Political News

బాబు 4.0.. మామూలుగా లేదుగా!

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రారంభించిన 4.0 ప్రభుత్వం ఊహకు అందని నిర్ణయాలు, ఆశ్చర్య‌గొలిపే నిర్ణయాలు తీసుకుంటోంది. వాస్తవానికి సాధారణంగా చంద్రబాబు పరిపాలన అంటే హైటెక్ సిటీ లాగా ఐటి పరిపాలనకు ఆయన ప్రాధాన్య ఇస్తారు. అదేవిధంగా పెట్టుబడులకు పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలు ఉండేలా చూస్తారు. ఇది అందరికీ తెలిసిందే. గత ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఇదే తరహాలో పెట్టుబడులు కల్పనకు అభివృద్ధికి చంద్రబాబు …

Read More »

ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తోంది.. ఇక‌, దూకుడే!

కూట‌మి ప్ర‌భుత్వంలో కీలక భాగ‌స్వామి.. జ‌న‌సేన పార్టీ వేస్తున్న వ్యూహాత్మ‌క అడుగులు ఫ‌లిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో పార్టీ ప‌ట్టు పెరుగుతోంది. దీనినే పార్టీ అధినేత, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశించారు. బ‌ల‌మైన వైసీపీ ఓటు బ్యాంకును బ‌దాబ‌ద‌లు చేయ‌డంలో రెండు కీల‌క అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని జన‌సేన ముందుకు సాగుతోంది. దీనిలో ప్ర‌ధానంగా గ్రామీణ, గిరిజ‌న ఓటు బ్యాంకు కీల‌కం. వీటిని వైసీపీకి దూరం చేయ‌డం ద్వారా.. కూట‌మి …

Read More »

ఆ పొలిటిక‌ల్‌ మేడంలు అంతే.. అసంతృప్తి..!

రాజ‌కీయంగా సీనియ‌ర్ నాయ‌కురాలు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మై.. సొమ్ములు కూడా రెడీ చేసుకున్నారు. కానీ.. ఏం చేస్తారు.. ఈక్వేష‌న్లు కుద‌ర‌లేదు. టికెట్ ద‌క్క‌లేదు. కానీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన గుర్తింపు ఉంద‌ని చెప్పుకొనే ఆమె.. గ‌తంలో కేంద్ర మంత్రిగా చేసి ఉండ‌డంతో చంద్ర‌బాబుకు ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్పింది కాదు. ఈ క్ర‌మంలోనే ఆమెకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డులో మెంబ‌ర్‌గా నియమించారు. ఎంతో మంది బ‌రిలో ఉన్నా.. …

Read More »

మ‌ళ్లీ బాబే.. తేల్చేసి మ‌హిళా లోకం!

టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ నాయకులకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు, చేస్తున్న అభివృద్ధి, సాధిస్తున్న పెట్టుబడులు వంటి వాటిపై ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇది జరిగి ఐదు రోజులు అయింది. ఈ ఐదు రోజుల్లో ఏ ఏ నాయకులు ఎలా పని చేస్తున్నారు? ఏ ఏ …

Read More »

బ్యాక్ బెంచ్ మినిస్ట‌ర్స్ వీరేనా? ఏం జ‌రుగుతుంది ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. దీనిలో ముఖ్య‌మంత్రి, ఉప ము ఖ్య‌మంత్రి పోస్టులు ప‌క్క‌న పెడితే.. 23 మంది మినిస్ట‌ర్లు అవ‌కాశం ద‌క్కించుకున్నారు. వీరిలోనూ జ‌న‌సేన కు చెందిన ఇద్ద‌రు, బీజేపీకి చెందిన ఒక‌రిని ప‌క్క‌న పెడితే.. మ‌రో 20 మంది అచ్చంగా టీడీపీ కి చెందిన మంత్రులే ఉన్నారు. వీరిపైనే సీఎం చంద్ర‌బాబుకు చాలా ఆశ‌లు ఉన్నాయి. అనేక వ‌డ‌పోత‌లు, సామాజిక …

Read More »

“మేం అధికారంలోకి వస్తే.. ఏకే 47లే!”

