Political News

కరోనా ఎఫెక్ట్…ప్రపంచవ్యాప్తంగా నమస్తేకు క్రేజ్

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు సంభవించాయి. కరోనా దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు….దాదాపుగా అందరి జీవనశైలి మారిపోయింది. ప్రజల జీవన విధానం…ఆలోచనా విధానం…జీవితంపై దృక్పథం…ఆఖరికి పలకరింపులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కరోనా వల్ల చాలామంది మనుషుల మధ్య భౌతిక దూరం…కొంతమంది మనసుల మధ్య మానసిక దూరం పెరిగింది. కరోనాను కట్టడి చేసేందుకు మాస్కు మన ముఖంలో అంతర్భాగం అయిపోయింది. ఇక, కరోనా మహమ్మారిని …

Read More »

ఆధార్ తో పాన్ ను లింక్ చేశారా? లేదంటే తిప్పలే

ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయాల్సిన విషయం చాలా పాతదే. కాకుంటే.. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకునే వాళ్లు తీసుకుంటే పట్టించుకోని వాళ్లు పిచ్చ లైట్ గా తీసుకోవటం తెలిసిందే. ఇప్పుడు అలాంటి వారందరికి దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది. కేంద్రం తాజాగా డిసైడ్ చేసిన గడువు తేదీ లోపల ఆధార్ తో పాన్ ను అనుసంధానం చేయని పక్షంలో అలాంటి కార్డుల్ని.. రద్దు …

Read More »

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టు సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని వస్తోన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని విపక్ష నేత చంద్రబాబు ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీలో ఆర్టికల్స్ 19 మరియు 21 ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. అయితే, ఫోన్ ట్యాపింగ్‌పై …

Read More »

రెండు..మూడు రాజధానుల మాటకు ఆ సీఎంకు కోపమొచ్చింది

దేశం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. రాజధాని ఒకటే ఉంటుంది. ఒకటికి మించి ఎక్కువ రాజధానులు ఉంటే.. అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయన్న వాదన ఇటీవల జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాదనలకు తమిళనాడు రాష్ట్ర అధికారపక్ష నేతలు స్ఫూర్తి పొందారేమో కానీ.. ఈ మధ్యన తమిళనాడు రెండు.. మూడు రాష్ట్ర రాజధానుల ఏర్పాటుపై కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొస్తున్నారు. అధికార అన్నాడీఎంకేకు చెందిన నేతలు రెండో …

Read More »

ఎన్టీవీ, టీవీ5ల మధ్య రచ్చపై నెటిజన్ల చర్చ…వైరల్

దేశంలోని పలు మీడియా సంస్థలు, పత్రికలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటాయన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తుంటాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు మీడియా చానెళ్లు కూడా అందుకు మినహాయింపు కాదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు తమకు దన్నుగా ఉన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా…వైరి వర్గాలకు ప్రతికూలంగా కథనాలు ప్రసారం చేస్తుంటాయని కొన్ని మీడియా సంస్థలపై సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా …

Read More »

‘స్వచ్ఛ సర్వేక్షణ్-2020’ టాప్-10లో 3 ఏపీలోనివే

2014లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ‘స్వచ్ఛ భారత్’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుతూ మోదీ చేపట్టిన బృహత్తర కార్యక్రమం….దేశంలోని మెట్రో నగరాలు, పట్టణాలతోపాటు, పల్లెలకూ వ్యాపించింది. ఈ క్రమంలోనే దేశంలోని నగరాల మధ్య స్వచ్ఛతలో పోటీతత్వం పెంపొందించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ సర్వేను ప్రతి ఏటా‌ మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ …

Read More »

డా. రమేష్ బాబు ను పట్టిస్తే రూ.లక్ష

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన స్వర్ణ ప్యాలెస్ ఫైర్ యాక్సిడెంట్ ఉదంతంలో కీలక వ్యక్తులు గాయబ్ కావటం తెలిసిందే. వారిని విచారిస్తేకానీ.. ఈ ప్రమాదానికి సంబంధించిన స్పష్టత రాని పరిస్థితి. ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత నుంచి రమేశ్ ఆసుపత్రి ఎండీ పి. రమేశ్ బాబు.. స్వర్ణాప్యాలెస్ ఎండీ ముత్తవరపు శ్రీనివాసరావుతో సహా పలువురు కీలక వ్యక్తుల ఆచూకీ తెలీకుండా ఉంది. వారు పరారైనట్లుగా చెబుతున్నారు. వారిని …

Read More »

శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో పేలుళ్లు.. చిక్కుకునన సిబ్బంది

తరచూ ఏదో విపత్తు చోటు చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఎప్పుడు వినని రీతిలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. విశ్వసనీయ సమాచారం …

Read More »

దేవీపట్నంలో 144 సెక్షన్…కారణం తెలిస్తే షాక్

సాధారణంగా అల్లర్లు, గొడవలు, మత కలహాలు, ఎన్నికలు జరిగేటపుడు 144 సెక్షన్ విధిస్తుంటారు. ఘర్షణపూరిత వాతావరణంలో ప్రజలు గుమిగూడితే అల్లర్లు మరింత పెరిగే ప్రమాదముందన్న కారణంతోనే నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధిస్తారు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత 144 సెక్షన్ ఎత్తివేసి సాధారణ పరిస్థితులు కల్పించడ పరిపాటి. అయితే, విచిత్రంగా ఏపీ చరిత్రలో బహుశా తొలిసారిగా వరద ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. తూర్పుగోదావరి జిల్లా …

Read More »

మోడీ సర్కారు.. ఒక విప్లవాత్మక నిర్ణయం

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఇప్పటిదాకా ఉన్న గందరగోళం, అస్పష్టతకు తెరదించుతూ.. ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చింది. ఒక దేశం.. ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీల కోసం ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) పేరుతో కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేసింది. దీనికి …

Read More »

అమరావతి బలమే విశాఖ బలహీనత?

మెసపటోనియా నాగరికత నుంచి మూసీనది వరకు… నదుల పక్కనే నాగరికత అభివృద్ధి చెందింది. నది జీవితాలకు, సంస్కృతులకు జీవనాడి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ కృష్ణానది తీరానికి అనుకుని ఉండటం వలన భవిష్యత్తులో వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందని చాలాకాలం నుంచి ఓ వాదన ఉన్న సంగతి తెలిసిందే. అందుకే, నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని అమరావతి నిర్మాణం సరైన నిర్ణయం కాదని కొందరు అధికార పార్టీ నేతలు విమర్శించారు. …

Read More »

మాకు కరోనా రాలేదనుకుంటున్నారా.. భలేవాళ్లే మీరు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకు 60వేలకు పైగా కేసులు నమోదవుతుండగా….ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఏపీలో రోజుకు 7 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా….తెలంగాణలో దాదాపు 1500కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో టెస్టులు, కేసుల సంఖ్యపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా..తెలంగాణాలో టెస్టులు, కేసుల సంఖ్య తక్కువగా చూపుతున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలలో …

Read More »