ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో ఒక పోస్ట్తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన!” అంటూ ఆసక్తి రేకెత్తించారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఈ …
Read More »జూబ్లీహిల్స్ రిసల్ట్: అంత మాట అనేశారేంటి కవిత?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుపై తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ఈ బైపోల్ను చాలా సీరియస్గా తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా, బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఉప ఎన్నిక ఫలితంపై …
Read More »ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరబోతుంది
రాష్ట్రంలో సొంతిల్లులేని ప్రతి పేద కుటుంబాన్నీ ఆదుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. 2029 నాటికి.. రాష్ట్రంలో ఉన్న పేదలను గుర్తించి.. వారికి సొంతగా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను స్వయంగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని చిన మండెం అనే గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 3 లక్షల 192 ఇళ్లను పేదలకు ఆయన …
Read More »బహిరంగంగా వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాశ్
ఏపీ కేడర్కు చెందిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ తాజాగా ఇన్ స్టా గ్రామ్లో ఓ పోస్టు చేశారు. దీనికి ఆయన పెట్టిన టైటిల్ `పబ్లిక్ అపాలజీ`(బహిరంగ క్షమాపణ). ఈ సందర్భంగా ఆయన మాజీ ఐపీఎస్ ఏబీవీ వెంకటేశ్వరరావు, మాజీఐఏఎస్ జాస్తి కృష్ణ కిషోర్లకు క్షమాపణలు చెప్పారు. వైసీపీ హయాంలో వారిని వేధించారన్న వాదన ఉంది. అంతేకాదు.. ఉద్దేశ పూర్వకంగా వారిపై కేసులు పెట్టారన్న చర్చ సాగింది. దీనివెనుక …
Read More »జాగృతితో పెట్టుకుంటే జాగ్రత్త: కవిత వార్నింగ్ వాళ్ళకేనా?
`తెలంగాణ జాగృతి` అధ్యక్షురాలు.. మాజీ ఎంపీ కవిత అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు మంచివేనని.. కానీ, హద్దు మీరి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. “నేను ఒక్కరి నేనన్న భావన మీకు ఉండొచ్చు. కానీ, నా యాత్రలకు వస్తున్న జనాలను చూడండి. ఈ తెలంగాణ సమాజాన్నిచూడండి.“ అని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా …
Read More »ఎప్పుడూ కామ్ గా ఉండే మంత్రి నిమ్మల ఈసారి సీరియస్!
మంత్రి నిమ్మల రామానాయుడుకు సౌమ్యుడు అన్న పేరుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు, కాంట్రవర్సీలకు ఆయన దూరంగా ఉంటారు. వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వారిని ఇరకాటంటో పెడుతుంటారు. అధికారులపై కూడా ఆయన ఎప్పుడూ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అయితే, తొలిసారిగా విద్యుత్ శాఖ అధికారులు నిమ్మలకు చిరాకు తెప్పించారు. దీంతో, ఎప్పుడూ కామ్ గా ఉంటే నిమ్మల అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ …
Read More »బీహార్ ఎఫెక్ట్: రాహుల్ గ్రాఫ్ విచ్ఛిన్నమే!
బీహార్లో జరిగిన రెండు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రజల నాడి ఇదేనంటూ కొన్ని సర్వేలు కూడా వెలుగుచూశాయి. అయితే ఏ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్కు పెద్దగా మార్కులు వేయలేదు. అంతేకాదు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందనিও పేర్కొన్నాయి. అది కూడా భారీ మెజారిటీ దక్కించుకుంటుందనని కొన్ని సర్వేలు గణాంకాలతో వివరించాయి. సర్వేల మాట …
Read More »నారా ఫ్యామిలీ.. ఇంటి ముఖం చూడట్లేదా..!
టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఇంటి ముఖం చూసి వారం రోజులు అయిందట. ఈ వారం రోజులుగా వారు ప్రజల మధ్యే ఉంటున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అయితే వారం కాదు, పది రోజులుగా ఇంటి ముఖం చూడలేదని అంటున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, విదేశాల్లో ఉంటే తప్ప ఏపీలో ఉన్నప్పుడు వారాంతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు …
Read More »కల్తీ రాజకీయం ఎవరిది..?
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానిపై ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించారు. “పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయం చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు …
Read More »పీకే దెబ్బ.. కాంగ్రెస్ కూటమి బెంబేలు: సర్వేలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని, మార్పు దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ప్రకటించిన రాజకీయ వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ (జెఎస్పీ) అధినేత ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పీకే పెద్దగా సత్తా చూపలేకపోయారని సర్వేలు చెబుతున్నాయి. రెండు దశల పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు బీహార్లో ఎవరికీ ప్రజలు పట్టం కట్టారన్న విషయాన్ని ప్రస్తావించాయి. ముఖ్యంగా 148 స్థానాల్లో నేరుగా అభ్యర్థులను దింపి, ‘మార్పుకోసం ఓటు’ నినాదాన్ని …
Read More »నారా లోకేష్ గ్రాఫ్: పేపర్ కటింగ్ సేకరించిన మోడీ టీమ్?
అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో నారా లోకేష్ గ్రాఫ్ పుంజుకుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు.. జాతీయ మీడియా ఆయన కోసం వేచి ఉండడం గమనార్హం. ఈ పరిణామం అసాధారణం. ఎంతో ఇమేజ్ ఉంటే తప్ప.. జాతీయ మీడియా.. అందునా.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో వేచి ఉండడం అరుదుగానే సంభవిస్తుంది. దీనిని బట్టి జాతీయ …
Read More »కొన్ని గంటలు.. మూడు ఆలయాలు… 165 కోట్ల విరాళం
ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్మ్యాన్, రిచెస్ట్ మ్యాన్ ఎవ్వరు అంటే తడుముకోకుండా ముకేశ్ అంబాని పేరు చెప్పేస్తారు ఎవ్వరైనా. ధీరూబాయి అంబానీ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయన పెద్ద కొడుకైన ముకేశ్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లారు. లక్షల కోట్లకు అధిపతిగా కొనసాగుతున్నారు. తమ్ముడు అనిల్ అంబానీ ఒక ఫెయిల్యూర్ బిజినెస్మ్యాన్గా పేరు తెచ్చుకుని అప్రతిష్ట పాలైతే.. ముకేశ్ మాత్రం ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు సైతం పెద్ద ఎత్తునే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates