Political News

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో విదేశీ సంస్థ కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు.. ఆయ‌న‌పై ఉన్న న‌మ్మ‌కంతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏపీకి త‌ర‌లి వ‌స్తున్నామ‌ని తెలిపింది. ఇది త‌మ‌కు ల‌భించిన గొప్ప అవ‌కాశంగా భావిస్తున్న‌ట్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అమెరికా-జ‌పాన్ సంయుక్తంగా ఏర్పాటు …

Read More »

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను ఈ కేసులో టార్గెట్ అయ్యాన‌ని వ్యాఖ్యానించారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని పేర్కొన్నారు. ఒక‌రిపై ఉన్న అక్క‌సుతో నాపై కేసు బ‌నాయించి.. జైలుకు త‌ర‌లించార‌ని ఆమె ప‌రోక్షంగా బీఆర్ ఎస్ అధినేత‌పై వ్యాఖ్య‌లు చేశారు. తాను రాజ‌కీయం పావుగా మారాన‌న్నారు. అయితే.. అప్ప‌ట్లోనే తాను.. క‌డిగిన ముత్యంగా …

Read More »

డిల్లీ లిక్కర్ కేసులో కవితకేం సంబంధం?

బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌కు ఢిల్లీ మ‌ద్యం కేసులో స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ద‌ర్యాప్తు సంస్థ‌లు స‌రైన ఆధారాలు చూప‌లేక పోయాయని పేర్కొంటూ.. కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ స‌హా 22 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. వీరిలో క‌విత కూడా ఉన్నారు. నాడు దేశంలో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన ఈ …

Read More »

ఎన్నిక‌ల వేళ‌… ఇన్‌ఫ్లుయెన్స‌ర్లదే `రాజ‌కీయం`!

ప‌దిమందిని మెప్పించ‌గ‌ల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌జ‌లను ఆక‌ర్షించ‌గ‌ల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాల‌న్నీ మీవే!. త్వ‌ర‌లోనే.. దేశ‌వ్యాప్తంగా కీల‌క‌మైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో బ‌ల‌మైన పోటీ ప‌డుతున్న ప్ర‌ధాన పార్టీలు ప్ర‌జ‌లను ఆక‌ర్షించేందుకు ర‌క‌ర‌కాల మార్గాల‌ను అన్వేషిస్తున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా సోషల్ మీడియాలో ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల కోసం.. పార్టీలు క్యూ క‌డుతున్నాయి. వీరి ద్వారా ప్ర‌చారం …

Read More »

రఘురామను మళ్ళీ గిల్లుతున్న సునీల్ కుమార్

“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా కొడితే?” అంటూ సునీల్ కుమార్ చేసిన తాజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “అబద్ధాలు బయటపడుతున్నాయి… నిజం దాగదు” అని వ్యాఖ్యానిస్తూ ఆయన పరోక్షంగా ఉంది ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో .. …

Read More »

న‌గ‌రిలో రోజా VS భాను… ఇదో స‌రికొత్త వార్‌…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నగ‌రిలో ఏం జ‌రుగుతోంది? నాయ‌కులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్ర‌స్తుతం సైలెంట్‌గానే ఉంద‌ని స‌మాచారం. వాస్త‌వానికి చిత్తూరు జిల్లాలో అంతో ఇంతో రాజ‌కీయంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం మాత్ర‌మే త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తుంది. గ‌త రెండు మాసాల కింద‌టి వ‌రకు ఇక్క‌డ రాజ‌కీయాలు భిన్నంగా ఉన్నాయి. వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి రోజా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. దీనికి ధీటుగా టీడీపీ నుంచి కూడా …

Read More »

ఆయ‌నో మ‌ర్రి చెట్టు: టీడీపీ కామెంట్‌.. !

కొంద‌రు నాయ‌కులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా స‌హ‌క‌రిస్తారు. ఇది ఎక్క‌డైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.. దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాము ఎదగ‌డ‌మే ముఖ్య‌మ‌ని భావిస్తున్న నాయ‌కులు కొంద‌రు టీడీపీలో చ‌ర్చ‌కు వ‌స్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో 25 ఏళ్లుగా ఒకే నాయ‌కుడు పాతుకుపోయారు. ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు కూడా త‌క్కువేమీ లేవు. అయినా.. ఆయ‌న త‌ప్ప ఇంకెవ‌రూ పార్టీ కార్య‌క్ర‌మాలు …

Read More »

ఒకేసారి 2 స‌మ‌స్య‌లు.. చంద్ర‌బాబు సీరియ‌స్ డెసిష‌న్‌!

ఏపీలో ఒకేసారి రెండు కీల‌క స‌మ‌స్య‌లు రాష్ట్రంలో అల‌జ‌డి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు కావ‌డం.. దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌త్యర్థులు విమ‌ర్శ‌లు చేస్తున్న క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు తాజాగా సీరియ‌స్ డెసిష‌న్ తీసుకున్నారు. అధికారులు క‌ద‌ల‌క‌పోతే.. తానే రంగంలోకి దిగాల్సి ఉంటుంద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఏం జ‌రిగింది? 1) ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో డ‌యేరియా సంభ‌వించింది. దీంతో ప‌లువురు …

Read More »

కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు తాజాగా మ‌రో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి రిమార్డ్ రిపోర్టులో పేర్కొ న్నారు. ఈ కేసులో కోట్ల రూపాయ‌ల ముడుపులు చేతులు మారాయ‌ని.. ఈ నిధుల‌ను సేక‌రించ‌డం.. క‌మీష‌న్లు రాబ‌ట్ట‌డం.. వంటి విష‌యాల్లో.. ముప్పిడి అవినాష్ రెడ్డి సూత్ర‌ధారి అని పేర్కొన్నారు. ఏం చేశాడంటే.. మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారి(ఏ1) …

Read More »

‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌ను రాజకీయం చేయ‌ద‌ల్చుకోలేద‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాల‌నే తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టిన‌ప్పుడు.. తాను అడ్డుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని తెలిపారు. అప్ప‌ట్లో చాలా మంది దీనిపై త‌న‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌య‌త్నించార‌ని.. కానీ, అన్నీ ఆలోచించే ఆనాడు తాను అడ్డు చెప్ప‌లేద‌న్నారు. దీనివ‌ల్ల తెలంగాణ స‌స్య‌శ్యామలం అవుతుంద‌న్నారు. అదేవిధంగా ఇప్పుడు పోల‌వ‌రం-మ‌ల్ల‌న్న …

Read More »

`లెస్స‌న్`పై నిప్పులు చెరిగిన సుప్రీం… అసలేంటిది?

కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఎన్ సీఈఆర్‌టీ సంస్థ‌.. 8వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కంలో కొత్తగా చేర్చిన ఓ పాఠం దేశాన్ని పెనుకుదుపున‌కు గురి చేసింది. `న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో అవినీతి` పేరుతో తీసుకువ‌చ్చిన ఈ పాఠ్యాంశంపై వ‌రుస‌గా రెండో రోజు కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డింది. ఇది న్యాయ వ్య‌వ‌స్థ‌ను అవ‌మానించేందుకు.. కుట్ర‌పూరితంగా చేసిన చ‌ర్య‌గా పేర్కొంది. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టేది లేద‌ని తేల్చి చెప్పింది. గురువారం మ‌రోసారి …

Read More »

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన అనంతరం కూడా అదే అంశంపై మరింత చర్చకు అవకాశం ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే ప్రశ్నోత్తరాల ప్రక్రియ పూర్తయ్యిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు …

Read More »