ఇటీవల కాలంలో నోట్ల కట్టలు.. రోడ్ల మీద విసిరేస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఏరుకునేవారు .. పెద్ద ఎత్తున గుమిగూడి వాటిని ఏరి సొంతం చేసుకుంటున్న ఘటనలు కూడా తరచుగా వార్తలుగా వస్తున్నాయి. ఇలానే ఇప్పుడు ఏకంగా కొన్ని నోట్ల కట్టలు ఏకంగా మురికి కాల్వలో కనిపించడం..వాటిని ఏరుకునేందుకు స్థానికులు ఆ డ్రైనేజీలో దిగి ఏరుకోవడం వంటివి దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారాయి. ఐటీకి భయపడో.. లేదా .. …
Read More »అమెరికాలో కాల్పులు.. 9 మంది దుర్మరణం.
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో శనివారం సాయంత్రం స్థానిక టెక్సాస్ మాల్లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో టీనేజీ యువతి సహా 9 మంది చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. కాల్పులకు తెగబడ్డ దుండగుడు ఎందుకు అలా చేశాడనేది మాత్రం తెలియలేదు. అయితే.. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. దుండగుడిని వెంబడించిన పోలీసులు అతనిని కాల్చిచంపారు. గాయపడిన వారిని చికిత్స …
Read More »క్రిష్ను భయపెడుతున్న సెంటిమెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మూణ్నాలుగు చిత్రాలను లైన్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు. ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే ముందుగా మొదలై.. అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఈ చిత్రం రెండేళ్ల కిందట్నుంచి మేకింగ్ దశలోనే ఉంది. దీని తర్వాత మొదలైన సినిమాలు …
Read More »ఆ రోజు స్టంప్స్ విరిగాయ్.. కానీ ఈ రోజు
పది రోజుల క్రితం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ముంబయికి 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్. ఛేదనలో ధాటిగా ఆడిన ముంబయి విజయానికి చేరువగా వచ్చింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి రాగా.. బంతి అందుకున్న పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ నిప్పులు చెరిగే బంతులతో ముంబయికి చెక్ పెట్టాడు. ఆ ఓవర్లో కేవలం రెండే పరుగులిచ్చి …
Read More »ధోని రిటైర్మెంట్పై మళ్లీ ట్విస్ట్
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప క్రికెటర్లలో ఒకడు ధోని. దేశంలో సచిన్ తర్వాత అత్యంత ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కూడా అతనే. ధోని ఎలా ఆడతాడన్నది పక్కన పెట్టి కేవలం అతను మైదానంలో ఉంటే చాలు అనుకునే అభిమానులు కోట్లల్లో ఉంటారు. కేవలం అతడి ఉనికినే ఎంజాయ్ చేస్తారు తన అభిమానులు. ఐపీఎల్లో చెన్నై మ్యాచ్లు అనగానే స్టేడియాలు జనాలతో పోటెత్తుతాయి. ధోని రిటైరైతే క్రికెట్ చూడ్డం మానేస్తాం …
Read More »ఆ ఆస్టరాయిడ్.. భూమిని ఢీకొంటుందా?
ఈ విశ్వంలో జరిగే అనేక పరిణామాల కారణంగా అప్పుడప్పుడూ భూమికి ముప్పు వాటిల్లుతున్న సంకేతాలు వెలువడుతుంటాయి. 2012 టైంలో యుగాంతానికి దగ్గర పడ్డామని.. భూమి అంతరించబోతోందని జరిగిన ప్రచారంతో జనాలు కంగారెత్తిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే ఏవేవో శకలాలు, ఆస్టరాయిడ్లు భూమి మీదికి దూసుకొస్తున్నాయని కూడా ప్రచారం జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో శాస్త్రవేత్తలు ఆ ముప్పును తప్పించడానికి ఏం చేయాలో అది చేస్తారు. స్వల్ప నష్టాలు మిగిల్చే పరిణామాలు …
Read More »క్యాసినో ఆడితే కఠినశిక్షలు తప్పవా ?
