Political News

వ్యాపారానికి హిందీ కావాలి.. నేర్చుకోవ‌డానికి వ‌ద్దా?

‘హిందీ’ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దుతున్నార‌న్న వ్యాఖ్య‌లు.. తెలంగాణ‌, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లో జ‌రుగుతున్న పెద్ద పెద్ద రాజ‌కీయ వివాదాలు అంద‌రికీ తెలిసిందే. త్రిభాషా సూత్రంగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన హిందీ విష‌యం పై ప‌లు రాష్ట్రాల్లో వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌హారాష్ట్రంలో బీజేపీ స‌ర్కారే ఉంది. కానీ, స్థానిక మ‌రాఠాకు పెద్ద‌పీట వేసే ప్ర‌జ‌లు ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ త్రిభాషా మంత్రం ప‌ఠించ లేక పోయారు. తొలుత హిందీపై కీల‌క …

Read More »

‘జ‌గ‌న్ మా మాట వినిపించుకుని ఉంటే..’

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌ పై ఆ పార్టీలోని కీల‌క నాయ‌కులు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే.. అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ ఓడిపోయిన ఏడాది దాటిన త‌ర్వాత కూడా.. వారు జ‌గన్‌ పై త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మికి ఎవ‌రు బాధ్యులు? అనే విష‌యం పై పార్టీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తేల్చ‌లేక‌పోయారు. ఆయ‌న‌కు తెలిసే.. మౌనంగా ఉంటున్నారో.. లేక‌, …

Read More »

బంగారుపాళ్యం ఎఫెక్ట్‌.. నేత‌ల‌కు జ‌గ‌న్ క్లాస్‌?

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మామిడి మార్కెట్‌లో రెండు రోజుల కింద‌ట విపక్ష నాయ‌కుడిగా, మాజీ సీఎంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ పర్య‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సంద‌ర్భంగా అస‌లు కార్యక్ర‌మం.. కొస‌రు హడావుడితో ప‌క్క‌దారి ప‌ట్టింది. దీంతో పూర్తిస్థాయిలో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌కుండా అర్ధంతరంగా రైతుల‌తో మాట్లాడి వెనుదిరిగారు. దీనివ‌ల్ల కార్య‌క్ర‌మానికి సంపూర్ణ‌త అయితే రాలేదు. ఇదే విష‌యం వైసీపీలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. బంగారుపాళ్యం ప‌ర్య‌ట‌న‌కు పోలీసులు ఆంక్ష‌లు విధించారు. …

Read More »

‘కొండ‌’ను త‌వ్వే వ‌ర‌కు వ‌ద‌లేలా లేరే!

ఓరుగ‌ల్లు కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న వివాదాలు, విభేదాలు ఇప్ప‌ట్లో స‌మ‌సి పోయేలా క‌నిపించ‌డం లేదు. పైగా.. మంత్రి కొండా సురేఖ భ‌ర్త, మాజీ ఎమ్మెల్యే కొండా ముర‌ళీధ‌ర్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల్సిందేన‌న్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. తాజాగా మాజీ మంత్రి క‌డియం శ్రీహ‌రి స‌హా.. వ‌రంగ‌ల్ నుంచి కీల‌క నాయ‌కులు గాంధీ భ‌వ‌న్‌కు పోటెత్తారు. కొండాపై ఫిర్యాదుల ప‌రంప‌ర‌ను పార్టీ ఇంచార్జి న‌ట‌రాజ‌న్ ముందు ఉంచారు. ఆయ‌న వ‌ల్ల పార్టీలో …

Read More »

పొలిటిక‌ల్ డిబేట్‌: జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇస్తోందెవ‌రు?

జ‌గ‌న్ జ‌నంలోకి వ‌స్తున్నారు. కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోతున్నారు. ర‌ప్పా-ర‌ప్పా డైలాగులు పేలుస్తున్నారు. పోలీసుల‌ను కూడా హెచ్చ‌రిస్తున్నారు. అది పొదిలైనా.. రెంట‌పాళ్లైనా.. తాజాగా బంగారు పాళ్య‌మైనా. జ‌గ‌న్ దూకుడు ఎక్కువ‌గానే ఉంది. జ‌న స‌మీక‌ర‌ణ కూడా అలానే ఉంది. వీటిని నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఓ ప‌ట్టాన సాధ్యం కావ‌డంలేదు. అంతా అయిపోయాక‌.. స‌ర్కారు కేసులు పెట్టి మ‌రోరూపంలో బద్నాం అవుతోంది. ఈ క్ర‌మంలో అస‌లు జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఇస్తోందెవ‌రు? …

Read More »

మాధ‌వ్‌ది అదే అజెండా.. తేల్చేశారుగా!

ఏపీ బీజేపీ చీఫ్‌గా కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌.. పీవీఎన్ మాధ‌వ్‌.. త‌న అజెండాను చెప్ప‌క‌నే చెప్పారు. ప‌క్కా హిందూత్వ వాదిగా ఆయ‌న ముద్ర వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన వారిలో గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో సోము వీర్రాజు ఒక్క‌రే ఇలా హిందూత్వ అజెండాను ఫాలో అయ్యారు. అయితే.. మ‌ధ్య మ‌ధ్య ఆయ‌న కూడా ప‌ట్టువిడుపుల ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ.. సోము …

Read More »

ఆర్ఎస్ఎస్‌కు వందేళ్లు.. !

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాతృసంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్‌) స్థాపించి 99 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్నాయి. ఈ ఏడాది అక్టోబ‌రు 2 నాటికి ఆర్ఎస్ఎస్ ఏర్ప‌డి 99 ఏళ్లు పూర్తయి.. 100వ సంవ‌త్స‌రంలోకి సంస్థ అడుగు పెట్ట‌నుంది. ఈ నేప‌థ్యంలో దేశంలో హిందూత్వ‌కు మ‌రింత ప‌దును పెట్టేలా కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. దాదాపు ల‌క్ష‌కు పైగా స‌మావేశాలు నిర్వ‌హించేలా ప్లాన్ చేశారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ …

Read More »

చంద్ర‌బాబు మాస్టారికి అరుదైన గౌర‌వం.. ఏంటో తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా స్కూల్ మాస్టారి అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. దాదాపు 45 నిమిషాల‌కుపైగా ఆయ‌న 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సైన్సుపాఠం బోధించారు. వారిని ప్ర‌శ్న‌లు అడుగుతూ.. స‌మాధానాలు రాబ‌డుతూ.. పాఠ్య పుస్త‌కాన్ని ఫాలో అవుతూ.. విద్యార్థులకు ‘వ‌న‌రులు’ అనే పాఠాన్ని బోధించారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన ‘మెగా పేరెంట్స్‌-టీచ‌ర్స్’ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు ఇలా స్కూల్ మాస్ట‌ర్‌గా మారిపోయారు. అక్క‌డే మధ్యాహ్న భోజ‌నం …

Read More »

అరెస్టుకు రెడీ అంటోన్న ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి తాను ఎక్కడికి …

Read More »

ఏం సాధించిన‌ట్టు జ‌గ‌న్‌?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. చేప‌ట్టిన చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న ద్వారా ఆయ‌న ఏం సాధించిన‌ట్టు? రైతు లకు ఏమేర‌కు మేలు చేసిన‌ట్టు? ఇదీ.. ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు. నిజానికి మామిడి కొనుగోలు స‌మ‌స్య‌.. గ‌త రెండు నెల‌లుగా ఉంది. రైతులు ఇబ్బందులు ప‌డుతున్న మాటా వాస్త‌వ‌మే. నెల రోజుల కింద‌టే.. టీడీపీ అనుకూల మీడియా లోనే మామిడి రైతుల క‌ష్టాల‌పై క‌థ‌నాలు వ‌చ్చాయి. …

Read More »

ఓడిపోయిన దువ్వాడకు డబ్బులిచ్చిన చిరు

2019-24 మధ్య వైభవం చూసి.. గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూశాక బాగా అన్ పాపులర్ అయిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు తీవ్ర దుమారం రేపడంతో, పార్టీ నుంచి సస్పెండై రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు దువ్వాడ. అధికారంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన ఏ స్థాయిలో నోరు పారేసుకున్నారో తెలిసిందే. అలాంటి వ్యక్తి …

Read More »

జ‌గ‌న్ కుట్ర‌ల‌పై విచార‌ణ‌?

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ నాయ‌కులు, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న కుట్ర‌ల‌పై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్ర ల‌పై సీఎం చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంతో చ‌ర్చించారు. ఎంతో క‌ష్ట‌ప‌డి రాష్ట్రానికి పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని చెప్పారు. దీనికి తాను రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పారు. అయితే.. ఇంత క‌ష్ట‌ప‌డి కంపెనీల‌ను ఒప్పిస్తే.. పెట్టుబ‌డులు రాకుండా …

Read More »