పెన్షన్ విధానంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఫైనల్ చేసేసింది. కొత్తగా రూపొందించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)మాత్రమే అమలు చేయబోతున్నట్లు మంత్రి బొత్సా సత్యనారాయణ ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంగా చెప్పేశారు. అయితే ఉద్యోగులేమో తమకు జీపీఎస్ వద్దని ఓపీఎస్సే కావాలని పట్టుబడుతున్నారు. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ ఓపీఎస్ ను యూపీఏ ప్రభుత్వం అమల్లోకి రాగానే అంటే 2004లోనే రద్దుచేసింది. 2004కి ముందు ఉన్న ఉద్యోగులకు …
Read More »తగ్గని పొంగులేటి, తుమ్మల.. మరి పాలేరు ఎవరికి?
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ కిందామీదా పడుతోంది. దాదాపు 80 స్థానాల్లో అభ్యర్థులను సులువుగానే ఖరారు చేసేలా కనిపిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానానికి మిగిలిన స్థానాల్లో ఇబ్బందులు తప్పడం లేదని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండటమే అందుకు కారణం. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కూడా …
Read More »మైనంపల్లి ప్లేస్లోకి ముగ్గురు లీడర్లను రెడీ చేసిన కేసీఆర్
గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చకు తెర దించుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలియజేయడమే కాకుండా త్వరలోనే తాను ఓ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే, మైనంపల్లి బదులుగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగబోయే నేత ఎవరనే చర్చ జరుగుతుంది. …
Read More »మధుయాష్కీకి కష్టమేనా?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ ఆశలు గల్లంతేనా? ఎల్బీ నగర్ టికెట్ ఆశిస్తున్న ఆయనకు భంగపాటు తప్పదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. మధుయాష్కీకి ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే అందుకు కారణమని చెప్పాలి. ఈ స్థానిక కాంగ్రెస్ నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ మధుయాష్కీకి వ్యతిరేకంగా పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు తెలిసింది. ఎల్బీ …
Read More »ఇంకొన్ని రోజులు ఢిల్లీలోనే.. లోకేష్ కింకర్తవ్యం?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కింకర్తవ్యం ఏమిటీ? చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన ఎటువంటి అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తండ్రి చంద్రబాబు రిమాండ్ మీద జైలుకు వెళ్లిన తర్వాత లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే విషయాన్ని జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మార్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. …
Read More »అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది… అయితే ఈ ఆధునిక సమాజంలో అన్ని దానాలలో కెల్లా అవయవ దానం కూడా గొప్పదే అన్న నానుడి బాగా ప్రాచుర్యం పొందింది. అనారోగ్య కారణాలతో, రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారు, బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు నిర్ధారించిన వారు తమ అవయవాలను దానం చేసి ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపిన ఘటనలు అనేకం ఉన్నాయి. అవయవదానంపై సెలబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు ప్రచారం చేపట్టడంతో …
Read More »నాలుగేళ్లు ఏం పీకావు జగన్?: మోత్కుపల్లి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మాజీ టీడీపీ నేత, మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ పొలిటిషన్ మోత్కుపల్లి నర్సింహులు స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఒక దుర్మార్గుడివి జగన్…చంద్రబాబు వంటి పెద్ద మనిషిని నిరాధార ఆరోపణలపై అరెస్టు చేసేందుకు నీకు సిగ్గు, బుద్ధి ఉన్నాయా?అంటూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి …
Read More »జగన్ కు ‘బెయిల్ డే’ విషెస్ చెప్పిన లోకేష్
సీఎం జగన్ బెయిల్ మీద బయట ఉండి సీఎం అయ్యారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న జగన్…చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో ఉంచాలని కక్షగట్టారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ సెటైర్లు వేశారు. జగన్ గత పదేళ్లుగా బెయిల్పై ఉన్నారని, బెయిల్ డే వార్షికోత్సవ శుభాకాంక్షలు …
Read More »జైలులో చంద్రబాబు విచారణ…ఇలా సాగుతోంది
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును 2 రోజులపాటు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమండ్రి జైలుకు విజయవాడ నుంచి సీఐడీ బృందం వెళ్లి విచారణ మొదలుబెట్టింది. 9 మంది అధికారులు చంద్రబాబును విచారణ జరపనున్నారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావులు విచారణకు హాజరయ్యారు. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో కాన్ఫరెన్స్ హాల్లో విచారణ జరుగుతోంది. …
Read More »షర్మిల అయోమయంలో ఉన్నారా ?
తనపార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయంలో వైఎస్ షర్మిలలో అయోమయం పెరిగిపోతోందా ? గ్రౌండ్ లెవల్లో పరిస్ధితులను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే షర్మిల పార్టీ విలీనం ఇపుడు అప్పుడు, ఈరోజు, రేపు అంటు ఆలస్యమవుతోంది. ఏదో కారణంగా విలీనం ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షర్మిలతో పాటు ఇతరుల్లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. మొన్నటి 16,17 తేదీల్లో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధిలు హైదరాబాద్ లోనే …
Read More »20 రోజులు వృధా అయిపోయిందా ?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదలై ముగిసిపోయాయి. 18వ తేదీన మొదలైన సమావేశాలు 22వ తేదీన ముగిశాయి. జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ బిల్లంటు నానా గోల జరిగింది. వీటికోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలంటు దేశ రాజకీయాల్లో నానా హడావుడి జరిగింది. దాంతో ఇండియాకూటమితో పాటు తెలంగాణాలో కేసీయార్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కేసీయార్ ఇబ్బందులకు కారణం ఏమిటంటే దాదాపు నెలరోజుల క్రితమే అభ్యర్ధులను ప్రకటించేయటం. జమిలి …
Read More »బీఆర్ఎస్కు మైనంపల్లి గుడ్ బై
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను , ఆయన నిర్ణయాలను బహిరంగంగా తూర్పారపట్టిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన మైనంపల్లి హనుమంతరావు త్వరలోనే తాను ఓ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కోరిన మైనంపల్లికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates