Political News

హైడ్రాకి బ్రేకులు వేసిన హైకోర్టు

తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న `హైడ్రా` వ్య‌వ‌స్థ‌పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎలాంటి ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చివేత‌లు చేప‌ట్ట‌డం ఏంట‌ని నిల‌దీసింది.“మీరేమైనా ప్ర‌జ‌ల‌పై యుద్ధం చేస్తున్నారా? మీరు చేప‌డుతున్న కూల్చివేత‌ల‌ను గ‌మ‌నిస్తే..యుద్ధ స‌న్నివేశాలను త‌ల‌పిస్తున్నాయి. ఇలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టే అధికారం మీకు ఉందా? ఉంటే ఎవ‌రు అధికారం ఇచ్చారు“ అని నిల‌దీసింది. ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌కుండా.. ముంద‌స్తు నోటీసులు కూడా ఇవ్వ‌కుండానే కూల్చివేత‌లు ఎలా చేప‌డ‌తార‌ని …

Read More »

ఓట్ల తొల‌గింపు ఎఫెక్ట్ ఉంటే ఎన్నిక‌లు రద్దేనా?

ఓట్ల తొల‌గింపు అంశంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇలా ఓట్లు కోల్పోయిన వారి వ‌ల్ల ఎన్నిక‌లు ప్ర‌భావితం (ఎఫెక్ట్‌) అవుతాయ‌న్న భావ‌న ఉంటేనే స‌ద‌రు ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అలా కాకుండా.. ఉంటే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ జోలికి న్యాయ వ్య‌వ‌స్థ వెళ్ల‌బోద‌ని పేర్కొంది. ఓట‌ర్లుగా ఉన్న‌వారికి త‌మ హ‌క్కును వినియోగించుకోవ‌డం స‌రైన చ‌ర్యేన‌ని .. అయితే.. లోటుపాట్ల‌ను నిర్ణ‌యించేది కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మేన‌ని.. సుప్రీంకోర్టు ఎవ‌రికీ …

Read More »

`లీకు` మంత్రులు బాబుకు దొరికిపోయారా?

త‌న మంత్రి వ‌ర్గంలోని స‌భ్యుల వ్య‌వ‌హార శైలిపై సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. వారు త‌మ ప‌నుల‌ను స‌రిగా నిర్వ‌హించ‌డం లేద‌ని.. ప‌నితీరును మెరుగు ప‌రుచుకోవాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా.. పాల‌న‌లో స‌హ‌జ‌మే కాబ‌ట్టి అంద‌రూ వింటున్నారు. కొంద‌రు స‌రిచేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు లైట్ తీసుకుంటున్నారు. అయితే.. పాల‌న‌కు సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ స‌మావేశాల‌కు ముందు.. అజెండా అంశాల‌ను లీక్ …

Read More »

విజయ్ కు పవన్ సలహా ఇస్తారా?

“నేనెవ‌రికీ స‌ల‌హాలు ఇవ్వ‌ను.“ అని జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ఎవ‌రి నుంచైనా తానే స‌ల‌హాలు తీసుకుంటాన‌ని.. వాటిలో మంచి చెడుల‌ను ఆలోచించి అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని తెలిపారు. ఇత‌రుల‌కు ఇచ్చే స‌ల‌హాల‌పై ఎప్పుడూ దృష్టి పెట్ట‌లేద‌న్నారు. త‌న‌కంటే కూడా అంద‌రూ బాగానే ఆలోచిస్తార‌ని విశ్వ‌సిస్తాన‌న్నారు. ఒక‌వేళ ఇత‌రుల‌కు స‌ల‌హాలు ఇచ్చినా.. అవి న‌చ్చుతాయో లేదో అనే భావ‌న త‌న‌లో ఉంటుంద‌ని.. కాబ‌ట్టి ఎవ‌రికీ …

Read More »

క‌విత‌కు భ‌య‌ప‌డుతున్నారా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలైనా ఎదుర‌వుతాయి. ఏకు మేకైన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలానే.. ఇప్పు డు బీఆర్ఎస్ పార్టీకి.. అదే పార్టీ మాజీ నాయ‌కురాలు, మాజీ ఎంపీ క‌విత కంట్లో న‌లుసుగా మారారు. కొత్త‌ పార్టీ ఏర్పాటు ద్వారా.. బీఆర్ ఎస్‌ను ల‌క్ష్యంగా చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ముందున్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా బీఆర్ ఎస్ పార్టీని బ‌ల‌హీన ప‌ర‌చ‌డం ద్వారా తాను ఎద‌గాల‌న్న వ్యూహాల‌తో క‌విత ముందుకు సాగుతున్నారు. …

Read More »

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత పది సంవత్సరాల కాలంలో పక్కన పెట్టారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో పార్టీకి అండదండగా ఉన్న కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకులను కూడా విస్మరించారు… అన్న వాదన బలంగా వినిపించింది. ఫలితంగా గత ఎన్నికల సమయంలో ఈ వాదన బలంగా పనిచేసింది. ఇప్పుడు కూడా అదే అసంతృప్తి పార్టీ నాయకులు కార్యకర్తల‌లో …

Read More »

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ, అటు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా విభ‌జించాల‌ని భావిస్తోంది. దీనికి సంబంధించి చ‌ర్చించేందుకు ఈ నెల 16 నుంచి 18 మ‌ధ్య రెండు రోజుల పాటు ప్ర‌త్యేకంగా పార్ల‌మెంటు స‌మావేశాలు కూడా జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఈ ద‌ఫా పున‌ర్విభ‌జ‌న‌లో కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. సంప్ర‌దాయంగా ప్ర‌తి …

Read More »

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన ఎంపీలు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు స‌హా.. ప‌లువురితో క‌లిసి ఆయ‌న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. అనంత‌రం.. రాష్ట్ర‌ప‌తి గౌర‌వార్థం.. మంగ‌ళ‌గిరి చేనేత చీర‌ల గిఫ్టు ప్యాక్‌ను అందించారు. అంతేకాదు.. అర‌కు కాఫీ గిఫ్టు ప్యాక్‌ను  కూడా బ‌హూకరించారు. అదేస‌మ‌యంలో తాను రాసిన పుస్త‌కం.. `యువ‌గ‌ళం` సంచికను కూడా రాష్ట్ర‌ప‌తికి అందించి …

Read More »

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని.. రిటైరయ్యారు. దీంతో కొత్త క‌మిష‌న‌ర్‌ను ఎంపిక చేసే బాధ్య‌తను సీఎం చంద్ర‌బాబు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్ల‌ను చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్నారు. తాజాగా అందిన అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు.. ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం స‌హా నీర‌బ్ …

Read More »

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా ఇటీవల కాలంలో హోం శాఖ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వివాదాల్లో కూడా చిక్కుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టేషన్ కి వెళ్తే పనులు జరగడం లేదని పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు.. పోలీసుల నుంచి సరైన వర్కింగ్ నేచర్ కూడా కనిపించడం లేదని ఫిర్యాదులు …

Read More »

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ధనసిరి అనసూయ అలియాస్ సీతక్క సోమవారం ఓ కీలక చర్య చేపట్టారు. రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చర్యలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆమె లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లోగా తనకు సారీ చెప్పాలని, లేదంటే కేసీఆర్ పై …

Read More »

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా మారడంతో, ‘హోలోగ్రాఫిక్ కృత్రిమ మేధస్సు సమాచార ప్రసారం’ను వినియోగిస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా విజయ్ అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తూ ఓటర్లతో మాట్లాడుతున్న అనుభూతిని కలిగిస్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించే అవకాశం ఏర్పడటమే కాకుండా, భౌగోళిక పరిమితులను అధిగమించే అవకాశమూ కలుగుతోంది. తాజాగా …

Read More »