తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా బీజేపీ భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ముందుగా రాష్ట్ర మోర్చాలతో పాటు 12 మంది జిల్లాల అధ్యక్షులను మార్చేసింది. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన ఆరు మోర్చాలను కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మార్చేశారు. ఇపుడు మార్చిన వాళ్ళంతా చాలా కాలంగా పదవుల్లో ఉన్న వాళ్ళే. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నపుడు కిషన్ వీళ్ళని మార్చటంపై దృష్టిపెట్టలేదు. ఎందుకంటే …
Read More »ఈటల పోటి ఇక్కడి నుండేనా ?
తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారా ? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఎందుకంటే మల్కాజ్ గిరి స్ధానం నుండి పోటీచేస్తానని ఈటల పార్టీ అగ్రనేతలను అడిగారు. ఈ విషయాన్ని ఈటలే స్వయంగా చెప్పారు. తనకు కరీంనగర్ పార్లమెంటుకు పోటీచేయాలని బలంగా ఉందట. ఎందుకంటే కరీంనగర్ జనాలతో తనకు ప్రత్యేక అనుబంధముందట. అయితే ఇక్కడ సిట్టింగ్ …
Read More »పోటీకే భయపడుతున్నారా ?
బీఆర్ఎస్ లో నేతల మాటలు వింటుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులను ఫైనల్ చేయటంతో పాటు నియోజకవర్గాల్లో పరిస్ధితులను సమీక్షించేందుకు ఈమధ్యనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. దాదాపు ఆరునియోజకవర్గాల్లోని నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చాలామంది నేతలు ఎంపీగా పోటీచేసే విషయంలో ఆసక్తిచూపలేదని సమాచారం. అలాగే గెలుపు అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నట్లు చెప్పారని పార్టీవర్గాలు …
Read More »వాసిరెడ్డి పద్మకు అసెంబ్లీ టికెట్.. గెలిచేనా..!
గత రెండు రోజులుగా.. వైసీపీ వర్గాల్లో వాసిరెడ్డి పద్మ పేరు మార్మోగుతోంది. తాజాగా ఆమెకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు కూడా వచ్చింది. ఈ రోజో రేపో.. ఆమె ముఖ్యమంత్రిని కూడా కలవనున్నారు . రాబోయే ఎన్నికల్లో ఆమెకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని.. ఆమె పేరు పరిశీలనలో ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. కీలకమైన జగ్గయ్య పేట నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో నిలుపుతారని కూడా …
Read More »నాలుగో జాబితా విడుదల చేసిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్చార్జిలను మూడు విడతలుగా వైసీపీ ప్రకటించింది. సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. అయినా సరే వెనక్కి తగ్గని జగన్ తాజాగా ఇన్చార్జిల మార్పునకు సంబంధించి నాలుగో …
Read More »టీడీపీ-జనసేన విజయం అన్ స్టాపబుల్: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సినీ డైలాగులతో ఉర్రూతలూగించారు. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన జన్మించిన గడ్డపై ‘రా.. కదలిరా!’ సభను నిర్వహించారు. ఈ సభ ఏర్పాట్ల నుంచి నిర్వహణకు వరకు ఆద్యంత ఉద్రిక్త వాతావరణంలోనే సాగింది. అయితే.. చివరి మూడు గంటలు మాత్రం.. పోలీసులు నచ్చజెప్పడంతో ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం శాంతించింది. దీంతో సభ సజావుగా సాగిపోయింది. ఈ సభలో తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో …
Read More »నాపై పోటీ చేసే అభ్యర్థిని వెతుక్కోండి: రఘురామ
వైసీపీ రెబల్ ఎంపీ, నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజు తాజాగా వైసీపీపై సటైర్లు వేశారు. తనకు టీడీపీ-జనసేన మిత్రపక్షం టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తోందని వైసీపీలో కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే.. వాస్తవానికి ఈ సీటు ఎప్పుడో తనకే రిజర్వ్ అయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మిత్రపక్షం తరఫున తాను నరసాపురం ఎంపీ సీటు నుంచే పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంలో రెండో మాటేలేదన్నారు. “అయితే.. …
Read More »కేసీఆర్ పథకానికి.. రేవంత్ సొమ్ము!
మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేసిన.. కీలక పథకానికి ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం మహిళలను ఆకట్టుకునేందుకు.. ‘బతుకమ్మ చీరలు’ పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసి.. ఇంటికో చీర చొప్పున పంపిణీ చేసింది. ఇది కూడా కొన్ని చోట్ల వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. …
Read More »పూర్ టు రిచ్ కాన్సెప్ట్ సీక్రెట్ చెప్పిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. గతంలో నిర్వహించిన సభల్లో ప్రకటించిన ‘పూర్ టు రిచ్’ కాన్సె ప్ట్ ను తాజాగా ఆవిష్కరించారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన జన్మభూమి.. నిమ్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్ను చంద్రబాబు ఆవిష్కరిస్తూ.. దీని లక్ష్యాలను కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి.. అధికారంలోకి వచ్చాక సమగ్రంగా అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం నిమ్మకూరు-నారా వారి …
Read More »రాయపాటి ఫ్యామిలీలో రాజకీయ రచ్చ.. టీడీపీకి పోయేదేంటి..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రాయపాటి ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. రాయపాటి సాంబశివరావు.. దాదాపు 40 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఉన్నారు. 2014 వరకు ఆయన కాంగ్రెస్ లో చక్రం తిప్పారు. అయితే.. టీడీపీకి కూడా ఆయన సానుకూలంగా ఉన్నారనే చర్చ ఉంది. విభేదించేవారు కాదు. అంతేకాదు.. అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన.. కన్నా లక్ష్మీనారాయణతోనే వైరం ఉండేది తప్ప.. టీడీపీ నాయకులతో ఆయన ఎక్కడా విభేదించిన సందర్భాలు …
Read More »కాంగ్రెస్ కి పెద్ద షాకే ఇది
తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై మొదటి షాక్ ఇచ్చారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయ్యింది. భర్తీ చేయాల్సిన రెండుపేర్లపై రేవంత్ పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇదే విషయమై పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు. …
Read More »అది నిజమైతే.. నియోజకవర్గం వదిలేస్తా: కొడాలి నాని
గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఫైర్బ్రాండ్ కొడాలి నాని మరోసారి హీటెక్కించారు. తాజాగా ఆయన టీడీపీపై నిప్పులు చెరిగారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు గుడివాడలో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా టీడీపీఅధినేత చంద్రబాబు నాయుడు రా..కదలిరా! సభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున గుడివాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. టీడీపీపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో …
Read More »