త్వరలో .. వైసీపీ తరఫున నాలుగు విప్ పదవులు రానున్నాయి. తాజా సమాచారం ప్రకారం కమ్మ సామాజికవర్గ నేతకు ఒకటి కేటాయించే అవకాశాలున్నాయి. మిగిలిన 3 కూడా గత ఎన్నికల్లో బలమైన నాయకులను ఢీకొన్న వారికే వరించనున్నాయి అని తెలుస్తోంది. కొత్త పదవుల వేటలో వైసీపీ ఉంది. అదేవిధంగా పదవుల సంఖ్య పెంపుపై కూడా ఆసక్తిగా ఉంది. తాజా సమాచారం అనుసరించి శాసన సభలో విప్ -ల సంఖ్య పెంచేందుకు …
Read More »ఇప్పటికి ముగ్గురు చనిపోయారు.. మిగిలివారినైనా కాపాడండి
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు సాక్షులు చనిపోయారని.. మిగిలిన వారినైనా కాపాడాలని కోరారు. వివేకా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నగంగాధర్ రెడ్డి మృతిపై ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు సరికావని …
Read More »రఘురామ రాజు ఎలా గెలిచారంటే ?
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడే అవకాశాలు లేవని దాదాపు తేలిపోయింది. అనర్హత పిటిషన్ వేయాలని వైసీపీ, వేసేందుకు లేదని తిరుగుబాటు ఎంపీ లోక్ సభ స్పీకర్ కార్యాలయం వేదికగా పరస్పరం వాదులాడుకుంటున్నారు. ఎంపీ పై అనర్హత వేటు వేయాల్సిందే అని పట్టుదలగా లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. అయితే ఎవరెంత పోరాటం చేసినా ఎంపీగా అనర్హత వేటు …
Read More »కఠినంగా కొట్టి చంపి.. వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య వెనుక నిజం ఇదే!
ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను హత్య చేసిన కేసులో పోలీసులు కట్టుకథ అల్లారా? పోస్టుమార్టం నివేదిక.. ఔననే అంటోంది. డ్రైవర్ సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మించేందుకు.. మృతదేహాన్నిఎమ్మెల్సీ కొట్టారని పోలీసులు చెప్పగా.. మరణానికి ముందే గాయాలయ్యాయని పోస్టు మార్టం నివేదిక నిగ్గుతేల్చింది. ఏపీలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు.. కేసు తీవ్రతను తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేశారని పోలీసులు మొదట్నుంచీ విమర్శలు ఎదుర్కొన్నారు. …
Read More »ఏపీ మద్యం విధానంపై పవన్ హాట్ కామెంట్స్..
ఏపీలో జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీ.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్లో జోడించారు. రాష్ట్రంలో …
Read More »గ్రూపు రాజకీయాలు చేస్తే.. ఇంటికే: కేటీఆర్ క్లాస్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అసంతృప్త నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం దృష్ట్యా.. ఈ ప్రత్యేక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని నేతలకు మంత్రి కేటీఆర్ …
Read More »ముందస్తు ఎన్నికలకు పవన్ రెడీ అవుతున్నారా ?
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నాదెండ్ల మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 5వ తేదీ నుంచి అంటే విజయదశమి నుంచి యాత్ర మొదలుపెడతారని ప్రకటించారు. తిరుపతి నుండి మొదలయ్యే యాత్రలో ఆరు మాసాల్లో రాష్ట్రమంతటా చుట్టేస్తారట. ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ యాత్ర అన్నారే …
Read More »రఘురామపై అనర్హత.. స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నాయకుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్పై అనర్హత పిటిషన్పై లోక్సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. సీఎం జగన్పై పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత వేటు కిందకు రాదని, పార్టీ విప్ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకి వస్తుందని స్పీకర్ ఆఫీస్ వెల్లడించింది. అంటే.. సీఎం, మంత్రులను విమర్శిస్తే అనర్హత వేటు కిందకి రాదని, రఘురామ అనర్హత పిటిషన్ ప్రివిలైజ్ …
Read More »వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
కృష్ణాజిల్లాలోని మాజీ మంత్రి-ఎంపీల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటనలో కొందరు కార్యకర్తలు గొడవ చేశారు. ఆ గొడవకు మాజీ మంత్రి పేర్ని నానియే కారణమని ఎంపీ మీడియాలోనే ఆరోపించారు. దాంతో ఎంపీ, మాజీ మంత్రి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ బందరులోని ఒక కార్యక్రమానికి వెళుతుండగా పేర్ని మద్దతుదారులు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నానా రచ్చ చేశారు. దీంతో …
Read More »నూపుర్ మంటలు : నిరసనలు, అల్లర్లు, అరెస్టులు, కర్ఫ్యూలు..
దేశవ్యాప్తంగా ఇప్పుడు నుపుర్ శర్మ వ్యాఖ్యలపైనే దుమారం రేగుతోంది. మహ్మద్ ప్రవక్త ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలున్నాయి. ఈ ఉద్రిక్తతల స్థాయి రెట్టింపు కాకమునుపే ప్రభుత్వాలు మేలుకొలుపు చర్యలు చేపట్టాల్సి ఉంది అని పరిశీలకులు అంటున్నారు. కానీ బీజేపీ కానీ ఇతర ప్రాతినిధ్య స్వరాలు కానీ ఆ దిశగా అడుగులు వేయకుండా వీటినొక ఓటు బ్యాంకు వ్యవహారంగానే చూస్తున్నాయి అని కూడా అంటున్నారు. …
Read More »లేటెస్ట్ డేట్ : కేసీఆర్ కొత్త పార్టీ.. భారత రాష్ట్ర సమితి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించారు. దీనికి భారత రాష్ట్ర సమితి(బీఆర్ ఎస్)గా పేరు పెట్టాలని ఆయన ఒక తీర్మానం చేసినట్టు తెలిసింది. ఈ నెలాఖరులోనే జాతీయ పార్టీపై కేసీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ ఎస్ మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్.. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన సమావేశంలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై …
Read More »తెలంగాణలోనూ బాదుడే బాదుడు !
వార్షికాదాయం పెంపునకు ముఖ్యంగా ఆదాయం తీసుకు వచ్చే స్టూడెంట్ పాస్-లపై ఉన్న రాయితీని తొలగించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొన్ని అడ్డదారులను వెదుకుతోంది. సంస్థను లాభాల బాట పట్టించేందుకు నిన్నటి దాకా ఎండీ సజ్జనార్ టికెట్ రేట్లు పెంచమని, ఛార్జీల వడ్డన ఉండదని చెబుతూ వచ్చి సడెన్-గా రివర్స్ గేర్ వేశారు. దీంతో విద్యార్థులపై ఊహించని రీతిలో భారం పడనుంది. ఈ చర్య వారికి అస్సలు మింగుడు పడకుండా ఉండనుంది. పెంచిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates