Political News

ఏపీలో గురుపూజా రాజ‌కీయం.. ఏం జ‌రుగుతోందంటే

గురు బ్ర‌హ్మ‌.. గురు విష్ణు.. అంటూ.. గురుదేవులను పూజించుకునే వేళ‌.. ఏపీలో రాజ‌కీయం అనేక కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. గురుపూజ‌లకు కూడా రాజ‌కీయం అలుముకుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కం ట్రిబ్యూట‌రీ పింఛ‌న్ ప‌థ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయుల‌పై పోలీసులుకేసులు పెట్టి వేధించ‌డాన్ని నిర‌శిస్తూ.. గురువులు.. మూకుమ్మ‌డిగా ఈ ఉత్స‌వాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించారు. ఇప్ప‌టికే స‌ర్కారుకు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా.. ఉపాధ్యాయులు …

Read More »

వైసీపీలోకి ముద్రగడ కుటుంబం ?

Mudragada

గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముద్రగడ పద్మనాభం కుటుంబం తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం కొడుకు ముద్రగడ గిరిబాబు వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముద్రగడ చాలాకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాపులను బీసీల్లో చేరుస్తానని 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలుచేయాలన్న డిమాండుతో ముద్రగడ …

Read More »

బీజేపీని జూనియర్ ఆదుకోగలరా?

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నది వాస్తవం. వామపక్షాలు, కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుందో బీజేపీ పరిస్ధితి కూడా అదే విధంగా ఉంది. కాకపోతే కమలనాథులు ప్రతి చిన్న విషయానికి ఎగెరిగెరి పడుతున్నారు. కారణం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉండటమే తప్ప మరోటి కాదు. మరి ఇంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామన్న బిల్డప్ ఇస్తోంది. దీనికి కారణం ఏమిటంటే జూనియర్ ఎన్టీయార్ లాంటివాళ్ళ తమకు సేవలందించటానికి సిద్ధంగా …

Read More »

తుమ్మ‌ల తేల్చుకోలేక పోతున్నారే!!

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఆయన‌కు ఒక‌ప్పుడు తిరుగులేదు. కానీ, ఓడ‌లు బ‌ళ్లు అయిన‌ట్టుగా.. ఆయ‌న ప‌రిస్థితి ఇప్పుడు సందిగ్ధావ‌స్థ‌లో ప‌డిపోయింది. ఉన్న పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేదు. వెళ్దామ‌నుకునే పార్టీల్లో స‌త్తాపై.. ఆయ‌న‌కు ధైర్యం లేదు. దీంతో ఇప్పుడు ఆయ‌న డోలాయ‌మాన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆది నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న తుమ్మ‌ల‌.. 2014 త‌ర్వాత‌.. అనూహ్యంగా టీఆర్ఎస్ …

Read More »

మునుగోడుపై.. కేసీఆర్ క‌సి

ఉప ఎన్నికే అయినా.. సార్వ‌త్రిక ఎన్నిక‌ను మించిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి ఇటీవ‌ల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలోకి చేరారు. ఈ క్ర‌మంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా ఆయ‌న వ‌దులుకున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఇది అధికార పార్టీ జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య కావ‌డంతో ఇక్క‌డ నుంచి …

Read More »

10 జిల్లాల్లో కాంగ్రెస్ ఓకే.. మరి వాటి సంగ‌తేంటి?

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. విజ‌యం త‌మ‌దేన‌ని చెప్పుకోవ‌డం వ‌ర‌కే కాంగ్రెస్ నేత‌లు ప‌రి మిత‌మవుతున్నారా? భారం మొత్తం పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌పై వేసి.. తాము చోద్యం చూస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఉగాది ప‌చ్చ‌డిని త‌ల‌పిస్తోంద‌ని చెబుతున్నారు. కేవ‌లం 10 జిల్లాల్లో మాత్ర‌మే.. పార్టీ ప‌రిస్థితి బాగుంద‌ని.. ఆయా జిల్లాల్లో ఆశాజ‌న‌మైన ఫ‌లితం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. …

Read More »

చివ‌రి నిముషం వ‌రకు ఆగితే.. జ‌న‌సేన‌కే న‌ష్ట‌మా?

కొన్ని విష‌యాల్లో రాజ‌కీయ పార్టీలు ముందుండాలి. ఏమాత్రం తేడా వ‌చ్చినా ఫ‌లితం డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అంతేకాదు.. కొన్ని కొన్ని విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాలంటే.. వాటిని అంతే బలంగా ముందు నుంచి ప్ర‌చారం చేసుకోవాలి. ఇప్పుడు ఇవ‌న్నీ కూడా .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌ని, అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్న జ‌న‌సేన గురించే. వ‌చ్చే ఎన్నిక‌ల సంగ‌తిని ప‌రిశీలిస్తే.. జ‌న‌సేన‌కు ఉన్న బ‌లం …

Read More »

బీజేపీ ట్రాపులో కేసీఆర్?

క్యాబినెట్లో తీసుకున్న ఒక నిర్ణయం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరిపించాలనేది కీలకమైనది. దీనికే జాతీయ సమైక్యతా దినోత్సవమని ముద్దుగా పేరుపెట్టారు. విమోచన దినోత్సవం అనేది ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నుండి వినబడుతున్నదే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు జరిగిన ఉద్యమంలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపటం …

Read More »

అన్నం పెడుతున్నా ఈ ఆంక్షలేంది జగన్?

నువ్వా నేనా అన్నట్లుగా ఉండే ఏపీ అధికార.. ప్రధాన ప్రతిపక్షం మధ్య నిత్యం ఏదో ఒక రభస జరుగుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో హైటెన్షన్ చోటు చేసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో తెర మీదకు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేయటం తెలిసిందే. దీంతో.. పార్టీ తరఫున అన్న క్యాంటీన్లను నిర్వహించేందుకు వీలుగా మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా …

Read More »

చంద్రబాబు విజన్ అసాధారణం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. దాదాపు 20 ఏళ్ల క్రితమే విజన్-2020 అనే నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన దార్శనీకుడు చంద్రబాబు. 1998లో చంద్రబాబు అంకురార్పణ చేసిన హైటెక్ సిటీ నేడు హైదరాబాద్ లో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. ఇక, చంద్రబాబు చొరవతో హైదరాబాద్ లో పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ …

Read More »

బ్రహ్మాస్త్ర ఈవెంట్ రద్దు వెనుక రాజకీయం?

బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దవటం సంచలనంగా మారింది. ఈ సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ జూనియర్ ఎన్టీయార్ కావటంతో జనాల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఫంక్షన్ ను పోలీసులు చివరి నిముషంలో రద్దుచేశారు. ముందుగానే ఫంక్షన్ కు సినిమా యూనిట్ అనుమతి తీసుకున్నది. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ఫంక్షన్ కు గురువారం రాత్రి పోలీసులు అనుమతిని రద్దుచేశారు. సినిమా ఫంక్షన్ …

Read More »

TDP: కఠిన చర్యలు తప్పవా?

పనితీరు మార్చుకోని నియోజకవర్గాల ఇన్చార్జీలు, నేతలపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని చంద్రబాబు నాయుడు సీరియస్ గా చెప్పారు. నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చేసిందని ఇపుడు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఉపయోగం ఉండదని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అందరికీ. నేతలు క్రియాశీలం అవుతారేమో అని మూడున్నరేళ్ళు ఎదురుచూసినా ఉపయోగం కనబడలేదని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం గుర్తు చేస్తునే కార్యకర్తలు కూడా …

Read More »