మార్గదర్శి మోసాలపై నమోదు చేసిన అన్ని కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మార్గదర్శి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుంటే లక్షల్లో ఉన్నారు. వీళ్ళంతా ఏపీ, తెలంగాణా, కర్నాటకతో పాటు కొందరు తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. అయితే ఏపీ, తెలంగాణా, కర్నాటకలోనే లక్షల్లో ఉన్నారు. మార్గదర్శిలో మోసాలు జరిగాయని సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్ రామోజీరావును ఏ1 …
Read More »వైసీపీ మహిళా ఎంపీ భూకబ్జా.. సొంత వదినే రోడ్డెక్కారుగా!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై భూకబ్జా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులపై ఈ తరహా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్, అనంతపురానికి చెందిన మంత్రి ఉష శ్రీ చరణ్లపై భూముల కబ్జాకు సంబంధిం చిన ఆరోపణలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయితే.. వీటిపై ఎన్ని వార్తలు వచ్చినా.. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. వైసీపీ ప్రభుత్వం లెక్కచేయకపోవడం గమనార్హం. తాజాగా …
Read More »పదే పది నెలలు… వైసీపీ, టీడీపీ టార్గెట్లు మామూలుగా లేవే…!
వైసీపీ వ్యూహాలు మారుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యూహం కూడా పూర్తిస్థాయిలో మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో 10 మాసాల్లో ఎన్నికలు జరగనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల వచ్చినా లేదా షెడ్యూల్ ప్రకారం 2024 మార్చిలోనే ఎన్నికలు జరిగినా కూడా ఈ ఉండేటటువంటి మధ్యకాలం అంతా కూడా ఇరు నాయకులు అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి …
Read More »వాళ్లంతా డమ్మీలే.. సర్వస్వం.. తాడేపల్లే: ఆనం సంచలన వ్యాఖ్యలు
జనాలూ.. నా మాట వినండి.. అంటూ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చేఎన్నికల్లో వైసీపీని ఓడించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని, ఈ దుర్మార్గపు, దౌర్భాగ్యపు పాలన అంతానికి అందరూ నడుం బిగించాలని అన్నారు. చట్టసభల్లో జరగాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంప్ కార్యాలయం వేదికగా సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంపు కార్యాలయంలో సాగుతున్నాయని, …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు.. చొక్కా చింపేసి మరీ..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అత్యంత అమానుష రీతిలో అరెస్టు చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి ఆయనను అరెస్టు చేయడం.. తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నెల్లూరులో ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి ఘటన మరువకముందే.. ఇలా టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు కలకలం రేపడం గమనార్హం. ఏం జరిగిందంటే.. …
Read More »రాహుల్ ఈ రేంజ్లో మోడీని ఏకేస్తారని అనుకోలేదట!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విమర్శలకు.. బీజేపీ నుంచి కూడా అదే రేంజ్లో కౌంటర్లు పడుతున్నాయి. కానీ… తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్గాంధీ మోడీపై ఓ రేంజ్లో ఎక్కేశారు. ఓ స్థాయిలో ఏకేశారు. దీంతో బీజేపీ నాయకులు కిమ్మనకుండా.. మౌనంగా ఉండిపోయారు. మరి మోడీని రాహుల్ ఏమన్నారంటే.. గత ప్రభుత్వంలో వైఫల్యాలపై ఒకరిని నిందించడమే …
Read More »తెలంగాణ దూకుడుకు ఏపీ పోటీ పడలేకపోతోందిగా!
ఆదాయంలో తెలంగాణ ముందుందంటే.. ఔను.. విభజన కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందని ఏపీ ప్రభుత్వ పెద్దలు వాదనకు దిగుతారు. ఇతర పరిశ్రమలు, ఐటీ వంటి వాటిలో తెలంగాణ దూకుడుగా ఉందని చెబితే.. ఔను.. మేం కూడా దూసుకుపోతున్నాం.. ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు వస్తున్నాయని బల్లగుద్ది మరీ చెబుతారు. కట్ చేస్తే.. మరి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమలకు సంబంధించి మీరు ఏం చేశారు? ఏమైనా …
Read More »విషయం తెలిసి.. బీజేపీ అలా చేయదేమో..
బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత.. అనేక విశ్లేషణలువ స్తున్నాయి. ఏపీలోనూ.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబుతో చేతులు కలిపేందుకు బీజేపీ పెద్దలు మంతనాలు జరిపారన్నది ప్రధాన చర్చ. అయితే.. ఏపీ విషయాన్ని పక్కన పెడితే.. తెలంగాణలో ఉన్న రాజకీయ సెన్సిటివిటీని, ఇక్కడి సెంటిమెంటును ఇప్పటికే కాచి వడబోసిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని …
Read More »ఆ 10 సీట్లు మాకివ్వండి.. లోకేష్
కడపలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ ప్రజలను కోరారు. 2024 ఎన్నికల్లో అదే 10 సీట్లు టీడీపీకి ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.. చెయ్యకపోతే కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి అని వ్యాఖ్యానించారు. టీడీపీ రాజంపేట పార్లమెంటు నుంచి 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే, జగన్ రెడ్డి రాజంపేట ఎంపీ సీటును మిథున్ …
Read More »బీజేపీ భారీ ప్రణాళిక
రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నది కమలనాదుల పట్టుదల. ఇందుకు ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెలలోనే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు పర్యటించబోతున్నారు. ముగ్గురి రాక సందర్భంగా తెలంగాణాలోని మూడు ప్రాంతాల్లో బీజేపీ భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే విషయమై పార్టీ చీఫ్ బండి సంజయ్ సీనియర్లందరితోను మాట్లాడుతున్నారు. బహిరంగసభలను సక్సెస్ చేయటం ద్వారా రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది …
Read More »చంద్రబాబుపై భగ్గుమంటున్న న్యూట్రల్స్
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి తేడా వస్తే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఒక టెర్మ్లోనే తెలుగుదేశం పార్టీని జగన్ ఎంతగా వేధించాడో.. ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో తెలిసిందే. ఇంకో పర్యాయం ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిందంటే చంద్రబాబుతో పాటు టీడీపీ ఉనికి ప్రమాదంలో పడటం ఖాయం. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే అని …
Read More »శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ వెనుక ఇంత జరిగిందా?
థ్రిలర్ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు.. అంతకూ అంతుచిక్కనిగా ఉండే కథలోని చిక్కుముడిని ముందుగా అంచనా వేస్తే.. సదరు సినీ దర్శకుడు ఫెయిల్ అయినట్లే. అందులో వేరే మాట లేదు. ఎత్తులు.. పైఎత్తులతో సాగే రియల్ రాజకీయ థ్రిల్లర్ లో చోటు చేసుకునే పరిణామాలు అందరికి అర్థమయ్యేలా ఉంటే అది వైఫల్యం కాక మరేంటి? అందరు అనుకున్నదే నిజమైతే అది రాజకీయం ఎందుకు అవుతుంది? తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates