ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మూడు రాజధానులకు ఈ నెల 17వ తేదీతో మూడేళ్లు పూర్త య్యాయి. అసెంబ్లీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలోనే మూడు రాజధానులు సాకారం అవుతా యని చెప్పారు. అయితే.. ఇవి ఎక్కడిగొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయాయి. సరే.. ఇవి అలా ఉండడానికి న్యాయపరమైన సమస్యలు మాత్రమే కారణం కాదు.. రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. …
Read More »ఆంధ్రప్రదేశ్ జనం బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదా ?
జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితి…(బీఆర్ఎస్)ను స్థాపించిన కేసీఆర్ …ఏపీ వైపు చూస్తున్నారు. ఢిల్లీలో కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం… ఇకపై పార్టీ విస్తరణకు ప్రాధాన్యమిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడంపైనే తొలుత దృష్టి పెడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీ వైపుకు బీఆర్ఎస్ కదులుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి శ్రీనివాస యాదవ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించారు. …
Read More »చంద్రబాబుకు ఎంత క్రేజ్ ఉందో చెప్పేసిన ఐఎస్ బీ
వారేం అల్లాటప్పా బ్యాచ్ కాదు. అత్యున్నత విద్యార్హతలతో పాటు.. కీలక స్థానాల్లో ఉండేవారు. లక్షలాది మంది సమయం కన్నా వారి టైం విలువ చాలా ఎక్కువ. రోటీన్.. రొడ్డుకొట్టుడు రాజకీయాల్ని వారు అస్సలు పట్టించుకోరు. విషయం లేని వాటివైపు వారి చూపు పడదు. అలాంటి వారు డెబ్భై ప్లస్ లో ఉండి.. నిద్ర లేస్తే రాజకీయ ప్రత్యర్థుల చేత విపరీతంగా తిట్టించుకునే చంద్రబాబు ప్రసంగానికి క్యూ కట్టటమా? నీ పనైపోయింది …
Read More »జగన్ ఊహించని కష్టం ?
రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనడం తేలికే. ఎందుకంటే వారు కళ్ల ముందే కనిపిస్తారు. అయితే.. కని పించని శత్రువును ఎదుర్కొనడం.. ప్రతిపక్షాలను మించిన వ్యూహాలతో ముందుకు సాగే.. అయిన వారిని అడ్డుకోవడం.. అంత తేలిక అయితే కాదు. ఊహలకు కూడా అందని విధంగా.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ విషయంలో ఆయన బావ, క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు వైసీపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సీబీఐ సంచలన ఆరోపణలు!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపిన సీబీఐ.. తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. దీనిలో అనేక సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కోర్టు సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా తనకు ఏ పాపం తెలియదని చెబుతున్న తెలంగాణ సీఎం కుమార్తె కవిత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్రలను సీబీఐ పూసగుచ్చినట్టు వివరించడం గమనార్హం. ఛార్జ్షీట్లో …
Read More »గంటా-కన్నా-బొండా.. భేటీ ఎందుకు హాట్ అయిందంటే!
మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. . తాజాగా విజయవాడలోని ఓ హోటల్ లో రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చసాగుతోంది. వాస్తవానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయకులు. గంటా, బొండా ఇద్దరూ టీడీపీలో ఉన్నారు. కన్నా మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు …
Read More »వంద రోజులు పూర్తి .. మరి ఇమేజ్ పెరిగిందా?
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులకు చేరింది. తమిళనాడు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకూ 8 రాష్ట్రాల్లో సాగింది. దాదాపు 2,800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ కు అదనంగా లభించిన ఫలితం ఏంటి? రాహుల్కు దక్కిన ఇమేజ్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 …
Read More »చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందా..
టీడీపీ అధినేత, ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు భద్రతపై అనుమానాలు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయనకు ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చినట్లు చెబుతున్నారు. దానితో దేశం నేత భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన రెండు మూడు సంఘటనలు కూడా భద్రత పెంపుపై దృష్టి సారించడానికి కారణమవుతున్నాయి. దేశంలో ఎన్ఎస్జి భద్రత ఉన్న అతి కొద్ది మంది ఉన్న వీవీఐపీల్లో …
Read More »ఎన్నికల మూడ్లోకి ఏపీ..
సార్వత్రిక సమరానికి దాదాపు ఏడాదిన్నర ముందే ఏపీ దాదాపు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయినట్టే కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అన్నీ కూడా దాదాపు ప్రచారం ప్రారంభించాయని చెప్పక తప్పదు. అధికార పార్టీ వైసీపీ నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వరకు.. మరో పార్టీ జనసేన వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గెలుపు గుర్రం ఎక్కడం కోసం టీడీపీ, వైసీపీ, జనసేనలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే.. ఎవరు గెలుస్తారు? ఎవరు …
Read More »బీజేపీ, టీడీపీ దోస్తీ అడ్డం పడుతున్న తెలంగాణ లీడర్?
రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ దోస్తీ ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూటమి కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణకు చెందిన ఓ నేత అడ్డం పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలే ఉన్న ఆ నేత కేంద్రంలోని బీజేపీ …
Read More »బీఆర్ఎస్ కార్యకర్తల జేబులు మాత్రం ఖాళీ అయిపోయాయి
కేసీఆర్ జాతీయ పార్టీ కలలేమో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటామోటా నాయకులకు మాత్రం ఆదిలోనే జేబులు బాగా ఖాళీ అయ్యాయి. దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఎగురుకుంటూ వచ్చిన కార్యకర్తలు, చోటామోటా నాయకులు తిరుగు ప్రయాణంలో బుక్కయ్యారు. పార్టీ ఆఫీసు ప్రారంభం తరువాత గురువారం, శుక్రవారం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావాలనుకుని విమానం టిక్కెట్లు చెక్ చేస్తే వారకి గుండె గుబేల్మంది. నాన్ స్టాప్ ఫ్లైట్ చార్జీలు రూ. 25 …
Read More »కేవలం పవన్తో పని జరిగేనా?
ఏపీలో ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకుని వైసీపీ విముక్త ఏపీని సాధించాలనేది ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉంది. అయితే.. ఈ క్రమంలో పార్టీకి పెద్దగా బలగం లేదు. ఉన్నదల్లా పార్టీ అదినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ మాత్రమే. నిజానికి టీడీపీని తీసుకున్నా.. చంద్రబాబు ఇమేజ్ ఇప్పటికీ తరిగిపోలేదు. అదేవిధంగా వైసీపీని తీసుకున్నప్పటికీ.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates