3D ప్లేయర్ ని కావాలనే అవుట్ చేయలేదా..?

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న విజయ్ శంకర్ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శంకర్ 54 బంతుల్లో 69 పరుగులు చేసినా, ఆ ఇన్నింగ్స్ చెన్నై ఓటమికి కారణమయ్యిందన్న అభిప్రాయంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అతడి స్లో బ్యాటింగ్, స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటమే మ్యాచ్ దారి తీర్చి పెట్టిందని అభిమానులు చెబుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ముందుగా 183 పరుగులు చేసి ఛాలెంజింగ్ టార్గెట్ సెట్ చేసింది. అయితే చెన్నై బ్యాటర్లు ముఖ్యంగా విజయ్ శంకర్, ధోనీ అవసరమైన వేగాన్ని చూపించకపోవడంతో 25 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. విజయ్ శంకర్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం, చాలా స్లోగా ఆడుతూ ఇన్నింగ్స్ ని నెమ్మదించడంపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. చాలా మంది నెటిజన్లు అతడిని అవుట్ చేయకుండా ఉంచటం వల్లే ఢిల్లీకి విజయం సాధ్యమైందంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

అతని ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు ఛాన్స్ ఇచ్చినా ఢిల్లీ ఆటగాళ్లు పట్టించుకోలేదని కామెంట్లు వచ్చాయి. క్లియర్ LBWని కూడా DRS తీసుకోకపోవడం, క్యాచ్ డ్రాప్స్ వంటి విషయాలన్నీ తాము కావాలనే అతనిని ఆరా తీస్తున్నట్టు ఉన్నాయని అభిమానులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. “విజయ్ శంకర్ అవుట్ అయితేనే మాకు డేంజర్.. అందుకే ఆడనిచ్చాం” అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ శంకర్ గతంలో కూడా ఇలాగే ఐపీఎల్‌లో నిరుత్సాహకర ప్రదర్శనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019 ప్రపంచకప్‌లో అంబటి రాయుడిని కాదని శంకర్‌ను ఎంపిక చేసినప్పటినుంచి ఆయనపై ‘3D ప్లేయర్’ అనే ట్యాగ్ వైరల్ అయింది. అప్పటినుంచి ఎప్పుడెప్పుడూ శంకర్ పర్ఫార్మెన్స్ తక్కువగానే ఉండటం వల్ల, ప్రతి సారి ఇదే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈసారి కూడా అదే పునరావృతం కావడంతో, చెన్నై అభిమానులు నిరాశగా ఉన్నారు. మళ్లీ మైదానంలో తన ఆటతో నెగెటివిటీని తుడిచిపెట్టే అవకాశమే ఇప్పుడు విజయ్ శంకర్ ముందు ఉంది.