రాజకీయాల్లో విధేయులకు పదవులు ఇవ్వడం కొత్తకాదు. పార్టీ పట్ల, పార్టీ అధినేతల పట్ల విధేయంగా ఉన్న నాయకులకు పదవులు అలవోకగా వరిస్తుంటాయి. ప్రస్తుతం ఏపీ అధికార పార్టీలలో కీలకమైన జనసేనలోనూ.. ఇదే తరహాలో పదవులు వస్తున్నాయి. పార్టీలో నమ్మకంగా ఉంటూ.. గత ఎన్నికల్లో విజయానికి కారణమైన రామ్ తాళ్లూరికి.. పవన్ కల్యాణ్.. కీలక పదవిని అప్పగించారు. పార్టీ సంస్థాగత, అభివృద్ధి వ్యవహారాలను ఆయన చేతిలో పెట్టారు. ఈ నేపథ్యంలోనే జనసేన …
Read More »చంద్రబాబుకే మేధావి వర్గం మద్దతు.. కారణం ఏమిటి?
రాష్ట్రంలోని మేధావి వర్గం అంతా కూడా సీఎం చంద్రబాబు వైపు నిలబడిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అనేకమంది మేధావులు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ఛానెల్లు, యూట్యూబ్ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించారు. అదేవిధంగా కూటమి నేతలకు అనుకూలంగా కామెంట్లు చేశారు. ప్రజలను ఒకరకంగా మొబిలైజ్ చేయడంలో మేధావి వర్గం పాత్ర కూడా ఉందని అంటారు. గత …
Read More »పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ నిజంగానే దూరం పెడుతున్నాడా?
ఏపీలో 2019 నుంచి 2024 వరకు అధికారం చెలాయించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా 151 సీట్ట నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఫలితంగా అప్పటిదాకా బలీయంగా కనిపించిన వైసీపీ.. అత్యంత బలహీన పార్టీగా గోచరించడం మొదలైంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకునేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఏ ఒక్కరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే… పార్టీలో బలమైన కుటుంబంగా కనిపిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఏకంగా పార్టీ …
Read More »బాబా మజాకా: సంక్షేమానికి పోలిక పెట్టి.. వైసీపీని ఏకేశారుగా!
సీఎం చంద్రబాబు అంటేనే మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్నారు. ఏ విషయాన్నయినా అలవోకగా స్పృశించే సీఎం చంద్రబాబు.. తాజాగా విజయనగరం జిల్లాలో పర్యటించి.. గత 15 మాసాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గుక్క తిప్పుకోకుండా వివరించారు. అంతేకాదు.. ఇదేసమయంలో ఆయన వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలకు, ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమానికి పోలిక పెడుతూ.. ఏకేశారు. ఈ క్రమంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను …
Read More »టీ – స్థానికంలో టీడీపీ రోల్ ఏంటి?
ఏపీ అధికార పార్టీ.. టీడీపీ వ్యూహం ఏంటో తెలియక తెలంగాణలో ఎదురు చూస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు లబోదిబోమంటున్నారు. చాలా మంది పార్టీలు మారినా, కొందరు అత్యంత నమ్మకంతో, అన్నగారి హయాం నుంచి ఉన్న కుటుంబాలు కూడా పార్టీలో కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో పార్టీని విస్తరించాలని భావించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ అనూహ్యంగా మౌనం పాటిస్తోంది. దీంతో అసలు తెలంగాణలో పార్టీ విస్తరిస్తారా లేదా అనేది సందేహం వ్యక్తమవుతున్న …
Read More »‘జూబ్లీహిల్స్’పై నివేదికలు.. అసలు స్ట్రాటజీ ఇదేనా?
హైదరాబాద్లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్. దీనికి త్వరలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ సందడి కొన్నాళ్ల కిందటే ప్రారంభమైంది. అయితే, ఎన్నికల ప్రక్రియ చేరువ అవుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ సందడిమరింత దుమ్మురేపనుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించడంతోపాటు, గల్లీ గల్లీకి బీఆర్ఎస్ నినాదంలో ప్రచారాన్ని కూడా ప్రారంభించనుంది. అంతేకాదు, ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా విజయం దక్కించుకోవాలి, సెంటిమెంటును ఎలా …
Read More »సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారా??
ఏపీ ప్రభుత్వంపై నిత్యం సోషల్ మీడియాలో విషం కక్కుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఐదుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా చెడుగా చూపిస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఒకానొక దశలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ …
Read More »కమ్యూనిస్టు కోటలో కాంగ్రెస్ పాగా వేసిన… దామన్న కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉరఫ్ దామన్న కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గాల్లో దామోదర్రెడ్డి మంత్రిగా పనిచేశారు. పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఆసాంతం.. కాంగ్రెస్ నేతగానే జీవించారు. ఒకానొక దశలో ఇతర పార్టీల నుంచి పిలుపు …
Read More »`గూగుల్`కు అడ్డు పడుతోందెవరు: చంద్రబాబు ఆరా
ఏపీలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కూటమి ప్రభుత్వానికి వైసీపీ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా అడ్డు పడుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. “వారు పెట్టుబడులు తీసుకురాలేదు. ఇప్పుడు తెస్తుంటే అడ్డుపడుతున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితిలోనూ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే“ అని సీఎం తేల్చి చెప్పారు. విశాఖపట్నంలో ప్రపంచ ప్రఖ్యాత డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం …
Read More »వార్నింగ్ లతో పని మొదలెట్టిన కొత్త సీపీ సజ్జన్నార్
తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిపోయిన వీసీ సజ్జన్నారి్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తానేం చేయాలనుకుంటున్న విషయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా నేరగాళ్లకు వార్నింగ్ లు ఇచ్చిన సజ్జన్నార్… డ్రంకన్ డ్రైవింగ్ ను మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను …
Read More »అటు తండ్రి-ఇటు కొడుకు.. దుమ్మురేపేసిన నారా ఫ్యామిలీ!
ఒకే రోజు.. ఢిల్లీలో పర్యటనలు. అయితేనేం.. ఇద్దరి దృష్టీ ఏపీపైనే. ఏపీలో పెట్టుబడులపైనే. క్షణం తీరిక లేకుండా పారిశ్రామిక వేత్తలతో భేటీలు.. పెట్టుబడుల కోసం వేటలు.. ఇదీ.. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమాడు, మంత్రి నారా లోకేష్ మంగళవారం ఢిల్లీలో వ్యవహరించిన తీరు. ఏ చిన్న గ్యాప్ వచ్చినా.. వెంటనే ఏపీలో పరిణామాలపై ఆరా. ఆ వెంటనే చర్యలకు ఆదేశం. తొలిసారి సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి …
Read More »మీరు కనీవినీ ఎరుగని అమరావతిని నిర్మిస్తాం: చంద్రబాబు
“మీరెవరూ ఇంతకు ముందు చూడని, కనీవినీ ఎరుగని రీతిలో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం. 2028 నాటికితొలి దశ నిర్మాణాలను పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాం. అద్భుతమైన నిర్మాణాలే కాదు.. ప్రపంచస్థాయి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదొక అద్భుత నగరంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో దేశంలోని ప్రముఖ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates