Political News

జ‌గ‌న్‌.. భ‌స్మాసురుడు: చంద్ర‌బాబు

ఏపీకి భ‌స్మాసురుడు ఎవ‌రైనా ఉన్నారంటే.. అది జ‌గ‌నేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. మంగళ‌వారం రాత్రి నంద్యాల జిల్లాలో నిర్వ‌హించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో సీమ జిల్లాలు నీరు లేక అల‌మ‌టించిపోతున్నాయ‌న్నారు. ఇదే జిల్లాల‌కు చెందిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. క‌నీసం ఇక్క‌డి వారిని ఆదుకోవాలన్న స్పృహ కూడా లేకుండా వ్య‌వ‌హ‌రిస్త‌న్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. “ఎక్కడ చూసినా విధ్వంస పాలన. రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం …

Read More »

వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, అస‌లు కాంగ్రెస్

‘తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మ‌గ‌త‌నం త‌ప్ప‌.. ప‌గ‌త‌నం లేదు’ అని ఆయ‌న మేన‌ల్లుడు, మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న ఖ‌మ్మం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ ఎస్‌ పార్టీ నాయ‌కుల‌తో తెలంగాణ భ‌వ‌న్‌లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారికి వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌పైనా.. పాల‌కుల‌పైనా ఆయ‌న నిశిత విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌తంలో కేసీఆర్ …

Read More »

రాతియుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం వస్తారా?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదలైన ఈ కార్యక్రమం ఈ రోజు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన చంద్రబాబు బహిరంగ సభకు వేల సంఖ్యలో …

Read More »

రేవంత్ కంటే కేసీఆర్ బలవంతుడన్న కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతల విమర్శలకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అనే రెండు అక్షరాల కంటే …

Read More »

జ‌గ‌న్‌ను శ‌పిస్తా: పాల్ వారి కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను శ‌పిస్తానంటూ ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు.. ప్ర‌ముఖ సువార్తీకులు కిలారి ఆనంద‌పాల్ హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు తాడేప‌ల్లి రోడ్ల మీదే హ‌ల్చ‌ల్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుని.. మ‌రోసారి జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రి చేయాల‌న్న కాంక్ష‌తో .. ఆశ‌యంతో .. తాను తాడేప‌ల్లికి వ‌చ్చిన‌ట్టు చెప్పారు. అయితే.. తాడేప‌ల్లి ప‌రిస‌రాల్లో 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తున్న పోలీసులు.. పాల్‌ను …

Read More »

న‌గ‌రాల‌పై న‌జ‌ర్‌.. వైసీపీ ఎన్నిక‌ల స్ట్రాట‌జీ ఇదే!

ఏపీలో మ‌రో రెండు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా లోక్‌స‌భ ఎన్నిక‌లు కూడా జ‌రుగుతాయి. గ్రామీణ స్థాయిలో వైసీపీకి గ్రాఫ్ బాగానే ఉంద‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు. ఇంటింటి కీ పింఛ‌న్లు, రేష‌న్‌, వైద్యం, ఇంటి డాక్ట‌ర్ కాన్సెప్టు, ఆరోగ్య‌శ్రీ వంటివి పార్టీకి మేలు చేస్తున్నాయ‌ని నాయ‌కులు లెక్క‌లు వేసుకున్నారు. దీంతో గ్రామీణ స్థాయిలో పార్టీకి ఇబ్బంది లేద‌ని భావిస్తున్నారు. ఇక‌, ఎటొచ్చీ.. కీల‌క‌మైన న‌గ‌రాలు.. ప‌ట్టణాల్లో ఓటు …

Read More »

ఏపీలో దళితులు నామినేషన్ వేసే పరిస్థితి లేదు: పవన్

విజయవాడలో పర్యటటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. చంద్రబాబుతో కలిసి సంయుక్తంగా సీఈసీ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, హింస పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలలో దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని అధికారులకు …

Read More »

కేంద్ర పోలీసులు పంపండి…సీఈసీకి చంద్రబాబు రిక్వెస్ట్

ఏపీలో మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన లకు చెందిన ఓట్లను వైసీపీ నేతలు తొలగిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం విజయవాడలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సీఈసీ అధికారులతో …

Read More »

గుంటూరు ఎంపీగా ఆలపాటి ?

రాబోయే ఎన్నికల్లో సీనియర్ తమ్ముడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి ఆలపాటి తెనాలి అసెంబ్లీ సీటును దాటి ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ ఇపుడు పరిస్ధితులు మునుపటిలా లేవు. ఎందుకంటే తెనాలిలో టికెట్ దక్కేది దాదాపు అనుమానమే. కారణం ఏమిటంటే జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఇక్కడి …

Read More »

బాలయ్య‌కు లైన్ క్లియ‌ర్ చేస్తున్న వైసీపీ…!

టీడీపీ నాయ‌కుడు, న‌ట‌సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణకు వైసీపీ లైన్ క్లియ‌ర్ చేస్తోందా? ఆయ‌న‌కు మ‌రింత మెజారిటీ ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ(2014, 2019) బాల‌య్య హిందూపురం నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. ఈ ద‌ఫా ఇక్క‌డ ఆయ‌న‌ను ఓడించాల‌ని వైసీపీ భావించింది. అయితే.. అంత‌ర్గ‌త‌కుమ్ములాట‌లు, వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి కార‌ణంగా.. ఇక్క‌డ స‌రైన నాయ‌కుడు వైసీపీకి క‌నిపించ‌లేదు. ఈ …

Read More »

రేవంత్ కేబినెట్ ఇకపై కింగ్ సైజ్

ఈనెలాఖరులో క్యాబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రేవంత్ కాకుండా 11మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అంటే మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశముంది. ఇపుడున్న మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీల నుండి ప్రాతినిద్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తరపున పోటీచేసిన మైనారిటి నేతలంతా ఓడిపోయారు కాబట్టే. ఓడిపోయిన వారిలో షబ్బీర్ ఆలీ, మహ్మడ్ అజహరుద్దీన్ ముఖ్యులు. అందుకనే మంత్రివర్గాన్ని విస్తరించి …

Read More »

కోదండరామ్ కు కన్ఫర్మ్ అయ్యిందా ?

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. దేనికంటే తొందరలోనే భర్తీ అవబోయే రెండు ఎంఎల్సీ స్ధానాలకోసం. ఈనెలాఖరులో ఎంఎల్ఏ కోటాలో ఖాళీ అయిన రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీకోసం కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిపికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమీషన్ జారిచేసిన నోటిఫికేషన్ ప్రకారం రెండుస్ధానాలూ కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయి. అందుకనే ఇంత ఒత్తిడి పెరిగిపోతోంది. కొందరు నేతలు రేవంత్ రెడ్డిపైన మరికొందరు నేతలు డైరెక్టుగా …

Read More »