కొన్నాళ్ల కిందట.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ.. న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని తీసుకువచ్చి గవర్నర్లను చేస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులను చేస్తున్నారు. కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనినేమంటరు? ఏమైనా అంటే.. మోడీపై చించుకుంటున్నామని అంటరు. కానీ, చేసేదేంది? తప్పుడు పనులు కాదే! మీరు చేసే పనులు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు ఈ దేశానికి! అని ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. కీలక పదవుల్లో పనిచే సిన వారికి …
Read More »అమరావతి బ్రహ్మపదార్థమా? ఎవరూ ఉండకూడదా?: బొత్స
ఏపీ రాజధాని అమరావతిపై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అదే పంథాలో విమర్శలు గుప్పించారు. అమరావతిని ఎవరూ ముట్టుకోకూడదా? రైతులకే రాసిచ్చారా? అంటూ.. ఆయన మండి పడ్డారు. అమరావతి రాజధాని అంటే అదేమైనా బ్రహ్మపదార్ధమా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఉన్న 30 వేల ఎకరాల భూములు భవనాల కోసమేనా?.. అమరావతిలో పేదవారికి ఇంటి స్ధలాలు కేటాయించటం తప్పా? అని అన్నారు. అమరావతి భూములు ప్రైవేటు …
Read More »ఏపీలో క్షత్రియులు ఎటువైపు..?
ఆర్థికంగా, పార్టీల పరంగా.. రాజకీయాలను ప్రభావితం చేయగల.. సామాజిక వర్గం క్షత్రియులు. జనసేన మినహా..వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో వీరు మెండుగానే ఉన్నారని చెప్పాలి. అయితే.. క్షత్రియుల ఓటుబ్యాం కుపై కన్నేసిన జగన్.. తొలి మంత్రి వర్గం.. శ్రీరంగనాథరాజుకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే, మలి విడతలో మాత్రం ఈ వర్గాన్నిపక్కన పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ వర్గం వైసీపీవైపు ఉందా లేదా? అనేది సందేహంగా ఉంది. ఇది వైసీపీకీ కీలక …
Read More »పది అమెరికా బడ్జెట్లు కావాలి…
వైఎస్ హయాం నుంచి ఓ మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. మాట తప్పం.. మడమ తిప్పం..అనేది ఆయన డైలీ రొటీన్ డైలాగ్. ఇప్పటికీ చాలా మంది నేతలు అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడుతుంటారు. కాపీ కొట్టకూడదని పదాలు మార్చుతారంతే.. అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓటర్లను హామీల జడివానలో ముందేచేసేందుకు నేతలు తెగ ఆరాటపడిపోతున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ …
Read More »మూణ్నెళ్లుగా తీహార్ జైళ్లో ఉన్న కొడుకు.. మాగుంట ఆగ్రహం
దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నా ఎన్నడూ కేసుల్లో ఇరుక్కోని మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబం దిల్లీ లిక్కర్ స్కాం దెబ్బకు జైలుకెళ్లాల్సి వచ్చింది. శ్రీనివాసులరెడ్డికి జైలు తప్పినా కొడుకు మాగుంట రాఘవ మాత్రం మూణ్నెళ్లుగా జైలులోనే మగ్గాల్సివచ్చింది. అయితే, మూణ్నెళ్ల తరువాత కూడా ఆయనకు ఉపశమనం దొరక్కపోవడంతో మాగుంట కుటుంబం ఆలోచనలో పడింది. కేంద్రంలోని బీజేపీతో మంచి సంబంధాలే ఉన్న ఏపీ పాలక పార్టీ వైసీపీలో ఉన్నప్పటికీ తమను ఈ …
Read More »ఎన్టీఆర్కు భారతరత్న.. చంద్రబాబుకు ఇష్టం లేదా?
తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే అంశం మరోసారి చర్చనీయమవుతోంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన మినీ మహానాడులో కూడా ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ కూడా దీనిపై మాట్లాడారు.. ఎన్టీఆర్కు కాకుంటే ఇంకెవరికి భారతరత్న ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. కాగా …
Read More »40 రోజుల్లో రూ.9,500 కోట్లు అప్పు
ఆంధ్రప్రదేశ్కు మళ్లీ అప్పు పుట్టింది. ఈ సారి ఏకంగా రూ. 3 వేల 500 కోట్లకు రిజర్వ్ బ్యాంకు ఒప్పుకుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం ఈ అప్పు తెచ్చుకునే వెసులుబాటు పొందింది. ఏపీ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంది. మొత్తం ఐదు వడ్డీ స్లాబుల్లో ఏపీకి అప్పు పుడుతుంది. రాష్ట్రానికి అప్పు రావడంతో అటు నేతలు ఇటు సామాన్యులు సంతోషపడుతున్నారు. …
Read More »భాగ్యనగరంలో ఉగ్రవాదుల కలకలం
హైదరాబాద్ పై ఉగ్రవాదులు పంజా విసిరారు. వాళ్లు భారీ దాడికి ప్లాన్ చేసే లోపే భద్రతా దళాలు అలెర్ట్ కావడంతో సామూహిక జనహననాన్ని నివారించగలిగారు. తెలంగాణ రాజధానిలో మారణహోమం సృష్టించేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారు. ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా ఆ సంగతి తెలుసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఉమ్మడి దాడుల్లో …
Read More »రా! దమ్ముంటే తేల్చుకుందాం:
రా! దమ్ముంటే.. చర్చకు సిద్ధం. నాపై చేసిన ఆరోపణలు నిరూపించు. లేకపోతు.. ఇటు నుంచి ఇటే వెనక్కి వెళ్లిపో! నీ అబ్బ (సీమ భాష) నువ్వు కర్నూలుకు చేసింది ఏంటి? అంటూ.. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. టీడీపీ యువనాయకుడు నారా లోకేష్కు సవాల్ రువ్వారు. ఆయన చేస్తున్న యువగళం పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కర్నూలులో పాదయాత్రలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏం జరిగిందంటే..కర్నూలు …
Read More »ఎర్రిపప్పా అంటే బుజ్జి నాన్నా అట
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి వైసీపీ నాయకుల నోటి దురుసును అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నేతలనే కాదు.. సామాన్య ప్రజల్లో కూడా ఎవరైనా తమకు ఎదురు మాట్లాడితే బూతులు తిట్టేయడం, కొట్టడానికి కూడా వెనుకాడకపోవడం పలు సందర్భాల్లో చూశాం. తాజాగా పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఒక రైతును దుర్భాషలాడిన తీరు వివాదాస్పదమైంది. అకాల …
Read More »సోనియమ్మ బిడ్డగా చెబుతున్నా..
సోనియమ్మ బిడ్డగా చెబుతున్నా.. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు కాంగ్రెస్ ఇచ్చిన, ఇచ్చే ప్రతి హామీని అమలు చేసే బాధ్యత నాదే. ఏమాత్రం తేడా వచ్చినా .. పార్టీని పక్కన పెట్టేయండి అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సరూర్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సభకు చేరుకున్న ఆమెకు …
Read More »ఏపీలో అందుకే రోడ్లేయట్లేదా..మంత్రివర్యా?
ఏపీలో రోడ్లు వేయడం లేదని.. ఎక్కడికక్కడ గుంతలే కనిపిస్తున్నాయని.. రోడ్లపై ప్రయాణించాలంటే.. ఒళ్లంతా హూనం కావాల్సిందేనని.. ప్రజల్లో ఒక టాక్ ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఏపీ రహదారుల గురించి.. తెలంగాణ మంత్రులు సైతం అనేక సందర్భాల్లో విమర్శలు కామెంట్లు చేసి కాక పుట్టించారు. కట్ చేస్తే.. ఇప్పుడు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే.. ఏపీ ఉపముఖ్యమంత్రి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రాజన్న దొర.. సంచలన వ్యాఖ్యలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates