తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పాటు ఏ ఇబ్బందీ లేకుండా వీటికి అనుమతులు వచ్చేశాయి. కానీ ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో చోటు చేసుకున్న విషాదం వల్ల.. చాలా రోజుల పాటు బెనిఫిట్ షోలు ఆగిపోయాయి. అదనపు రేట్లూ ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు …
Read More »రాజాసింగ్ చెప్పిందే నిజమైందా?
“తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం.” ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేకుండాపోయింది. కేవలం ఒకరిద్దరు నాయకుల మధ్య బంధీ అయిన అధికారం ఆధిపత్యం కారణంగానే తెలంగాణలో బీజేపీ నానాటికీ తీసికట్టుగా మారుతోందన్నది నిజం. ఎవరికివారు పెద్దలుగా మారి పార్టీ లైన్ను విస్మరించిన ఫలితంగానే ప్రజలకు చేరువ కావాల్సిన పార్టీ జారుబండిపై ప్రయోగాలు చేస్తోంది. ఈ …
Read More »తను కూడా ముఖమంత్రి అవుతానంటున్న కవిత
బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు.. కవిత షాకింగ్ కామెంట్లు చేశారు. బీఆర్ ఎస్ నాయకులను గుంటనక్కలతో పోల్చిన కవిత.. తనను అనవసరంగా విమర్శిస్తున్నారని.. తనపై ఉత్తిపుణ్యానికే ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వీరి అవినీతి చిట్టాను బయటకు తీస్తానని చెప్పారు. అంతేకాదు.. కవిత అక్కడితో ఆగలేదు. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన పాలన(కేసీఆర్)పైనా విచారణ చేయిస్తానని హెచ్చరించారు. ఈ …
Read More »మళ్ళీ మొదలైన కొలికపూడి వాట్సాప్ పంచాయతీ
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు. వరుసగా పెట్టే వాట్సాప్ స్టేటస్లు, స్థానిక నేతలపై తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. విస్న్నపేట టీడీపీ నేతలను ఉద్దేశించి “నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా?”, “పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటావ్… నిజంగా రాయల్, కొండపర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్!” అంటూ కసిరిపోయే వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో ఈ పోస్టులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి వచ్చిన …
Read More »టీవీ డిబేట్లలో జాగ్రత్త… వారిని హెచ్చరించిన బాబు
అధికార ప్రతినిధులకు సీఎం చంద్రబాబు తాజాగా క్లాస్ అవ్వటం ఆసక్తిగా మారింది. పార్టీలో అధికార ప్రతినిధులుగా ఉన్న కొందరు విషయ పరిజ్ఞానం లేకుండా మీడియా ముందుకు వస్తున్నారు అన్న చర్చ ఆయన తీసుకువచ్చారు. ఏ అంశం పైనైనా మాట్లాడేందుకు అందరూ సాధ్యం కాకపోవచ్చు. ఎవరికైనా విషయపరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇటీవల ఇండిగో వ్యవహారంపై పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు …
Read More »శభాష్ లోకేష్… ఇది కదా స్పీడ్ అంటే
విశాఖపట్నం ఐటీ మ్యాప్పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ వెయ్యి సీట్ల సామర్థ్యంతో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇది విశాఖ ఐటీ రంగానికి నూతన దశను తెరలేపుతుందని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దావోస్ పర్యటన ఫలితం ఏమిటి అన్న విమర్శలకు ఇదే సమాధానం అంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. జనవరి 23న …
Read More »బర్త్ డే పార్టీ: దువ్వాడ మాధురి అరెస్ట్!
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసినట్టు తెలిసింది. గురువారం ఆమె పుట్టిన రోజు కావడతో మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో మాధురి బర్త్ డే పార్టీ ఇచ్చారు. దీనికి పలువురు వైసీపీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా హాజరయ్యారు. అయితే.. ఈ పార్టీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం.. …
Read More »మూడు నెలల గడువు చంద్రబాబు ప్లాన్ సక్సెస్ అయ్యేనా
మూడు నెలల కాలంలో అద్భుత విజయాలను సాధించాలని టిడిపి అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి ఆయన మార్చి 31 వరకు సమయం కేటాయించారు. అధికారులకు మరిన్ని అధికారాలు అప్పగిస్తామని, ప్రజలకు సేవ చేయడంతో పాటు వారి నుంచి ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉండాలని కూడా సూచించారు. అయితే చంద్రబాబు పెట్టిన ఈ మూడు నెలల గడువులో నిజంగా అద్భుతాలు సాధ్యమవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. …
Read More »వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. నాడియాలోని కృష్ణనగర్లో గురువారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ సమావేశంలో ఆమె బీజేపీ, ఎన్నికల కమిషన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష ఓటర్ల పేర్లు పెద్ద ఎత్తున తొలగించేందుకు కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ… కలెక్టర్లపై ఒత్తిడి పెంచి కోటి యాభై లక్షల …
Read More »రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మొదటి విడతలోనే రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది. 26 జిల్లాలలో 4007 కిలో మీటర్ల రోడ్లను పటిష్టపరిచే ప్రణాళికను రూపొందించగా, ‘పల్లె పండుగ 2.0’ పేరిట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే శంకుస్థాపనలు …
Read More »చావు భయంలో ఎలన్ మస్క్
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా తీసుకున్న నిర్ణయం కాదు, భయం అలా ఉంది మరి. ఇన్నాళ్లు ఎంతో జోష్ గా కనిపించిన మస్క్ లో ఇప్పుడు టెన్షన్ క్లియర్ గా కనిపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్ అమెరికాలో జరిగిన చార్లీ కిర్క్ హత్యే. ఆ ఒక్క సంఘటన మస్క్ ను పూర్తిగా మార్చేసింది. “లైఫ్ …
Read More »కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘కాఫీ కబుర్లు’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈనెల రెండో తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సరికొత్త కార్యక్రమాన్ని లోకేష్ నేతృత్వంలో నిర్వహించారు. నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తలతో ఎలా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates