ఆ కేసులో అంబటికి బెయిల్.. కానీ…

సీఎం చంద్రబాబును అనుచిత పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల కస్టడీ పిటిషన్ ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు తిరస్కరించింది. అయితే, మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

గత ఏడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టిన అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు 2 వారాలపాటు రిమాండ్ విధించింది. దీంతో, ఆయనకు బెయిల్ లభించినా ఊరట లభించలేదు. దీంతో, అంబటిని గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

మరోవైపు, ఏపీ హైకోర్టులో అంబటికి ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెంతో పాటు పలు స్టేషన్లలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో 35 (3) బీఎన్ఎస్ఎస్ ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.