెలుగు వారు అంతా ఒక్కటేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు …
Read More »మంత్రినే లంచం అడిగిన అర్చకుడు
తమిళనాట అధికారాన్ని చేజిక్కించుకున్న స్టార్ హీరో దళపతి విజయ్… తన పార్టీ ప్రభుత్వ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సీఎం హోదాలో విజయ్ కొనసాగిస్తున్న పాలనను ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా అందిపుచ్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే… విజయ్ కేబినెట్ లోని దేవదాయ శాఖ మంత్రి రమేశ్.. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఓ ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఆలయంలో అక్రమాలకు పాల్పడుతున్న పలువురు ఉద్యోగులను …
Read More »వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. డీఎస్సీలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని, డీఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ పిలుపు మేరకు వైసీపీ …
Read More »పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న పవన్.. ఓ దశాబ్దం క్రితం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చాక 12 ఏళ్లకు గానీ ఆయనకు పదవి దక్కలేదు. అయితేనేం… పాలనలో సత్తా చాటుతున్నారు. రెండు, మూడు సార్లు మంత్రులుగా పనిచేసినవ వారి కంటే కూడా పవన్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇందుకు ఆయన దృక్పథమే కారణమని చెప్పక …
Read More »3 రోజులుగా పార్టీ ఆపీస్ లోనే మాజీ ఎంపీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ ను ఎక్కించిన పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే యత్నం చేశాయి. ఫలితంగా అక్కడ ఉద్రిక్త …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates