Political News

చంద్రబాబు గ్రాఫ్.. 2025లో ఎలా ఉందంటే..!

ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఈ ఏడాది కీలక సంవత్సరం అనే చెప్పాలి. గత ఏడాది జూన్‌లో బాధ్యతలు చేపట్టినప్పటికీ, అప్పటికే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడం, ప్రభుత్వ విధానాలను సమన్వయం చేయటం, అధికారుల బదిలీలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఏడాది పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకోగలిగారు. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అవగాహనను పెంచుకున్నారు. ముఖ్యంగా వైసీపీ …

Read More »

కూటమి ప్రభుత్వం పై రఘురామ అసంతృప్తి?

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్‌కు గురి చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019–24 మధ్య కాలంలో వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామను సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టి కస్టడీలో హింసించిన ఘటన షాకింగ్‌గా మారింది. ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి …

Read More »

కేసీఆర్ పేరు కేటీఆర్ కాకపోతే ఇంకెవరు వాడుకుంటారు

మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసని రేవంత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను ఉమ్మడి ఏపీలోని గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి నొప్పెందుకు అని కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్, పుణె, అమెరికాలో చదివానని..రేవంత్ మాదిరి చదువు, సంధ్య …

Read More »

వైసీపీ గిరిజన ఓటు బ్యాంకుకు పవన్ గండి

గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. గిరిజనుల డోలీ మోతలకు చరమగీతం పాడే దిశగా పవన్ అడుగులు వేశారు. గిరిజన గ్రామాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేపట్టడం, తద్వారా గిరిజన గ్రామాలను ప్రధాన మార్గాలతో అనుసంధానం చేయడం వంటి కార్యక్రమాలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే పల్లె పండగ 2.0 లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో …

Read More »

సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమానే గొప్ప

తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ ను ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వారితో కలిసి ఆ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్‌లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్ప వారని, ఆ విషయాన్ని మన పిల్లలకు …

Read More »

పంచాయతీ పవన్ దగ్గరికి వెళ్తే అంతే

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏదైనా విష‌యంపై దృష్టి పెట్టారంటే.. అది సాధించే వ‌ర‌కు వెంట ప‌డుతూనే ఉంటారు. అది ప్ర‌జాసంక్షేమం కావొచ్చు.. పార్టీ కార్యక్ర‌మం కావొచ్చు. ఏదైనా త‌న దృష్టికి వ‌స్తే.. దానిలో మంచి చెడులు విచారించి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్న సంద‌ర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం ప్రాంతానికి చెందిన డీఎస్పీ జ‌య సూర్య వ్య‌వ‌హారంపై కొన్నాళ్ల కింద‌ట …

Read More »

హాట్ టాపిక్‌: ఏపీ 2025 రాజ‌కీయాలు ఇవే… !

2025 సంవత్సరంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? సాధారణ ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఏ విధంగా స్పందిస్తున్నారు? అనేది ఆసక్తికర విషయం. రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్న విషయాన్ని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. తద్వారా కూటమి బలాన్ని తగ్గకుండా అదేవిధంగా ప్రజల్లో జోష్ …

Read More »

ఇంచ్ కూడా తగ్గొద్దు: చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీ ప్రతిపక్షం (ప్రధాన కాదు) వైసీపీ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంపై ఆ పార్టీ చేస్తున్న నిరసనలు, ధర్నాలు, కోటి సంతకాల సేకరణ వంటి అంశాలపై బుధవారం రాత్రి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. పీపీపీ విధానంలో ఎవరు ఎలాంటి యాగీ చేసినా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్నారు. …

Read More »

ఏపీలో మరో ‘జీవీఎంసీ’ రాబోతోందా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు విజయవాడ నగరం పాలనకు కీలకంగా మారింది. ఆల్రెడీ అభివృద్ధి చెందిన విజయవాడను విస్తరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు చాలాకాలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలోనే గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని …

Read More »

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రా బిడ్డ చూసుకుందాం…రెడీ అంటూ కేసీఆర్ ను సవాల్ చేశారు రేవంత్. ఇక, పేడమూతి బోడిలింగం…అంటూ కేటీఆర్ పై కాస్త పరుష పదజాలాన్ని వాడారు రేవంత్. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో …

Read More »

ఇండిగో తోక కత్తిరించే పని మొదలైంది.. కొత్తగా 4 సంస్థలకు ఓకే

రంగం ఏదైనా.. వ్యాపారం మరేదైనా గుత్తాధిపత్యం అస్సలు మంచిది కాదు. పోటీ తత్వం లేకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు అంతకంతకూ పెరుగుతుంది. అందుకు నిలువెత్తు నిదర్శనంగా ప్రముఖ విమానయాన రంగానికి చెందిన ఇండిగో నిలుస్తుంది. ఇటీవల ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. అంతేకాదు.. భారతదేశ ఇమేజ్ కు కూడా డ్యామేజ్ జరిగిన పరిస్థితి కనిపించింది. దేశీయ విమానయాన రంగంలో తిరుగులేని …

Read More »

ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోనే ఉన్నారు

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రింత సెగ పెరుగుతోంది. ఒక‌వైపు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్య‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీని ఆత్మ‌ర‌క్ష‌ణలో ప‌డేస్తున్నాయి. 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న 10 మంది ఎమ్మెల్యేలు… త‌ర్వాత కాలంలో బీఆర్ఎస్‌ను వ‌దిలి అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే.. ఇది వివాదం కావ‌డం.. న్యాయ‌ప‌ర‌మైన వ్య‌వ‌హారం వ‌ర‌కు వెళ్ల‌డం.. తెలిసిందే. మొత్తంగా 10 …

Read More »