Political News

టీఆర్ఎస్ లో మొదటి వికెట్ పడిందా ?

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఖాతాలో టీఆర్ఎస్ మొదటి వికెట్ పడిందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఇబ్రహింపట్నం ఎంఎల్ఏ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం విచారణకు పిలిపించిన ఉన్నతాధికారులు సుమారు తొమ్మిది గంటలపాటు విచారించారు. కొద్దిరోజుల క్రితం క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ విదేశాల్లో క్యాసినో ఆడేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి …

Read More »

మూడు రాజ‌ధానులు కాదు.. ఏపీని మూడు రాష్ట్రాలు చేయండి: జ‌గ్గారెడ్డి

ఏపీ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. త‌న విమ‌ర్శ‌ల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. సోమ‌వారం.. ఆయ‌న హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంపై తీవ్రంగా స్పందించారు. సీఎం జ‌గ‌న్‌..అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా.. ఫ్యాక్ష‌న్ అల‌వాట్లు నిర్ణ‌యాలు మార్చుకోవ‌డం లేద‌ని.. దుయ్య‌బ‌ట్టారు. పేరు మార్పు స‌రికాద‌న్నారు. రేపు వ‌చ్చే ప్ర‌భుత్వం.. వైఎస్ పేరు తీసేస్తే.. అది ఆయ‌న‌కు అవ‌మానం కాదా అని ప్ర‌శ్నించారు. …

Read More »

ఎక్క‌డిక‌క్క‌డ అసంతృప్తి సెగ‌లు.. పార్టీని ప‌ట్టించుకునేవారేరీ?

వైసీపీలో ఎక్క‌డిక‌క్క‌డ అసంతృప్తి సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నాయి. అది కూడా.. ఏదో ఎమ్మెల్యేల మ‌ధ్యో.. మంత్రులు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్యో వివాదాలు కావు.. ఏకంగా.. క్షేత్ర‌స్థాయిలో రేపు ప్ర‌జల ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. వారితో మాట్లాడి.. ఓట్లు వేయించాల్సిన‌.. స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల మ‌ధ్య వివాదాలు త‌లెత్తుతున్నాయి. త‌మ‌కు ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం విలువ ఇవ్వ‌డం లేద‌ని.. క‌నీసం.. ప్రొటోకాల్ కూడా పాటించడం లేద‌ని.. వారు వాపోతున్నారు. గ‌డిచిన రెండు రోజుల్లో …

Read More »

కేంద్రం ముందు ప‌రువు తీసుకున్న తెలుగు రాష్ట్రాలు!

విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ముగిసింది. అయితే.. ఇంత కీల‌క స‌మావేశానికి.. రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి? ఏ విధ‌మైన ముందు చూపుతో ముందుకు సాగాలి. కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. కేంద్రం ముందే మ‌నోళ్లు పేచీ ప‌డ్డారు. నేను స‌హ‌క‌రించేది లేదంటే.. నేనూ అంతే అంటూ.. ఇరు రాష్ట్రాలు భీష్మించాయి. దీంతో కేంద్రం ఈ స‌మావేశాన్ని ఇంత‌టితో ముగించింది. అస‌లు ఏం జ‌రిగింది.? స‌మావేశంలో …

Read More »

చంద్రబాబుకు అదిరిపోయే ఎలివేషన్

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు తాజాగా ఒక వైసీపీ ప్రో యూట్యూబ్ ఛానెల్లో చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించినపుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ప్రత్యేకత ఏంటో అర్థం అవుతోంది. యాంకర్ చంద్రబాబునాయుడితో మీ అనుభవం గురించి చెప్పమంటే.. “చంద్రబాబు నాయుడి గారి దగ్గర నేను ఐదేళ్లు ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశాను. చంద్రబాబుగారు నేను చూసిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన చాలా భిన్నం. …

Read More »

మాటల వేట‌తో.. మొదటికే మోసం గురూ!

నువ్వొక‌టంటే.. నేరెండంటా.. అనే ధోర‌ణిలో వైసీపీ నాయ‌కులు రెచ్చిపోతున్నారు. అయితే.. ఇది మొదటికే మోసం వ‌స్తుంద‌ని.. ప‌రిశీల‌కులు… వైసీపీ సానుభూతిప‌రులు కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ విశ్వ‌విద్యాల‌యానికి పేరు మార్పు విష‌యం..ర‌చ్చ‌కు దారితీసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంత్రులు మార్కులు వేయించుకునేందుకు త‌మ నోటికి ప‌ని చెప్పారు. ప‌రుషంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని విష‌యాల‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌నే వాద‌న టీడీపీ నేత‌ల నుంచి కూడా వినిపిస్తోంది. …

Read More »

కాంగ్రెస్ పరిస్ధితి ఇలాగైపోయిందా ?

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిస్ధితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతోంది. రాజస్ధాన్లో నాయకత్వ మార్పు విషయంలో జరుగుతున్న గొడవే దీనికి తాజా ఉదాహరణ. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీచేయబోతున్నారు. మనిషికి ఒకటే పదవి అన్న విధాన నిర్ణయం ప్రకారం సీఎం పదవికి రాజీనామా చేయమని సోనియా చెప్పారు. అయితే ఇందుకు గెహ్లాట్ అంగీకరించటంలేదు. ఏదో తంటాలుపడి మొత్తానికి ఒప్పించారు. అయితే గెహ్లాట్ షరతు విధించారు. అదేమిటంటే …

Read More »

ఇవ్వ‌లేక వైసీపీ చెప్ప‌లేక టీడీపీ ఏపీలో ‘సంక్షేమ‌ రాజ‌కీయం’!

ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు బెంగ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న పార్టీల‌ను.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న పార్టీలను కూడా ఈ బెంగ వెంటాడుతోంది. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాల‌కు దాదాపు అల‌వాటు ప‌డిపోయార‌ని మేధావులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అమ్మ ఒడి, రైతు భ‌రోసా,నేత‌న్న నేస్తం, వైఎస్సార్ చేయూత‌ ఇలా అనేక ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది. దీంతో …

Read More »

అమ‌రావ‌తి పై అబ‌ద్ధాలు వెళ్లేలోపే.. నిజాలు చెప్పండి.. బ్ర‌ద‌ర్స్‌..!

ఏదేమైనా.. ఎవ‌రు ఎన్ని అన్న‌న్నా.. నిజాలు గ‌డ‌ప‌దాటే లోపే.. అబ‌ద్ధం ఊరు చుట్టివ‌స్తుంద‌నేది సామెత‌. ఇది వాస్త‌వం కూడా. మరీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఇలాంటివి కామ‌న్‌గా కూడా మారిపోయాయి. ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యంపైనా.. అదే జ‌రుగుతుంద‌ని మేధావులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం అధికార పార్టీ వైసీపీ మూడు రాజ‌ధానుల కోసం ప‌ట్టుబ‌ట్టింది. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తే లేద‌ని.. చెబుతోంది. ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా ఏమైనా …

Read More »

జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ బుద్ధి మానుకోలేదు : జ‌గ్గారెడ్డి

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తెలంగాణలోని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జగ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ అదికారంలో లేన‌ప్పుడు ఫ్యాక్ష‌న్ వ్య‌వ‌హారాలు న‌డిపిన‌ట్టు త‌న‌కు చాలా మంది చెప్పార‌ని అన్నారు. అయితే అప్పుడు ఎలా ఉన్నా అధికారంలోకి వ‌చ్చాక మాత్రం ఆయ‌న‌ ఫ్యాక్ష‌న్ బుద్ధి మానుకోవాలి క‌దా! అని హిత‌వు ప‌లికారు. కానీ, ఆయ‌న వ్య‌వ‌హారం చూస్తే అది మానుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. తాజాగా మీడియాతో …

Read More »

పేరు మార్చడం తప్పు కాదన్న లక్ష్మీ పార్వతి

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ యూనివర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడంపై టీడీపీ సహా ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ యూనివర్సిటీకి తన తండ్రి వైఎస్ఆర్ పేరుని పెట్టడంపై సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిల కూడా …

Read More »

మూడు రాజధానులు – మూడు బహిరంగ సభలు

రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండుతో అమరావతి టు అరసవల్లికి పాదయాత్ర జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధానిగా చంద్రబాబునాయుడు అండ్ కో కీలకమైన ఎజెండాగా చేసుకునే అవకాశముంది. ఇలాంటి నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మూడు రాజధానులే తమ ఎజెండాగా ఎన్నికల నినాదం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొందరలో మూడు బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ …

Read More »