Political News

‘శ్రీవారి ప్రసాదాలు తిని మాట్లాడండి జగన్, భారతి’

తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత తగ్గిపోయిందని, అన్న ప్రసాదాల్లో అసలు నాణ్యత కొరవడిందని వైసీపీ అధినేత జగన్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. భక్తులు శ్రీవారి ప్రసాదాలను ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తున్నారు. నాణ్యత బాగుందని కూడా చెబుతున్నారు. మీరు ఏనాడైనా తిరుమలకు వచ్చారా? నిత్యాన్నదాన సత్రంలో కూర్చుని తిరుమల శ్రీవారి ప్రసాదాలు తీసుకున్నారా? చెప్పండి. ఇప్పుడు చెబుతున్నా, జగన్, భారతి లు స్వయంగా తిరుమలకు రండి. …

Read More »

దువ్వాడ రీఎంట్రి!… మడతెట్టేస్తారట!

దువ్వాడ శ్రీనివాస్… ఈ పేరుకు పెద్దగా పరిచయమే అక్కర్లేదు. తెలుగు ప్రజల కళ్ల ముందు నుదుటన నిలువు బొట్టు పెట్టి నిత్యం ఓ పోరాట యోధుడిలా కనిపిస్తూ ఉంటారు. మరో పార్శ్వంలో నుంచి చూస్తే… రెండో పెళ్లాం దివ్వెల మాధురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతూ తెగ హల్ చల్ చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా విపక్ష వైసీపీలో కొనసాగిన దువ్వాడ తన వ్యవహార సరళి …

Read More »

అమిత్ షాపై చిత్తు కాగితాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాలు అత్యంత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. అధికార పక్షంపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ విపక్షాలు నానా రచ్చ చేశాయి. అందులో భాగంగా ఒకానొక సమయంలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విపక్షాల సభ్యులు ఆయ బిల్లుల ప్రతులను చించివేసి… ఆ చిత్తు కాగితాలను ఆయన మీదకే విసిరిపారేశారు. ఈ ఘటనతో …

Read More »

బాబును ప్రశాంతంగా ఉండనివ్వరా…?

అరె… అసలే ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన నవ్యాంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేందుకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అహరహం శ్రమిస్తున్నారు. ఇక రాజధాని లేదన్న రాష్ట్రంగా ఏపీ ఇకపై పిలబడకుండా ఉండేలా…ఈ ఐదేళ్లలోనే రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మరోవైపు కసరత్తు చేస్తున్నారు. అంతేనా.. ఏపీలో కూటమి రథసాథిగా ఉన్న బాబు…మూడు పార్టీల మధ్య ఎక్కడ కూడా సమన్వయం కొరవడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎన్డీఏలో టీడీపీ …

Read More »

మరి అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారు గా

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు రాజకీయ వర్గాల్లోనే కాక దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. కనీసం ఐదేళ్ల శిక్షకు గురయ్యే నేరారోపణలపై అరెస్టయి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు తమ పదవిని ఆటోమేటిక్‌గా కోల్పోవాలని ఇందులో ప్రతిపాదించారు. 31వ రోజు నుంచే ఆ నిబంధన అమల్లోకి వస్తుందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజీనామా చేయకపోయినా ఈ చట్టం ప్రకారం వారి …

Read More »

తాడిప‌త్రికి రాలేరు: పెద్దారెడ్డికి పెద్ద టెన్ష‌న్‌

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. అధికారంలో ఉన్న‌ప్పుడు విర్ర‌వీగితే.. ప‌రిస్థితి ఇలానే ఉంటుంది. అలా కాకుండా.. అధికారంలో ఉన్న‌ప్పుడు అంద‌రినీ క‌లుపుకొని పోతే అంద‌రూ మంచోళ్ల‌వుతారు. ఈ విష‌యం తెలిసి కూడా.. వైసీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరి కోరి త‌న వ్య‌వ‌హారాన్ని కొరివితో అంటించుకున్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించారు. వైసీపీ హ‌యాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో టీడీపీకి చెందిన …

Read More »

వైసీపీ ఎఫెక్ట్‌:’వ్యూహం’ సినిమా నిర్మాత అరెస్టు..

