తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో …
Read More »భారత్లో కరోనా.. భయపెడుతున్న ఎంఐటీ ఫిగర్స్
రెండు నెలల కిందట ఇండియాలో రోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్నపుడే వామ్మో వామ్మో అంటూ మాట్లాడుకున్నాం. ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారంటే అయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండియాలో కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా రోజుకు 20 వేల మందికి అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఐతే ఇదే పీక్స్ అనుకుని.. త్వరలో మంచి రోజులు వస్తాయని …
Read More »రఘురామకృష్ణంరాజుతో మైండ్ గేమ్ మొదలు పెట్టిన జగన్
పార్టీలో ఉంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైయస్ జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. రఘురామ గత కొంతకాలంగా చాలా వ్యూహాత్మకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఓ వైపు అధినేతను ప్రశంసిస్తూనే, పార్టీలో నేతలపై, పార్టీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై జగన్ చర్యలు తీసుకోని విధంగా ముందుకు కదిలారు. దీంతో ఇప్పుడు జగన్ రివర్స్ స్ట్రాటజీలో వచ్చారు. రఘురామకృష్ణంరాజుపై నర్సాపురం నియోజకవర్గంలో వరుసగా …
Read More »బీజేపీ చీలిపోతోందా..వైసీపీ చీల్చుతోందా?
ఏపీ బీజేపీ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. ఆ పార్టీలోని అంతర్గత పరిణామాలపై రాజకీయ విశ్లేషకులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏకంగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నిహితుడనే పేరున్న ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పందన ఓ రకంగా ఉంటే మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు భిన్నంగా ఉందని ప్రస్తావించారు. తద్వారా …
Read More »కేసీఆర్ పాలన పై సై అంటోన్న తమిళ`సై
తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ల మధ్య సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక విషయాలకు వీరిద్దరూ ప్రాధాన్యతనివ్వడ కావచ్చు….పాలన పరంగా కేసీఆర్ తో నరసింహన్ ఎప్పుడూ విభేదించకపోవడం కావచ్చు…ఏదైనా కానీ, వారిద్దరి మధ్య పెద్దగా విభేదాలు వచ్చినట్లు కనబడలేదు. అయితే, ప్రస్తుత గవర్నర్ తమిళ సైతో కేసీఆర్ కు పెద్దగా పొసగలేదన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ప్రధాని మోడీపై కేసీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత ఏరికోరి …
Read More »తెలంగాణలో ఎప్పటికి లాక్ డౌన్ ఉండనట్లే.. !
పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు నమోదయ్యే వందలు కాస్తా పదిహేనువందలకు చేరుకున్నపరిస్థితి. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ పుణ్యమా అని.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వీయ లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. పలు వాణిజ్య సంస్థలు తమకు తాముగా స్వీయ నియంత్రణ విధించుకొని షాపుల్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమవుతుందన్న వాదన జోరుగా వినిపించింది. అందరి అంచనాల్ని …
Read More »#sukanyarapistrahulgandhi.. ఎందుకు ట్రెండ్ అవుతోంది?
రాహుల్ గాంధీ మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. కానీ అది మంచి కారణంతో కాదు. ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేసే ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. #sukanyarapistrahulgandhi.. ఇదీ ఆ హ్యాష్ ట్యాగ్. రాహుల్ గాంధీ ఏంటి.. రేప్ కేసు ఏంటి అనిపిస్తోందా? ఆయన మీద ఒక రేప్ కేసు ఉన్న మాట వాస్తవం. ఒకప్పుడు ఆ కేసు సంచలనం రేపింది. 13 …
Read More »కరోనాపై అవగాహన పెంచి.. చివరికి కరోనాకే బలై
కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులే చివరికి ఆ వైరస్ బారిన పడి ప్రాణాలు వదులుతున్న విషాదాంతాలూ చూస్తున్నాం. కరోనాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పిన వాళ్లు సైతం చివరికి ఆ వైరస్ బాధితులుగా మారుతున్నారు. తాజాగా అలా కరోనా బాధితుడిగా మారిన ఓ రచయిత, గాయకుడు ప్రాణాలు వదిలిన విషాదాంతం హైదరాబాద్లోనే చోటు చేసుకుంది. సామాజిక అంశాల మీద గద్దర్ తరహాలో పాటలు రాసి, పాడటం ద్వారా నయా …
Read More »తమ్మినేని అసలు టార్గెట్ అదేనట
సాధారణంగా రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండేవారు రాజకీయల గురించి మాట్లాడరు. ఒకవేళ ఏదో అరకొరగా మాట్లాడినా పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. కానీ, ఏపీలోని సీనియర్ పొలిటిషియన్లలో ఒకరు, ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం తరచుగా అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఏదో ఒకటి రెండు సార్లు అంటే సందర్భాన్ని బట్టి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయనుకోవచ్చు. కానీ, దాదాపుగా అన్ని సార్లు అటువంటి కాంట్రవర్షియల్ …
Read More »వైసీపీలో మరో నిరసన గళం… ఈ సారి ధర్మాన వంతు
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో నిరసన గళాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీకి ఓ తలనొప్పిగా మారిపోతే.. తాజాగా పార్టీ సీనియర్ నేత, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తనదైన శైలిలో నిరసన గళం విప్పారు. అది కూడా జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ధర్మాన తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబందించి …
Read More »రికవరీ రేటులో తెలుగురాష్ట్రాలది బ్యాక్ బెంచ్
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. వైరస్ కేసులు తెలంగాణలో 28వేలు దాటగా, ఆంధ్రప్రదేశ్లో 23వేలకు దగ్గరలో ఉంది. కేసుల్లో దాదాపు టాప్ 10లోనే ఉన్నాయి. టెస్టుల పరంగా తెలంగాణ చాలా బలహీనంగా ఉందనే విమర్శలు ఎదుర్కొంటోంది. రోజు రోజుకు కేసులు పెరగడంతో పాటు రికవరీలో అయితే తెలుగు రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 12,010,593, మరణాలు 548,057 కాగా, రికవరీ 6,951,695గా ఉంది. మన దేశంలో …
Read More »కేసీఆర్ షాక్ అయ్యే వార్త…ఆయన కోసం పూజలు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఓ వైపు చారిత్రక సెక్రటేరియట్ను కూల్చివేస్తూ భారీ బడ్జెట్తో మరో సచివాలయం నిర్మించేందుకు సన్నద్ధం అవడం… మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల కలకలం కొనసాగుతుండగా దాదాపుగా పది రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక, వ్యక్తిగత కార్యకలాపాల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం! కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్గా …
Read More »