థాయ్ ల్యాండ్ లో గ్యాంబ్లింగ్ ఆడటం పూర్తిగా నిషిద్ధం. థాయ్ లోని బ్యాంకాక్, పట్టాయా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలన్న విషయం అందరికీ తెలిసిందే. పై రెండు ప్రాంతాల్లో క్యాసినోల రూపంలో గ్యాంబ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న లాటరీలు తప్ప ఇంకే విధమైన జూదాన్ని థాయ్ చట్టాలు అనుమతించవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న గ్యాంబ్లింగ్ మొత్తం అనధికారికంగా జరుగుతున్నదే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే గ్యాంబ్లింగ్ …
Read More »మొత్తం గంభీరే చేశాడు..
నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ల గొడవ గురించే చర్చ. లక్నో-బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లి క్యాచ్లు పట్టినపుడు.. వికెట్లు పడ్డపుడు స్పందించిన తీరు.. మ్యాచ్ అయ్యాక కోహ్లి, గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం.. లక్నో ఆటగాడు నవీనుల్ హక్తో కోహ్లి గొడవ.. ఇవన్నీ పెద్ద చర్చకే దారి తీశాయి. ఈ మొత్తం వ్యవహారంలో కోహ్లీనే ఎక్కువ నిందకు గురయ్యాడు. మ్యాచ్ …
Read More »ఎవరు వచ్చినా.. ఆ రెండు స్థానాలూ వైసీపీకి దక్కేలా లేవే!
ఇటీవల వైసీపీకి సంబంధించి ఒక ఆసక్తికర సర్వే అంటూ..ప్రచారంలోకి వచ్చింది. ఒక జాతీయ మీడియా వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాలకు 24 చోట్ల గెలుస్తుందని పేర్కొంది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఈ సర్వే ఎంత తప్పో చెప్పడానికి రెండు కీలక నియోజకవర్గాలు ఉదాహరణగా నిలిచాయి. ఉమ్మడి కృష్ణాలో రెండు ఎంపీ స్థానాలు విజయవాడ-మచిలీపట్నం ఉన్నాయి. 2014లో రెండు కూడా టీడీపీ దక్కించుకుంది. విజయవాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో …
Read More »ఆర్నెల్లు ఆగక్కర్లేదు.. కోరుకున్నంతనే విడాకులు ఇచ్చేయొచ్చు..
సంచలన తీర్పును వెల్లడించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కలిసి జీవించే పరిస్థితులు లేనప్పుడు విడిపోవాలని దంపతులు ఇద్దరు పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నప్పుడు.. విడాకుల కోసం ఆర్నెల్లు ఆగాల్సిన అవసరం లేదని.. వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని చెప్పింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే అందుకు ఆరు నెలలు ఎందుకు ఆగాలి? కొన్ని షరతులతో ఆరునెలల నిరీక్షణ నిబంధనను పాటించకుండా తక్షణమే విడాకులు మంజూరు చేసే విశిష్ఠ అధికారం తమకు …
Read More »థాయ్ లాండ్ లో అడ్డంగా దొరికిపోయిన చికోటి గ్యాంగ్
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. క్యాసినో కింగ్ గా పేరున్న చికోటి ప్రవీణ్ ను థాయ్ లాండ్ లో అరెస్టు చేశారు. మొత్తం 90 మంది భారతీయ గ్యాంబ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. థాయ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పటాయాలోని టాస్క్ ఫోర్సు పోలీసులు ఈ అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ముఠాలో పద్నాలుగు మంది మహిళలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. వీరి నుంచి భారీగా …
Read More »కాళీమాతను హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోతో పోల్చుతూ..
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్.. భారత ప్రజల మనోభావాలు దెబ్బతీసే పనికి ఒడిగట్టింది. హిందువులు ఆరాధించే కాళీమాత ఫొటోను అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ చేసింది. కాళీమాతను హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోతో పోల్చుతూ రెండు ఫొటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తొలి ఫొటోలో బాంబు దాడి అనంతరం సంభవించే అగ్ని, దట్టమైన పొగ దృశ్యాలున్నాయి. మరో ఫొటోలో దట్టమైన పొగంతా …
Read More »