బాలినేనికి చెక్ పెడుతున్నారా ?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి తొందరలోనే చెక్ పెట్టబోతున్నారా ? ఇందుకు రంగం సిద్ధమైందా ? ఇపుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈ విషయంపైనే పెద్ద చర్చ మొదలైంది. జిల్లాలో పార్టీకి బాలినేని పెద్ద సమస్యగా మారిపోయారు. ప్రతి చిన్న విషయానికి అలగటం, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనబడకపోవటం, ఇచ్చిన బాధ్యతలను చూడకపోవటం, ఎంతసేపు పార్టీపైన అసంతృప్తి వ్యక్తంచేయటంతోనే మాజీమంత్రి రాజకీయమంతా సరిపోతోంది. బాలినేని అలిగినపుడల్లా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. దాంతో జగన్ అంటే కొందరు నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.

తనకు జగన్ ఎంత సన్నిహితుడు అని చెప్పుకోవటానికే బాలినేని అలుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్ కూడా బాలినేనిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీవర్గాల టాక్. అందుకనే బాలినేనిని పక్కనపెట్టేసి ముందుకెళ్ళాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే బాలినేనికి దగ్గర బంధులు, సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని యాక్టివ్ చేస్తున్నట్లు సమాచారం. వైవీ మాట్లాడుతు తాను జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించబోతున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.

వైవీ చేసిన రెండు ప్రకటనలతో బాలినేనికి షాక్ కొట్టినట్లయ్యింది. అవసరమైతే తనను వదులుకోవటానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా బాలినేనికి సమాచారం అందిదట. దాంతో ఇపుడు ఏమిచేయాలనే విషయమై బాలినేని తన మద్దతుదారులతో మంతనాలు మొదలుపెట్టారు. ఏదేమైనా వైవీ ద్వారానే బాలినేనికి చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు అర్ధమవుతోంది.

వచ్చేఎన్నికల్లో వైవీ ఎంపీగా పోటీచేస్తే సమస్యుండదు. ఎందుకంటే గతంలో ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అలాకాకుండా వైవీ ఎంఎల్ఏగా పోటీచేస్తే మాత్రం బాలినేనికి సమస్యలు తప్పవు. ఎందుకంటే వైవీ ఎక్కడినుండి పోటీచేస్తారన్నదే పెద్ద సమస్య అయిపోతుంది. బాలినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నుండి వైవీ పోటీచేయాలని అనుకుంటే బాలినేనిని పార్టీనుండి బయటకు పంపటానికి జగన్ రెడీ అయిపోయినట్లే అనుకోవాలి. అయితే ఎక్కడినుండి పోటీచేయబోతున్నారనే విషయాన్ని వైవీ ప్రకటించకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.