తమిళనాడులో రాజకీయాలు వేడి వేడిగా వున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష డీఎంకే తరచుగా ఏదో ఒక వివాదం రాజేసేందుకు ప్రయత్నిస్తుంది. అడ్డగోలు కామెంట్స్ చేసి రోడ్డు మీద పడుతుంది. నిజానికి విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాలేదు. ఈ ఏడాది మే 10 వ తేదీన చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి …
Read More »స్థానికాల తరువాత మంత్రివర్గ మార్పులు తప్పవా?
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ చాలా మంది మంత్రులు మౌనంగా ఉండడం.. కనీసం పన్నెత్తు విమర్శ కూడా చేయకపోవడంతో సీఎం మరోసారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయమే టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన సీఎం చంద్రబాబు.. మంత్రులకు వారి బాధ్యతలను గుర్తు చేసినట్టు …
Read More »3 వేల కోట్ల అవినీతి ఆరోపణలు… వైసీపీ నేతపై ఈడి కన్ను!
ఏకంగా 3 వేల కోట్ల రూపాయల మోసం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సినిమా నిర్మాత చిక్కుకుపోయారు. తాజాగా బుధవారం ఉదయం సదరు నేత నివాసం సహా.. బంధువుల ఇళ్లు, కార్యాలయాలు, వైసీపీ నేత అనుచరుల ఇళ్లలో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నా యి. ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో సేకరించిన నిధులను దారి మళ్లించారన్నది ప్రధాన అభియోగం. ప్రజల …
Read More »రాజకీయాల కోసం కోర్టును వాడుకోవద్దు
మీ రాజకీయాల కోసం కోర్టును వాడుకోవద్దు. మీ గల్లీ రాజకీయాలను కోర్టు ముందుకు తీసుకురావద్దు. ఇదే ఆఖరిసారి. మరోసారి ఇలానే జరిగితే తీవ్రంగా పరిగణిస్తాం అంటూ.. వైసీపీపై హైకోర్టు మండిపడింది. కోర్టులు అన్నవి ప్రజల కోసం పనిచేస్తాయని, రాజకీయాల కోసం కాదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించు కోవాలని.. లేకపోతే చర్యలు తప్పవని పేర్కొంది. దీంతో సదరు పిటిషన్ను వైసీపీ నాయకుడు వెనక్కి తీసుకుంటామని కోర్టుకు …
Read More »ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో ఎంతో చేశామని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని చెప్పారు. అదేసమయంలో ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేశామని వివరించారు. సచివాలయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా వివరాలను వెల్లడించారు. ఆదాయం రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »ఉత్తరాదిన మోడీ ఇమేజ్కు యూత్ చెక్ పెడుతున్నారా?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున చెక్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవ స్థాపకుడు అభిజిత్ దీప్కే, ఢిల్లీలో సౌరవ్దాస్, బీహార్లో ప్రశాంత్ కిషోర్.. పంజాబ్, హరియాణాలో కాక్రోచ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోడీకి ఇబ్బందిగా పరిణమించారన్న వాదన వినిపిస్తోంది. అది ప్రస్తుత పరిస్థితిలో ఒక అసాధారణమని కూడా అంటున్నారు. ఉత్తరాది …
Read More »అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమలో అటు వైసీపీ, ఇటు టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత 2024 ఎన్నికల తర్వాత.. వైసీపీ ప్రభావం తగ్గిపోయిందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను …
Read More »మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కప్లాన్కు కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం నేరుగా విచారణకు హాజరు కావాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణకు కప్లాన్ తో పాటు ఇన్స్టాగ్రామ్ సాంకేతిక అధికారులను కూడా తప్పనిసరిగా …
Read More »జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా… జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ లను గంటలో లేపేస్తానంటూ.. పవన్ వైజాగ్ లో అడుగు పెట్టీ చూడమని అసభ్య పదజాలంతో సవాలు విసిరి సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా అనిల్ అందరికీ తెలుసు. జగన్ ఆదేశించారో, లేదో తెలియదు గానీ.. అనిల్ మాత్రం తాను …
Read More »మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష, ముఖ్యమంత్రి విజయ్పై పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తంజావూరులో కావేరి జలాల అంశంపై పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా, “ముఖ్యమంత్రి విజయ్కు ఒకటే టెన్షన్ ఉంది” అని ఉదయనిధి …
Read More »మీరు నేర్పిన విద్యే… కేటీఆర్ సర్!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తాజాగా మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. ముఖ్యంగా ఆయన ప్రధాన మీడియాపై చెణుకులు విసిరారు. రాష్ట్రంలో ప్రధాన మీడియా `దాసోహం` చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కీలక వార్తలనుతొక్కి పెడుతున్నారని అన్నారు. “ఎవరి మెప్పుకోసం ఇదంతా చేస్తున్నారో.. మీడియా సంస్థలు ఆలోచన చేసుకోవాలి. ప్రజలకోసం ఉన్నారా? వ్యక్తుల కోసం ఉన్నారా?“ అంటూ.. తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకా …
Read More »పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి… జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా పగ్గాలను బీజేపీ లాగేసుకున్న వైనాలతో ఆ రాష్ట్రం హెడ్ లైన్స్ లోకి ఎక్కగా… ఇప్పుడు అదే బీజేపీకి అదే రాష్ట్రం నుంచి డేంజర్ బెల్స్ వినిపించాయి. బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నుంచి జన సురాజ్ పార్టీ అదినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయం సాదించడంతో బీజేపీపై పెను ప్రబావమే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates