Political News

గుడివాడ‌లో అప్పుడు క్యాసినో.. ఇప్పుడు.. ?

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం.. అన‌గానే… ఒక‌ప్పుడు క్యాసినో.. జూదానికి ప్ర‌తీక‌. అప్ప‌ట్లో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొడాలి నాని.. నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న అడ్డాగా చేసుకుని ముందుకు సాగారు. ఆయ‌న ఏం చేసినా.. ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. బూతుల‌తో విరుచుకుప‌డిన మంత్రిగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే.. కాలం మారింది. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఇంటికి ప‌రిమితం చేశారు. దీంతో గుడివాడ‌లో ఇప్పుడు టీడీపీకి చెందిన వెనిగండ్ల రాము …

Read More »

నేనున్నాననీ.. పవన్

కార్యకర్తకు కష్టం వస్తే నేనున్నానంటూ.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేశారు. జనసేన కార్యకర్తల సంక్షోభ సమయంలో పార్టీ మొత్తం ఒక కుటుంబంగా నిలబడుతుంది అనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. బుధవారం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా, పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. వసంతరాయలు …

Read More »

రెండేళ్లలో పెట్టుబడులు గ్రౌండ్ అవుతాయా?

వ‌చ్చే రెండేళ్ల‌లో ఏపీ ముఖ చిత్రం మార‌నుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే రెండేళ్ల‌లోనే స‌మూలంగా ఏపీ ముఖ చిత్రం మారిపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీనికి ప్ర‌ధానంగా మూడు రీజ‌న్లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. 1) పెట్టుబ‌డులు గ్రౌండ్ కావ‌డం. 2) ప్రాజెక్టులు పూర్తి చేయ‌డం. 3) పాల‌న ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌కత‌కు పెద్ద‌పీట వేయ‌డం. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ ఇమేజ్ మ‌రింత పెర‌గ‌డం. …

Read More »

అమరావతికి చట్టబద్ధత తథ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనపై కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం పొందిన అనంతరం బిల్లును సభ ముందుకు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 2014 రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి …

Read More »

టైం వస్తే ఆంధ్రోళ్ల విగ్రహాలు తీయొచ్చన్న కవిత

తన సోదరుడు కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేటీఆర్ కు కవిత కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గారు వచ్చి సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్.. జిల్లా చేయాలని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కేటీఆర్ …

Read More »

పాదయాత్రపై జగన్ అఫిషియల్ క్లారిటీ

మరో పాదయాత్రకు మాజీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. దీనిపై ఆయన ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ఈ రోజు సమావేశం అయ్యారు. ‘ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు, …

Read More »

మరో దావోస్ గా హైదరాబాద్?

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్ లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో-అప్ మీటింగ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రమోట్ చేయాలని కోరారు. రేవంత్ ప్రతిపాదనకు సానుకూల మద్దతు లభించింది. ఈ హైటెక్ యుగంలో వ్యాపారానికి, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఏడాదికి ఒకసారి దావోస్ …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే vs కాంగ్రెస్ ఎంపీ.. అసలేం జరిగింది?

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ పై ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని, సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నారని విజయుడు ఆరోపించారు. అంతేకాదు, దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంటనే బదిలీలు చేయిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు …

Read More »

ఉద్యోగం వ‌దిలేసి వ‌చ్చా.. న‌న్ను చూడండి బాబు స‌ర్‌.. !

“స‌ర్.. ఉద్యోగం వ‌దిలేసి వ‌చ్చా. 25 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. న‌న్ను కొంచెం చూడండి స‌ర్‌” అని ఒక‌రు. “గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ కూడా వ‌దిలేశా. ఇప్పుడు కూడా మీరు ప‌ట్టించుకోక‌పోతే.. నియోజ‌క‌వ‌ర్గంలో మొహం చూపించ‌లేను.” అని మ‌రొక‌రు!.. ఇలా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముందు.. ప‌లువురు నాయ‌కులు.. గోడు వెళ్ల‌బోసుకున్నారు. గత ఆదివారం చంద్ర‌బాబు పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతిలో పాల్గొన్నారు. అనంత‌రం పార్టీ సీనియ‌ర్లు.. ఆయ‌న‌ను …

Read More »

ఉగాది నుంచి ఏపీలో ‘ప‌చ్చ‌ద‌నం’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. రాష్ట్రాన్ని 50 శాతం మేర‌కు ప‌చ్చ‌ద‌నంతో నింపే ఈ కార్యక్ర‌మానికి సంబంధించి కీల‌క ఆదేశాలు ఇచ్చారు. వ‌చ్చే ఉగాది నుంచి రాష్ట్రంలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ మొక్క‌లు నాట‌డంతో పాటు.. అట‌వీ సంర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిధులను వినియోగించుకోనున్నారు. ‘గ్రీన్ క‌వ‌ర్ …

Read More »

డెలివరీ బాయ్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే

గతంలో చాలామంది రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఎన్నికల ప్రచారం సమయంలో చిన్న పిల్లలకు స్నానం చేయించడం వంటి పనులు మొదలు…మురికి కాలువలు శుభ్రం చేయడం వరకు…నానా తిప్పలు పడి తమను తాము మీడియాలో ప్రమోట్ చేసుకునేవారు. అయితే, ఈ సోషల్ మీడియా జమానాలో ట్రెండ్ మారడంతో నేతలంతా సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడడంతో పాటు సరికొత్త ట్రెండ్ లో ప్రజలకు చేరువవుతున్నారు. …

Read More »

చిరంజీవి దావోస్ కి ఎందుకు వెళ్లారు?

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది దావోస్ కు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎంపీ టీజీ భరత్, పలువురు అధికారులు…తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోకండి…రేవంత్ …

Read More »