Political News

‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో యాక్టివ్ గా అనిల్ కుమార్ యాదవ్ పాల్గొనలేదు. అయితే, తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై దాడి నేపథ్యంలో అనిల్ కుమార్ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే పాత అనిల్ కుమార్ యాదవ్ బయటకు …

Read More »

నా మెడ కోసేశారు: కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ నా మాట‌కు విలువ లేకుండా పోయింది. నేను ఏమొహం పెట్టుకుని తిర‌గాలి. పార్టీ పెద్ద‌లు.. నా మెడ కోసేశారు“ అని జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు స్థానికంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 116 మునిసిపాలిటీలు 7 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో స్థానిక ఎన్నిక‌ల్లో …

Read More »

నాగబాబుకు పవన్ క్లాస్?

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్రస్థాయి రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై వైసీపీ నేతలకు టీడీపీ నేతలు…టీడీపీ నేతలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు మాత్రం జనసేన నుంచి పెద్దగా కౌంటర్లు వస్తున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే జనసేన నేతల తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. …

Read More »

టీడీపీకి మరో ఫైర్ బ్రాండ్ మహిళా నేత దొరికారు

గళ్లా మాధవి… 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఘన విజయం సాధించిన మహిళా నేత. తొలి ప్రయత్నంలోనే మాజీ మంత్రి విడదల రజనీని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మాధవి. అయితే, మాధవి కొద్ది సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినా ఆ సందర్భం, విషయంపై మాత్రమే ఆచితూచి మాట్లాడేవారు. అయితే, సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మాధవి పేరు …

Read More »

ట్రంప్ తో ఒప్పందం… పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. తొలుత 25 శాతం మేర టారిఫ్‌లు విధించగా, అనంతరం రష్యా చమురు కొనుగోలుతో సంబంధం ఉన్న పెనాల్టీ టారిఫ్‌లను కూడా జోడించి వివిధ రంగాల్లో ఆందోళనకు దారి తీసింది. రష్యా చమురు కొనుగోలును తగ్గించకపోతే టారిఫ్‌లపై సడలింపు ఉండదన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారు. ఇప్పుడు రష్యా చమురు …

Read More »

పరామర్శ యాత్రలు కాదు… అసెంబ్లీకి రండి సార్..!

వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే మీ నాయకుల ఇళ్లకు వెళ్ళి పరామర్శించడంతో పాటు అసెంబ్లీకి కూడా వచ్చి ఇదే అంశాలపై మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ఏ సమయంలో ఎవరెవరు ఏం మాట్లాడారో చర్చిద్దాం రమ్మంటున్నారు. జగన్ మొదటి నుంచి …

Read More »

`సిట్` విచార‌ణ కోరుకుంటున్న క‌విత‌!

తెలంగాణ‌లో బీఆర్ ఎస్ పార్టీ హ‌యాంలో జ‌రిగిన‌ ఫోన్ ట్యాపింగ్ కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచారి స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సిట్‌.. ఇప్ప‌టికే చాలా మందిని విచారించింది. మ‌రీ ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా అధికారులు విచారించారు. అయితే.. సిట్ ఎప్పుడు ఎవ‌రిని విచార‌ణ‌కు పిలిచినా.. వెంట‌నే వారు సిట్‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం లేదా.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం కామ‌న్‌గా మారింది. అయితే.. తాజాగా బీఆర్ఎస్ …

Read More »

నాడు నేడు… బాబు గారే బాదితులు!

వైసీపీ నేత‌ల‌పైనా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌పైనా సీఎం చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. అధికారం కోల్పోయిన‌ప్పుడు కూడా వారిలో అహంకారం పోలేద‌న్నారు. అందుకే రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌ని వ్యాఖ్యానించారు. నాడు-నేడు కూడా తానే బాధితుడిన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో సోమ‌వారం ఆయ‌న టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. “వైసీపీ అధికారంలోఉ న్న‌ప్పుడు న‌న్నే ల‌క్ష్యంగా చేసుకుని కుటుంబంపై నానా …

Read More »

‘కల్తీ’పై జనసేన నేతలు ఎందుకు మాట్లాడట్లేదు?

జ‌న‌సేన కీల‌క నాయ‌కుల‌పై ఆపార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలిసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “మీరెందుకు మాట్లాడరు?. కూట‌మి ప్ర‌భుత్వంలో అంద‌రూ క‌ల‌సి ఉండాలి క‌దా“ అని వ్యాఖ్యానించారు. కూట‌మి ప్ర‌భుత్వాన్ని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఆయ‌న‌.. వైసీపీ నేత‌లు చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఒక్క నాయ‌కుడో.. ఒక్క పార్టీనో తిప్పికొడితే స‌రిపోదని.. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఉండాల‌ని.. ఈ విష‌యంలో పార్టీ నాయ‌కులు వెనుక‌బ‌డ్డార‌ని ప‌వ‌న్ …

Read More »

దారుణం: ఎన్నిక‌ల్లో పోటీ కోసం… కూతుర్ని చంపేశాడు!

మ‌హారాష్ట్ర‌లో మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఇప్ప‌టికే ఈ రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసింది. ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ తెర‌మీదికి వ‌చ్చింది. కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజ‌కీయ కోలాహ‌లం నెల‌కొంది. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. రిజ‌ర్వేష‌న్‌తో పాటు సంతానంపై కూడా.. సీలింగ్ ఉంటుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మించి …

Read More »

బాబును తిడితే మైలేజీ పెరుగుతుందా..!

సీఎం చంద్రబాబును తిట్టడం ద్వారా గ్రాఫ్ పెరుగుతుందా అనేది ఇప్పుడు టిడిపిలోనూ అటు వైసిపిలోనూ చర్చ నడుస్తోంది. వ్యక్తిగత లాభం కోసం చంద్రబాబును దూషించిన చాలామంది నాయకులు ఫేడ్ అవుట్ అయ్యారు. ఇలాంటి వారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రస్తుతం జైలు పాలైన అంబటి రాంబాబు కూడా గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఈ ముగ్గురు గతంలో …

Read More »

పవన్ కు అంబటి కూతురు సూటి ప్రశ్న

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దాడిపై అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు. మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా అని ప్రశ్నించారు. కాపు మహిళలైన తమపై …

Read More »