వాహనాలను ఛేజ్ చేయడాన్ని మనం సినిమాల్లోనే చూస్తుంటాం. ఇక రియల్ లైఫ్ లో కూడా అక్కడక్కడ వెహికిల్ ఛేజ్ ఘటనలు చోటుచేసుకుంటున్నా… వాటిని ఛేజ్ చేసే వారు పోలీసులే అయి ఉంటారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సర్కారీ ఆధీనంలోని ఆర్టీసీ బస్సును ఛేజ్ చేశారు. ప్రయాణికులతో స్పీడుగా వెళుతున్న ఆ బస్సును తన కారుతో వెంబడించిన సదరు ఎమ్మెల్యే బస్సును ఆపారు. ఈ ఘటన ఎన్టీఆర్ …
Read More »విజయ్ కు లైన్ క్లియర్ చేసిన స్టాలిన్?
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావడం లాంఛనమే అంతా భావించిన తరుణంలో ఆ పార్టీ అధినేత విజయ్ కు అనుకోని చిక్కులు ఎదురు వచ్చాయి. కాంగ్రెస్ కు చెందిన 5గురు ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతిచ్చినా….సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి చిన్న పార్టీలు టీవీకేకు ఇంకా మద్దతివ్వలేదు. ఈ నేపథ్యంలోనే విజయ్ సీఎం సీటుకు లైన్ క్లియర్ అయ్యేలా మాజీ సీఎం స్టాలిన్ చేసిన ప్రకటన …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై బీజేపీ శ్రేణుల దాడి
తెలంగాణలోని కరీంనగర్ లో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వాహనాలు, క్యాంప్ కార్యాలయాలపై బీజేపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతల కార్లు ధ్వంసం కాగా… క్యాంప్ కార్యాలయాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడులకు పాల్పడ్డ వారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులుగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో బీఆర్ఎస్ …
Read More »విజయ్ కు మరోసారి షాకిచ్చిన గవర్నర్
తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించిన టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనూహ్యంగా షాకిచ్చిన సంగతి తెలిసిందే. టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సభ్యులు తీసుకువస్తేనే అనుమతినిస్తానని ఆయన తేల్చి చెప్పారు. అయితే, తాజాగా నేడు మరోసారి గవర్నర్ రాజేంద్రను కలిసేందుకు విజయ్ లోక్ భవన్ కు వెళ్లిన విజయ్ కు …
Read More »వర్మకు ఊహించని షాకిచ్చిన టీడీపీ
ఏపీలో అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ ఎన్వీఎస్ఎన్ వర్మను ఆ పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం గురువారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవి నుంచి తప్పించడం పెద్ద వార్తేమీ కాదు గానీ.. పిఠాపురం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం …
Read More »వైసీపీలో మావిగన్ రచ్చ ఇంకా సమసిపోలేదా..?
వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన వ్యవహారం ఆ పార్టీలోనే చిచ్చు పెడుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది నాయకులు జగన్ చేసిన ప్రకటనను గుడ్డిగా సమర్థిస్తూ.. ఆయన వెంట నడుస్తామని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురు నేతల్లో వ్యక్తమవుతోంది. …
Read More »55 ఏళ్ల బంధానికి బీటలు.. కాపురం కాదు.. రాజకీయం!
తమిళనాడులో రాజకీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన.. టీవీకే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో 10 స్థానాలకు దూరంలో నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే.. రాష్ట్రపతి పాలన తప్పదు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. ఈ నేపథ్యంలో తమతో కలిసి వచ్చే పార్టీలకు చేతులు చాచింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఈ పార్టీకి.. తాజా ఎన్నికల్లో …
Read More »సీఎం వెళ్లే రూట్లో ట్రాఫిక్ పూర్తిగా ఆగదు!
వీవీఐపీలు…ప్రత్యేకించి ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అనుకోని కారణాల వల్ల సీఎం వెళ్లడం కాస్తంత లేటైందంటే… ఇక నడిరోడ్డుపై సామాన్య వాహనదారులు గంటల తరబడి నిలబడిపోవాల్సిన పరిస్థితి నిత్యం కనిపిస్తూనే ఉంది. ఈ తరహా పద్ధతిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాను వెళుతున్నానని చెప్పి సామాన్య జనాన్ని ఎంతసేపని అలా రోడ్డుపై నిలబెడతారంటూ ఆయన పోలీసు అధికారుపై …
Read More »తమిళనాట సంచలన పొత్తు… నిజమెంత?
తమిళనాడు రాజకీయం రంజుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనన్ని ట్విస్టులు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు కారణం నిన్నటిదాకా అక్కడ ఉన్నవి రెండు పార్టీలే. ఇప్పుడు ప్రధాన పార్టీల సంఖ్య రెండు నుంచి మూడుకు చేరింది. అంతేకాకుండా నిన్నటిదాకా ఓ సారి నీకు, ఓ సారి నాకు అంటూ అధికారం పంచుకుంటూ వస్తున్న డీఎంకే, అన్నాడీఎంకేలను ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ టీవీకే చిత్తు చేసింది. విజయ్ కొట్టిన దెబ్బకు …
Read More »ఏపీపై పెట్టుబడుల వర్షం.. చంద్రబాబు హర్షం!
ఏపీలో పెట్టుబడుల వరద ప్రవహిస్తూనే ఉంది. తాజాగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రంపై కనక వర్షం కురిసినట్టుకురిశాయి. చిన్న పెద్ద అన్నీ కలిపి ఒకే రోజు(బుధవారం) రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి. దీంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా బుధవారం జరిగిన 17వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటిలో రిలయన్స్ నుంచి.. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థల వరకు ఉన్నాయి. …
Read More »దీదీ రాజీనామా చెయ్యకపోతే ఏం జరుగుతుంది?
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం పాలయ్యాయి. వాటిలో కీలక రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ఉంది. ఈ లెక్కన ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోక తప్పని పరిస్థితి. అయితే ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని ఆరోపిస్తూ… సీఎం పదవి నుంచి తాను దిగేది లేదంటూ తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి …
Read More »వారు నేరం చేసినా.. గౌరవనీయులే…
ప్రజాప్రతినిధుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల విషయంలో గౌరవాన్ని పాటించి తీరాల్సిందేనని తెలిపింది. దాదాపు లక్షల మంది ఓట్లు వేసి.. గెలిపించిన ప్రజా ప్రతినిధుల విషయంలో అగౌరవంగా వ్యవహరించేందుకు పోలీసులకు, అధికారులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాల హోం శాఖలను కూడా ఆదేశించింది. తాజాగా ఓ కేసు విచారణ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates