ఏపీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని.. వాటికి కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని.. కొత్త రోడ్ల మాట ఎలా ఉన్నా.. కనీసం గుంతలైనా పూడ్చాలని.. రాజకీయ నాయకులు.. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఆటోవాళ్లు.. విద్యార్థులు.. గ్రామస్థులు.. చందాలు వేసుకుని.. మరీ కొన్ని చోట్ల రహదారులు బాగుచేసుకున్న పరిస్థితిని మనం గమనించాం. ఇక, జనసేన నాయకులు.. వినూత్న నిరసనలు వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు …
Read More »బాబు కన్నా.. నాకే ఎన్టీఆర్ అంటే.. గౌరవం: జగన్
ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం అసెం బ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ను తానుకానీ, పార్టీ నాయకులు కానీ.. ఎక్కడా .. ఎప్పుడూ.. కించపరచలేదన్నారు. ఆయనపట్ల తనకు ఎఫెక్షన్ ఉందని తెలిపారు. పాదయాత్ర సమయంలో కూడా.. ఎన్టీఆర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అంతేకాదు.. ఆ సమయంలో కొందరు జిల్లాకు …
Read More »రేవంత్ రాంగ్ టైమింగ్
తానేం చేస్తున్నాడో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కైనా అర్ధమవుతోందా లేదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పీసీసీ ఆఫీసు బేరర్ల సంఖ్యను పెంచటంతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటిల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. సరిగా పనిచేయని డీసీసీ అద్యక్షులను మార్చేసి కొత్తవారిని నియమించాలని రేవంత్ అనుకున్నారు. ఇందుకనే కేరళలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి గ్నీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు రేవంత్ …
Read More »మూడేళ్లలో జగన్ దోపిడీ 2 లక్షల కోట్లు: నారా లోకేష్
ఏపీ సీఎం జగన్పై టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. గడిచిన మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ ప్రజాధనాన్ని దోచేశారని ఆయన విమర్శలు గుప్పించారు. దీని విలువ దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. తాజాగా బుధవారం ఉదయం.. నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన తెలిపింది. రాష్ట్రంలో సహజ వనరులైన.. భూమిని, ఇసుకను.. వైసీపీ నాయకులు …
Read More »వైసీపీకి తొలి దెబ్బ.. ఎన్టీఆర్ పేరు మార్పుపై.. యార్లగడ్డ రాజీనామా!
వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న తలతోకలేని నిర్ణయాలపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అయితే.. వీరు వైఎస్పై అభిమానంతో సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. అయితే.. ఈ దూకుడు మరింత దారుణంగా మారిపోవడంతో విసుగు చెందిన వారు.. పార్టీ నుంచి.. పదవుల నుంచి కూడా బయటకు వస్తున్నారు. తాజాగా కీలకమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు …
Read More »జగన్ పిచ్చి ఆలోచనలు మానుకో
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. 1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనమన్నారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని ఆయన …
Read More »‘ఎన్టీఆర్’ తో పెట్టుకున్న జగన్.. రాంగ్ ఐడియా
సంస్ధలకు, వ్యవస్థలకు పాలకులు తమ పేర్లు పెట్టుకోవటం మామూలైపోయింది. తమ హయాంలో ఏర్పాటుచేసిన వాటికి తమిష్టమొచ్చిన పేర్లు పెట్టుకోవటంలో తప్పులేదు. అంతేకానీ అంతకు ముందు ప్రభుత్వం పెట్టిన పేర్లను తీసేసి తమిష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవటం మాత్రం తీవ్ర అభ్యంతరకరమనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటిగా పేరు మార్చటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు …
Read More »ఢీ అంటే ఢీ.. టీడీపీదే పైచేయి..!
అసెంబ్లీలో టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క అసెంబ్లీలోనే కాదు.. శాసన మండలిలోనూ.. టీడీపీ చాలా వరకు దూకుడుగానే ఉంది. నిజానికి అసెంబ్లీలో రెండు ప్రధాన ఇబ్బందులను టీడీపీ ఎదుర్కొంటోంది. ఒకటి.. పార్టీకి నాయకుడు లేకపోవడం. అంటే.. పార్టీ అధినేత చంద్రబాబు.. సభకు రాకుండా.. దూరంగా ఉండడం ఒక పెద్ద మైనస్. రెండోది.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 12 లేదా 13 మంది ఎమ్మెల్యేలే సభకు హాజరుకావడం. దీంతో …
Read More »లిక్కర్ కింగ్ వారసుడి అరంగేట్రం..
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం ప్రస్తుతం పార్లమెంటు సభ్యులు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఆసక్తికర ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని.. తనకు బదులుగా.. తన కుమారుడిని గెలిపించాలని.. ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో అసలు.. ఈ రాఘవరెడ్డికి ఉన్న ప్రజాసేవ ఏంటి? ఆయన ఏమేరకు పుంజుకునే అవకాశం ఉంది.. అసలు వైసీపీలో టికెట్ లభిస్తుందా? అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం. …
Read More »సీఎం జగన్ నోట.. ‘బసవతారకం’ మాట
బసవతారకం.. ఇండో అమెరికన్ ఆసుపత్రి.. ఇది ప్రతిపక్షం టీడీపీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే అన్నగారు ఎన్టీఆర్ తనయుడు.. బాలయ్య చైర్మన్గా ఉన్న ఆసుపత్రి. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పేరుతో నిర్మించిన ఆసుపత్రి. అయితే.. దీని గురించి ఏపీ ప్రభుత్వాధినేత, సీఎం జగన్ తొలిసారి స్పందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాక ముందు కూడా.. ఎప్పుడూ.. ఈ ఆసుపత్రి గురించి.. ఆయన స్పందించలేదు. స్పందిస్తారని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ, తాజాగా …
Read More »టీడీపీపై మంత్రి రోజా ఇంతగా బ్లాస్ట్ అయ్యారేంటి?
టీడీపీ నేతలకు దేని మీద పోరాడాలో తెలియడం లేదని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. పిచ్చి పట్టినోళ్లలాగా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజా సాధికారత సర్వే ద్వారా డేటా సేకరించి దుష్ట పన్నాగం పన్నారన్నారు. ఈ డేటా బాబా.. డేరా బాబా కంటే పెద్ద దొంగ అని విమర్శించారు. 30 లక్షల మంది డేటాను చోరీ చేశారన్నారు. డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను …
Read More »ఇప్పుడేమంటారు.. జగన్ సర్.. కృష్ణాలో రైతులకు బ్రహ్మరథం!
అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంటూ.. ప్రబుత్వం అభవృద్ధి చేయాలనే డిమాండ్తో ఇక్కడి రైతులు చేపట్టిన పాదయాత్ర 2.0 పై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం అక్కడి రైతులు అమ్ముడు పోయారని.. పెయిడ్ యాత్ర అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు రైతుల ముసుగులో పాల్గొంటున్నారని కూడా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. సాక్షాత్తూ నిండు అసెంబ్లీలోనూ ఇదే వ్యాఖ్య చేశారు. అయితే.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates