Political News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక సాధారణ రైతుపై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జైలు పాలవగా, ఆయనకు శిక్ష పడే వరకు చెప్పులు ధరించనని శపథం చేసిన రైతు తన మొక్కు తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 2022 జనవరి 6న పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు …

Read More »

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి(బీహార్ కేడ‌ర్‌) సునీల్ నాయ‌క్‌పై తీవ్రంగా మండిప‌డింది. స‌రెండ‌ర్ అవుతారా? లేక కేసులో వాద‌నలు కొన‌సాగిస్తారా? అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. ఈ కేసులో అన్నీ తెలుసున‌ని వ్యాఖ్యానించింది. తాజాగా సునీల్ నాయ‌క్‌.. త‌న‌కు ముందస్తు బెయిల్ కావాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు.. ఈ …

Read More »

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన(టీఆర్ ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటును వేర్పాటుతో పోల్చిన ప‌వ‌న్ పై ఎందుకు కేసు పెట్ట‌లేద‌ని ఆమె నిల‌దీశారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ప‌వ‌న్ వంటి వారు రెచ్చిపోతున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక‌.. …

Read More »

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది. తాము అధికారంలోకి వస్తే…ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను క్రమానుగతంగా భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ… అందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పింది. అనుకున్నట్లుగానే ఆ ఎన్నికల్లో వైసీపీకి అధికారం దక్కగా… ఆ తర్వాత జాబ్ కేలండర్ అన్న మాట వైసీపీ నుంచి వినిపించ …

Read More »

‘రికార్డు’ వేలంపై హైకోర్టు స్టే!

అనుకున్నంతా అయ్యింది. హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటాయని చెప్పిన సర్కారీ వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఎస్బీఐ అభ్యంతరాన్ని మన్నిస్తూ సర్కారీ వేలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెరసి అన్ని రికార్డులను బద్దలు కొట్టేసిన సర్కారీ వేలం పాట ప్రశ్నార్థకంగా మారిపోయింది. గత నెల …

Read More »

బ్రేకింగ్… కారుమూరి కుమారుడు అరెస్ట్

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో అదనంగా లిక్కర్ రవాణాలోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న విషయం ఇటీవలే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ ట్రాన్స్ పోర్ట్ స్కాంలో ప్రత్యక్ష పాత్ర ఉందన్న ఆరోపణలతో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్టయ్యారు. మద్యం అక్రమ రవాణాపై కేసు నమోదు …

Read More »

‘బీచ్ లో ఎందుకు… గీతంలో బార్ పెట్టండి’

ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే దిశగా బీచ్ లలో బార్లను ప్రవేశపెడుతున్న తీరుపై నిన్నటిదాకా అంతగా విమర్శలేమీ లేవనే చెప్పాలి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్రమంగా పెరుగుతోంది. ఈ దిశగా జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీచ్ లలో మాత్రమే …

Read More »

‘పెట్రోల్ ధరలు వెంట‌నే పెంచామా.. వెంట‌నే త‌గ్గించ‌డానికి?’

పెట్రోల్ ధ‌ర‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పెట్రోలియం శాఖ కార్య‌ద‌ర్శి శుక్ర‌వారం ఢిల్లీలో విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. అయినా.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను వెంట‌నే పెంచ‌లేద‌ని.. ప్ర‌పంచ దేశాల‌న్నీ.. పెంచినా.. భార‌త్ సంయ‌మ‌నం పాటించి ప్ర‌జ‌ల‌పై భారాలు మోప‌కుండా చూసింద‌ని తెలిపారు. నెమ్మదిగానే పెంచింద‌ని చెప్పారు. కాబ‌ట్టి.. ఇప్పుడు కూడా నిర్ణ‌యం తీసుకునేందుకు …

Read More »

‘తెరపై హీరో… చేతల్లో జీరో’

సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే… ఈ తరహా మాటలే వినిపిస్తాయి. ఇక రాజకీయాల్లోకి వచ్చిన ఆ సినీ నటులు ఏకంగా అధికార పీఠాన్నే అధిరోహిస్తే… ఈ తరహా విమర్శలు మరింత ఘాటుగా వినిపిస్తాయి. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పైనా ఇదే తరహా ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గురువారం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగా…విపక్ష డీఎంకే విజయ్ పాలనపై తొలిరోజే విమర్శల జడివానను కురిపించింది. తెరపై హీరో…చేతల్లో …

Read More »

అయోధ్య రామాల‌యంలో దోపిడీ… CCTV మార్చేశారా?

దాదాపు 500 సంవ‌త్స‌రాల సుదీర్ఘ పోరాటం త‌ర్వాత‌.. అనేక రాజ‌కీయ ఒత్తిళ్ల‌ను అధిగ‌మించి.. నిర్మించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య రామాల‌యంలో భారీ దోపిడీ జ‌రిగింద‌ని అధికారులు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ఈ చ‌ర్చ‌.. గ‌త నెల రోజులుగా సాగుతోంది. ఇదేదో.. బ‌య‌ట నుంచి వ‌చ్చిన వారి ప‌నికాద‌ని కూడా అంటున్నారు. బాల‌ రామ‌య్య‌కు భ‌క్తులు స‌మ‌ర్పించిన‌.. కోట్ల రూపాయ‌ల న‌గ‌దుతోపాటు.. విలువైన వ‌జ్రాభ‌ర‌ణాలు, బంగారు న‌గ‌లు కూడా మాయ‌మ‌య్యాయ‌ని అధికారులు గుర్తించారు. తొలుత …

Read More »

రికార్డు ధర పలికిన భూమి స్టేట్ బ్యాంకుదా..?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటిన విషయాన్ని కళ్లకు కట్టిన ఇటీవలి ప్రభుత్వ భూముల వేలం పెను వివాదానికే తెర తీసింది. ఇటీవల తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో ఒక్కో ఎకరా రేటు రూ.237 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. వేలం దాకా సాఫీగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంట్రీతో వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వం వేలం …

Read More »

పవన్ మాటంటే మాటే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు కొత్తగా, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల కంటే ముందు సినిమా నటుడిగానే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పవన్… తెలుగు నేలలో అశేష అభిమాన సమూహాన్ని సంపాదించుకున్నారు. అభిమానుల పట్ల పవన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగానే ఆయనకు ఫ్యాన్స్ లక్షల సంఖ్యలో పోగయ్యారని చెప్పాలి. అభిమానుల పట్ల …

Read More »