ఏ ప్రభుత్వంలో అయినా.. మంత్రులు అంటే.. ఒక దర్పం.. అంతకుమించిన డాంబికం.. వీటికి మించిన అధికారం ఉంటుంది. దీంతో మంత్రి అంటే.. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా.. రాష్ట్రం మొత్తంగా కూడా అందివచ్చే గౌరవం.. మర్యాద వంటివి వేరేగా ఉంటాయి. అదేంటో కానీ, ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా మంత్రులు అంటే.. ఎమ్మెల్యేలతో సమానం అయిపోయారనే టాక్ ఉంది. ప్రజలకు ఏం కావాలన్నా.. వలంటీర్. ప్రజలకు ఏం చేయాలన్నా.. వలంటీర్. …
Read More »వైరల్ వీడియో: కూతురుకి క్రికెట్ శిక్షణ ఇస్తున్న లసిత్ మలింగ
లెజెండరీ అంతర్జాతీయ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే. విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ తో అంతర్జాతీయ క్రికెట్ లో 546 వికెట్లు తీసిన ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. తాజాగా మలింగ ఒక వీడియోలో ఒక బ్యాటర్ కి ట్రైనింగ్ కోసం బంతులు విసురుతూ కనిపించాడు. ఆ వీడియోలో ఉన్న బ్యాటర్ ఎవరో …
Read More »27 నుంచి 32.. పెరుగుతున్న లెక్క.. జగన్ తప్పులే కారణమా?
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. ప్రజల మధ్య ఉండడం లేదని.. ఎన్ని సార్టు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. గతంలో నియోజకవర్గాలపై తెప్పించు కున్న నివేదికల ఆధారంగా.. దాదాపు 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారు తమ పంథాను మార్చుకోవాలని సీఎం జగన్ హెచ్చరించారు. దీంతో 151మందిలో 27 మాత్రమేగా అనే చర్చ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ …
Read More »Video: ఫుల్ గా తాగేసి బూతులు తిడుతున్న తెలుగమ్మాయి
మద్యం మత్తు తలకెక్కితే మనిషి ఎలా అదుపు తప్పుతాడో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. ఒక అమ్మాయి పూటుగా మందుకొట్టి తానేం మాట్లాడుతున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియకుండా చేసిన వీరంగం తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మన ఆంధ్రప్రదేశ్కు చెందింది కావడం విశేషం. విశాఖపట్నంలో ఓ అమ్మాయి మందు కొట్టడమే కాక గంజాయి నిండిన సిగరెట్ కాల్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని, న్యూసెన్స్ …
Read More »రెండు రూపాయలకే.. బాలయ్య చికెన్ బిర్యానీ!
టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయాల్లో సైలెంట్గా ఉంటారనే పేరున్నప్పటికీ.. అవసరం.. అవకాశం వచ్చిన ప్రతిసారీ.. బాలయ్య తన విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు రూ.2 కే భోజనం అందిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు ప్రాంతాల్లో నిత్యం మధ్యాహ్నం 11 – 2 గంటల వరకు …
Read More »7 కోట్లు ఆశ చూపి 20 లక్షలు దొబ్బేశారు
రాంగోపాల్ వర్మ సినిమాలు అంటే.. కొంత సస్పెన్స్.. అంతకు మించిన థ్రిల్లర్.. ఇంకొంత దూకుడు.. అన్నీ కలిసి ఉంటాయి. అయితే.. వీటిని మించి రియల్ జీవితంలో జరిగితే.. ఇంకెలా ఉంటుంది. అచ్చం ఇలాంటి సినిమాకు బాబు లాంటి ఘటన గుంటూరులో జరిగింది. ఇక్కడ ఓ అమ్మాయ్ వ్యవహరించిన తీరు.. సినిమా ట్విస్ట్లను మించిపోయింది. దీంతో ఈ విషయం కనుక వర్మకు తెలిస్తే.. సినిమా తీసేయడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏం …
Read More »బరువులు మోస్తూ భలే హుషారుగా రీల్స్ పెడుతున్న ప్రగతి
సీనియర్ ఆర్టిస్టు ప్రగతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అతికొద్దిమంది లేడీ ఆర్టిస్టులలో ఒకరు. ఈమె తరచుగా ఏదో ఒక పోస్ట్ ను తన ఇంస్టాగ్రామ్ లో వేస్తూ ఉంటుంది. తాజాగా తాను బాడీ బిల్డింగ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) అయిదు పదుల వయసులో …
Read More »హాట్ ఫోజులతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్న శ్రియా..!
40 ఏళ్ల వయసులో కూడా శ్రియా శరన్ అవే అందచందాలతో కుర్రాలను ఉర్రూతలూగిస్తుంది. ఆమె తన సోషల్ మీడియా లో వేసే హాట్ హాట్ పోస్టుల ద్వారా ఎప్పుడూ హాట్ టాపిక్ నిలుస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఆమె వేసిన ఒక ఫోటో అయితే అందరినీ ఎంతో ఆకట్టుకుంది. లైట్ పింక్ రంగులో ఆమె వేసుకున్న స్లీవ్ లెస్ డ్రెస్ లో తన అందాలని ఆరబోస్తూ పోస్టు చేసిన ఫోటో …
Read More »ఫోన్ కి మిస్డ్ కాల్స్ ఇచ్చి 50 లక్షలు లేపేశారు
ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. తాజాగా దిల్లీ ఒక వ్యక్తి వద్ద 50 లక్షలు టోకరా వేశారు. కేవలం అతని ఫోన్ కి మిస్డ్ కాల్స్ రావడం వల్ల అతను ఈ డబ్బుని పోగొట్టుకున్నాడు. అతను ఆ ఫోన్ కాల్స్ ఎత్తితే అవతల వేరొకరు మాట్లాడకపోగా కొద్దిసేపటికి అతని అకౌంట్ లో నుండి 50 లక్షలు రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో …
Read More »షాకింగ్ సర్వే: కాపురాల్లో చిచ్చు రేపుతున్న స్మార్ట్ ఫోన్
ఈరోజుల్లో సెల్ ఫోన్ చేతుల్లో లేకుండా ఎవరూ కనిపించడం లేదు. మన రోజు వారి జీవితంలో చరవాణి భాగం అయిపోయింది. అయితే వీటి వల్లే భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలకు దారితీస్తోందని ఒక సర్వే తెలిపింది. ప్రతి 10 మంది భారతీయ దంపతుల్లో 8 మంది సెల్ ఫోన్ కారణంగానే విడిపోతున్నారు అన్న షాకింగ్ వాస్తవం వెల్లడింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు 67 శాతం మంది తన …
Read More »అప్పు ఇచ్చిన సాప్ట్ వేర్ ను చంపేశారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. వారికి ఇచ్చిన అప్పును తిరిగి అడుగుతున్నాడని కక్షతో ఇద్దరు దుండగులు ముత్యాలంపాడు కు చెందిన అశోక్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను నరికి చంపేశారు. మృతుడు అశోక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అతనికి తెలిసిన ఇద్దరు వ్యక్తులకు లక్ష రూపాయలను వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. ఇక వారు ఎన్ని రోజులకీ అప్పు తీర్చలేదు. అశోక్ పలుమార్లు …
Read More »IND vs AUS : సూపర్ ఓవర్ లో గెలిచిన ఇండియా అమ్మాయిలు
నిన్న రాత్రి డివై పాటిల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా-ఆస్ట్రేలియా అమ్మాయిల రెండవ టి20 లో భారత జట్టు సూపర్ ఓవర్ లో 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు మూనీ (82), మెక్ గ్రాత్ (70) పరుగులతో అజేయంగా నిలవడంతో 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. చేధనలో భారత్ ఓపెనర్లు స్మృతి మందన (79), షెఫాలీ …
Read More »