వైసీపీ నాయ‌కుల తీరు మార‌డం లేదు. రోజు రోజుకు నోరు పారేసుకుంటున్నారు. అడ్డు-అదుపు లేకుండా వాగేస్తున్నారు. దీంతో కొత్త వివాదాలు కొని తెచ్చుకుంటున్నామ‌న్న స్పృహ కూడా వారిలో క‌నిపించ‌డం లేదో .. లేక‌, ఇదే ట్రెండ్ అని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ.. నాయ‌కులు.. అందునా సీనియ‌ర్ నాయ‌కులు ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్టుగా నోటి దురుసు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల‌రెడ్డి నోరు …

Read More »

ఏపీ రైతుల‌కు పండ‌గే.. ఒకే సారి 20 వేలు

ఏపీ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భ‌రోసా నిధుల‌పై మంత్రి నారాయ‌ణ క్లారిటీ ఇచ్చేశారు. ఒకేసారి రైతుల‌కు 20 వేల రూపాయ‌ల‌ను అందిస్తామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే త‌దుప‌రి విడ‌త నిధుల‌తో క‌లిపి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది ఇవ్వాల్సిన బ‌కాయిని కూడా క‌లిపి ఇస్తామ‌న్నారు. దీంతో రైతుల ఖాతాల్లో రూ.20 వేల చొప్పున ప‌డ‌తాయ‌ని.. వారు ఈ విష‌యంలో ఎలాంటి అపోహ‌ల‌కు పోవ‌ద్దని తేల్చి చెప్పారు. …

Read More »

మా నాయ‌కుడు(చంద్ర‌బాబు) అరుస్తాడు

‘ర‌ప్పా.. ర‌ప్పా.. న‌రుకుతాం!’ అనే డైలాగు ఇటీవ‌ల కాలంలో వైసీపీ నాయ‌కుల నుంచి త‌ర‌చుగా వినిపి స్తున్న విష‌యం తెలిసిందే. వారిపై విమ‌ర్శ‌లు కూడా అంతే జోరుగా వ‌స్తున్నాయి. అయితే.. తాజాగా టీడీ పీకి చెందిన సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇవే వ్యాఖ్య‌ల‌తో వైసీపీ నాయ‌కు డికి వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల కింద‌ట వైసీపీ యువ నాయ‌కుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తాడిప‌త్రికి …

Read More »

నా సంగ‌తేంటి?.. ఢిల్లీకి కిర‌ణ్ కుమార్‌!

“నా సంగ‌తేంటి? తేల్చండి!” అంటూ.. మాజీ సీఎం, బీజేపీ నాయ‌కుడు.. న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌పై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యారా? ఆయ‌న ఈ రోజో రేపో ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్ర చివ‌రి ముఖ్యమంత్రిగా చేసిన త‌ర్వాత‌.. దాదాపు 11 సంవ‌త్స‌రాలుగా కిర‌ణ్ రాజ‌కీయాలు ఊగిస‌ల‌డుతూనే ఉన్నాయి. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వినీ ఏ పార్టీలోనూ …

Read More »

మెగాస్టార్‌కే షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. హైకోర్టుకు వివాదం!

మెగాస్టార్ చిరంజీవి అంటే.. స‌మాజంలో మంచి పేరు, ప‌లుకుబ‌డి ఉంద‌న‌డంలో సందేహం లేదు. పైగా విన‌మ్రుడు, వివాదర‌హితుడు కూడా. దీంతో ఆయ‌న ఏం చెప్పినా.. ఏం చేయాల‌ని అనుకున్నా..ప‌నులు క్ష‌ణాల్లో జ‌రిగిపోతూ ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, చిత్రంగా.. గ్రేట‌ర్‌ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు మాత్రం మెగాస్టార్‌కే షాకిచ్చారు. ‘అయితే ఏంటి?’ అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. దీంతో చిరు.. హైకోర్టు వ‌ర‌కు వెళ్లి.. అధికారుల‌ను క‌దిలించారు. ఏం జ‌రిగింది? హైదరాబాద్‌లోని …

Read More »

పేర్నినానికి పిచ్చి పట్టినట్లుంది: కందుల దుర్గేష్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని ఈ మధ్య చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చీకట్లోనే సైలెంట్ గా పని కానిచ్చేయాలని…రప్పా రప్పా అంటూ పగటి పూట రచ్చ చేయడం కాదని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా నాని చేసిన కామెంట్లు దుమారం రేపాయి. మంత్రి కందుల దుర్గేష్ ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఈ క్రమంలోనే పేర్ని …

Read More »

బ‌ట్టు తిరిగి వస్తున్నారు జగన్!

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపించి… చ‌ట్టాన్ని ప‌రిచ‌యం చేసి.. మొట్టికాయ‌లు వేసిన న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్‌. 2020 జనవరి 13 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప‌ని చేసిన ఆయ‌న 2023 ఏప్రిల్‌ 10న మద్రాస్‌ హైకోర్టుకు బ‌దిలీ అయ్యారు. వాస్త‌వానికి బ‌ట్టును బ‌దిలీ చేయించింది కూడా.. జ‌గ‌నే అనే ప్ర‌చారం ఉంది. అప్ప‌ట్లో బ‌ట్టు బ‌దిలీని వ్య‌తిరేకిస్తూ.. న్యాయ‌వాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించారు. అయితే.. …

Read More »