భారతదేశంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించిందని తాజా నివేదికల్లో వెల్లడైంది. 2024లో ఏకంగా 111 AQI స్కోర్తో భారత్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇక 140 AQIతో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉండగా, 115 AQIతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. దీనితో భారతదేశం కూడా అత్యంత కాలుష్య ప్రభావిత దేశాల జాబితాలో …
Read More »పట్టుకుంటే ఊడిపోయే జుట్టు.. అసలు కారణమిదే..
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది తల వెంట్రుకలు ఒక్కసారిగా రాలిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితి 18 గ్రామాల్లో 279 మందిని ప్రభావితం చేసింది. ఆడవారు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరూ ఈ సమస్యతో సతమతమవుతుండగా, అసలు కారణం ఏమిటో అర్థం కాక కొన్నాళ్ళు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రభావితుల తల వెంట్రుకలు, రక్త నమూనాలను …
Read More »భూమిని ఢీకొట్టే గ్రహశకలం.. మరో క్లారిటీ ఇచ్చిన నాసా
ఇటీవల అంతరిక్ష పరిశోధకులు భూమి వైపుగా దూసుకొస్తున్న 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని గుర్తించారు. ఈ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా మొదట హెచ్చరించింది. దాని ప్రకారం, ప్రాథమిక విశ్లేషణలలో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు 3.1 శాతంగా ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. తర్వాతి రోజుల్లో నాసా మరిన్ని పరిశీలనలు చేపట్టి, ముప్పు …
Read More »ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్: నమ్మకం తగ్గుతోందా?
సోషల్ మీడియా వేదికగా బ్రాండ్ ప్రమోషన్లో ప్రభంజనంలా పెరిగిన ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఇప్పుడు నెమ్మదిగా నమ్మకాన్ని కోల్పోతుంది. ఒకప్పుడు నిజమైన సిఫారసుల్లా కనిపించిన కంటెంట్ ఇప్పుడు వ్యాపార ఉద్దేశంతోనిదనే అనుమానంతో వినియోగదారులు చూడటం ప్రారంభించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటివి సాధారణ యూజర్లను ఇన్ఫ్లూయెన్సర్లుగా మార్చాయి. కానీ, ఇప్పుడు అదే పద్ధతి ఇన్ఫర్మేషన్ కంటే అడ్వర్టైజింగ్గా మారిపోతుండటంతో ప్రేక్షకులు విసుగు చెందుతున్నారు. ఇండియాలోని మెట్రో నగరాల వినియోగదారులపై …
Read More »ఊరించి ముంచేసిన బంగ్లాదేశ్ : పాక్ ఇక ఇంటికే!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో, పాక్ సెమీస్ కు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. గ్రూప్-ఏలో ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో ఓటమి చెందిన పాకిస్థాన్, ఇప్పుడు చివరగా బంగ్లాదేశ్ పై గెలిచినా కూడా, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. న్యూజిలాండ్ ఈరోజు బంగ్లాదేశ్ పై విజయం సాధించిన తర్వాత, గ్రూప్-ఏలో …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఉగ్ర ముప్పు?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లో జరుగుతున్న వేళ, ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు కొత్త ముప్పును గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఈ మెగా ఈవెంట్ను టార్గెట్ చేస్తూ, మ్యాచ్లకు హాజరైన విదేశీయులను కిడ్నాప్ చేయాలనే పథకం వేసినట్లు సమాచారం. ముఖ్యంగా తెహ్రిక్-ఇ-తాలిబన్ (TTP), ఐసిస్, బలూచిస్థాన్ గ్రూపులు ఈ కుట్రలో భాగమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించి, స్టేడియంల వద్ద …
Read More »హర్దిక్ వాచ్ ఇన్ని కోట్లా…
భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ కూడా హై వోల్టేజ్ వైబ్ తోనే ఉంటుంది. కానీ, ఈసారి దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో హార్దిక్ పాండ్యా ఆటతో మాత్రమే కాదు, తన చేతికి ఉన్న లిమిటెడ్ ఎడిషన్ వాచ్ తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వాచ్ విలువ సుమారుగా 7 కోట్లు కావడం, అది రేర్ పీస్ కావడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ …
Read More »ప్రేమ పిచ్చిలో… ఇంటికొచ్చి తగలబెట్టేశాడు
బెంగళూరులో ఓ యువతి ఇంటి వద్ద జరిగిన ఆగడాలు అందరినీ షాక్కు గురి చేశాయి. శనివారం అర్ధరాత్రి తన మాజీ ప్రేయసి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబానికి చెందిన కార్లు, బైక్ తగలబెట్టిన ఘటన ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. సౌత్ బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాహుల్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. అతనిపై ఇప్పటికే హత్యాయత్నం, …
Read More »భారత్ గెలవాలని పాకిస్తాన్ ప్రార్ధించాల్సిందే..
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు ఓటమిపాలై, సెమీఫైనల్ అవకాశాలను సంకోచంలోకి నెట్టుకుంది. ఇప్పుడు పాక్ ఆశలు పూర్తిగా ఇతర జట్లు ఎలా ఆడతాయనేదానిపైనే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది. పాకిస్తాన్కు సెమీస్ అవకాశాలు మళ్లీ సజీవంగా రావాలంటే కివీస్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాలి. ఆ తర్వాత పాక్, …
Read More »భారత్ vs పాక్ మ్యాచ్… ఎన్ని కోట్ల మంది చూశారంటే…
భారత క్రికెట్ అభిమానుల హృదయాలను దడదడలాడించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్, వ్యూస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ మ్యాచ్ను జియో హాట్స్టార్లో ఏకంగా 60.2 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. ఇది క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని రీతిలో సాధించిన రికార్డ్ కావడం గమనార్హం. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో 6.8 కోట్లుగా ఉన్న వ్యూస్, ఆ జట్టు చివరి ఓవర్ ఆడుతున్నప్పుడు 32.1 …
Read More »పబ్లిసిటీ స్టంట్: తెలుగు సెలబ్స్ పై రాయుడు కామెంట్స్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఏపీకి చెందిన అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పబ్లిసిటీ “స్టంట్ కోసమే కొందరు పాకిస్థాన్-ఇండియా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు”- అని వ్యాఖ్యానించా రు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నీకన్నా.. తక్కువ అనుకుంటున్నావా? ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉంటుందని ఎవరూ ఊహించలేదు-అని అంబటి రాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం జరిగింది? దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్.. దాయాది …
Read More »సెంచరీతో పాక్ ను చిత్తు చేసిన కోహ్లీ!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో ఓటమితో ఆతిథ్య జట్టు పాక్ ఇంటిదారి పట్టింది. తన కెరీర్ లో 51వ సెంచరీ సాధించిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates