Trends

మొబైల్స్ ను కంట్రోల్ చేయటం సాధ్యమేనా ?

ఈరోజు సమాజంలో జరుగుతున్న అనేక దరిద్రాలకు మొబైల్ ఫోనే చాలావరకు కారణం అనటంలో సందేహంలేదు. సమాజంలో హింస మితిమీరి పెరిగిపోతోంది. సెక్స్, అఘాయిత్యాలు, మహిళలపై దాడులు లాంటి అనేక సమస్యలకు మొబైల్ వాడకమే కారణమని పోలీసుల దర్యాప్తులో కూడా బయటపడుతోంది. ఈ సమస్య ఒక్క మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగా అన్నీ దేశాల్లోను ఉంది. అందుకనే డ్రాగన్ ప్రభుత్వం ముందుగా మేల్కొనబోతోంది. ఎలాగంటే మొబైల్ ఫోన్ వాడకంపై నియంత్రణ విధించబోతోంది. పిల్లలు, …

Read More »

సెక్స్ కోస‌మే.. భ‌ర్త‌ను చంపించింది.. కానిస్టేబుల్ భార్య దురాగ‌తం!

వివాహేత‌ర సంబంధం, శారీర‌క వాంఛ కోస‌మే.. క‌ట్టుకున్న భ‌ర్త‌ను చంపించేసిన ఘ‌ట‌న విశాఖ‌తోపాటు రాష్ట్రంలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. నేరాల‌ను క‌ట్ట‌డిచేసే పోలీసు కుటుంబంలోనే ఈ దారుణం చోటు చేసుకున్న‌నేప‌థ్యంలో స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. విశాఖ‌ప‌ట్నం వన్ టౌన్ పోలీసు స్టేష‌న్‌లో కానిస్టేబుల్ గా ప‌నిచేసే రమేష్ దారుణ హత్యకు గుర‌య్యాడు. తొలుత దీనిని సాధార‌ణ మ‌ర‌ణ‌మే అనుకున్నా.. త‌ర్వాత ఎందుకో అనుమానం వ‌చ్చి.. విచార‌ణ చేప‌ట్ట‌గా గ‌గుర్పొడిచే వాస్త‌వాలు …

Read More »

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు? హింట్ ఇదే

ఈ మధ్యకాలంలో పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వైనం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, విడాకులు తీసుకోవడానికి ముందు కొందరు సెలబ్రిటీ కపుల్స్ ఒక కొత్త ట్రెండ్ కి తెర తీశారు. మరికొద్ది రోజుల్లో విడాకులు తీసుకుబోతున్నాం అన్న హింట్ ఇస్తూ తమ సోషల్ మీడియా ఖాతాలలో తమ పార్ట్నర్ కు సంబంధించిన వివరాలను తొలగించడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ గా మారింది. అక్కినేని నాగచైతన్య-సమంత, మెగా …

Read More »

విండీస్ తో వన్డే సిరీస్ కైవసం…పాండ్యా అసంతృప్తి

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో దుమ్మురేపిన భారత బ్యాట్స్ మన్లు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచారు. గిల్ 85 పరుగులు, ఇషాన్ కిషన్ 77 పరులుగు, …

Read More »

దేశంలో అత్యధిక ఆదాయపన్ను కట్టిందెవరో తెలుసా?

జులై వచ్చిందంటే ఇన్ కం ట్యాక్స్ మంత్. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ ను దాఖలు చేయటానికి తుది గడువు జులై 31. నిన్నటితో (సోమవారం) తో ముగిసిన ఈ గడువు ముచ్చట ఇలా ఉంటే.. మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. దేశంలో అత్యధిక ఆదాయపన్ను కట్టిందెవరు? అన్నది క్వశ్చన్ గా మారింది. అత్యధిక ఆదాయపన్ను అన్నంతనే దేశీయంగా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ.. తర్వాతి స్థానంలో …

Read More »

ఎత్తైన భ‌వ‌నాలు ఎక్క‌డం అలవాటు.. చివ‌ర‌కు అదే ప్రాణం తీసింది

రెమీ లుసిడి.. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ వ్య‌క్తికి అత్యంత ఎత్తైన భ‌వ‌నాలు ఎక్క‌డం అల‌వాటు. ప్ర‌మాదాల‌తో చెల‌గాటం చేస్తూ.. సాహ‌సాలకు పాల్ప‌డుతూ.. ఆ ఫొటోలు, వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేస్తుంటాడు. డేర్ డేవిల్ స్కై స్క్రేప‌ర్‌గా పేరొందిన రెమీ.. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో ఆకాశ హ‌ర్మ్యాల‌ను అధిరోహించాడు. కానీ చివ‌ర‌కు ఓ ఎత్తైన భ‌వ‌నం మీద నుంచి ప‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న హాంకాంగ్‌లో సోమ‌వారం …

Read More »

ట‌మాటాల‌తో ఏపీ రైతుకు రూ.4 కోట్లు.. తెలంగాణలో రూ.2 కోట్లు

అప్పులు చేసి మ‌రీ వ్య‌వ‌సాయం చేస్తున్న రైత‌న్న‌ల‌కు ఏమీ మిగ‌ల‌క ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. దేశానికి అన్నం పెట్టే అన్న‌దాత‌లు తినేందుకు తిండి లేక క‌డుపు మాడ్చుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెరిగిన ట‌మాట ధ‌ర పుణ్య‌మా అని రైతులు కోటీశ్వ‌రులు అవుతున్నారు. కొంత‌మంది అన్న‌దాత‌ల‌కు ట‌మాట‌లు అధిక లాభాల‌ను తెచ్చిపెడుతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా క‌ర‌క‌మండ్ల గ్రామానికి చెందిన ముర‌ళి.. ట‌మాటాల ద్వారా 45 …

Read More »

సోషల్ మీడియా కళ్ళలో టిల్లు భామ

ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ మారింది కానీ మొదటి భాగంలో నటించిన నేహా శెట్టి పాత్రను తక్కువ చేసి చూడలేం. సిద్ధూ జొన్నలగడ్డతో అమ్మడి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పేలింది. ప్రియుడిని చంపేసి ఆ కేసులో కూల్ గా కొత్త లవర్ ని ఇరికించిన పాత్రలో సరిగ్గా ఒదిగిపోయింది. రెండో భాగంలో ఎందుకు లేదనే ప్రశ్న హీరోకు దర్శకుడికే తెలియాలి. తన స్థానంలోనే అనుపమ పరమేశ్వరన్ వచ్చి …

Read More »

ఫేస్‌బుక్ ప్రేమ‌.. ఏపీ కుర్రాడితో శ్రీలంక అమ్మాయి పెళ్లి

ఫేస్‌బుక్‌లో ప్రేమ‌.. పెళ్లి కోసం ఖండాలు దాట‌డం.. విదేశాల‌కు వెళ్ల‌డం.. ఇలాంటి వార్త‌లు ఇటీవ‌ల త‌ర‌చుగా చూస్తున్నాం. ప్రేమించిన వాళ్ల కోసం ఇత‌ర దేశాల‌కు వెళ్లి పెళ్లి చేసుకోవ‌డం.. అక్క‌డ ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘ‌ట‌నలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి కోసం శ్రీలంక యువ‌తి దేశం దాటి రావ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది. ఈ ఇద్ద‌రిని ఫేస్‌బుక్ ప్రేమ క‌ల‌ప‌డం …

Read More »

న‌టి శోభ‌న ఇంట్లో చోరీ.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే?

అల‌నాటి అందాల తార‌.. ఒక‌ప్ప‌టి హీరోయిన్ శోభ‌న గుర్తున్నారా? ఎన్నో అద్భుత‌మైన సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించారు. విక్రమ్‌, రౌడీ అల్లుడు, మువ్వ‌గోపాలుడు, అల్లుడు గారు, త్రిమూర్తులు, రుద్ర‌వీణ‌, నారీ నారీ న‌డుమ మురారి, అప్పుల అప్పారావు త‌దిత‌ర చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించారు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్ మెద‌లెట్టారు. కొన్ని చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే తాజాగా …

Read More »

సీఎం ఇంటి గేటు ముందు కావాలనే కారు అడ్డుపెట్టిన నైబర్

ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి ఆయన ప్రయాణించే వాహనాల సముదాయానికి తన కారును అడ్డంగా పెట్టేసిన ఒక వ్యక్తి వైనం ఆసక్తికరంగా మారితే.. అందుకు ఆ ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా.. పిలిపించుకొని.. సదరు వ్యక్తిని శాంతపరిచిన ఈ ఉదంతం ఇప్పుడు వార్తాంశంగా మారింది. అయితే.. ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశమే లేదన్నది మర్చిపోకూడదు. కాకుంటే తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉండే కర్ణాటకలో ఈ ఉదంతం చోటు …

Read More »

హైదరాబాద్ లోని కోకాపేటలో గోదావరి వారి ‘‘ఇష్టా’’

అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలలో దక్షిణాది వంటకాలను వండి వార్చే ప్రముఖ రెస్టారెంట్ లలో ఒకటిగా ‘గోదావరి’ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్యూర్ వెజ్ కాన్సెప్ట్ రెస్టారెంట్ ‘ఇష్టా‘ను చాలాకాలం క్రితం ప్రారంభించింది. వినూత్న ఆలోచనలతో, విభిన్నమైన కాన్సెప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ గా మారి భోజన ప్రియులకు రుచికరమైన శాఖాహార వంటకాలను ‘ఇష్టా’ ఇష్టంగా వండి వారుస్తోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (హైటెక్ సిటీ) ప్రాంతంలో …

Read More »