తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఆయన పార్లమెంటులో మాట్లాడినప్పుడు.. తల్లిని చంపి బిడ్డను తీశారని తెలంగాణ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కూడాపలు సందర్భాల్లో పార్లమెంటు తలుపులు మూసేసి.. విరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(కర్ణాటక) కూడా.. పాకిస్థాన్-భారత్ విభజనతో ఏపీ విభజనను, తెలంగాణ …
Read More »తమిళ మంత్రి కీర్తన.. గతంలో టీడీపీకి..?
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. టీవీకే తరఫున శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ అమ్మాయి, ఇప్పుడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. కేవలం 29 ఏళ్ల వయసులోనే తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి, వెంటనే మంత్రివర్గంలో స్థానం సంపాదించడం ద్వారా …
Read More »మోదీ బంగారాన్ని ఎందుకు కొనొద్దంటున్నారు?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి హైదరాబాద్ పర్యటన సాంతం ఆసక్తికరంగానే సాగింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ… హైదరాబాద్ లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ… బంగారం కొనొద్దంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చి …
Read More »మోదీకి మరిచిపోలేని ఆతిథ్యమిచ్చిన చంద్రబాబు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి తన హైదరాబాద్ పర్యటనలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీని విశిష్ట అతిథిగా పరిగణించిన చంద్రబాబు కుటుంబం మోదీకి మచిరిపోలేని అతిథ్యం ఇచ్చింది. బాబు ఫ్యామిలీ అందించిన ఆతిథ్యంతో మోదీ కూడా మంత్రముగ్ధులయ్యారని చెప్పక తప్పదు. ఎందుకంటే…ఓ వైపు తాను ఎంతగానో ఇష్టపడే యువ రాజకీయవేత్త నారా లోకేశ్, మరోవైపు …
Read More »‘కాంగ్రెస్… మావోయిస్టు పార్టీ కంటే దారుణం’
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జరిగిన బీజేపీ సభలో కాంగ్రెస్ పార్టీని మావోయిస్టుల కంటే దారుణమైన పార్టీగా అభివర్ణించారు. వాస్తవానికి ఆదివారం ఆయన బెంగళూరులో పర్యటించినప్పుడు కూడా కాంగ్రెస్పార్టీపై విరుచుకుపడ్డారు. డీఎంకే పార్టీకి వెన్నుపోటు పొడిచిన పార్టీగా అభివర్ణించారు. తాజాగా సాయంత్రం సికింద్రాబాద్లో నిర్వహించిన సభలోనూ కాంగ్రెస్ను మరింత ఎక్కువగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వామపక్ష పార్టీల …
Read More »తమిళనాట పాడిన వందే మాతరం… బెంగాల్ లో లేదెందుకు?
వందేమాతరం ఆలపించడంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ప్రధాని ప్రమాణ స్వీకారం, పౌర పురస్కారాలు అందించే కార్యక్రమాలు, రాష్ట్రపతి పాల్గొనే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, తమిళనాడు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం ఆలపించిన దాఖలాలు లేవు. దీంతో, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం పాడతారా …
Read More »మొదటి సారి… బాబు, పవన్ ఇళ్లకు మోదీ
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ టాప్ 10 లో ఉంటారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే భారత్ మరో రేంజ్ కు వెళ్లిందంటే అతిశయోక్తి కాదు. అటువంటి పవర్ ఫుల్ లీడర్ అయిన మోదీకి ఏపీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రాధాన్యతను మోదీ నెక్స్ట్ …
Read More »రేవంత్ రెడ్డిని చేతులు కలపమంటున్న మోడీ
భారత ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హెచ్ ఐసీసీ లో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలోనే తన ప్రసంగం సమయంలో ఆ విషయంపై మోదీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. …
Read More »ముఖ్యమంత్రిగా మూడు సంతకాలు.. విజయ్ అదరహో!
తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ(తమిళ వెట్రిగ కళగం) అధినేత సీ. జోసెఫ్ విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తోపాటు.. సీనియర్ నాయకులు కూడా కొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే.. తొలిరోజే విజయ్.. మూడు కీలక హామీలపై సంతకాలు చేసి అదరహో అనిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను …
Read More »జనసేనలో కొమ్ములాట వెనుక ఉన్న కోవర్టులెవరు?
జనసేన పార్టీకి సంబంధించి రాయల సీమ జిల్లాల వ్యవహారాలు సమీక్షించడంతోపాటు.. క్షేత్రస్థాయిలో ఇంచార్జ్లను నియమిం చేందుకు ఉద్దేశించిన సమావేశం రచ్చకు దారితీసింది. పార్టీలో కీలక నాయకులుగా ఉన్నవారిని వ్యతిరేకిస్తూ.. కొందరు నాయకులు బహిరంగ విమర్శలు చేశారు. సమావేశం నిర్వహణను కూడా బహిష్కరించారు. దీంతో జనసేనలో అంతర్గతంగా ముసురుకున్న వివాదాలు రోడ్డున పడినట్టు అయింది. ముఖ్యంగా పార్టీలో వ్యవస్థాపక సమయం నుంచి ఉన్న నాయకులకుఎలాంటి గుర్తింపు లేకుండా పోయందని పలువురు వ్యాఖ్యానించారు. …
Read More »త్రిషకు అంత ప్రాధాన్యమిచ్చారెంటీ?
మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టిన తమిళ స్టార్ హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు. ఈ రోజు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తన చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. విజయ్ ఒక్క పిలుపునిస్తే లక్షల మంది అభిమానులు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చేవారు కానీ.. వారిని అదుపు చేయడం కష్టమని స్టేడియంలో పరిమిత సంఖ్యలో అతిథులు, …
Read More »లెక్కలు మొత్తం బయటకి తీస్తానంటున్న విజయ్
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత, దళపతి విజయ్ తొలి ప్రసంగంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజల సొమ్మును తినేందుకు.. వారిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు రాలేదన్నారు. ప్రతి క్షణం ప్రజల కోసం.. పేదల కోసం కష్టపడి పని చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గత డీఎంకే ప్రభుత్వంపై నిశిత విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లరూపాయలను అప్పు చేసిందన్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates