Trends

బైక్ రైడ్ లో రొమాన్స్.. ఇదెక్కడి పిచ్చి బాబు

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో రాత్రివేళ రోడ్డుపై ఓ జంట చేసిన రొమాంటిక్ స్టంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అగ్రా-కాన్పూర్ నేషనల్ హైవేపై బైక్ మీద అతి వేగంగా ప్రయాణిస్తున్న ఈ జంట, ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించింది. మహిళ బైక్ ట్యాంక్‌పై పడుకుని ఉంది, పురుషుడు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. ఇది చూసిన ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్‌లో …

Read More »

విమాన విషాదం తర్వాత పార్టీలా? ఎయిరిండియాలో నలుగురిపై వేటు!

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని కదిలించింది. 275 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే, ఎయిరిండియా గ్రౌండ్ సిబ్బంది కార్యాలయంలో చేసిన పార్టీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దురదృష్టకరమైన సంఘటనను మర్చిపోకుండా కుటుంబాలు ఇంకా బాధతో అలమటిస్తుండగా, కొంతమంది ఉద్యోగులు మ్యూజిక్, డాన్స్‌తో వేడుకల్లో పాల్గొనడం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఈ వివాదాస్పద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో …

Read More »

టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్.. కారణం ఇదేనా?

శుక్రవారం రాత్రి కాస్త పొద్దు పోయిన తర్వాత షాకింగ్ ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంతో లుంగీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెకు కుమార్తె (13) ఉన్నారు. యాంకర్ గా సుపరిచితురాలు కావటమే కాదు.. జర్నలిస్టు సర్కిల్స్ తో ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపైనా.. …

Read More »

భార్యకు జాబ్ ఉన్నా భరణం ఇవ్వాలి: హైకోర్టు

బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూసిన భర్తకు దిమ్మ తిరిగే షాకిచ్చింది బాంబే హైకోర్టు. విడాకులు తీసుకున్న తర్వాత.. మాజీ భార్యకు ఆర్థికంగా సపోర్టు చేయాల్సిన మాజీ భర్త.. ఆమెకున్న చిన్న ఉద్యోగాల్ని సాకుగా చూపిస్తూ.. భరణం చెల్లించాల్సిన అవసరం లేదంటూ కోర్టును ఆశ్రయించిన ఉదంతంలో ఎదురుదెబ్బ తగిలింది.అసలేం జరిగిందంటే.. భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. భార్య గౌరవప్రదమైన జీవనం కోసం ఆమెకు నెలకు రూ.15 వేలు చొప్పున భరణం చెల్లించాలని …

Read More »

భార్య, కూతుళ్లతో గొడవ.. హుండీలో 4 కోట్ల ఆస్తి

తన భార్య, కూతుళ్లతో ఉన్న గొడవల వల్ల విసిగిపోయి తనకు చెందిన రూ.4 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పేపర్లను తీసుకెళ్లి ఓ గుడి హుండీలో వేసేసిన ఘటన ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన భార్య, కూతుళ్లు ఇప్పుడు ఆలయ అధికారులను సంప్రదించి ఆ ఆస్తి పేపర్లు తమకు ఇచ్చేయాలంటూ వేడుకుంటున్నారు. కానీ దీనిపై ఆలయ అధికారులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వివరాల్లోకి వెళ్తే.. తిరువణ్ణామలై (అరుణాచలం) జిల్లాలోని అరణి సమీపంలోని కోనైయూర్ …

Read More »

ఈ వీడియో చూస్తున్నారంటే నేను మరణించినని అర్థం!

