Political News

మా మంచి మ‌హిళా నేత‌.. ఈసారి మంత్రి పోస్టు ఖాయం?

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన వారిలో చాలా మంది మ‌హిళా నాయ‌కులు ఉన్నారు. వీరిలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు కూడా ఉన్నారు. అయితే.. ఎంత మంది ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు? ఎంత మంది సీఎం చంద్ర‌బాబు దృష్టిలో ఉన్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇలా చూసుకుంటే.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నందిగామ నియోజ‌వ‌ర్గం ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో తంగిరాల సౌమ్య విజ‌యం …

Read More »

గుడివాడలో హై టెన్షన్..వైసీపీ వర్సెస్ టీడీపీ

గుడివాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ లో వైసీపీ నేతల సమావేశం జరిగింది. మరోపక్క గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు బ్యానర్లు ఏర్పాటు చేయగా…అందుకు ప్రతిగా గుడివాడ గడ్డ రామన్న అడ్డా అంటూ టీడీపీ …

Read More »

మాట నిలబెట్టుకున్న పవన్ అన్నియ్య

ఏపీలోని గిరిజన ప్రాంతాలలో ప్రజలకు అనారోగ్యం వస్తే చాలు గుండెల్లో గుబులు మొదలవుతుంది. అడవులు, కొండలు, వాగులు, వంకలు, డొంకలు దాటుకుంటూ డోలీలో రోగిని మోసుకు పోవాలన్న ఆలోచన వస్తే చాలు వారు వణికిపోతుంటారు. ఇక, గర్భిణుల పరిస్థితి అయితే అగమ్య గోచరం. డోలీలో మోసుకుపోతున్న సమయంలోనే వారు అనుభవించే ప్రసవ వేదన వర్ణనాతీతం. దశాబ్దాలుగా ఆదివాసీలు, గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాలలోని ప్రజలు పడుతున్న అవస్థలు చూసిన పవన్ కల్యాణ్ …

Read More »

పాపం వెంటాడ‌డ‌మంటే ఇదే క‌దా.. కాకాణీ?!

చేసిన పాపం ఊరికే పోదంటారు పెద్ద‌లు. క‌ళ్ల‌ ముందు క‌నిపిస్తున్న కొన్ని విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా. రాజ‌కీయాల్లో ఎప్పుడు చేసిన పాపం.. అప్పుడే పేరుకుని.. అనంత‌ర కాలంలో అనుభ‌వించేలా చేస్తోంద‌ని కూడా చెబుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయ‌న‌ను క‌స్టడీకి తీసుకుని విచారించ‌నున్నారు. గ‌నుల కేసులో నెల్లూరు …

Read More »

ర‌ప్పా ర‌ప్పా ను వదలలేకపోతున్న వైసీపీ

ప్ర‌జ‌ల‌కు చేరువయ్యేందుకు.. చాలా మార్గాలే ఉన్నాయి. వారి క‌ష్టాలు తెలుసుకోవ‌చ్చు. వారి త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌వ‌చ్చు. ప్ర‌భుత్వంపై పోరాటం చేయొచ్చు. నిరంతరం ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ డం ద్వారా కూడాప్ర‌జ‌ల‌కు చేరువ కావొచ్చు. కానీ.. వైసీపీ మాస్ పాలిటిక్స్ ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్ నాయ‌కుల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు కూడా.. మాస్ ఎలివేష‌న్ కోరుకుంటున్నారు. అయితే.. ఇది వైసీపీకి ఏమేర‌కు మేలు చేస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. ప్ర‌జ‌ల్లో మాస్ పాలిటిక్స్‌ను …

Read More »

జనసేన మహిళా నేతపై వేటు వేసిన పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని మరోసారి నిరూపించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డ నేతలపై వేటు తప్పదని పవన్ గతంలో చాలాసార్లు హెచ్చరించారు. జనసేన నేతలు నిబద్ధతగా ఉంటూ జనసైనికులు, ప్రజలకు ఆదర్శప్రాయంగా వ్యవహరించాలని..లేని పక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి వెనుకాడనని పవన్ ఎన్నోసార్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరు …

Read More »

ఆర్టీసీ ఎఫెక్ట్‌: వైసీపీకి డ్యామేజీ.. టీడీపీకి క‌వ‌రేజీ!

ఏపీలో ఆగ‌స్టు 15 నుంచి ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అందించేందుకు ప్ర‌భుత్వం రంగం రెడీ చేసింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ దీనిని అమ‌లు చేసి తీరుతామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణంఒక‌టి. అయితే.. దీనిపై అనేక అధ్య‌య‌నాలు చేసిన త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు దీనిని ప్రారంభించేందుకు రెడీ అయింది. దీనిపై మ‌హిళ‌లు హ‌ర్షం వ్య‌క్తంచేస్తున్నారు. …

Read More »

తండ్రి త‌గ్గ త‌న‌యుడు: ఆ టీడీపీ ఎమ్మెల్యే క‌థేంటంటే..!

తండ్రి వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన యువ నాయ‌కుల్లో కొంద‌రు చాలా దూకుడుగా పని చేస్తున్నా రు. మ‌రికొంద‌రు.. మంద‌గ‌మ‌నంతో ముందుకు సాగుతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం ఇంకా తండ్రి చాటు బిడ్డ‌ల్లానే ఉండిపోతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం తండ్రి పేరు నిల‌బెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి వారిలో ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కీల‌కంగా మారారు. సుదీర్థ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న కేఈ కుటుంబం నుంచి వార‌సుడిగా ఆయ‌న రంగ …

Read More »

పొలిటిక‌ల్ ఎఫెక్ట్‌: ఫైర్‌బ్రాండ్లు కావ‌లెను..!

ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్లు త‌గ్గుతున్నారా? అయితే.. రెచ్చిపోవ‌డం.. లేక‌పోతే తెర‌చాటు కావ‌డంతో ఫైర్ బ్రాండ్ల కొర‌త వెంటాడుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా వైసీపీలో ఒక‌ప్పుడు కొడాలి నాని, రోజా, గుడివాడ అమ‌ర్నాథ్‌, అంబ‌టి రాంబాబు, అనిల్‌కుమార్‌యాద‌వ్ వంటి ప‌లువురు నాయ‌కులు ఫైర్‌బ్రాండ్లుగా చ‌లామ‌ణి అయ్యారు. అయితే.. త‌ర్వాత కాలంలో అధికారం కోల్పోయాక‌.. వారిలో దాదాపు అంద‌రూ తెర‌మ‌రుగ‌య్యారు. ఇక‌, టీడీపీలోనూ ఒక‌ప్పుడు ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. …

Read More »

మోడీకి ఎర్త్ త‌ప్ప‌దా.. ఆర్ ఎస్ ఎస్ దూకుడు!

గుజ‌రాత్‌కు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా, దేశానికి మూడు సార్లు ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌రేంద్ర మోడీకి.. ఈ ఏడాది సెప్టెంబ‌రులో ఆ ప‌ద‌విని వ‌దులుకోక త‌ప్ప‌దా? వ‌య‌సు రీత్యా ఏర్ప‌డిన నిబంధ‌న‌ల‌ను ఆయ‌న‌కు మిన‌హాయింపు ఇచ్చే అవ కాశం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నాయి బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌) వ‌ర్గాలు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్‌భ‌గ‌వ‌త్‌.. ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని …

Read More »

గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి చంద్ర‌బాబు..

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న ప‌రిణామాల ను చ‌ర్చించేందుకు.. ఆయ‌న వెళ్లార‌ని సీఎంవో వ‌ర్గాల చెబుతున్నాయి. రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌లు, విప‌క్ష నేత జ‌గ‌న్ వ్య‌వ‌హారం .. స‌హా అమ‌రావ‌తి రాజ‌ధానిలో నిర్మాణాలు.. అద‌న‌పు భూ స‌మీక‌ర‌ణ వంటి వాటిపై గ‌వర్న‌ర్‌తో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. అయి తే.. వీటితోపాటు.. కీల‌క‌మైన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పైనే ప్ర‌ధానంగా చంద్ర‌బాబు …

Read More »

వ్యాపారానికి హిందీ కావాలి.. నేర్చుకోవ‌డానికి వ‌ద్దా?

‘హిందీ’ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దుతున్నార‌న్న వ్యాఖ్య‌లు.. తెలంగాణ‌, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లో జ‌రుగుతున్న పెద్ద పెద్ద రాజ‌కీయ వివాదాలు అంద‌రికీ తెలిసిందే. త్రిభాషా సూత్రంగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన హిందీ విష‌యం పై ప‌లు రాష్ట్రాల్లో వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌హారాష్ట్రంలో బీజేపీ స‌ర్కారే ఉంది. కానీ, స్థానిక మ‌రాఠాకు పెద్ద‌పీట వేసే ప్ర‌జ‌లు ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ త్రిభాషా మంత్రం ప‌ఠించ లేక పోయారు. తొలుత హిందీపై కీల‌క …

Read More »