Political News

తెలంగాణ‌లో `సికింద్రాబాద్‌` సెగ‌… అస‌లేంటిది?

తెలంగాణ‌లో తాజాగా `సికింద్రాబాద్` కేంద్రంగా వివాదం తెర‌మీద‌కి వచ్చింది. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. ప్ర‌స్తుతం ఉన్న మండ‌లాల ప‌రిధిల‌ను కూడా మార్చనున్నారు. అయితే.. దీనికి కొంత క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన జంట న‌గ‌రాల్లో ఒక‌టైన సికింద్రాబాద్‌లోని ఉత్తర భాగం(నార్త్‌జోన్‌)లో ఉన్న కొన్ని ప్రాంతాల‌ను మ‌ల్కాజిగిరి కార్పొరేష‌న్‌లో క‌లిపేందుకు.. ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్న ప్ర‌చారం తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి దీనిపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి …

Read More »

1996, జ‌న‌వ‌రి 18 … చ‌రిత్ర‌పై లిఖించ‌ని సంత‌కం!

కొన్ని తారీకులు.. సంవ‌త్స‌రాలు.. కాలంతో పాటు క‌రిగిపోవు. అవి శాశ్వ‌తంగా నిలిచి ఉంటాయి. స‌ద‌రు తారీకులు.. సంవ‌త్స‌రాల‌లో జ‌రిగిన పెద్ద ఘ‌ట‌న‌లైనా..చిన్న ఘ‌ట‌న‌లైనా.. అశేష ప్ర‌జానీకంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయి. అలాంటి తారీకుల్లో జ‌న‌వ‌రి – 18, అలాంటి సంవ‌త్స‌రాల్లో 1996 ఒక‌టి. ఆ రోజు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఆమాట‌కొస్తే.. అమెరికాకు చెందిన `వాషింగ్ట‌న్ పోస్టు`.. సాధార‌ణంగా.. వెలువరించే.. ఉద‌యం ప‌త్రిక‌కు ఆ రోజు అనుబంధం ప్ర‌చురించింది. …

Read More »

కొడాలి నానీకి ఈసారి టికెట్ లేనట్టేనా?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం గుడివాడలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న కొడాలి నాని (శ్రీ వెంకటేశ్వరరావు) వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే రెండు ప్రధాన చిక్కులు ఎదురవుతున్నాయి. మొదటిది.. తానే ప్రకటించుకున్న శపథం. గత ఎన్నికల సమయంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ కొడాలి నాని శపథం చేశారు. …

Read More »

పెట్టుబడుల వేట.. అమరావతి టూ దావోస్

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నాలుగు రోజుల దావోస్ పర్యటన ప్రారంభమవుతోంది. జనవరి 19 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో నేరుగా భేటీలు నిర్వహించనున్నారు. దావోస్ వేదికగా జరిగే ఈ సమావేశాల ద్వారా ఏపీకి కొత్త పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, టెక్నాలజీ భాగస్వామ్యాలే ప్రధాన లక్ష్యంగా ఉన్నాయని తెలిసింది. …

Read More »

అమ‌రావతిపై సుజ‌నా మంత్రాంగం… !

రాజధాని అమ‌రావ‌తి విష‌యంలో రెండో ద‌శ భూ స‌మీక‌ర‌ణ వ్య‌వ‌హారం ఒకింత ఇబ్బందిగా మారింది. కొంద‌రు గ‌తంలో భూములు ఇచ్చిన రైతులు.. త‌మ‌కు ఇంకా ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన‌వి అంద‌లేదని భీష్మించారు. దీంతో రెండోద‌శ భూసేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వానికి ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, రాష్ట్ర మంత్రి నారాయ‌ణ‌ల‌తో కూడిన క‌మిటీని వేసింది. అయిన‌ప్ప‌టికీ.. రైతులు ప‌ట్టుద‌లతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో …

Read More »

కేసీఆర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక, కేసీఆర్ చావును రేవంత్ కోరుకుంటున్నారని, పదే పదే ఆ తరహా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నడుము విరిగి కింద …

Read More »

సంగారెడ్డికి జగ్గారెడ్డి గుడ్ బై!

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తన సొంత పార్టీపై అయినా..విపక్షాలపై అయినా నిర్మొహమాటంగా తన అభిప్రాయలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నేత జగ్గారెడ్డి. తనదైన వ్యాఖ్యలతో జగ్గారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జీవితంలో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా …

Read More »

చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి కొలువు

కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేమాట మీద ఉన్నారు. జలజగడాలు వద్దని…చర్చలతో సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు. మరోపక్క చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కొలువునిచ్చారు. అంతేకాదు, అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని కూడా స్వయంగా చంద్రబాబుకు రేవంత్ అందజేశారు. అయితే, ఆ చంద్రబాబు… …

Read More »

జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!

ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి. ప్రజలు కూడా హర్షించరు. పైగా ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీలో ప్రభుత్వం ప్రజల అభీష్టానికి అనుగుణంగా కొన్ని పట్టు విడుపులు ప్రదర్శించింది. దీంతో పల్లెల నుంచి పట్టణాల వరకు సంక్రాంతి పండుగ సంబరాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా కోడి పందేల …

Read More »

గెలిస్తే సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ నేత ఎడప్పాడి కే. పళనిస్వామి ఐదు ప్రధాన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టోలో భాగంగా సిటీ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కీలక హామీ ఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న …

Read More »

సంక్రాంతి అంటే రికార్డింగ్ డ్యాన్సులేనా?

సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ సందర్భంగా ఫుల్ జోష్ లో ఉంటారు. అయితే, పండుగ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న వైనంపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక, ఈ ఏడాది సంక్రాంతి వేడుకల సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓ స్టేజి పైకి ఎక్కి యువతితో డ్యాన్స్ …

Read More »

కేటీఆర్ నోట ‘తుగ్లక్ సీఎం’ మాట

సికింద్రాబాద్‌ను మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో విలీనం చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ డిమాండ్ సాధనకు శాంతి ర్యాలీ చేపట్టిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును ఖండించిన కేటీఆర్…సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి సికింద్రాబాద్‌ ఐడెంటిటీని శాశ్వతంగా లేకుండా చేస్తున్నాడని …

Read More »