“హాయ్, ఇది నేను టానర్.. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నేను ఇక మరణించానని..” అంటూ మొదలైన ఓ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను తాకుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ టానర్ మార్టిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. మరణానికి ముందే స్వయంగా ఒక ఎమోషనల్ వీడియో రికార్డ్ చేసిన టానర్.. దాన్ని తన భార్య షేరైట్ బుధవారం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. …

Read More »

ఇంకో హనీమూన్ మర్డర్.. జస్ట్ మిస్

కొన్ని వారాల కిందట మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ అనే కొత్త పెళ్లికొడుకు మేఘాలయాలో హనీమూన్ కోసం వెళ్లి హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. స్వయంగా భార్య సోనమ్‌యే తన ప్రియుడి సపోర్ట్ తీసుకుని సుపారీ కిల్లర్లను పెట్టి తన భర్తను చంపించడం కలకలం సృష్టించింది. తాజాగా తెలంగాణలోని గద్వాల జిల్లాలోనూ తేజేశ్వర్ అనే సర్వేయర్‌ను అతడి భార్య ఇదే రీతిలో చంపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి తరుణంలో ఇదే …

Read More »

రీల్స్‌ చేస్తూ 13వ అంతస్తు నుంచి పడిపోయిన యువతి

రాత్రివేళ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్న బెంగుళూరు లోని యువకుల సమూహం అనూహ్య విషాదానికి దారితీసింది. 20 ఏళ్ల యువతి ఒక అండర్‌ కన్స్ట్రక్షన్ బిల్డింగ్‌ టెరస్‌పై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందింది. ఈ ఘటన పరప్పన అగ్రహార ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె రాత్రి సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసేందుకు అక్కడికి వెళ్లింది.  మధ్యలో ఓ గొడవ మొదలవడంతో ఉద్వేగానికి లోనైన …

Read More »

అంతరిక్షం నుంచి లైవ్: శుభాంశు ఏమన్నాడంటే..

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా… అంతరిక్షంలో ఉన్న తన అనుభూతులను ప్రత్యక్షంగా లైవ్‌ కాల్‌ ద్వారా మొదటిసారి షేర్ చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరే ముందు తొలిసారిగా లైవ్ కాల్‌ ద్వారా మాట్లాడిన శుభాంశు, తన అనుభవాలను ఎంతో ఎమోషనల్‌గా, శ్రద్ధతో వివరించారు. “ఇది అద్భుతమైన ప్రయాణం. నేను ఇప్పుడు భారరహిత స్థితికి అలవాటు పడటం …

Read More »

Video: మందేసి రైల్వే ట్రాక్ పై కారు నడిపిన మహిళ

ఇది కలికాలం…అందులోనూ వర్షా కాలం…క్లైమేట్ బాగుంది కదా అని ఓ మహిళ అరె మామా ఏక్ పెగ్ లా అంటూ ఊటుగా తాగేసింది. అంతవరకు పర్వాలేదు….కానీ, ఆమెకు లిక్కర్ ఇచ్చిన కిక్కు సరిపోలేదు. అందుకే, ధూమ్ మచాలే..ధూమ్ మచాలే..ధూమ్ అంటూ ఏకంగా రైలు పట్టాల మీద కారు నడిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ లో మందేసి ఆమె చేసిన రచ్చ వల్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. …

Read More »

జీడిమెట్లలో తల్లి హత్య.. కొత్త కోణం బయటికి

పిల్లల్ని చంపేసి ప్రియుడితో కలిసి లేచిపోయిన తల్లి.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య.. ప్రియుడి కోసం సొంత తల్లినే చంపేసిన కూతురు.. ఈ తరహా వార్తలు ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఈ సమాజం ఎటు పోతోందో.. బంధాలు ఏమైపోతున్నాయో అని ఆందోళన రేకెత్తించే పరిణామాలివి. తాజాగా తెలంగాణలో గొప్ప పోరాట యోధురాలిగా పేరున్న చాకలి ఐలమ్మ ముని మనవరాలు.. తన కూతురి చేతిలోనే హత్యకు గురైన ఉదంతం …

Read More »

శుభాంశు శుక్లా న్యూ రికార్డ్.. ఫైటర్ పాటతో రోదసిలోకి!

41 ఏళ్ల అనంతరం మరోసారి భారత్ తరఫున వ్యోమగామి రోదసిలోకి పయనించడం గర్వకారణమైన ఘట్టం. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం ఫాల్కన్-9 రాకెట్ ద్వారా రోదసికి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం 12:01కు లాంచ్ అయిన ఈ ప్రయోగంలో శుభాంశు తో పాటు హంగేరీ, పోలాండ్‌కు చెందిన వ్యోమగాములు పాల్గొన్నారు. ఫ్రాన్స్, యూరప్, అమెరికా, …

Read More »