లెజెండరీ నటి జయసుధ నట వారసత్వాన్ని అందుకుంటూ సినిమాల్లోకి అడుగు పెట్టారు ఆమె తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్. ఐతే వీరిలో శ్రేయాన్ హీరోగా ‘బస్తీ’ అనే ఒక సినిమా చేసి తెరమరుగు అయ్యాడు. నిహార్ మాత్రం నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్తో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’లో అతను ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్ర తాను …
Read More »వారంతా కలెక్షన్ కింగ్లు: జగన్
రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై తరచుగా విమర్శలు గుప్పిస్తున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసులు కలెక్షన్ కింగ్లుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. గతంలో డీఐజీ స్థాయి అధికారులు కలెక్షన్ కింగులుగా మారారన్న జగన్.. తాజాగా కానిస్టేబుల్ నుంచి హోం గార్డు వరకు కూడా అందరూ కలెక్షన్ ఏజెంట్లుగా, కింగులుగా మారారని అన్నారు. ఈ సొమ్మును కీలక నాయకుడు, ఆయన కుమారుడికి చేరవేస్తున్నారని చెప్పారు. ఇక, మద్యం …
Read More »మోడీ పొదుపు.. విదేశీ పర్యటనకు ఎన్ని కోట్లో తెల్పిన కేంద్రం!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చు.. 370 కోట్ల పైచిలుకుగా ఉందని.. కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చౌధరి.. లోక్సభకు లిఖిత పూర్వకంగా వివరించారు. ఇది.. గత ఐదేళ్లకు సంబంధించిన ఖర్చు అని ఆయన తెలిపారు. 2021-25(మార్చి 31) వరకు చేసిన ఖర్చుగాఆయన పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో మొత్తం 33 దేశాలకు ప్రధాని వెళ్లారని తెలిపారు. ఆయా దేశాల్లో …
Read More »`సరస్వతి` షేర్ల బదిలీ నిలిపివేత: జగన్కు ఊరట, షర్మిలకు షాక్
వైసీపీ అధినేత జగన్ ఫ్యామిలీ ప్యాక్ వివాదంలో కీలకమైన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో హైదరాబాద్లోని కంపెనీ లా ట్రైబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. ఈ కంపెనీలోని షేర్లను ట్రాన్స్ ఫర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. గతంలో తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేసింది. ఈ మేరకు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ పరిణామం.. జగన్కు ఊరటనివ్వగా.. షర్మిల, విజయమ్మలకు ఒకింత షాక్ అనే చెబుతున్నారు న్యాయనిపుణులు. ఏంటీ …
Read More »ఉత్తమ్పై కోమటిరెడ్డి ఆగ్రహం… కార్యక్రమానికి డుమ్మా!
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిర్రెత్తు కొచ్చింది. మమ్మల్ని 9గంటలకే రమ్మని.. పదే పదే చెప్పి.. 10గంటలకు మీరు వస్తారా? అంటూ.. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి కార్యక్రమానికి హాజరు కావాల్సిన కోమటిరెడ్డి సదరు కార్యక్రమానికి ఏకంగా డుమ్మా కొట్టారు. దీంతో ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. మరో వైపు.. కోమటిరెడ్డి లేకుండానే.. మంత్రి ఉత్తమ్ …
Read More »అక్కడా `అదే` ప్రశ్న.. చంద్రబాబు ఏం చెప్పారంటే!
సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెట్టుబడులు.. అమరావతి నిర్మాణంపై అక్కడి పారిశ్రామిక వేత్తలకు అనేక విషయాలు వెల్లడించారు. సోమవారం రాత్రి `ఏపీ-సింగపూర్` బిజినెస్ ఫోరం, సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించారు. దీనిలో చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు ఏపీ అభివృద్ధి, అమరావతి రాజధాని నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ, సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. స్టార్టప్ల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని పిలుపునిచ్చారు. తొలుత ఆయన.. …
Read More »మీ పనితీరు అద్భుతం: బాబుకు సింగపూర్ మంత్రి ప్రశంసలు
సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు.. అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి ఆ దేశ మంత్రుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. “మీ నైపుణ్యాలు మాకు అవసరం. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు“ అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ మాత్రం.. “మీ పనితీరు అద్భుతం. మీ నుంచి పనితీరును నేర్చుకోవాలి.“ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్.. సీఎం చంద్రబాబు …
Read More »మాధవ్ రాజకీయం.. బీజేపీకి ఆ వర్గాలు దూరం..!
బీజేపీ ఏపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ వ్యవహార శైలి కాపురానికి వచ్చిన కొత్తలోనే అన్న సామెతను గుర్తు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో పనిచేసిన ఇద్దరు కీలక నాయకులు అందరినీ కలుపుకొని పోయారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా, సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్, బీజేపీతో పెద్దగా సంబంధం లేదని దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. దీంతో …
Read More »కేటీఆర్ కు చెప్పే వారే లేరా?
రంగం ఏదైనా సరే.. కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకు రాజకీయాలు మినహాయింపు కాదు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగతంగా ఉండే పరిచయాలు.. పార్టీలకు అతీతంగా బంధాలు.. అనుబంధాలు కామన్. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకున్న వ్యక్తిగత సంబంధాల్ని దెబ్బ తీసుకునే రీతిలో ఏ ముఖ్యనేత వ్యవహరించరు. ఈ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తూ.. కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు కేటీఆర్. ఇలాంటి తీరుతో ఆయన పొందే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే …
Read More »కార్యకర్తల సెంట్రిక్గా వైసీపీ బిగ్ స్ట్రాటజీ!
వైసీపీ అధినేత జగన్.. కార్యకర్తల సెంట్రిక్గా రాజకీయాలను ముమ్మరం చేస్తున్నారు. గత 2014, 2019 ఎన్నికల సమయంలో తానే అన్నీ అయి రాజకీయాలు చేసుకున్నారు. తన కుటుంబం కూడా వెంట నడిచింది. అమ్మ, చెల్లి.. ఇద్దరూ కూడా రాజకీయాలకు దోహదపడ్డారు. అయితే.. ఇప్పుడు వారిద్దరూ కూడా దూరమయ్యారు. పైగా చెల్లి రాజకీయాలు యాంటీగా మారాయి. దీంతో జగన్కు ఇప్పుడు ఆదరువుగా ఉన్న కుటుంబ సభ్యులు, నాయకులు కూడా ఎవరూ కనిపించడం …
Read More »కేటీఆర్ వర్సెస్ రమేష్: రేవంత్ స్పందించాలా? వద్దా?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్కు, బీజేపీ ఏపీ నేత, ఎంపీ సీఎం రమేష్కు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంట్రాక్టులను ఏపీ వారు దోచుకుంటున్నారని.. ఇందుకేనా తెలంగాణ సాధించింది.. అని కేటీఆర్ విమర్శించారు. దీనిలో సీఎం రేవంత్ పేరును కూడా తీసుకువచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్నారని.. దీనికి ప్రతిఫలంగానే ఫ్యూచర్ సిటీలో …
Read More »ఢిల్లీకి జగన్.. ఎందుకు?!
వైసీపీ అధినేత జగన్.. ఢిల్లీకి వెళ్తున్నారా? కేంద్రంలోని పెద్దలతో ఆయన భేటీ అవుతున్నారా? అంటే.. జగన్ నివాసం తాడేపల్లి వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఆదివారం, లేదా సోమవారంలో జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని అంటున్నారు. బీజేపీ పెద్దలను ఆయన కలుసుకునే అవకాశం ఉందని అంటు న్నారు. అదేవిధంగా ఇండియా కూటమి పార్టీల నాయకులతోనూ జగన్ భేటీ కానున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలవాలని వారిని కోరే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates