Political News

జగన్ ఢిల్లీ టూర్.. ఎవరెవరిని కలుస్తున్నారు?

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ బీజేపీ నేతలు జగన్ పాలనపై విరుచుకుపడటమే కాదు.. రెండు పార్టీల మధ్య లడాయి మోతాదు మించిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి మరో ఒకట్రెండు నెలల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయన్న అంచనా ఒకవైపు.. సీఎం జగన్ మీద ఉన్న అవినీతి కేసులకు సంబంధించి అంశం ఏదైనా తెర మీదకు వస్తుందన్న మాటతో …

Read More »

జగన్ – షర్మిల మధ్య వాదులాట?

మరే మీడియా సంస్థ ప్రస్తావించని అంశాల్ని తన కాలమ్ లో చెప్పే గుణం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాక్రిష్ణకు అలవాటన్న సంగతి తెలిసిందే. ప్రతి వారాంతంలో తాను రాసే పొలిటికల్ కామెంటరీ ‘కొత్త పలుకు’లో ఆయన పలు సంచలన అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. గత వారం ఆయన తన కాలమ్ లో.. క్రిస్మస్ ముందు రోజు రాత్రి కడప జిల్లాలోని వైఎస్ కుటుంబానికి చెందిన ఇడుపులపాయ గెస్టు హౌస్ …

Read More »

పండుగలకు ‘RRR’ శాపం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ అంటే.. సంక్రాంతినే. ఆ తర్వాత అంత సందడి ఉండేది దసరాకే. ఈ రెండు పండగలనూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కిల్ చేసి పడేసిందంటూ ఇప్పుడు సినీ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పోయినేడాది దసరాకే ‘ఆర్ఆర్ఆర్’ రావాల్సింది. అక్టోబరు 13కు రిలీజ్ డేట్ ఇచ్చి అప్పటికి సినిమాను సిద్ధం చేయడానికి చూశారు. చాలా ముందుగానే డేట్ ఇవ్వడంతో వివిధ భాషల్లో పేరున్న సినిమాలన్నింటినీ దసరా …

Read More »

చంద్రబాబు ముందు జాగ్రత్త?

చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. ఈ నెలలో మూడు రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. 6,7,8 తేదీల్లో కుప్పంలోని నేతలు, కార్యకర్తలతో పాటు జనాలను కూడా కలవబోతున్నారు. కుప్పంలో ఒకరోజు మిగిలిన మండలాల్లో రెండు రోజులు పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారట. గడచిన మూడు నెలల్లో నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించటం ఇది మూడోసారి. అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ముందు జాగ్రత్తపడుతున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళలో …

Read More »

6 వేల ఎన్జీవోలకు మోడీ దెబ్బ

మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కారు. పలు విదేశీ సంస్థల నుంచి దేశంలోకి వచ్చే విదేశీ విరాళాల మీద కత్తి దూసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 6 వేల ఎన్జీవోల విదేశీ విరాళాల లైసెన్సుల్ని రద్దు చేయటం గమనార్హం. నిబంధనల్ని అత్రికమించారని కేంద్రం చెబుతుంటే.. ఇదంతా కక్ష సాధింపు చర్యలో భాగమని సదరు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే..  ఇలా పలు విదేశీ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే విరాళాలకు …

Read More »

షర్మిలతో వైఎస్ వివేకా చెప్పిన మాట?

Sharmila

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు వైఎస్ షర్మిల. అందరి అంచనాలకు భిన్నంగా తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆమె.. ఇటీవల కాలంలో తన సోదరుడు కమ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో విభేదాలు పొడ చూపాయని.. క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఇడుపులపాయలోని గెస్టు హౌస్ లో తన సోదరుడు జగన్ తో షర్మిల గొడవ పడినట్లుగా వార్తలు …

Read More »

ఎంతలా ట్రై చేసినా.. టెంప్ట్ అవ్వని బాబు

కొత్త ఏడాది అడుగు పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో మాట్లాడటం గతంలో ఒక అలవాటుగా ఉండేది. అందరూ కాకున్నా కొందరు మాత్రం ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మీడియాతో మాట్లాడటం.. మరికొన్ని సందర్భాల్లో దూరంగా ఉండటం చేసే అధినేతలు ఉన్నారు. వీరికి భిన్నంగా ఒకే విధానాన్ని ఫాలో అయ్యే కొద్ది మంది నేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరు. జనవరి ఒకటి సందర్భంగా మీడియాతో కాసేపు …

Read More »

అమ‌రావ‌తిని చూపించి ఏపీ అప్పు..

అప్పులు చేయ‌డంలో త‌న‌కు తానే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్న ఏపీ ప్ర‌భుత్వం.. తాజాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేనినైతే బూచిగా చూపించి.. ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంద‌ర‌గోళంలోకి  నెట్టేసిందో.. రాజ‌కీయ దుమారం రేపి.. రైతులను.. అన్ని వ‌ర్గాల వారిని ఇబ్బందిపాటు చేసిందో.. ఇప్పుడు దానినే చూపించి అప్పులు తెచ్చుకునేందుకురెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. అదే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. ఈ రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల పనులు చేపట్టి వాటిని హామీగా చూపించి 2022 …

Read More »

ఉండ‌వ‌ల్లికి ఇప్పుడు తెలిసొచ్చిందా?

వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేల్లో  అత్యంత వివాదాస్ప‌ద నాయ‌కురాలిగా పేరొందిన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి.. అన్ని వ‌ర్గాల నుంచి గ‌ట్టి షాకే త‌గులుతోంది. ఇటీవ‌ల ఆమె అంబేడ్క‌ర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆమె సామాజిక వ‌ర్గం నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. దీంతో ఇప్పుడు నాలిక క‌రుచుకుని.. “త‌ప్పు నాది కాదు“ అని మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ఏం జ‌రిగిందంటే..ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ 4వ మాదిగ మహాసభలో …

Read More »

రాధాపై `రెక్కీ` నిజం కాదా?

కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని.. టీడీపీ యువ నాయ‌కుడు, వంగ‌వీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఇటీవ‌ల ఆరోపించిన విష‌యం తెలిసిందే. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు.  అయితే.. త‌న‌ను ఎవ‌రు ఎప్పుడు.. ఇలా ప్ర‌య‌త్నించార‌నే విష‌యంపై ఆయ‌న మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. కొంత మేర‌కు మాత్ర‌మే ఆయ‌న‌.. ఈ విష‌యం వెల్ల‌డించ‌డం.. మిగ‌తాది స‌స్పెన్స్‌లో …

Read More »

అధికారం మ‌ళ్లీ మాదే: KTR

తెలంగాణ‌లో వచ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని.. సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సమ్మిళిత వృద్ధి కొనసాగుతోందని  అన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా తెలంగాణ రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. నల్గొండలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో …

Read More »

కేసీఆర్ నిర్ణయం స‌రైందే.. కానీ: బండి

తెలంగాణ‌లో అనూహ్య‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్‌పై ఎప్పుడూ నిప్పులు చెరిగే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్‌.. తాజాగా కూల‌య్యారు. అంతేకాదు.. కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణ‌యాన్ని ఆయ‌న స‌మ‌ర్ధించారు. అయితే.. దీనిలో కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని మాత్రం సూచించారు. తాజాగా బండి సంజ‌య్ స‌హా ప‌లువురు నేత‌లు ఇటీవ‌ల ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో 317ను సవరించాలని కోరుతూ గవర్నర్‌ను కలిశారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైకు వినతిపత్రం …

Read More »