Trends

కుంభమేళాకు వెళ్లి వస్తూ… ఏడుగురు దుర్మరణం

మహా కుంభమేళాకు వెళ్లిన హైదరాబాదీలు ప్రమాదంలో చిక్కుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా… పలువురు గాయపడ్డారు. మృతులతో పాటుగా గాయపడ్డ వారంతా.. హైదరాబాద్ లోని నాచారం పరిధిలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్‌కు చెందినవారుగా గుర్తించారు. వీరంతా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్బంగా ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లోని నాచారం పరిధిలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర …

Read More »

8.5 లక్షల కోట్లకు ఓపెన్ AI ని అమ్ముతారా? : మస్క్

కృత్రిమ మేధ (AI) రంగంలో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ మధ్య ఉన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. గతంలో ఓపెన్ ఏఐ సంస్థపై తీవ్ర విమర్శలు చేసిన మస్క్, తాజాగా దానిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. చాట్ GPT ఓపెన్ ఏఐని పూర్తిగా లాభాపేక్ష గల సంస్థగా మార్చేందుకు 97.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.5 లక్షల కోట్లు) చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన …

Read More »

క్షణానికో కోడి.. గోదావరి జిల్లాల్లో బర్ద్ ఫ్లూ విజృంభణ

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గత కొంతకాలంగా కోళ్ల ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నెల రోజులుగా జరగుతున్న కోళ్ల మరణాలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. చనిపోయిన కోళ్ల నమూనాలను అధికారులు భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పంపారు. ఈ నమూనాలను పరిశీలించిన అక్కడి శాస్త్రవేత్తలు.. గోదావరి జిల్లాల కోళ్లకు బర్ద్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. ఈ …

Read More »

ఘోర బస్సు ప్రమాదం – 51 మంది మృతి

సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశం ఒక ఘోర రోడ్డు ప్రమాదంతో విషాదంలో మునిగిపోయింది. రాజధాని గ్వాటెమాలా సిటీ సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 51 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 36 మంది పురుషులు, 15 మంది …

Read More »

బీర్ ప్రియులకు చేదు వార్త

తెలంగాణలో బీర్ ప్రేమికులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షాక్ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ తాజా నిర్ణయంతో అన్ని రకాల బీర్ ధరలు 15 శాతం పెరగనున్నాయి. ఈ పెరుగుదలపై అధికారిక ఉత్తర్వులను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ ధరలు అమాంతం పెరిగి, వినియోగదారులకు అదనపు భారం అయ్యే పరిస్థితి ఏర్పడింది. వేసవి సమీపిస్తుండటంతో బీర్ డిమాండ్ పెరిగే సమయంలో ఈ …

Read More »

చంద్రయాన్-3 ద్వారా బయటపడిన కొత్త రహస్యాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో కొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా భారత శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం, విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్ సుమారు 3.7 బిలియన్ సంవత్సరాల వయస్సు కలిగి ఉంది. ఇది భూమిపై జీవం ఉద్భవించిన కాలంతో సమానమని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రాంత భౌగోళిక విశ్లేషణను ఇండియా ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ …

Read More »

భారత్ రక్షణ శక్తి పెరుగుతోంది… ఏరో ఇండియా 2025లో హైలైట్స్!

ఏషియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరుగాంచిన ఏరో ఇండియా 2025 బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎయిర్ షోలో భారత నౌకాదళం, వైమానిక దళం, డిఫెన్స్ రంగానికి చెందిన అనేక సంస్థలు తమ అత్యాధునిక వైమానిక సామర్థ్యాలను ప్రదర్శించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియా పావిలియన్ లో భారతదేశ ఆత్మనిర్భరతకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. ఈవెంట్‌లో భారత నౌకాదళం అధునాతన …

Read More »

మళ్ళీ నవ్వులపాలైన పాకిస్తాన్ క్రికెట్

పాకిస్తాన్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం మరోసారి వివాదాస్పదంగా మారింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకి తీవ్ర గాయం కావడం, ఆ గాయానికి స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు కారణమని అనుమానాలు వెల్లువెత్తడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బంతి వేగాన్ని అంచనా వేయలేకపోవడం, కళ్లకు వెలుతురు నేరుగా తాకడం వల్లే గాయం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి నమ్మకం తక్కువైందని …

Read More »

పెళ్లి ర‌ద్దు: సిబిల్ స్కోర్‌.. ఎంత ప‌నిచేసింది!

పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం.. జ‌ర‌గ‌క‌పోవ‌డం అనేది కామ‌నే. కానీ, ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న పెళ్లిళ్ల కంటే కూడా.. ర‌ద్ద‌వుతున్న పెళ్లిళ్ల వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగాను.. ఒకింత ఆవేద‌న‌గానూ ఉంటున్నాయి. పెళ్లి పీట‌లు ఎక్కి మూడు ముడులు ప‌డే దాకా కూడా.. ఈ పెళ్లి జ‌రుగుతుందో లేదో !? అనే సందేహాలు చుట్టుముడు తున్నాయి. ఇటీవ‌ల పెళ్లి పీట‌ల‌పై కూర్చున్న వ‌రుడు.. చోళీకే పీచే క్యాహై పాట‌కు డ్యాన్స్ చేయ‌డంతో పెళ్లి కుమార్తె తండ్రికి …

Read More »

ఆధార్ ధృవీకరణలోనూ AI డామినేషన్!!

భారతదేశంలో ఆధార్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరిలో 284 కోట్ల ఆధార్ ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 214.8 కోట్ల లావాదేవీలు నమోదుకాగా, ఇప్పుడు 32% వృద్ధి కనిపించింది. దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం రోజుకు 9 కోట్లకు పైగా ఆధార్ ధృవీకరణలు జరుగుతున్నాయి. ఇందులో ఫేస్ అథెంటికేషన్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. జనవరిలో 12 కోట్లకు పైగా ఫేస్ …

Read More »

కెప్టెన్ తడబడితే ఎలా? – కపిల్ దేవ్

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ గత పది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదని, ఇది జట్టుకు సమస్యగా మారవచ్చని కపిల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన …

Read More »

బైడెన్‌కు షాక్ : భద్రతా అనుమతులు రద్దు చేసిన ట్రంప్!

అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రహస్య సమాచారాన్ని తెలుసుకునే అనుమతిని బైడెన్‌కు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన, తన అధికారిక హోదాను ఉపయోగించి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గతంలో తాను ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్‌ కోల్పోయినప్పటి నుంచి ఇదే …

Read More »