తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పొట్టోడా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి నిన్న కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే మరోసారి రేవంత్ ను కేటీఆర్ టార్గెట్ చేశారు. కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
తిడితే తనను తిట్టాలనీ…కేసీఆర్ ను, కార్యకర్తలను తిడితే మాత్రం ఊరుకోబోం పొట్టోడా అంటూ హెచ్చరించారు. రెండేళ్ల తర్వాత గులాబీ జెండా అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు పాతాళంలో దాక్కున్నా సరే రేవంత్ ను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.
ఇక, పథకాలు రావడం లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతల లాగులో తొండలు వదిలిపెడతానని అంటున్నారని, కాబట్టి ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదని…లాగుల తొండల్ రెడ్డి అని కేటీఆర్ సెటైర్లు వేశారు.
గట్టిగా రామాయంపేటలో గుద్దు గుద్దితే జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి గువ్వ పగలాలి అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, కొందరు పోలీసులు ఎక్స్ ట్రాలు చేస్తున్నారని, అటువంటి పోలీసుల నట్లు, బోల్టులు ఫిట్ చేస్తానని హెచ్చరించారు.
రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తాను మంత్రిగా ఉంటానని జోస్యం చెప్పారు. మంచికి మంచి, మర్యాదకు మర్యాద అని, తేడా వస్తే అరెస్టులకైనా, దేనికైనా సిద్ధం అని అన్నారు. ఇలా, బావాబామ్మర్దులు హరీశ్, కేటీఆర్ లు ఒకరి తర్వాత ఒకరు రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ టార్గెట్ చేస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates