ఒక్కోసారి అంతే. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. కాలం కలిసి రాదు కూడా. అలాంటిది టైం లెక్క మారితే చాలు.. అలా అన్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున కలిసి వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే సీఎం మీద టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు.. పార్టీకి చెందిన పలువురు తమ ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని వ్యక్తం చేయటం.. విమర్శలతో …
Read More »వైసీపీ ఎమ్మెల్యే ఫొటోతో వీరసింహారెడ్డి పోస్టర్లు!
నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా మూవీ వీరసింహారెడ్డి విడుదలై ప్రభంజనం సృష్టిస్తు న్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్లోనూ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు.. పెద్ద ఎత్తున మూవీకి స్వాగతం పలుకుతూ.. బ్యానర్లు కట్టారు. మరోవైపు.. టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. ఇక, హిందూపురం నియోజకవర్గంలో ఈ జోష్ …
Read More »తెలుగు ప్రజలకు మోడీ పండుగ కానుక
ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర Modi చేతుల మీదుగా తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనుకున్న దాని కంటే ముందుగా అందుబాటులోకి రానుంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ రైలును తెలుగు ప్రజల పెద్ద పండుగ అయిన సంక్రాంతికి నడిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి కానుకగా అభివర్ణిస్తున్నారు. తొలుత అనుకున్న …
Read More »బండికి బెర్త్ దొరికిందా? పోస్ట్ ఊడుతుందా?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి రావడంతో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన అధ్యక్ష పీఠం కదులుతోందని వ్యతిరేకులు ప్రచారం చేస్తుంటే… మోదీ కేబినెట్లో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయింది, అందుకే పిలుపు వచ్చిందంటూ ఇంకొందరు చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణకు సంబంధించి బీజేపీలో ఏదో మార్పు అయితే జరగబోతోందన్నది అంతటా వినిపిస్తోంది. అది ఎవరికి అనుకూలం… ఎవరికి ప్రతికూలం అనేది మాత్రమే తెలియాల్సి ఉంది. మరోవైపు …
Read More »జగనన్న లెక్క అట్లుంటది
ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఒకవైపు సంక్రాంతి పండుగ వచ్చే సింది. ఇంటిల్లిపాదీ పండగ సంబరాలకు రెడీ అయ్యారు. అయితే.. నెల మొత్తం పనిచేసిన ఉద్యోగులు మాత్రం జీతం కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వచ్చేసినా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 30 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు ఇచ్చింది. అది కూడా సీమ ప్రాంతానికే మెజారిటీగా దక్కాయని తెలుస్తోంది. ఇక, …
Read More »ఏపీ పోలీసులను చంద్రముఖిగా పోల్చిన చంద్రబాబు..
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ పోలీసులను చంద్రముఖిగా అభివర్ణించారు. తాజాగా చంద్రముఖి హీరో రజనీ కాంత్.. బాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఇస్తూ.. దీనిని లైవ్లో చర్చకు ఉంచేలా.. చంద్రబాబు పోలీసులపై చంద్రముఖి కామెంట్లతో విరుచుకు పడ్డారు. గంగ.. చంద్రముఖిగా మారినట్టు.. ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఏ చిన్న ఉద్యమం …
Read More »తమిళనాడు నాడార్లు బీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తున్నారు !
బీఆర్ఎస్ విస్తరణ చర్యలు వేగం పుంజుకున్నాయి. కొందరు ఏపీ నేతలను బీఆర్ఎస్లోకి చేర్చుకున్న తర్వాత కేసీఆర్ వేగం పెంచారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఇప్పుడాయన తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నాడార్ సామాజిక వర్గం నేతలు వచ్చి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిశారు. తమిళనాడులోని నాడార్ సంఘాలు బీఆర్ఎస్ నాయకత్వంలో పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.. తెలుగు రాష్ట్రాల్లో గౌడ, ఈడిగ కులాలకు సమానమైన సామాజిక …
Read More »ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క రేటు.. రాజకీయం!
సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలకు రెడీ అయిన రెండు సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే.. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్సినిమాలే కావడం గమనార్హం. అయితే.. ఈ రెండు చిత్రాల నిర్మాతలు కూడా.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. తమ …
Read More »‘చంద్రబాబు కాదు ఆయన్ను ఓడించి తీరండి’
‘చంద్రబాబును ఓడించడానికి ట్రై చేయండి.. ఆయన్ను మాత్రం ఓడించి తీరండి’.. జగన్ నోటి నుంచి వచ్చినట్లుగా చెప్తున్న ఈ మాట ఎవరి గురించో తెలుసా?పవన్ కళ్యాణ్ గురించి అనుకుంటున్నారా? కానే కాదు. ఈ మాట చింతకాయల అయ్యన్నపాత్రుడి గురించి. అవును.. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడి గురించి జగన్ ఈ మాట అన్నట్లుగా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయ్యన్నపాత్రుడిని 2019 ఎన్నికల్లో వైసీపీ ఓడించినప్పటికీ ఈసారి కూడా …
Read More »వెళ్లకు.. వసంత.. వెళ్లకు..
వసంత వెళ్లకు.. వెళ్లకు, వెళ్లకు..వసంత… వైసీపీలో వినిపిస్తున్న కొత్త రాగం ఇది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్కడ జారిపోతాడోనన్న భయం వైసీపీ వర్గాల్లో నెలకొంది. పక్క చూపులు చూస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన అలిగిన కొద్దీ బుజ్జగించేందుకు అధికార పార్టీ అధిష్టానం నానా పాట్లు పడుతోంది. తాజాగా వసంత కామెంట్స్ రుచించకపోయినా అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోంది. మంత్రి జోగి రమేష్ ను టార్గెట్ చేస్తూ వసంత …
Read More »విశాఖ జనసేనకు.. నరసాపురం రఘురామకు ఫిక్స్ చేసిన బాబు…!
ఏపీలో రాజకీయ పరిణామాలుమారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేసినట్టు రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. ఇక, తాజాగా జనసేనలో మరో చర్చ తెరమీదికి వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సీటును జనసేనకు ఇవ్వాలనే షరతు తెరమీదికి వచ్చిందని అంటున్నారు. దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు కూడా అంగీకరించారని …
Read More »ఏం చూసి మిడిసిపాటు.. వైసీపీ ఎమ్మెల్యేకు అధిష్టానం వార్నింగ్!
వైసీపీ అధిష్టానం.. ఒక ఎమ్మెల్యేపై చాలా సీరియస్ అయిందనే ప్రచారం తాడేపల్లి వర్గాల్లో సాగుతోంది. ఇటీవలే..ఈయనను స్వయంగా సీఎం జగన్ తన నివాసానికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటి కీ.. ఆయనలో మార్పు రాకపోవడంతో తాజాగా కీలక సలహాదారు ఒకరు.. స్వయంగా ఫోన్ చేసి.. ఏం చూసి మిడిసిపాటు? అని ప్రశ్నించినట్టు తాడేపల్లి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సదరు ఎమ్మెల్యే గత ఎన్నికల్లో అనూహ్యంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates