మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ప్రస్తుతం ఆయన రిజర్వ్లో ఉన్నారని కొందరు, కాదు వెయిటింగ్లో ఉన్నారంటూ మరికొందరు చెప్పుకుంటున్నారు. నిజానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నా, రాజకీయంగా మాత్రం ఆసక్తికర చర్చగా మారింది. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంలో యనమల చర్చ వచ్చింది. అందులో కొందరు ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తనకు చిరకాల కోరికగా …
Read More »ఢిల్లీలో 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణం అదే!
ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. ఏక్యూఐ 359తో ప్రమాదకర స్థాయికి చేరగా, అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం పెరగడంతో కేంద్రం జీఆర్ పీఏ స్టేజ్-4 చర్యలను స్టేజ్-3లోనే అమలు చేయాలని సూచించింది. ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో పనిచేయాలి, మిగతావారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఏక్యూఐ.. ఆనంద్ విహార్ లో 422, అశోక్ విహార్ …
Read More »రాజధాని రైతులకు భరోసా… ఆరు నెలల్లోగా..?
రాజధాని రైతుల సమస్యలన్నీ ఆరునెలల్లోగా పరిష్కరిస్తామని త్రీమెన్ కమిటీ హామీ ఇచ్చింది. స్వార్ధం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలు ఎవరూ నమ్మవద్దని కమిటీ సభ్యులు సూచించారు. ప్రతి రెండు వారాలకోసారి సమావేశమై రైతుల సమస్యలను పరిష్కరించేలా ముందుకెళ్తామని కమిటీ తెలిపింది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ రెండో సమావేశం అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ …
Read More »G20లో మోదీ: ప్రపంచానికి 4 ఐడియాలు!
జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న G20 సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. కేవలం చర్చలతో సరిపెట్టకుండా, ప్రపంచవ్యాప్త అభివృద్ధి కోసం నాలుగు కీలకమైన ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. భారతీయ విలువలే ప్రపంచ ప్రగతికి బాటలు వేస్తాయని చెబుతూ.. ఆరోగ్యం, ఉగ్రవాదం, నైపుణ్యాభివృద్ధి, ప్రాచీన విజ్ఞానం అనే నాలుగు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందులో మొదటిది ‘గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ’. మన …
Read More »జగన్ – కేటీఆర్: ఇద్దరు ఒకే వేదికపై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫంక్షన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న వైయస్ …
Read More »ప్రభుత ఆసుపత్రిలో గర్భిణీ మృతి, సీఎం బాబు ఆగ్రహం
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు వరుస సంఘటనలు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో, తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోయారు. మల్లేశ్వరికి పాంటాప్రోజోల్ అలెర్జీ ఉందని, హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నాయని కేస్ …
Read More »మరోసారి పుట్టపర్తికి చంద్రబాబు..
వారం వ్యవధిలో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టపర్తికి వెళ్లారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లవ్ ఆల్..సర్వ్ ఆల్, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలి… ఎవ్వరిని నొప్పించకూడదు అనేది సత్యసాయిబాబా సిద్దాంతం అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేది సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలు. ఈ సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందన్నారు. ఆంధ్రా, …
Read More »బీజేపీ రుణం తీర్చేసుకున్న నితీశ్
రాజకీయాల్లో లెక్కలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని ఫార్ములాలు కొందరికి మినహాయింపులు ఇచ్చేసే పరిస్థితి కాలం ఇస్తూ ఉంటుంది. బీజేపీ లాంటి పార్టీ.. తాను గురి పెట్టిన రాష్ట్రంలో తన భాగస్వామి పార్టీ కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి కూడా ముఖ్యమంత్రి కుర్చీని మిత్రపక్షానికి కట్టబెట్టటమే ఒక వింత. అందుకు వేదికగా మారింది బిహార్. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధించటం …
Read More »గన్నవరంలో యార్లగడ్డకు పట్టు చిక్కిందా… గ్రాఫ్ ఎలా ఉంది…?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలకమైన నియోజకవర్గం గన్నవరం. గత రెండు దశాబ్దాలుగా.. ఇక్కడి రాజకీయం.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంవీ చుట్టూనే తిరిగింది. వరుస విజయాలతో ఆయన ఇక్కడ ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించారన్న టాక్ కూడా ఉంది. గత 2019 ఎన్నికలలో విజయం దక్కించుకున్న వంశీ.. తర్వాత.. వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత.. తనకు రాజకీయంగా భిక్ష పెట్టిన టీడీపీ పైనే విమర్శలు చేశారు. పార్టీ అధినేత కుటుంబాన్ని కూడా …
Read More »ఎన్ని రోజులైనా జైల్లో ఉంటా.. కానీ, ఆ పని చేయొద్దు: చెవిరెడ్డి
వైసీపీ సీనియర్ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏసీబీ కోర్టులో కన్నీరు మున్నీరయ్యారు. తాజాగా వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయనకు మరో 14 రోజలు పాటు రిమాండ్ విధించారు. అయితే.. ఈ సమయంలో చెవిరెడ్డి.. అనూహ్యంగా నోరు విప్పారు. న్యాయాధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని.. …
Read More »మొన్న బాబు, నిన్న లోకేష్, నేడు నారా భువనేశ్వరి
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ తరచుగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు.. వారి విజ్ఞాపనలపై స్పందిస్తున్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయాని కి వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహించినప్పుడు.. సుమారు 4 వేల మందికి పైగా ప్రజలు వచ్చి.. తమ సమస్యలు చెప్పుకొన్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా వేల మంది సమస్యలతో వచ్చారు. వారి …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మరో బాంబు పేల్చిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. మాజీ ఎంపీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను ఆ పనిచేస్తే.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారేమో.. ఆ విషయమే ఆలోచిస్తున్నా“ అని అన్నారు. జాగృతి జనం యాత్ర నిర్వహిస్తున్న కవిత .. తాజాగా శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates