బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు గతంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అవసరం లేకుండానే.. నిర్వహణ కంపెనీకి నిధులు మంజూరు చేశారని.. ఈ విషయంలో అప్పటి మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్కు ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ కేసును ఏసీబీకి అప్పగించారు. దీంతో …
Read More »`సూపర్ సిక్స్`తో త్రిముఖ వ్యూహం: బాబు స్ట్రాటజీ ..!
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు పూర్తయిన నేపథ్యంలో బుధవారం నిర్వ హిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమానికి అనంతపురం వేదికగా మారింది. అయితే.. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. పథకాలపై ప్రజలకు మరోసారి వివరించడంతోపాటు… కూటమి ఐక్యతను చాటి చెప్పేలా చేయడమే దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో.. దీనిని …
Read More »మీరు ముగ్గురూ చరిత్ర హీనులు: షర్మిల ఫైర్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 300 ఓట్ల వద్దే ఆగిపోయారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీలను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీరు ముగ్గురూ చరిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జనసేన, వైసీపీ అధినేతలపై ఆమె విరుచుకుపడ్డారు. ముగ్గురూ కలిసి ఉమ్మడిగా ఎన్డీయే అభ్యర్థిని గెలిపించారని …
Read More »కేసీఆర్ ఆశయం కోసం కొట్లాడుతా: కవిత
సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతానని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన.. ఆ పార్టీకి రాజీనామా చేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణ సాధించేందుకు తెలంగాణ జాగృతి పక్షాన పోరాడుతామన్నారు. కేసీఆర్ ఆశయాలను సాధించేందుకు ప్రజల మధ్యకు వెళ్తామని తెలిపారు. “కేసీఆర్ కష్టకాలంలో ఉంటే.. పోరాడేందుకు ముందుకు వచ్చింది మేమే. మా జాగృతి కార్యకర్తలే” అని కవిత కీలక వ్యాఖ్యలు …
Read More »భారత నూతన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
భారత దేశ నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అయినప్పటికీ…ఇండి కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తారని భావించారు. ఈ క్రమంలోనే ముందుగా ఊహించినట్లుగానే సీపీ రాధాకృష్ణన్ ఈ ఎన్నికలో గెలుపొందారు. రాధా కృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. …
Read More »ఏపీలో మోగిన నగారా.. స్థానిక సమరానికి రంగం రెడీ!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం రెడీ అయింది. వచ్చే ఏడాదితో రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు గడువు తీరుతుంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం నాలుగు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో నీలం సాహ్ని మీడియాతో మాట్లాడారు. ఈ దఫా ఎన్నికలను స్వేచ్ఛగా పక్షపాత రహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుందని …
Read More »వైసీపీతో మిలాఖత్.. ఇక, వారికి చుక్కలే.. !
రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోని నాయకులతో చేతులు కలిపి పనులు చేస్తున్నారన్నది ప్రధాన విమర్శ. ఇది గత ఏడు నెలలుగా వినిపిస్తున్నప్పటికీ.. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వారికి చెక్ పెట్టేదిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి చిన్నాచితక కాంట్రాక్టులు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిని వైసిపి లోని అనుకూల నాయకులతో కలిసి …
Read More »‘సూపర్ సిక్స్’కు జీఎస్టీ దెబ్బ.. !
జీఎస్టీ తగ్గింపు ప్రభావం రాష్ట్రంలో ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ మేరకు దీని ప్రభావం పడుతుంది? అనేది ఆర్థిక శాఖలో చర్చిగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా పన్నులపై ఆధారపడి పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి …
Read More »రూటు మార్చిన ఫైర్ బ్రాండ్.. ఇప్పుడు ఆపన్న నేత..!
ఒకప్పుడు ఆయన నోరు విప్పితే విమర్శలు. నోరు విప్పితే వివాదాలు అనే మాటను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మీడియా ముందుకు వస్తే సంచలనాలకు వేదిక అనే మాట కూడా వినిపించేది. దీంతోనే గత ఎన్నికల సమయంలో అసలు టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం వెనకడుగు వేసింది. అటువంటి నాయకుడు ఇప్పుడు ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతగా రాజకీయ వర్గాల్లో …
Read More »‘సీఎం.. డిప్యూటీ సీఎంలు సినిమాల్లో నటించకూడదన్న రూల్ లేదు’
ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నోళ్లు సినిమాల్లో నటించకూడదా? అలా నటించటం చట్ట విరుద్ధమా?అన్న ప్రశ్నలకు ఇప్పటికే ఇచ్చిన తీర్పుల ప్రకారం.. అలాంటిదేమీ కనిపించదు. ఇదే విషయాన్ని తాజాగా ఏపీ హైకోర్టుకు తెలియజేశారు అడ్వొకేట్ జనరల్ దమ్మలాపాటి శ్రీనివాస్. ఇంతకూ ఏం జరిగిందంటే.. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ వాదన ఏమంటే.. ఏపీకి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ ను సినిమాల్లో నటించకుండా …
Read More »జగన్ మామ వర్సెస్ రాజా అల్లుడు.. అప్పుడే చర్చ.. !
పులివెందుల నియోజకవర్గంలో తమకు తిరుగులేదని భావిస్తూ వచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాల్లో ఇబ్బందికర పరిణామాలు తప్పవనే సంకేతాలు తెర మీదకు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేసిన ప్రకటన పులివెందుల రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి …
Read More »4 కార్పొరేషన్లు: 51 మంది డైరెక్టర్లు.. ఏం పందేరం బాబూ!
ఏపీలో పదవుల పందేరంలో హైలెట్గా నిలిచే వార్త ఇది!. నామినేటెడ్ పదవుల విషయంలో సీఎం చంద్రబాబుపై ఉన్న ఒత్తిళ్లకు ఇది నిలువుటద్దంగా మారుతోంది. ప్రస్తుతం టీడీపీలో అనేక మంది నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. వీరిని సంతృప్తి పరిచేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున డైరెక్టర్లను నియమిస్తూ.. జంబో కార్పొరేషన్లుగా మారుస్తున్నారు. ఒకరకంగా చూస్తే.. కార్పొరేషన్లో సిబ్బంది కంటే కూడా.. డైరెక్టర్ల సంఖ్యే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates