ఏకంగా 240 సీట్లు. ఇక్కడ పాగా వేయాలన్నది కమల నాథుల సుదీర్ఘ సంకల్పం. అందుకే.. నానా తిప్పలు పడి.. ఇతర పార్టీలతో చెలిమి చేశారు. ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలతో జట్టు కట్టారు. సో.. మొత్తంగా `ఎన్డీయే` కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే… బీజేపీ వచ్చినట్టే. అదే.. తమిళనాడు రాష్ట్రం. వచ్చే నెల 23న ఇక్కడ పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ ఎన్డీయే కూటమిలో తాజాగా …
Read More »ఏపీలో మిట్టల్… దేశంలోనే టాప్
విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో కొత్త చరిత్రను సృష్టించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే కూడా.. అతి పెద్ద పరిశ్రమ నక్కపల్లిలో రానుందన్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిట్టల్ కు చెందిన ఉక్కు పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు శంకు స్థాపన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్లు ఈ కార్యక్రమంలో …
Read More »గాడిద వెర్సస్ అడ్డగాడిద.. సోషల్ మీడియాలో
సోషల్ మీడియాలో ఓపక్క సినీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ నడుస్తుంటే.. ఇంకోపక్క రాజకీయ కార్యకర్తలు, అభిమానుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు గొడవపడడానికి వాళ్లకు కొత్త కారణాలు దొరుకుతుంటాయి. కొన్నిసార్లు చిన్న విషయాలకే ట్రిగ్గర్ అయిపోతుంటారు. ఐతే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన రోజా సెల్వమణి చేసిన ఒక కామెంట్తో గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేడెక్కింది. ఆమె తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. తెలుగుదేశం అధినేత నారా …
Read More »షర్మిలకు బాణంగా మారిన విజయమ్మ లేఖ
జగన్న వదిలిన బాణం.. ఈ మాట వింటేనే వైఎస్ షర్మిల గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆమెకు విజయమ్మ లేఖ బాణంగా మారింది. జగన్ ను ఉద్దేశించి రెండు రోజుల కిందట తల్లి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. దీనిపై ఈ రోజు షర్మిల మాట్లాడారు. ‘నా అజెండా ఆస్తులు కాదు.. నిజం!’ అంటూ వైఎస్ జగన్పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావన వస్తే …
Read More »సీఎం పోస్టు ఖాళీ లేదు… తేల్చేసిన రేవంత్!?
తెలంగాణలో రాక రాక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సీటుకోసం చాలా మంది ట్రై చేశారు. అయితే.. అధిష్టానం ఈ సీటును రేవంత్రెడ్డికి అప్పగించేందుకు అనేక ప్రయాసలు పడింది. అనేక మంది సీనియర్లను బుజ్జగించి.. ఒప్పించింది. దీంతో ప్రస్తుత టర్మ్లో ఆయనే ముఖ్యమంత్రి. మరో రెండున్నరేళ్లపాటు రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారు. అయితే.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తమ వంతు వస్తుందని కొందరు నాయకులు ఆశలు …
Read More »ఎమ్మెల్యే: పనిచేస్తున్నా.. ప్రచారం సున్నా.. !
ఆయన తొలిసారి విజయం దక్కించుకున్న నాయకుడు. అయితేనేం.. ప్రజల సమస్యలపై పట్టున్న నేత. ప్రజలతో కలివిడిగా ఉండే నాయకుడు. దీంతో ప్రజలకు అవసరమైన అన్ని పనులు చేస్తున్నారు. సమస్యలపై స్పందిస్తున్నారు. ఇటు ప్రజలకు-అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా కూడా ఉంటున్నారు. ఎక్కడా ప్రచారాన్ని ఆశించడం లేదు. ఎలాంటి వివాదాలను కూడా కొని తెచ్చుకోరు. పని-ప్రజలు అనే నినాదాన్ని పైకి చెప్పకపోయినా.. కార్యాచరణలో మాత్రం పెడుతున్నారు. ఆయనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, …
Read More »ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్: చడీ చప్పుడు లేని కాంగ్రెస్!
ఔను.. నిజమే! ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. మరో రెండు మూడు రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే కేరళలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా చడీ చప్పుడు కనిపించడం లేదు. ముఖ్యంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ప్రచారం, స్టార్ క్యాంపెయినర్ల సందడి కనిపించేది. కానీ ఈసారి అలాంటి వాతావరణం ఎక్కడా …
Read More »సిద్దిపేట నుంచి గెలిస్తే.. మంత్రి సీటు: రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిగ్ ఆఫర్ ప్రకటించారు. ఇదేసమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావుకు సెగ పెంచేశారు. సిద్దిపేట నుంచి విజయం దక్కించుకునే కాంగ్రెస్ నేత ఎవరైనా సరే.. మంత్రి వర్గంలో సీటు ఖాయమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సిద్దిపేట ఎవరి జాగీరూ కాదన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలిచి తీరుతుందని తేల్చి …
Read More »అవమానాలే మిగిలాయా.. జీవన్ రెడ్డి బిగ్ డెసిషన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అనేక అవమానాలు, అనుమానాలు, సందేహాల మధ్య పార్టీలో కొనసాగలేమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, “నా రాజకీయ జీవితానికి మీ తోడు కావాలి. మీ మార్గదర్శనం కావాలి” అంటూ కార్యకర్తలను ఉద్దేశించి జీవన్ రెడ్డి ఆదివారం సాయంత్రం బహిరంగ లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. గత 20 …
Read More »ఫేక్ చలాన్ వలలో జనసేన ఎమ్మెల్యే
వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. పెద్దా చిన్నా అనే బేధం లేదు. ఎవరు అందివస్తే.. వారిని మోసగించడమే!. వారి సొమ్మును కాజేయడమే. అది ఏ రూపంలో అయినా కావొచ్చు. ఇందుగలదందు లేదను సందేహం లేదు. సైబర్ మోసాలు ఏ రూపంలో అయినా.. విజృంభించవచ్చు. ఇదీ.. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ ప్రజలకు సంకటంగా మారిన దుస్థితిని కళ్లకు కడుతోంది. శనివారం.. ఓ మాజీ డీజీపీ మనవరాలిని కోటి రూపాయలకు పైగా …
Read More »2004 గాయం మర్చిపోలేదా? ఇక మళ్లీ జరగదన్న చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో జరిగిన ఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఓడిపోయామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నామని అన్నారు. 2004కు ముందు కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అది రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకువచ్చినా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని చెప్పారు. దీంతో అప్పట్లో ఓటమి ఎదురైందని వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని …
Read More »వైసీపీలో గుడివాడ పేచీ..!
వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో బలమైన నేత కోసం వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బలమైన ఆర్థిక స్థాయి ఉండి, సామాజిక వర్గం పరంగా కూడా బలంగా ఉన్నవారి కోసం వెతుకుతోంది. గత మూడు నెలలుగా గుడివాడ నియోజకవర్గంపై వైసీపీ ఇదే దృష్టితో ఉంది. దీనికి కారణం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించిన నేపథ్యమే. గత ఎన్నికల్లోనే ఆయన ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates