బీజేపీ జాతీయ నాయకత్వం లైట్ తీసుకుంది. జనసేన పార్టీ, తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే పరిమితమవుతోంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఊరూ వాడా అంతా తనదేనని అంటోంది. అటు నారా లోకేష్, ఇటు చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ తరఫున ఏమాత్రం విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా వుంటున్నారు. ఇదీ తెలుగు తమ్ముళ్ళ వాదన.! ఇందులో కొంత నిజం లేకపోలేదు. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో …
Read More »పవన్ కల్యాణ్ ఇమేజా మజాకానా..
తాజాగా ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆయన.. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇక్కడో ఇంటిని ఏర్పాటు చేసుకొని స్థానికంగా ఉంటానని చెప్పటం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఆయనో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 54 గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో తన నివాసం ఉంటుందని ఆయన చెప్పటం తెలిసిందే. తాను చెప్పినట్లే గొల్లప్రోలు మండలం చేబ్రోలులో తన …
Read More »మంత్రి ‘ విడదల రజనీ ‘ సీటుపై కన్నేసిన వైసీపీ టాప్ లీడర్..?
మంత్రి విడుదల రజనీ ఇప్పుడు అధికార వైసీపీ వాళ్లకే టార్గెట్గా మారిపోయారు. చాలా తక్కువ టైంలోనే ఎమ్మెల్యే అవడంతో పాటు.. మంత్రి అయ్యి ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో కీలక నేతగా ఎదిగిపోయారు రజని. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా రజనీని బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. దీంతో గత రెండేళ్ల పాటు రజని హవా మామూలుగా లేదని చెప్పాలి. ఇక జిల్లాలోనూ …
Read More »‘పేద’ బుట్టా రేణుక ఆస్తులు వేలం!
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ.. వైసీపీకి భారీ షాక్ తగిలింది. నిన్న మొన్ననే.. సీఎం జగన్.. ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తున్న పార్టీ కీలక నాయకురాలు.. బీసీ మహిళ బుట్టా రేణుకను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బుట్టమ్మ ఆస్తులు కూడా అంతంత మాత్రమే అన్నారు. అయితే.. ఆ అంతంత మాత్రం ఆస్తులు ఎంతెంత ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. మెరిడియన్ స్కూల్ పేరుతో హైదరాబాద్లో విద్యావ్యాపారం సహా.. కల్యాణ మండపాలు కూడా కట్టించారు.
Read More »కార్ కన్ఫ్యూజ్ పోయినట్టే
ఎన్నికలు అనగానే.. పార్టీలు, నాయకులు ఎంత మంది ఉన్నా.. హోరా హోరీగా ప్రచారం చేసుకున్నా.. చివరకు వీరంతా ఆధారపడేది.. వీరి జతకాలు తేల్చేది… ఎన్నికల గుర్తులే. అందుకే నాయకులు.. ఎన్నికల్లో ఎంత పోరాటం చేసినా.. చివరకు ప్రజల వద్దకు వెళ్లేసరికి పేర్లు మరిచిపోయినా ఫర్లేదు..కానీ గుర్తును మాత్రం మరిచిపోవద్దని పదే పదే చెబుతుంటారు. మన గుర్తు.. మన గుర్తు అంటూ.. పెద్ద ఎత్తున గుర్తునే ప్రచారంలోకి తీసుకువస్తారు.
Read More »పింఛను సొమ్ముతో ఉద్యోగి పరార్.. ఇది కూడా రాజకీయం!
ప్రస్తుతం ఏపీలో సామాజిక భద్రతా పింఛన్ల వ్యవహారం రాజకీయంగా మారిన విషయం తెలిసిందే. పింఛన్లను ఇంటింటికీ తీసుకువెళ్లి ఇవ్వకుండా టీడీపీ అడ్డు పడుతోందని వైసీపీ ప్రచారం చేస్తుంటే.. అదేంలేదు.. వైసీపీనే ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తూ.. టీడీపీపై నెడుతోందని తెలుగుదేశం తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాసాగుతుంటూ.. ఇప్పుడు మరో విషయం తెరమీదికి వచ్చింది. పింఛన్ల పంపిణీ కోసం.. బ్యాంకు నుంచి తీసుకువచ్చిన సొమ్మును సచివాలయ ఉద్యోగి ఒకరు తస్కరించారు. …
Read More »“హత్యా రాజకీయాలు వద్దంటే.. జగన్ను చిత్తుగా ఓడించండి”
“హత్యా రాజకీయాలు వద్దని అనుకుంటే.. వైసీపీని, సీఎం జగన్ను చిత్తుగా ఓడించండి” – అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో హత్యా రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. ఈ హత్యా రాజకీయాలను వైసీపీ పెంచి పోషించిందని తెలిపారు. ముఖ్యమంత్రే హంతకులకు మద్దతుగా నిలుస్తున్నారని.. ఇలాంటి వారిని ఓడించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు …
Read More »కిషన్ రెడ్డిగారూ మీ మాటలు ఎలా నమ్మాలి?
ఔను.. ఇప్పుడు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈ ప్రశ్నే ఎదురవుతోంది. మిమ్మ ల్ని ఎలా నమ్మాలండీ అంటూ.. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. దీనికి కారణం.. తన ఫోన్ కూడా ట్యాపిం గునకు గురైందని.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. తాము వదిలి పెట్టబోమని.. బీజేపీ ప్రభుత్వం కూసాలు కదిలిస్తుందని భారీ డైలాగులు పేల్చారు. అయితే, ఇప్పటికీ కేంద్రంలో ఉన్నదిబీజేపీనే కదా.. …
Read More »పరిటాల కమిట్మెంట్ కు సలాం
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలక నియోజకవర్గం ధర్మవరంలో కూటమి పార్టీలైన.. టీడీపీ-బీజేపీ-జనసేన నాయకులు చేతులు కలిపాయి. ధర్మవరం టికెట్.. కూటమి పార్టీగా ఉన్న బీజేపీకి వెళ్లింది. దీంతో టీడీపీలో కొంత అలజడి రేగినా.. యువ నాయకుడు.. పరిటాల శ్రీరామ్ టికెట్ కోసం కొన్ని రోజులు రగడ చేసినా.. తర్వాత సర్దుకున్నారు. దీంతో ఇప్పుడు పరిస్థితి దారిలో పడింది. ఇక, తాజాగా పరిటాల శ్రీరామ్, ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్లు.. …
Read More »జగన్ కి చేతగాక బాబుపై ఏడుపు – భువనేశ్వరి
“ఏపీకి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ, ఆయనకు పింఛన్లు ఇవ్వడం చేతకాదు. కానీ, చంద్రబాబుపై ఏడవమంటే మాత్రం ఏడుస్తారు” అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నిజం గెలవాలి” పేరుతో నిర్వహిస్తున్న యాత్ర.. నంద్యాలలో చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో గుండెలాగి మరణించిన నంద్యాల పట్టణం, వెంకటాచలం కాలనీ, 34వ వార్డులో కార్యకర్త అబ్దుల్ రహీమ్ కుటుంబాన్ని పరామర్శించి, హామీ పత్రం ఇచ్చారు. నిధులను …
Read More »జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీకి దూరం చేసేది ఆ ఇద్దరేనా?
జూనియర్ ఎన్టీఆర్. సార్వత్రిక ఎన్నికల వేళ మరోసారి రాజకీయంగా తెరమీదికి వచ్చిన పేరు. టీడీపీ విషయంలో సానుకూలంగా స్పందించి.. 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగినా.. కూడా ఆసుపత్రి నుంచి ప్రచారం నిర్వహించారు. అయితే, ఆ తర్వాత కాలంలో ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీనిపై అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. తాజాగా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరికొన్ని …
Read More »జనసేనకు గ్లాసు గుర్తే.. బెంగలేదు.. కానీ, సస్పెన్స్!
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల గుర్తుల అంశం జనసేన పార్టీని కుదిపేస్తోంది. ఈ పార్టీకి.. గాజు గ్లాసు గుర్తు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతో ప్రతిసారీ గుర్తు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ గుర్తు విషయంలో జనసేన ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పడు ఏపీలోనూ ఇదే ఇబ్బంది ఎదురైంది. అయితే.. తాజాగా ఈ …
Read More »