టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి హెచ్-1బీ వీసా వ్యవహారంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికాలో నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను ఆహ్వానించేందుకు ఉపయోగించే హెచ్-1బీ వీసా విధానంలో లోపాలు ఉన్నాయని, దీనిపై సమూల మార్పులు అవసరమని ఆయన పోస్ట్ చేశారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ వల్ల అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారని, వీటిని నియంత్రించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) లో, హెచ్-1బీ వీసా నియమాలను …
Read More »జైస్వాల్ ఔట్.. థర్డ్ అంపైర్ రివ్యూ తప్పిదమా?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఔట్ తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు వరుసగా విఫలమవుతుండగా, జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ భారత జట్టుకు ఆశలు చిగురింపజేశాడు. కానీ 84 పరుగుల వ్యక్తిగత స్కోరులో అతని ఔట్ తీరు వివాదాలకు కారణమైంది. పాట్ కమిన్స్ బౌలింగ్లో 70.5 ఓవర్ వద్ద …
Read More »మెల్బోర్న్ టెస్ట్లో భారత్ ఘోర పరాజయం!
మెల్బోర్న్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ విఫలమై కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత బ్యాటింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేస్తూ 84 పరుగులతో …
Read More »‘పోస్ట్ నో ఈవిల్’, నగరాల్లో పోస్టర్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం
వైసీపీ హయాంలో దారి తప్పిన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని పదే పదే చెప్పిన సీఎం చంద్రబా బు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు నిజంగానే ఆ పని చేస్తున్నారు. ఇప్పటికి అంతర్గతంగా కొన్ని వ్యవస్థలను దారిలోకి తీసుకువచ్చారు. ఇక, ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా ను కూడా సంస్కరించే పనిని ప్రారంభించారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియా అంటే.. బూతులకు, దుర్బాషలకు, పరుష కామెంట్లకు వేదికగా మారిపోయాయన్న విమర్శలు వున్నాయి. …
Read More »నీతా అంబానీ ఐఫోన్ గుట్టు వీడిపోయింది
ప్రముఖులకు సంబంధించి విషయాలు తరచూ చర్చకు వస్తూ ఉంటాయి. మీడియాకు మించి సోషల్ మీడియా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అవసరం లేని విషయాల మీద చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కొన్ని అబద్ధాల్ని అందమైన నిజాలుగా చూపించే సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది నిజం? అన్నది తెలుసుకోవటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. దేశీయంగా సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ …
Read More »ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి
దక్షిణ కొరియాలో జరిగిన దారుణ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7సి2216, ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పింది. బోయింగ్ 737-800 విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, ఈ ప్రమాదంలో 179 మంది మృతిచెందారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానం రన్వే చివరికి …
Read More »సానియా – షమీ… అసలు మ్యాటర్ ఇదే
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డేటింగ్లో ఉన్నారన్న ప్రచారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో రిలేషన్షిప్ ఉందంటూ ప్రచారమవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, బీచ్లో హగ్ చేసుకుంటున్న ఫొటో కూడా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఫొటోకు ఇప్పటికే వేలాది లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయి. అయితే, దీనిపై నిజానిజాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. సానియా మీర్జా …
Read More »సెంచరీ తరువాత అందుకే ఆ స్టిల్: నితీశ్ కుమార్ రెడ్డి
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో, భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కి దిగి తన కెరీర్లో తొలి సెంచరీని సాధించిన నితీశ్, భారత్ను ఫాలో-ఆన్ ముప్పు నుంచి కాపాడాడు. మొత్తం 171 బంతుల్లో 105 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు, తన పట్టుదలతో జట్టును నిలబెట్టాడు. నితీశ్ చూపించిన ఆటతీరుకు క్రీడా ప్రపంచం …
Read More »న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందు బాబులకు గుడ్ న్యూస్!
కొత్త సంవత్సరం వేడుకల సందడి మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా వైన్ షాపులు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే, బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఎక్సైజ్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పబ్లు, …
Read More »తగ్గేదెలే అంటున్న తెలుగోడు : తొలి సెంచరీతో సంచలనం!
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. టెస్టు కెరీర్లో తన తొలి శతకాన్ని నమోదు చేసిన నితీశ్, ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన నితీశ్ తన అద్భుత ప్రదర్శనతో జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. మొదట హాఫ్ సెంచరీ …
Read More »హైదరాబాద్ మల్లయ్యకు 2 కోట్ల లాటరీ
అబుదాబిలో గడుపుతున్న ఓ హైదరాబాదీకి అదృష్టం వరించింది. నాంపల్లి ప్రాంతానికి చెందిన రాజమల్లయ్య (60) ఇటీవల బిగ్ టికెట్ మిలియన్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఏకంగా మిలియన్ దిర్హమ్స్ (రూ. 2.32 కోట్లు) గెలుచుకున్నారు. దుబాయిలో వాచ్మెన్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మల్లయ్యకు ఈ విజయంతో జీవితం కొత్త మలుపు తిరిగింది. రాజమల్లయ్య గత 30 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నారు. భార్య, పిల్లలు హైదరాబాదులో ఉంటుండగా, ఒంటరిగా ఉంటూ …
Read More »రిషబ్ పంత్.. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ ఔట్ అయిన తీరు ఇప్పుడు క్రికెట్ లవర్స్ మధ్య హాట్ టాపిక్గా మారింది. మూడో రోజు భారత ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా పేసర్ బోలాండ్ బౌలింగ్లో పంత్ చేసిన స్కూప్ షాట్ మ్యాచ్ను భారత్ కోసం మరింత క్లిష్ట పరిస్థితిలోకి నెట్టింది. ఫైన్ లెగ్ దిశలో స్కూప్ ప్రయత్నం చేసి తన వికెట్ను సులభంగా కోల్పోయాడు. ఈ ఘటనపై క్రికెట్ దిగ్గజం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates