కాంగ్రెస్ అగ్రనేత, ఇటీవల తనపై ఉన్న రెండేళ్ల జైలు శిక్ష నుంచి ఒకింత ఊరట పొందిన రాహుల్గాంధీపై బీజేపీ నాయకులు సటైర్లు కుమ్మేశారు. “రండి అరుణాచల్ ప్రదేశ్ చూపిస్తా” అని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సహా.. పలువురు బీజేపీ నేతలు.. ఆయనను లోక్సభలోనే ఆట పట్టించారు. దీనిపై మాట్లాడేందుకు ఏమీ కనిపించకపోవడంతో రాహుల్ గాంధీ మౌనంగా చూస్తుండి పోయారు. దీంతో మరింతగా బీజేపీ ఎంపీలు, మంత్రులు సటైర్లతో విరుచుకుపడ్డారు. …
Read More »జోస్యం చెప్పేసిన రేవంత్
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 25 సీట్లకు మించి వచ్చే అవకాశంలేదన్నారు. కేసీయార్ ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు మ్యాగ్జిమమ్ 25 అని కచ్చితంగా చెప్పారు. అంత కచ్చితంగా ఎలా చెబుతారంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్లుగా చెప్పారు. మరి రేవంత్ కాన్ఫిడెంట్ ఏమిటో తెలీదు. బీఆర్ఎస్ …
Read More »షర్మిల పార్టీ విలీనం ఖాయమైందా?
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం ఖాయమైపోయిందా ? అయ్యిందనే అంటున్నాయి రెండుపార్టీల వర్గాలు. ఈనెల 12 వ తేదీన షర్మిల ఢిల్లీకి వెళ్ళి పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం గురించి ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొంతకాలంగా రెండుపార్టీల మధ్య పొత్తా లేకపోతే విలీనమా అనే విషయమై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట్లో షర్మిలేమో పొత్తుకు మొగ్గుచూపితే …
Read More »బొత్స కామెంట్స్ విన్నారా.. వైసీపీలో ఇవే హైలెట్!
వైసీపీ సర్కారుపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా వైసీపీకి చెందిన అనేక మంది నాయకులు వ్యాఖ్యలు చేశారు. వీరిలో కాపు నాయకులే ఎక్కువగా ఉన్నారు. సరే.. ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనే హైలెట్గా నిలిచాయి. ఆయన చాలా నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్టు కొందరు చర్చించుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు(కొన్ని ధియేటర్లలో) …
Read More »నువ్వు చంద్రబాబుకే పుట్టి ఉంటే..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాచర్లలో లోకేష్ మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు సార్లు గెలిచించారని, కానీ ఇక్కడ అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్గా ఉందన్నారు. గ్రానైట్ లారీల నుంచి మామూళ్లు, పక్క రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారా పిన్నెల్లి సోదరులు రూ.కోట్లు సంపాదించారని లోకేష్ విమర్శించారు. పిన్నెల్లి సోదరులను పిల్లి బ్రదర్స్ అని …
Read More »ఇక అన్నీ ఢిల్లీలోనేనా?
ప్రత్యర్ధి పార్టీలను దెబ్బకొట్టి అధికారంలోకి రావాలన్నది బీజేపీ నేతల పట్టుదల. ప్రత్యర్ధిపార్టీలంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అనే అర్ధం. ఎందుకంటే అధికారంలో ఉన్నపార్టీ కాబట్టే. అధికారంలో ఉంది కాబట్టే ఇంటెలిజెన్స్, పోలీసులు వ్యవస్ధలు మొత్తం బీఆర్ఎస్ కంట్రోల్లోనే ఉంటుంది. హైదరాబాద్ పార్టీ ఆఫీసులోనో లేకపోతే ఏదైనా హోటల్లోనో ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా వెంటనే అధికారపార్టీకి తెలిసిపోతోందట. అందుకనే ఇకనుండి కీలకమైన భేటీలన్నీ ఢిల్లీల్లోనే జరపాలని అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం. నిర్ణయాలు …
Read More »ఒక్క టికెట్.. ముగ్గురు నేతలు
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దించాలనే లక్ష్యంతో పని చేస్తున్న కాంగ్రెస్కు సొంత నాయకుల మధ్య విభేదాలు సమస్యగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య పోటీ నెలకొంది. దీంతో ఈ టికెట్ల వ్యవహారం టీపీసీసీకి తలనొప్పిగా మారింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజవకర్గంలోనూ కాంగ్రెస్కు ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీపడుతున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన జుక్కల్ …
Read More »రాజన్న చోటులో.. రామన్న దృష్టి
తెలంగాణ ఎన్నికలపై పార్టీలన్నీ దృష్టి పెట్టడంతో సందడి మొదలైంది. అధికార బీఆర్ఎస్ మూడో సారి విజయంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో పార్టీలోని అసంతృప్తులను బుజ్జగిస్తూ ఎన్నికల నాటికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో పార్టీలో అగ్రనేత కేటీఆర్ ఈ బాధ్యతలు భుజాన వేసుకుని పార్టీ నాయకుల మధ్య దూరాన్ని, వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వేములవాడ నియోజకవర్గంపై దృష్టి సారించినట్లు తెలిసింది. …
Read More »రాహుల్ గ్రాండ్ ఎంట్రీ.. స్పెషల్ ఎట్రాక్షన్
ఈరోజు లోక్ సభలో స్పెషల్ ఎట్రాక్షనంతా రాహుల్ గాంధీయే. కారణం ఏమిటంటే మణిపూర్ అల్లర్లపై ఇండియా కూటమితో పాటు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై 8,9,10 తేదీల్లో చర్చలు మొదలవ్వబోతున్నాయి. సభ్యులంతా మాట్లాడిన తర్వాత చివరగా నరేంద్రమోడీ సమాధానం చెబుతారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. నిజానికి ఓటింగ్ తో ప్రతిపక్షాలు సాధించబోయేది ఏమీలేదని అందరికీ తెలుసు. కాకపోతే విషయం తీవ్రతను దేశంమొత్తానికి తెలియజేయటం, లోక్ సభలో మణిపూర్ అల్లర్లపై …
Read More »ఎన్ని లక్షల కోట్ల అప్పులు రద్దయ్యాయో తెలుసా?
గడచిన తొమ్మిది ఏళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం బడా పారిశ్రామకవేత్తలకు లక్షల కోట్ల రూపాయల అప్పులను మాఫీచేసింది. మామూలు జనాలు వెయ్యిరూపాయలు అప్పున్నా వదిలిపెట్టని బ్యాంకులు పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం వేల కోట్ల రూపాయల అప్పులను రద్దుచేసేస్తోంది. గడచిన తొమ్మిదేళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం రద్దుచేసిన అప్పులు రూ. 14.56 లక్షల కోట్లు. మొండిబాకీల పేరుతో అంటే వసూలు చేయటం సాధ్యంకాదని బ్యాంకులు చేతులు ఎత్తేసిన పేరుతో లక్షల కోట్ల రూపాయలను రద్దుచేశాయి. …
Read More »కాంగ్రెస్ ప్రచారం వ్యూహాత్మకమేనా?
రాబోయే ఎన్నికల్లో తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేయాలని డిసైడ్ అయ్యింది. మామూలుగా అయితే ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారాన్ని మ్యానిఫెస్టో ఆధారంగానే చేసుకుంటుంది. నియోజకవర్గాల్లో అభ్యర్ధులైనా, రాష్ట్రస్ధాయి ప్రచారమైనా ఒకే విధంగా జరుగుతుంది. అయితే వచ్చేఎన్నికల్లో పద్దతిని మార్చాలని డిసైడ్ అయ్యింది. ఎలాగంటే ‘లోకల్ ఇష్యూస్ ఫస్ట్..ఓవరాల్ అండ్ కామన్ ఇష్యూన్ నెక్ట్స్’ అన్న పద్దతిని అవలంభించబోతున్నది. దీనికి ఉదాహరణ ఏమిటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్ధి …
Read More »కేసీయార్ ఆయుధాలు పనిచేస్తాయా?
రాబోయే ఎన్నికల్లో ప్రయోగించేందుకు తన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని, వాటిని ప్రయోగిస్తే ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని కేసీఆర్ అనుకుంటున్నారు. నిజంగానే కేసీయార్ దగ్గర అంత దమ్మున్న ఆయుధాలున్నాయా ? ఉంటే అవి ఏమిటి ? కేసీయార్ చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ ఆయుధాల దెబ్బకు దిమ్మతిరిగిపడిపోతాయా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ ఆయుధాల గురించి చెప్పుకుంటే ముందు ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వడం, ఇతరత్రా సౌకర్యాలు కలగజేయటం. ఇక రైతులకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates