ఆశ్చర్యం లేదు.. అనుమానం కూడా లేదు! హిందూత్వ బ్రాండును పుణికి పుచ్చుకున్న బీజేపీ.. అవకాశం, అవసరం అనే కోణంలో ఇప్పుడు క్రిస్టియన్ సెంట్రిక్గా రాజకీయాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్లో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో కులం, మతం ఆధారంగా ఎక్కువగా ఓట్లు పడే ఏకైక రాష్ట్రం కేరళ. ఇక్కడ క్రిస్టియానిటీకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం కేరళలో క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న వారి సంఖ్య …
Read More »పెరిగిన సీట్లు… వాళ్ళంతా సేఫేగా?
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయని తాజాగా తెలిసింది. అయితే.. వాస్తవ లెక్క ప్రకారం.. అంటే.. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయం ప్రకారం.. 50 అదనపు నియోజకవర్గాలు రావాల్సి వుంటుంది. కానీ, దీనికి భిన్నంగా.. 263 స్థానాలు పెరగనున్నాయి. అంటే.. ప్రస్తుతం ఉన్న 175 స్థానాలకు అదనంగా.. 88 స్థానాలు పెరగనున్నాయి. అయితే.. నిన్న మొన్నటి వరకు ఉన్న లెక్కల ప్రకారం.. 50 స్థానాలు పెరిగితే.. పురుష నాయకులు …
Read More »పార్లమెంటులోనూ వైసీపీని వెంటాడిన ’11’
వైసీపీని `నెంబరు 11` వెంటాడుతోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం దక్కింది. వాస్తవానికి వైనాట్ 175 అన్నా కూడా.. ప్రజలు మాత్రం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇక, అప్పటి నుంచి `లెవెన్ రెడ్డి` అనే పేరు జగన్కు.. `11 మెంబర్స్` అనే పేరు వైసీపీ ఎమ్మెల్యేలకు స్థిరపడిపోయింది. ఇక, తరచుగా ఈ విషయం రాజకీయంగా కూడా… జగన్కు, ఆ పార్టీ నాయకులకు …
Read More »కరోనా సమయపు తెగువ మళ్ళీ చూపించాలి
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావం భారత్పై దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాజ్యసభలో మంగళవారం ప్రసంగించిన ఆయన, యుద్ధం వల్ల ఇంధన సరఫరాలో ఆటంకాలు కలగవచ్చని, దీనివల్ల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం ఇప్పటికే అన్ని రంగాల్లో అప్రమత్తంగా ఉందని భరోసా ఇచ్చారు. యుద్ధం …
Read More »ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?
అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 2062 సీట్లు పెరగనున్నాయి. దీంతో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి ప్రాతినిధ్యం మెరుగవుతుందనే అభిప్రాయం ఒకవైపు కనిపిస్తున్నా, అంత మంది నాయకులు ఎక్కడ నుంచి …
Read More »మతం మారితే ఎస్సీ హోదా రద్దు… సంచలన తీర్పు
భారత దేశంలో కులం, మతం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్య, ఉద్యోగం, సామాజిక హోదాలకు కులం, మతం ప్రాతిపదిక. అయితే, ఒక కులం నుంచి మరో కులంలోకి మారిన సందర్భంలో ఎదురయ్యే సమస్యల గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా క్రిస్టియానిటీలోకి మారిన షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులకు ఎస్సీలకు లభించే హక్కులు లభించడంపై చాలా ఏళ్లుగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై …
Read More »అమరావతిపై అగ్ని కుట్ర?
“ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ హయాంలో కుట్రలు చేశారు. దీనిని శ్మశానం అని గేలి చేశారు” అని సీఎం చంద్రబాబు గత ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ కుట్రలు ఇంకా ఆగలేదన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. వరుసగా అమరావతిలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దీనికి ఉదాహరణగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి పెడుతోంది. సోమవారం అర్ధరాత్రి అమరావతి రాజధాని ప్రాంతంలో …
Read More »ఈసీ లేఖపై బీజేపీ ముద్ర నిజమే కానీ…
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడింపు, ఎన్నికల ప్రచార నిబంధనలకు సంబంధించిన 2019 మార్గదర్శకాలపై ఈసీ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ పంపింది. అయితే ఆ లేఖపై బీజేపీ సీల్ ఉండటం వివాదానికి దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తూ, ఎన్నికల సంఘం …
Read More »యుద్దం ఎఫెక్ట్.. మోడీ ప్రచారం రద్దు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సామాన్యులకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇక, వ్యాపారులకు రవాణా నిలిచిపోయి.. వ్యాపారాలు ఆగిపోయాయి. ఇక, చమురు సమస్య వెంటాడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదిలావుంటే.. కేంద్రంలోని సర్కారుకు పశ్చిమాసియా ప్రభావంతో కీలకమైన రవాణా, గ్యాస్ దిగుమతులు.. సహా ఎగుమతులు కూడా నిలిచిపోవ డం కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఈ పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు.. పరిశీలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా మంత్రులు, అధికారులతో …
Read More »మార్పు దిశగా మాచర్ల.. !
పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గం మాచర్ల. ఇక్కడ నుంచి వరుసగా విజయాలు దక్కించుకున్న పిన్నెల్లి రామకృష్నారెడ్డి ఇటీవల కాలంలో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసు ఆయనను వెంటాడింది. ఆ తర్వాత.. టీడీపీ నాయకుల జంట హత్యల కేసు కూడా పిన్నెల్లి సోదరులపై ఉండడంతో ఇటీవలే జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం మాచర్లలో పిన్నెల్లి ప్రభావం ఎంత? అనేది చర్చకు …
Read More »తమిళనాట బీజేపీకి ఎన్ని సీట్లు?
ఏకంగా 240 సీట్లు. ఇక్కడ పాగా వేయాలన్నది కమల నాథుల సుదీర్ఘ సంకల్పం. అందుకే.. నానా తిప్పలు పడి.. ఇతర పార్టీలతో చెలిమి చేశారు. ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలతో జట్టు కట్టారు. సో.. మొత్తంగా `ఎన్డీయే` కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే… బీజేపీ వచ్చినట్టే. అదే.. తమిళనాడు రాష్ట్రం. వచ్చే నెల 23న ఇక్కడ పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ ఎన్డీయే కూటమిలో తాజాగా …
Read More »ఏపీలో మిట్టల్… దేశంలోనే టాప్
విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో కొత్త చరిత్రను సృష్టించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే కూడా.. అతి పెద్ద పరిశ్రమ నక్కపల్లిలో రానుందన్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిట్టల్ కు చెందిన ఉక్కు పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు శంకు స్థాపన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్లు ఈ కార్యక్రమంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates