Political News

అమ‌రావ‌తికి ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నుల నిర్మాణం వేగంగా జ‌రుగుతోంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇక్క‌డ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అనేక రంగాల నుంచి డిమాండ్ పెరిగింద‌న్నారు. ముఖ్యంగా ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు అమరావ‌తిలో స్టూడియోలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నార‌ని చెప్పారు. త‌మ‌కు భూము లు కేటాయించాల‌ని ప్ర‌భుత్వానికి విన్న‌విస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. వారి ఆర్థిక లావాదేవీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. ఈ …

Read More »

‘సనాతనం’పై ఉదయనిధికి సీనియర్ హీరో కౌంటర్

సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి. సనాతన ధర్మం ఒక మలేరియా లాంటిదని.. దాన్ని నిర్మూలించడమే తన లక్ష్యమని డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఐతే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఉదయనిధి తీరు మారలేదు. మరోసారి సనాతన ధర్మం గురించి …

Read More »

1000 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా, భూముల నుంచి మైనింగ్ వ‌ర‌కు కూడా అనేక రూపాల్లో ప్ర‌జ‌ల ధ‌నాన్ని దోచుకున్నార‌న్న కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే మ‌ద్యం, గ‌నులు, ఇసుక‌.. అక్ర‌మాల‌పై పెద్ద ఎత్తున విచార‌ణలు కూడా జ‌రుగుతున్నాయి. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప‌ల్నాడు జిల్లా వినుకొండ‌కు చెందిన బొల్ల బ్ర‌హ్మ‌నాయుడు.. హైద‌రాబాద్‌లో ఏకంగా …

Read More »

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా మారింది. తాజాగా మిగిలి ఉన్న దక్షిణాది రాష్ట్రం ఏపీలో కూడా ఆ పార్టీ పుంజుకునే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఏపీలో ఓ మోస్తరుగా బలపడేందుకు ఆ పార్టీ సిద్దమవుతున్నట్లు సమారారం. షర్మిలకు రాజ్యసభ అవకాశం …

Read More »

క‌డ‌ప‌పైనే పసుపు సేన దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున హాజరయ్యారు. మై టిడిపి యాప్ ద్వారా ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అన్న విషయాలను తెలుసుకున్నారు. హాజరు కూడా తీసుకున్నారు. ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ క్లస్టర్ల వారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతం అయింది. అయితే మహానాడును నిర్వహించిన మంగళగిరిలోని పార్టీ కేంద్ర …

Read More »

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు.. స‌మావేశాలు నిర్వ‌హించారు. ఇక‌, మ‌హానాడు విజ‌య‌వంతంగా ముగిసింది. ఇప్పుడు దీనికి మించిన కార్య‌క్ర‌మం చంద్ర‌బాబు ముందు ఉంది. అదే.. రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక‌. మ‌రో మూడు రోజుల్లోనే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ రానుంది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 26 రాజ్య‌స‌భ స్థానాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ …

Read More »

మా అబ్బాయిని మంత్రిని చేయండి!

క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. సీఎం సిద్ద‌రామ‌య్య‌.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం.. ఆయ‌న పీఠాన్ని సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత డిప్యూటీ ముఖ్య మంత్రి డీకే శివకుమార్ అధిరోహించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో సిద్దూ కొన్నాళ్లుగా త‌ప్పుకోన‌ని మారాం చేసిన‌ప్ప‌టికీ.. తాజాగా మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో సీఎం సీటును వ‌దులుకున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సిద్ద‌రామ‌య్య‌కు కొన్ని ఆఫ‌ర్లు …

Read More »

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని ముందుకు నడిపించే విషయంలో జరుగుతున్న పొరపాట్లు.. వంటి అంశాలను ఇటీవల ఆయన చర్చించారు. ఈ క్రమంలో పార్టీ విషయంలో గతంలో జరిగిన పరిణామాలు అదేవిధంగా సీనియర్ నాయకుల నుంచి ఎదురైనా ఇబ్బందులు కొంతమంది నాయకులు పార్టీని వీడే వెళ్లిపోవడం ఆ తర్వాత వచ్చిన గ్యాప్ వంటి అంశాలపై ఆయన …

Read More »

ప‌సుపు సేన‌-జ‌న‌సేన‌.. ఇక‌, తిరుగులేదుగా!

ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పార్టీల మధ్య సమన్వయం సాధించే దిశగా పై స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటు టిడిపిలోను అటు జనసేనను నాయకత్వాన్ని ముందుకు నడిపించేందుకు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. దీనికి సంబంధించి మహానాడులో తీసుకున్న నిర్ణయం ప్రకారం అటు పసుపు సేన ఇటు జనసేన నాయకులను కార్యకర్తలను ముందుండి నడిపించేందుకు …

Read More »

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. పవన్ స్ట్రాటజీ అదుర్స్

గోదావరి పుష్కరాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా… పని ఒకటే గానీ… రెండు రకాల ప్రయోజనాలు ఇచ్చే దిశగా సాగుతోంది. ఇప్పటికే రెండు రోజుల పాటు గోదావరి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చిన పవన్…తాజాగా శుక్రవారం పవిత్ర గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించే దిశగా ఓ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఈ …

Read More »

20 ఏళ్లుగా వెయిటింగ్..

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ ఇప్పటిది కాదు. దాదాపు 20 సంవత్సరాలకు పైగానే ఈ డిమాండ్ ఎప్పుడూ చర్చల్లోకి వస్తోంది. తరచుగా ఆయన గురించి మాట్లాడిన ఎవరైనా భారతరత్న తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఈ ఆలోచన సాకారం కాలేదు. తాజాగా జరిగిన మహానాడులో మరోసారి అన్నగారికి భారతరత్న తీసుకురావాలన్న డిమాండ్ తెరమీదకు …

Read More »

తెలంగాణ ఏర్పడ్డాక.. తొలిసారి.. ఎన్టీఆర్ విగ్రహం

ప్రాంతాలు వేరైనా.. మన అంతరంగం ఒకటేనన్నా.. అంటూ ప్రాంతాల విభేదాలను పక్కన పెట్టి తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకున్న నాయకుడు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన నేత అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ నడిబొడ్డున మైత్రీవనంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు అన్నగారి విగ్రహం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ …

Read More »