Trends

టీకా వేసుకున్నాక.. కరోనా వచ్చే రిస్కు ఇంతేనట!

ఓవైపు కరోనా ఆందోళన.. మరోవైపు వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు. ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. దేన్నిపట్టించుకోకుండా ప్రభుత్వం చెప్పే మాటను నమ్మేటోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు భిన్నంగా ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే వారికి మాత్రం తిప్పలు తప్పువు. అదే సమయంలో.. ప్రభుత్వం చెప్పేదానికి.. తమ కళ్ల ముందు కనిపించే అంశాల్ని లింకు వేసుకునే వారికి వచ్చే సందేహాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ ప్రపంచంలో చాలానే …

Read More »

రాష్ట్రంలో రెడ్ అలర్ట్ తప్పదా ?

దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాగే ఏపిలో కూడా కరోనా వైరస్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతోంది. రోజుకు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. రికార్డుల ప్రకారం 35 మంది చనిపోయారు. ఏపికి నాలుగువైపులా తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఒడిస్సా రాష్ట్రాలున్నాయి. వీటిల్లో తమిళనాడు, కర్నాటక, తెలంగాణాలో ప్రతిరోజు వేలాదికేసులు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం ఏపిపైన కూడా పడుతోంది. మొదటి దశలో …

Read More »

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎంతకమ్ముతున్నారంటే..

నెల రోజుల ముందు దేశవ్యాప్తంగా చాలా చోట్ల వ్యాక్సినేషన్ సెంటర్లు వెలవెలబోయాయి. కరోనా ప్రభావం తగ్గిపోయిందని, ఇక భయం లేదని భావించి జనాలు వ్యాక్సినేషన్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ధాటికి కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు జనాల్లో మళ్లీ భయం కనిపిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. కానీ డిమాండుకు తగ్గట్లు సరఫరా లేదు. ఐతే ఉత్పత్తి పెంచడానికి కేంద్ర …

Read More »

కేసీఆర్ కర్ఫ్యూ మాటకు హైదరాబాద్ రెస్సాన్స్ ఇదే

కేసులు పెరిగిపోతున్నాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించండి మహా ప్రభో.. అన్న విన్నపాల్ని పట్టించుకోని కేసీఆర్ సర్కారు.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలకు వెంటనే స్పందించటం.. మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. ఈ జీవో విడుదల కావటానికి కొన్ని గంటల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పాజిటివ్ గా తేలటం షాకింగ్ గా …

Read More »

‘చావు’ బిజినెస్‌.. త‌ప్ప‌న‌లేం.. కాద‌న‌లేం..!

దేశాన్ని క‌రోనా కాలం ప‌ట్టిపీడిస్తోంది. ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని బతుకున్న ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలో క‌రోనా బారిన ప‌డి.. ఎవ‌రైనా మృతి చెందినా.. వారికి స‌రైన రీతిలో ద‌హ‌న సంస్కారాలు చేసే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆత్మీయులు పోయార‌న్న ఆవేద‌న‌.. వెంటాడుతున్నా.. క‌రోనా భీతి .. మ‌నషుల‌ను నిలువునా కాల్చేస్తోంది. దీంతో అయిన వారికి అంతిమ సంస్కారం చేసేందుకు సైతం వెనుకాడుతున్న వారు క‌నిపిస్తున్నారు. చనిపోయిన …

Read More »

వైర‌ల్ వీడియో.. రైల్వే ట్రాక్‌పై అద్భుతం

నిన్న‌ట్నుంచి సోష‌ల్ మీడియాను ఒక మీడియా ముంచెత్తుతోంది. ఒక రైల్వే స్టేష‌న్లో అవ‌త‌లి నుంచి రైలు దూసుకొస్తుండ‌గా.. ట్రాక్ మీద ప‌డ్డ పిల్లాడిని ఆ స్టేష‌న్లో విధులు నిర్వ‌ర్తించే పాయింట్స్ మ్యాన్ క్ష‌ణాల వ్య‌వ‌ధిలో ప్రాణాల‌కు తెగించిన తీరు అబ్బుర ప‌రుస్తోంది ఈ వీడియోలో. ముంబ‌యిలోని వాంగ‌ని రైల్వే స్టేష‌న్లో చోటు చేసుకుంది. మ‌యూర్ షేల్కే అనే పాయింట్స్ మ్యాన్ అసాధార‌ణ సాహ‌సంతో హీరో అయ్యాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. …

Read More »

సెకండ్ వేవ్: ఇలాంటి లక్షణాలు వస్తే.. అలెర్టు అవ్వాల్సిందే

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సెకండ్ వేవ్.. షాకుల మీద షాకులు ఇస్తోంది. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో పాజిటివ్ ల జోరు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. మొదటి వేవ్ లో కరోనా సోకిన వారికి కనిపించిన లక్షణాలకు.. సెకండ్ వేవ్ వేళ.. కనిపిస్తున్న లక్షణాల్లో కాస్తంత మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. నిత్యం కరోనా రోగులకు చికిత్స చేస్తున్న పలువురు వైద్య నిపుణులు.. తమ వద్దకు వస్తున్న …

Read More »

డబ్బుకు ఇబ్బంది తప్పదా ?

కరోనా వైరస్ ప్రభావం కరెన్సీ మీద కూడా పడిందా ? అంటే అవునే సమాధానం వినిపిస్తోంది. కరోనా పుణ్యమా అని తొందరలోనే దేశంలో కరోన్సీ చెలామణికి ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఎందుకంటే కరెన్సీని ముద్రించే ప్రెస్సులపైన కూడా కరోనా వైరస్ ప్రభావం పడిందట. మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కొన్ని వేల కేసులు బయటపడుతున్నాయి. అదే స్ధాయిలో చనిపోతున్న వారిసంఖ్య కూడా రోజురోజుకు …

Read More »

బెంగుళూరును వణికించేస్తున్న కరోనా

ఇప్పటివరకు ఉత్తరాధిని వణికించేస్తున్న కరోనా వైరస్ పడగ తాజాగా బెంగుళూరు మీద పడింది. కరోనా వైరస్ కారణంగా బెంగుళూరు సిటిలో రోజుకు కనీసం వందమంది దాకా చనిపోతున్నట్లు సమాచారం. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకోసమని ప్రభుత్వం ప్రత్యేకంగా 5 శ్మశానవాటికలను ఏర్పాటుచేసింది. అయితే ఇపుడు కరోనా వైరస్ తీవ్రత దెబ్బకు ఇవి ఏమాత్రం సరిపోవటంలేదని సమాచారం. బెంగళూరులోని జాలహళ్ళి, సుమనహళ్ళి, కెంగేరి, బొమ్మనహళ్ళి, పెనత్తూరు శ్మశానవాటికలను ప్రభుత్వం కరోనా మృతుల …

Read More »

40 కోట్లమంది టీవీలే చూడటంలేదట

మనదేశంలో ఉన్న టెలివిజన్లు 21 కోట్లేనని తాజా లెక్కల్లో తేలింది. దేశజనాభా 130 కోట్లన్న విషయం అందరికీ తెలిసిందే. జనాభా 130 కోట్లన్నమాటే కానీ కుటుంబాల సంఖ్య 30 కోట్లు. అంటే సగటును ఒక్కో కుటుంబంలో 4.5 సభ్యులున్నట్లు లెక్క. ఈ లెక్కలన్నీ ఏదో సర్వే సంస్ధ విడుదల చేసింది కాదు. బార్క్ అంటే బ్రాడ్ క్యాస్టింగ్ ఆడియన్స్ రేటింగ్ కౌన్సిల్ విడుదల చేసిన లెక్కలు కాబట్టి దాదాపు వాస్తవమే …

Read More »

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం!

ఈమధ్యకాలంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క రోజులో కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పిన సరే కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ కంటైనర్ లో మంటలు తారాస్థాయిలో చెలరేగడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ …

Read More »

అంత పెద్ద ప్రొఫెసర్.. ఎంత దారుణంగా మరణించారంటే?

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిస్థితులు ఎంత తీవ్రంగా.. మరెంత దారుణంగా ఉన్నాయన్న విషయం కళ్లకు కట్టినట్లుగా తెలిపే ఉదంతంగా దీన్ని చెప్పాలి. రోజులు గడుస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు.. అందుకు తగ్గట్లు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందని దుస్థితి. దీంతో.. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. సామాన్యుల సంగతి తర్వాత.. సమాజంలో గుర్తింపు.. గౌరవంతో పాటు.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారికి …

Read More »