Political News

బాలినేని క‌న్నా వైవీ బెట‌ర్‌!: ప్ర‌కాశం వైసీపీలో టాక్

ప్ర‌కాశం రాజ‌కీయాల్లో మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి స్ట‌యిలే వేరు. ఆయ‌న ఎక్కువ‌గా మాట్లాడ‌రు. ప‌ని మాత్ర‌మే చేస్తార‌నే పేరుంది. గ‌తంలో ఆయ‌న ఓట‌మి పాలైన‌ప్పుడు.. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఈమాటే వినిపించేది. నాయ‌కులు కూడా ఆయ‌న‌ను గౌర‌వించ‌డం వెనుక ఈ ఫార్ములానే కీల‌కంగా న‌డిచింద‌నే వాద‌న ఉంది. అయితే, ఇప్పుడు ఆయ‌న మంత్రి అయ్యారు. పైగా ప్రకాశం రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు రెండు కేంద్రాలుగా న‌డిచిన వైసీపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు …

Read More »

లోకేష్ పైన కూడా సిబిఐ విచారణకు సిఫారసా ?

అవును ఈ విషయం ఇపుడు తెలుగుదేశంపార్టీలో సంచలనంగానే మారింది. ఒకవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం సిబిఐ విచారణ జరపటానికి ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర హోంశాఖ గనుక సానుకూలంగా స్పందిస్తే చంద్రబాబునాయుడుకు ఇబ్బందులు మొదలవ్వటం ఖాయం. ఈ విషయమే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉండగానే తాజాగా ఏపి ఫైబర్ నెట్ స్కాంను కూడా సిబిఐ విచారణ జరిపాలంటూ …

Read More »

రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే విపక్షంలా మారిన ఆర్ఆర్ఆర్…తనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా కేంద్ర బలగాల భద్రత కోరి సంచలనం రేపారు. ఓ వైపు సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ…మరో వైపు సీఎం జగన్ మరో 30 ఏళ్లు సీఎం అంటూ పొగుడుతున్నారు. తాను రాజీనామా చేయబోనని, తాను సీఎం జగన్ బొమ్మతోపాటు తన ఇమేజ్ తోనే గెలిచానని …

Read More »

పయ్యావుల మౌనానికి కారణాలు ఎన్నో !!

అనంతపురం జిల్లాలోనే కాకుండా, రాయలసీమ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టీడీపీ ముఖ్యనేతల లిస్టు తయారుచేస్తే పయ్యావుల కేశవ్ టాప్ -20 లో ఉంటారు. రాజకీయ అవగాహన, అనుభవం ఉన్నా… ఆయన మీడియాలో అరుదుగా కనిపిస్తున్నారు. పార్టీలో చాలా సీనియరే అయినా ప్రస్తుతం పదవిలో ఉన్నా కూడా ఎంచేతో పార్టీ కార్యక్రమాలతో పాటు అధినేతకు కూడా దూరం మెయిన్ టైన్ చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని రాయలసీమ మొత్తం …

Read More »

విశాఖలో భారీ టైర్ల ప్లాంట్… రూ. 1240 కోట్ల పెట్టుబడి

ఏపికి శుభవార్తనే చెప్పాలి. విశాఖపట్నంలో అచ్యుతాపురం పారిశ్రామికవాడలో జపాన్ పారిశ్రామిక దిగ్గజం యోకోహామా ఓ టైర్ల ప్లాంటును ఏర్పాటు చేయటానికి రెడీ అయిపోయింది. యోకోహామా లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూపు ప్లాంటు ఏర్పాటును దగ్గరుండి మరీ పర్యవేక్షించబోతోంది. సుమారు రూ. 1240 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంటు రెడీ చేయబోతున్నట్లు యోకోహామా ఇండియా ఛైర్మన్ నితిన్ మంత్రి స్వయంగా చెప్పారు. దాంతో టైర్ల ప్లాంటు ఏర్పాటు ఖాయమనే అనిపిస్తోంది. …

Read More »

వచ్చే మార్చికి వ్యాక్సిన్, మంత్రికి తొలి షాట్

కరోనా వైరస్ కు విరుగుడుగా మనదేశంలో జరుగుతున్న పరిశోధనలు ఫలితాలనిస్తే వచ్చే ఏడాదిలో మందు తయారయ్యేట్లుంది. ఈ విషయాన్ని కేంద్రం ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. మనదేశంలో వైద్య నియంత్రణ సంస్ధ ఐసిఎంఆర్ అనుమతులు తీసుకుని అనేక ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ కనిపిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో ముంబాయ్, హైదరాబాద్, పూనా లాంటి నగరాల్లోని వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు ఇదే పనిమీద 24 …

Read More »

ర‌ఘురామ స‌వాల్.. ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను మించి అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారారు ఎంపీ ర‌ఘురామ ‌కృష్ణంరాజు. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచిన ఆయ‌న ఏడాది తిరిగేస‌రికి పార్టీ రెబల్‌గా మారిపోయారు. గ‌త కొన్ని నెల‌లుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు, ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న చెల‌రేగిపోతున్నారు. వాటికి స‌మాధానం చెప్ప‌లేక వైకాపా నేత‌లు స‌త‌మ‌తం అయిపోతున్నారు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల త‌ర‌ఫున మాట్లాడుతూ.. అధికార పార్టీకి స‌వాళ్లు విసురుతున్న …

Read More »

ఏపీలో ఆరోగ్యశాఖపై జగన్ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన ప్రభుత్వం ఆరోగ్య శాఖ, విద్యా శాఖపై ఎక్కువ దృష్టిపెట్టనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య శాఖలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత హామీలో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ .2050 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేయటం కీలక …

Read More »

విద్యుత్ వాడకానికీ ప్రీ పెయిడ్ మీటర్లేనా? కేంద్రం నిర్ణయం

విద్యుత్ రంగంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇళ్ళల్లోను, కమర్షియల్ గా వాడే విద్యుత్ విషయంలో భవిష్యత్తులో కేటాయించబోయే మీటర్లన్నీ ప్రీపెయిడ్ మీటర్లే ఉండాలని నిర్ణయించింది. ఈ విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసేసుకుని రాష్ట్రాలకు ముసాయిదాను పంపింది. కేంద్రం ముసాయిదాను పంపిందంటేనే అర్దం నిర్ణయం దాదాపు తీసేసుకుందని. మనం ఇపుడు మొబైల్ ప్రీపెయిడ్ ఎలాగ వాడుతున్నామో ఇకనుండి విద్యుత్ మీటర్లు తీసుకునే వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ మీటర్లే కేటాయించాలని …

Read More »

బిజెపి, జనసేనలపై హర్ష కుమార్ తీవ్ర విమర్శలు

బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు హిడెన్ అజెండా ఇదే అంటూ అమలాపురం మాజీ ఎంపి హర్షవర్ధన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవిని సిఎంగా చేయటమే వీర్రాజు హిడెన్ అజెండాగా పనిచేస్తున్నట్లు మాజీ ఎంపి బయటపెట్టారు. అలాగే బిజెపి+జనసేన పార్టీలు రెండు కుళ్ళిపోయిన పార్టీలే అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. ఎలా కుళ్ళిపోయాయంటే బిజెపి ఏమో మతంతో కుళ్ళిపోతే జనసేనేమో కులపరంగా కుళ్ళిపోయిందట. అందుకనే రెండు కలిసి అంతర్వేది …

Read More »

ఏపీకి రాజధాని శాపం? చంద్రబాబు చెప్పిందే జరిగితే?

టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాదనలు సైతం సబబుగానే కనిపిస్తాయి. ఇలాంటివేళ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. ఏపీ ప్రజలకు రానున్న రోజుల్లో రాజధాని అంటూ ఒకప్రాంతం పర్మినెంట్ గా ఉండదా? అన్న సందేహం కలుగక …

Read More »

వెలుగులోకి ’నూతన్’ లీలలు… ఇంకా ఎన్నున్నాయో ?

శిరోముండనం ఘటనలో అరెస్టయిన నూతన్ నాయుడు లీలలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. తనింట్లో ఓ దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేయించిన ఘటన పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ ఘటనలో నాయుడు భార్యతో పాటు కుటుంబసభ్యులు, ఇంట్లో పనిచేసే ఉద్యోగులు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత నాయుడు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వేస్టేషన్లు …

Read More »