ఏపీ డీజీపీ మార్పు జరిగిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్కారు.. ఈ క్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ ను పక్కన పెడుతుందంటూ.. ఈ నెల 4వ తేదీనే గుల్టే ప్రత్యేక కథనం ప్రచురించింది. ఏపీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఉద్యోగులు ఉద్యమాన్ని కంట్రోల్ చేయడంలో డీజీపీ సవాంగ్ విఫలం చెందారని.. దీనిపై సీఎం కూడా హుటాహుటిన …
Read More »కేసీఆర్ కౌగిలించుకున్నా.. కోమటిరెడ్డి తగ్గడం లేదు
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేయాలో తెలంగాణ సీఎం కేసీఆర్కు బాగా తెలుసని చెబుతుంటారు. పరిస్థితులను బట్టి ఆయన తన వ్యవహార శైలి మార్చుకుంటారు. అసరాలకు అనుగుణంగా ప్రత్యర్థి పార్టీలపై కోపాన్ని, ప్రేమను ఒలకబోస్తుంటారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని కేసీఆర్ ప్రదర్శిస్తున్నారు. మోడీని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్పై ప్రేమ చూపిస్తున్నారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత …
Read More »ఏపీ : రెవెన్యూ లోటుకు కారణాలివే!
ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ లోటు అంతులేనిదిగా ఉంది అని,అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని వార్తలొస్తున్నాయి.ముఖ్యంగా 9 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు ఐదు వేల కోట్లకుపైగా అని తేలింది.బహుశా! ఈ మొత్తం గత మార్చి నుంచి డిసెంబర్ వరకూ అయి ఉంటుంది.లేదా ఇంకేదయినా లెక్క కావొచ్చు.ఓ తొమ్మిది నెలల కాలం లెక్క తీస్తే జగన్ ప్రభుత్వం చేసిన అప్పు ఇది.ఈ అప్పుకు వడ్డీ ఎంత..ఎంత కాలానికి తిరిగి చెల్లిస్తారు …
Read More »8 కోట్ల కోసం.. వివేకా హత్య: సీబీఐ చార్జ్షీట్
వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్ వెలుగులోకి వచ్చింది. కేవలం 33 రోజుల్లోనే ఈ హత్యకు ప్లాన్ చేయడం.. కార్యక్రమంలోకి దిగిపోవడం.. మర్డర్ చేయడం అన్నీ జరిగిపోయాయని వెల్లడించింది. అంతేకాదు.. కేవలం 8 కోట్ల రూపాయల విలువైన భూమి కోసమే ఈ హత్య జరిగినట్టు సీబీఐ వెల్లడించడం గమనార్హం. అంతేకాదు.. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి పాత్రలు కీలకంగా ఉన్నాయని తలిపింది. గత ఏడాది అక్టోబర్ 26న …
Read More »పవర్ ప్రాబ్లం : రాతలు సరే కోతలు మాటేంటి?
రాష్ట్రంలో అనధికార కోతలు అమలు అవుతున్నాయి. ఇదివరకు కోతలు విధించేటప్పుడు సంబంధిత సంస్థల నుంచి ముందస్తు సమాచారం వినియోగదారులకు అందేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఉండదో కూడా తెలియని సందిగ్ధత నెలకొని ఉంది.ముఖ్యంగా రెండు రంగాలను ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకోవాల్సి ఉంది. ఒకటి వ్యవసాయ రంగం,రెండు పారిశ్రామిక రంగం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎప్పటికప్పుడు కోతలు వస్తూనే ఉన్నాయి. అనధికార …
Read More »హోదాపై తోక ముడుస్తారా? చంద్రబాబు ఫైర్
ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తోడముడిచారని.. టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ నాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహకమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కేంద్ర హోంశాఖ అజెండాలో హోదా అంశం పేర్కొనడాన్ని తమ ఘనతగా చెప్పుకున్న వైసీపీ నేతలు.. అజెండా నుంచి …
Read More »కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు కేసీఆర్: బండి ఆగ్రహం
సర్జికల్ స్ట్రయిక్ జరగలేదని సీఎం కేసీఆర్ అనటం దారుణమని… తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రయిక్ జరిగినప్పుడు దేశమంతా సంబురాలు చేసుకున్నారని సంజయ్ చెప్పారు. రాహుల్గాంధీ, కేసీఆర్కు మాత్రమే సర్జికల్ స్ట్రయిక్ గురించి తెలియదని ఎద్దేవా చేశారు. సైనికుల త్యాగాలను కేసీఆర్ కించపరిచారని సంజయ్ ఆరోపించారు. ఉగ్రవాదుల మాటలనే నమ్ముతారా? భారత సైనికులపైనా కేసీఆర్కు నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ను …
Read More »మందు బాబులకు మరో షాక్ ఇచ్చిన జగన్
రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన రోడ్డు సెఫ్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. రోడ్డు భద్రత కోసం చర్యలు తీసుకునేందుకు లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయటంతో పాటు.. ప్రస్తుతం ఇస్తున్న డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. రోడ్ల పక్కన మద్యం అమ్మకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి …
Read More »వ్యూహకర్తను మార్చిన బాబు.. ఇక పరుగులేనా?
తెలుగు దేశం పార్టీ మనుగడ కోసం తన రాజకీయ భవిష్యత్ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వచ్చే ఏపీ ఎన్నికల్లో విజయం అవసరం. లేదంటూ ఆయన రాజకీయ కెరీర్కు ముగింపు పడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఆయన పార్టీని ఆ దిశగా సిద్ధం చేస్తున్నారు. నియోజవకవర్గాల వారీగా ఇంఛార్జీలను నియమిస్తూ సాగుతున్నారు. అయితే తాజాగా ఆయన తన ఎన్నికల వ్యూహకర్తను …
Read More »వెనకాల ఉంది పీకేనే.. కన్ఫార్మ్ చేసిన కేసీఆర్!
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ గెలిచిన టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఎదిగింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తనకు ప్రత్యర్థి లేకుండా చేసుకున్నారన్నా అభిప్రాయాలు వినిపించాయి. కానీ గత రెండేళ్లుగా పరిస్థితిలో మార్పు వస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ ఎదుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ.. కేసీఆర్కు సవాలు విసురుతోంది. దీంతో కాంగ్రెస్.. ఆ పార్టీపై యుద్ధం ప్రకటించారు. ఇన్ని రోజులూ లేనిది ఇప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మోడీని టార్గెట్ చేసి …
Read More »మోడీకి వ్యతిరేకంగా సీఎంల మీటింగ్.. మరి కేసీఆర్?
గత కొద్దికాలంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విరుచుకుపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు కామెంట్లలోని విశ్వసనీయతను తేల్చి చెప్పేందుకు కీలక అవకాశం దొరికింది. భారత ప్రభుత్వ విధివిధానాలపై స్పందించడమే కాకుండా రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అయిన గవర్నర్ల పాత్రపై సైతం అసహనం వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కు సరిగ్గా ఇదే అంశంలో కలిసివచ్చే తోటి సీఎంలతో ముందుకు సాగే సందర్భం ఎదురైంది. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, …
Read More »కేసీఆర్ జగన్ను ఇరికిస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా సీఎం జగన్ చప్పుడు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు కేంద్రంపై పోరుబాటలో సాగుతుంటే.. వైసీపీ మాత్రం కిమ్మనడం లేదు. ఇప్పటికే అన్ని విషయాల్లో జగన్పై విమర్శలు వస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విద్యుత్ మీటర్ల విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చేలా …
Read More »