ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ… అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసే దిశగా యత్నించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అసెంబ్లీలో పాసై శాసనమండలికి వచ్చిన మూడు రాజధానుల బిల్లును నాడు మండలి చైర్మన్ గా కొనసాగిన మహ్మద్ షరీఫ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ …
Read More »‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి లేకపోతే). అయితే ఆ రెండు ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న విషయంపై వైసీపీ నేతలకు ఓ స్పష్టమైన అవగాహన అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే… ఏపీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావులు మరోమారు సీఎంలుగా కొలువుదీరతారన్న అర్థం వచ్చేలా వైసీపీ నేతలు చెబుతున్నారు. తాము …
Read More »సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకి సొంత పార్టీ షాక్
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. పార్టీ పేర్లు వేర్వేరుగా ఉన్నా.. రాజకీయ పార్టీల డీఎన్ ఏ మాత్రం ఒకేలా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది ఆమ్ ఆద్మీ. దేశంలోని రాజకీయ పార్టీలకు భిన్నంగా.. రాజకీయాల కంటే కూడా ప్రజల కోసం పోరాటం చేయటమే లక్ష్యమని చెప్పే పార్టీ.. మిగిలిన పార్టీల మాదిరే తన పార్టీకి …
Read More »అమరావతిపై చర్చ.. రాజ్యసభలో దుమ్మురేపిన నాయుడు
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.. దీనిని సభకు సమర్పించారు. అనంతరం.. చైర్మన్ సీపీ రాధాకృష్ణన్.. చర్చకు అనుమతించారు. తొలుత టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఈ చర్చను ప్రారంభించారు. తనదైన శైలిలో ఆయన సభలో దుమ్మురేపారు. రాజధానికి సంబంధించి పూర్వాపరాలతో పాటు.. చంద్రబాబు-జగన్ ప్రభుత్వాల హయాంలో రాజధాని …
Read More »ఎలక్షన్ ఎఫెక్ట్: `ఐప్యాక్`పై ఈడీ నజర్!
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీ చేపట్టారు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై సహా.. ఇతర ప్రాంతాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో తనిఖీలు చేస్తున్నట్టు వివరించింది. అయితే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. …
Read More »జగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయింది
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం నిన్నటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత వైరల్ అయిపోయింది. 2014 ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని తొలిసారి రాజధానిగా ప్రకటించినపుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అంటూ ప్రకటించి, 2019లో అధికారంలోకి వచ్చాక యుటర్న్ తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి నాశనానికి పూనుకున్న జగన్.. ఇప్పుడు …
Read More »తండ్రి బాటలోనే పేర్ని కిట్టు
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి ఎగబడిపోతూ ఉంటారు. తాను చెప్పిందే వేదమంటూ ఆయన చేస్తున్న వాగ్వాదాలు వైరల్ అవుతూ ఉంటాయి. నాని రాజకీయ వారసత్వం పుచ్చుకున్న ఆయన కుమారుడు పేర్ని వాక సాయి కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కొట్టు కూడా అచ్చూ తన తండ్రి మాదిరే వ్యవహరిస్తున్నారు. అధికారులన్నా, పోలీసులన్నా ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదు. తాజాగా ఓ సర్కిల్ …
Read More »ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం.. తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇక, లోక్సభలో ఆమోదం కూడా పొందిన ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దీనికి ఆమోద ముంద్ర వేయడంతో అధికారికంగా.. అమరావతికి చట్టబద్ధత చేకూరుతుంది. అయితే.. దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏంటి? …
Read More »మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. తొలిసారి కేరళలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పలు చోట్ల నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొన్నారు. …
Read More »నాడూ మూడే!… నేడూ మూడే!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా లేకుండా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీకి రాష్ట్రం నడిబొడ్డున అమరావతిని రాజధానిగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. చంద్రబాబు సర్కారు నుంచి ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో నాటి నుంచి జగన్ నోట మూడు రాజధానులు అనే మాట పదే పదే …
Read More »మోడీ ముందు జగన్ మరింత పలుచన!
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను ఎదిరించి.. బెదిరించి నిలదొక్కుకునే పార్టీలు దాదాపు కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక సందర్భంలో మోడీకి మద్దతు ఇవ్వకతప్పడం లేదు. అయితే.. మోడీ సైతం.. ఆయా పార్టీలు, రాజకీయ నేతల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. పార్టీలు ఏవైనా.. రాష్ట్రాలు మరేవైనా.. ఆయనకు ఉండే సీనియర్ల …
Read More »దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని, వారికి న్యాయం జరిగేలా దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయని, మరి ఈ విషయంలో జగన్ వైఖరి ఏంటని ఆమె ప్రశ్నించారు. జగన్కు దళిత క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వారి తరఫున గళం వినిపించిన జగన్ కేవలం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates