Political News

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయం కనుక ఇక్కడ తనకు ఎదురులేకుండా చేసుకునే వ్యూహంలో భాగంగా పిఠాపురంకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. ప్రధానంగా రహదారులను …

Read More »

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని కూడా చేపట్టలేదు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ డీఎస్సీ నిర్వహించింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పలు డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో …

Read More »

జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యార్థులు వీధి పోరాటాలు చేస్తున్నారు. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజి వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. ఉత్తరం, దక్షిణం అనే తేడాలు లేకుండా యావత్ భారత దేశంలోని విద్యార్థి, యువజనులు ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్నారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు, అసాంఘిక శక్తుల దాడులు …

Read More »

రేప్ కేసులో `తెహ‌ల్కా` మాజీ ఎడిట‌ర్ దోషి!

`తెహ‌ల్కా`.. ఒక‌ప్పుడు ఈ పేరంటే రాజ‌కీయ నేత‌లకు.. లంచాల‌కు మ‌రిగిన అధికారుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టేవి. ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజానికి అప్ప‌టి వ‌ర‌కు ఎన‌లేని ప్రాధాన్యం తీసుకువ‌చ్చిన మీడియా తెహ‌ల్కా. 2జీ స్పెక్ట్ర‌మ్ కుంభ‌కోణం నుంచి బొగ్గు గ‌నుల కుంభ‌కోణం వ‌ర‌కు అనేక కుంభ‌కోణాల‌ను తెహ‌ల్కా వెలుగులోకి తీసుకువ‌చ్చింది. అలానే.. భోపాల్ గ్యాస్ బాధితుల వెనుక‌.. రాజ‌కీయ నేత‌లు చేసిన కుట్ర‌లను కూడా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించింది. అలాంటి వార్త‌లు, క‌థ‌నాలు, …

Read More »

పోలీసు దెబ్బ: వైసీపీలో `ర‌ప్పా-ర‌ప్పా` పోయిందే

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఇటీవల కాలంలో `ర‌ప్పా-ర‌ప్పా` డైలాగులు త‌ర‌చుగా వినిపించేవి. రప్పా-ర‌ప్పా అని రాసున్న బ్యాన‌ర్లు, ప్ల‌కార్డులు కూడా ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే.. ఇవి స‌మాజాన్ని రెచ్చ‌గొట్టేలా ఉండ‌డం.. రౌడీయిజాన్ని పెంచేలా ఉండ‌డంతో పోలీసులు ఈ వ్యాఖ్య‌లు స‌హా.. ఈ బ్యాన‌ర్ల‌ను క‌ట్టిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో ఇటీవ‌లి జ‌గ‌న్‌ ప‌ర్య‌ట‌న‌ల్లో ర‌ప్పా-ర‌ప్పా బ్యాన‌ర్లు మాయ‌మ‌య్యాయి. వీటి స్థానంలో కొత్త‌వి చోటు చేసుకున్నాయి. ఇటీవల …

Read More »

జ‌గ‌న్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. తొలుత తాడేప‌ల్లి నుంచి ప్ర‌త్యేక ప్రైవేటు హెలికాప్ట‌ర్‌లో నేరుగా దేవ‌ర‌ప‌ల్లికి చేరుకున్న జ‌గ‌న్ ఎలాంటి ర్యాలీలు లేకుండానే.. ఎలాంటి జ‌న స‌మీక‌ర‌ణ చేయ‌కుండానే నేరుగా పొగాకు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. దీనికి ప‌క్క‌నే హెలిప్యాడ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే.. ఇక్క‌డే పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. ఇదే రాజ‌కీయంగా అటు వైసీపీ, …

Read More »

రాజ్యసభలో జగన్ కేసులను ప్రస్తావించిన టీడీపీ యువ రక్తం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే ఉన్నాయి. జగన్ పై ఇటు సీబీఐతో పాటు ఇటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసి ఇప్పటికే దాదాపుగా 13 ఏళ్లు గడుస్తోంది. అయినా ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదే అంశం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బుధవారం …

Read More »

కొత్త జంట‌కు తాళి బొట్లు… ఫ‌స్ట్ బ‌డ్జెట్‌లోనే `విజ‌య్` ముద్ర‌!

త‌మిళ‌నాడులో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్.. నేతృత్వంలోని స‌ర్కారు.. తొలి బ‌డ్జెట్‌ను(2026-27)ను బుధ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌కు తొలి బ‌డ్జెట్‌నే నిధులు కేటాయించారు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఎంతో ఆశ పెట్టుకున్న ప‌థ‌కాల‌కు ఈ బ‌డ్జ‌ట్‌లోనే సింహ‌భాగం నిధుల‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా తొలి బ‌డ్జెట్‌లోనే సీఎం విజ‌య్ త‌న‌దైన ముద్ర వేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్‌. …

Read More »

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలో వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఒకసారి ఇలాంటి ప్రచారం జరిగింది. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ ఉహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి …

Read More »

బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని ఢిల్లీ మీడియా కోడై కూస్తుంది. ఈ నెల 15 వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ఢిల్లో పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. కేంద్ర మంత్రులందరూ అందుబాటులో వుండాలని మంగళవారం పిలుపు రావడంతో బండి సంజయ్ హుటాహుటిన ఫ్లయిట్ ఎక్కి ఢిల్లీ చేరుకున్నారు. రెండు …

Read More »

విజయ్ వెంట పడడం మొదలెట్టిన డీఎంకే

తమిళనాడులో రాజకీయాలు వేడి వేడిగా వున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష డీఎంకే తరచుగా ఏదో ఒక వివాదం రాజేసేందుకు ప్రయత్నిస్తుంది. అడ్డగోలు కామెంట్స్ చేసి రోడ్డు మీద పడుతుంది. నిజానికి విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాలేదు. ఈ ఏడాది మే 10 వ తేదీన చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి …

Read More »

స్థానికాల తరువాత మంత్రివర్గ మార్పులు తప్పవా?

మంత్రులు మౌనంగా ఉంటే స‌హించేది లేద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రుల‌కు ఆయ‌న ఈ విష‌యంలో ఇప్ప‌టికే చాలా సార్లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయిన‌ప్ప‌టికీ చాలా మంది మంత్రులు మౌనంగా ఉండ‌డం.. క‌నీసం ప‌న్నెత్తు విమ‌ర్శ కూడా చేయ‌క‌పోవ‌డంతో సీఎం మ‌రోసారి వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఉద‌య‌మే టెలీ కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించిన సీఎం చంద్ర‌బాబు.. మంత్రుల‌కు వారి బాధ్య‌త‌ల‌ను గుర్తు చేసిన‌ట్టు …

Read More »