Political News

అవినాష్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం రీజ‌నేంటి?

 ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నారు. సీఎం జ‌గ‌న్ అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నవారు కూడా వేలల్లోనే ఉన్నారు. కానీ, వారికెవ‌రికీ జ‌గ‌న్ అనుగ్ర‌హం క‌ల‌గ‌డం లేదు.. కానీ, విజ‌య‌వాడకు చెందిన యువ నాయ‌కుడు దేవినేని అవినాష్‌కు మాత్రం జ‌గ‌న్ ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నారు. కృష్ణాజిల్లాలో ఎక్క‌డ ఎలాంటి కార్య‌క్ర‌మం జ‌రిగినా.. అవినాష్‌కు ఏకంగా సీఎంవో నుంచే ఆహ్వానం అందుతోంది. ఆయ‌న కూడా అంతే వేగంగా …

Read More »

త్వ‌ర‌లో మ‌హానేత‌ ప‌థ‌కం.. స్కెచ్ సిద్ధం చేస్తున్న స‌ల‌హాదారు..!

రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమలు చేస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఆయా ప‌థ‌కాల‌కు త‌మ కుటుంబ స‌భ్యుల పేర్లు పెట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా కొన్ని ప‌థ‌కాల‌కు త‌న పేరును, పార్టీ అధినేత ఎన్టీఆర్ పేరును పెట్టుకున్నారు. అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబును విమ‌ర్శించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. త‌ను ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌కు త‌న పేరు, త‌న తండ్రి …

Read More »

జ‌గ‌న్ ఆ మంత్రికి చ‌క్క‌గా చెక్ పెట్టేశారే ?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ రాజ‌కీయాలు ఊపందుకున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డి పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌స్తుత మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి.. వైసీపీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పుతున్నారు. బాబు గుర్తులు చెరిగిపోయేలా.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు పొందేలా పెద్దిరెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ఈ క్ర‌మంలోనే స్థానిక ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చూపించారు. టీడీపీకి కేరాఫ్ లేకుండా చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే …

Read More »

జ‌గ‌న్ ఎన్నిక‌ల స్టంట్‌.. తిరుప‌తి వ్యూహంగా అడుగులు!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలా స్పందించాలో తెలిస్తే.. చాలు.. విజ‌యం దానంత‌ట అదే చేరువ అవుతుంద‌ని అంటారు సీనియ‌ర్లు. ఇప్పుడు ఇదే త‌ర‌హా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌. ఆయ‌న గ‌డప దాట‌కుండానే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌, కొన్ని రోజుల కింద‌ట జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హరిస్తున్నారు. కొన్ని రోజుల కింద‌ట జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన కార్పొరేష‌న్ …

Read More »

వీర్రాజు అవస్తలు దేనికో తెలుసా ?

జనసేన అధినేత పవన్ను ఎలాగైనా ఎన్నికల ప్రచారంలోకి దించాలని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు నానా అవస్తలు పడుతున్నారు. అందుకనే కాబోయే సీఎం పవనే అని, మోడి, అమిత్ షాకు పవన్ చాలా ఇష్టుడని ఏవేవో డైలాగులు చెబుతున్నారు. నిజంగానే వాళ్ళిద్దరికి పవన్ అంత ఇష్టుడే అయితే మోడి ఎందుకని అపాయింట్మెంట్ ఇవ్వటంలేదు. చివరగా నాలుగుసార్లు ఢిల్లీకి వెళ్ళిన పవన్ ప్రధానమంత్రిని కలవకుండానే వెనక్కు తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. నిజానికి …

Read More »

కేంద్ర బలగాల గుప్పిట్లో నందిగ్రామ్

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అత్యంత ఎలక్ట్రిఫైయింగ్ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నందిగ్రామ్ ఒక్కటే. ఇక్కడే మమతాబెనర్జీ పోటీచేస్తున్నారు. బీజేపీ తురుపుముక్క సుబేందు అధికారిది నందిగ్రామ్ సొంత నియోజకవర్గం. చాలా సంవత్సరాల పాటు మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు ఒక్కసారిగా ప్లేటు మార్చేసి బీజేపీలోకి ఫిరాయించారు. ఫిరాయించిన సుబేందు ఊరికే ఉండకుండా ధైర్యముంటే తనపై నందిగ్రామ్ లో పోటీచేసి గెలవాలంటు మమతకు సవాలు విసిరారు. అసలే మండిపోతున్న మమతకు సుబేందుకు విసిరిన …

Read More »

విశాఖ ముహుర్తం ఫిక్స్… సీఎం ధైర్యం ఏంటి?

రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌న్న‌.. త‌న క‌ల‌ను, ప‌ట్టుద‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ అంతే వేగంగా పావులు క‌దుపుతున్నారు. అమ‌రావతిని కేవ‌లం ఓ సామాజిక వ‌ర్గం కోస‌మే నిర్మాణం చేశార‌న్న ఆయ‌న దానిని కేవ‌లం చ‌ట్ట‌స‌భ‌ల రాజ‌ధానిగా ఉంచేసి.. విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని, క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని స‌మ‌తుల్యం చేస్తామ‌ని.. త‌ద్వారా.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు అవ‌కాశం …

Read More »

టీడీపీలో సీనియ‌ర్ల దుమారం.. కీల‌క స‌మ‌యంలో సీన్ రివ‌ర్స్ ?

తీవ్ర ఇర‌కాటంలో ఉన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ఏ విధంగా ముందుకు న‌డిపించాల‌నే విష‌యంపై పార్టీ అధినేత చంద్ర‌బాబు ఒక‌వైపు ప్ర‌య‌త్నిస్తుంటే.. మ‌రోవైపు సీనియ‌ర్లు త‌మ దారిలో తాము న‌డుస్తున్నారు. త‌మ ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కొంద‌రు నాయ‌కులు పార్టీకి ఇప్ప‌టికీ దూరంగానే ఉన్నారు. మ‌రికొంద‌రు ఇప్పుడున్న నాయ‌క‌త్వం మారాల‌ని బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట కుప్పంలోనే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. పార్టీ నాయ‌క‌త్వాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అప్ప‌గించాల‌ని …

Read More »

అన్న అవుట్‌… త‌మ్ముడైనా టీడీపీని కాపాడ‌తాడా ?

విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదా? ఎవ‌రూ పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మూడు సార్లు విజ‌యం ద‌క్కించుకుంది. ఈ మూడు సార్లు కూడా 1983, 1985, 1994 ఎన్నిక‌ల్లో శంబంగి వెంక‌ట చిన అప్ప‌ల‌నాయుడు టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత .. పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి …

Read More »

రాధా ఏమ‌య్యారు… ఎక్క‌డున్నారు?

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఒక వెలుగు వెలిగిన దివంగ‌త కాపు నేత వంగ‌వీటి రంగా వార‌సుడిగా అరంగేట్రం చేసిన వంగ‌వీటి రాధా.. 2004లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న రాజ‌కీయంగా చేసిన త‌ప్పులు కావొచ్చు.. లేదా.. వేసిన అడుగులు కావొచ్చు.. ఆయ‌న‌కు రాజ‌కీయ ఫ్యూచ‌ర్ ‌లేకుండా చేశాయ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఆయ‌న ఏం చేస్తున్నారు ? ఎక్క‌డ ఉన్నారు ? అనే విజ‌య‌వాడ‌లో జోరుగా …

Read More »

సానుభూతిపైనే కేసీయార్ ఆశలు ?

అవును నాగార్జునసాగర్ ఉపఎన్నికలో దివంగత ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య కొడుక్కి టికెట్ ఇవ్వటంతోనే ఈ విషయం అందరికీ అర్దమైపోయింది. నోముల కొడుకు నోముల భగత్ కు కేసీయార్ పార్టీ కార్యాలయంలో బీఫారమ్ అందించారు. దాంతో సాగర్ ఉపఎన్నికలో కూడా కేసీయార్ సానుభూతి రాజకీయాలకే కట్టుబడినట్లుగా అర్ధమైపోయింది. మొన్నటి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలో కూడా కేసీయార్ దివంగత ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో …

Read More »

వీడియో తీసి పంపితే రూ.10వేలు ఇస్తారట

ఏపీ తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తు వేసింది. తాము అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికార వైసీపీ నేతలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుందన్న ఆరోపణల్ని తరచూ చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను పంపి బెదిరింపులు.. దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని తరచూ చెప్పటమే కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. దీంతో.. కొత్త ఆఫర్ ను ప్రకటించారు ఏపీ …

Read More »