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో చేసిన ప‌నుల‌కు.. వెలుగులోకి వ‌చ్చిన అక్ర‌మాల‌కు.. ఇప్పుడు చాలా మంది నాయ‌కులు, ప్ర‌ముఖులు కూడా బ‌ల‌వుతున్నారు. తాజాగా ‘వ్యూహం’ సినిమా నిర్మాత‌.. దాస‌రి కిర‌ణ్‌ను విజ‌య‌వాడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆయ‌న నివాసానికి వెళ్లిన పోలీసులు.. కిర‌ణ్‌ను కొద్ది సేపు ప్ర‌శ్నించారు. అనంత‌రం ఆయ‌న‌ను అరెస్టు చేస్తున్నట్టు ప్ర‌క‌టించి.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు. వ్యూహం సినిమాకు ఏపీ ఫైబ‌ర్ నెట్ …

Read More »

మా మంచి మంత్రి: చంద్రబాబు మార్కులు వేశారు..!

చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మహిళా మంత్రుల్లో ఒకరి వ్యవహారం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలో ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ మంత్రిగా మంచి మార్కులు వేసుకుంటున్నారని ఇటు పార్టీ వర్గాల్లోను, అటు సీఎం స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సంజీవరెడ్డి గారి సవిత ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. వీరిలో వయసు పరంగా చూసుకుంటే సంజీవరెడ్డి గారి సవిత కొంచెం ఎక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ఆమె నిరంతరం …

Read More »

లోకేశ్ సత్తా.. ఏపీ విద్యకు కేంద్రం అదనపు నిధులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన సత్తా నిరూపించుకున్న నారా లోకేశ్ ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వ పాలనలోనూ తనదైన శైలి దూకుడుతో సాగుతున్నారు. ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఏ ఒక్క మంత్రికి గానీ సాధ్యం కాని రీతిలో కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరీ కేటాయించిన నిధుల కంటే కూడా అదనపు నిధులను సాధిస్తున్నారు. అది కూడా ఏదో పంచాయతీ రాజ్ లాంటి శాఖకు కాదు. విద్యా శాఖకు లోకేశ్ …

Read More »

కీలక బిల్లుకు కేంద్రం రెడీ… నేతల్లో వణుకు

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టి, వాటికి ఆమోదం కూడా సాధించింది. తాజాగా బుధవారం కేంద్రం తీసుకురానున్న ఓ బిల్లు గురించి తెలిసిన వెంటనే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి విపక్ష పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. ఆ పార్టీల నేతల్లో వణుకు మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగంలోని 130 అధికరణకు సవరణ బిల్లు పేరిట కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే… …

Read More »

షాకింగ్‌: ఢిల్లీ ముఖ్య‌మంత్రిపై దాడి?

దేశ రాజ‌ధాని ప్రాంతం ఢిల్లీలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఢిల్లీ మ‌హిళా ముఖ్య‌మంత్రి రేఖా గుప్తాపై ఓ వ్య‌క్తి ముఖ్య‌మంత్రి నివాసంలోనే ఆమెపై అత్యంత స‌మీపం నుంచి దాడి చేశాడు. దీంతో ఒక్క‌సారిగా ఢిల్లీలో అల‌జ‌డి రేగింది. ఈ ఘ‌ట‌న‌తో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సీఎం రేఖా గుప్తా.. ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌ను తాను ఊహించ‌లేద‌న్నారు. సుదీర్ఘ‌కాలంగా తాను రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని.. వ్య‌క్తిగ‌త దాడ‌ల‌కు వ్య‌తిరేక‌మ‌నిపేర్కొన్నారు. …

Read More »

రేవంత్ స్వచ్ఛమైన అభ్యర్థనకు స్పందన ఎంత?

దేశ రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు సంకటంగా మారిందని చెప్పక తప్పదు. ఎందుకంటే…ఓ వైపు కేంద్రంలో అధికార ఎన్డీఏతో ఏపీలోని కీలక పార్టీలు పొత్తులో ఉన్నాయి. తెలంగాణ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అంటే వ్యతిరేకతతో ఏ నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఓ స్వచ్ఛమైన, క్లియర్ కట్ అభ్యర్థన …

Read More »