వైసీపీ కీలక నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. తాజాగా పవన్పై విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత బుధవారం నిర్వహించిన జెండా సభలో చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన.. నాని.. పురాణాలతో పవన్పై విరుచుకుపడ్డారు. పవన్ శల్యుడు, శిఖండి అని వ్యాఖ్యానించారు. “చంద్రబాబుకు సరైన జోడీ దొరికింది. శల్య సారథ్యంలో ఆయన ముందుకు సాగుతున్నాడు. తమ్ముళ్లే ఇక, తేల్చుకోవాలి” అని నాని అన్నారు. …
Read More »నాగబాబు.. ఒక పంచ్.. ఒక క్లారిటీ
పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాగబాబు సోషల్ మీడియాలో వేసే పంచ్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన వ్యంగ్యంగా స్పందించే తీరు, వేసే పంచ్లు జనసైనికులకు బాగా నచ్చుతుంటాయి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన టార్గెట్ చేసుకున్న తీరు చర్చనీయాంశం అయింది. ఐతే ఇప్పుడు జనసేన.. తెలుగుదేశంతో పొత్తుతో సాగుతోంది. …
Read More »ఇంతియాజ్ ఎంట్రీ.. కర్నూలు అసెంబ్లీ నుంచే పోటీ!
రాజకీయాల్లో నాయకులు అనుకుంటే కానిదేముంది? ముఖ్యంగా అధినేతలు తలుచుకుంటే జరగనిది ఏముంటుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేయడం.. సాయంత్రానికి గ్రీన్ సిగ్నల్ రావడం.. సీనియర్ ఐఏఎస్ ఇంతియాజ్ విషయంలో చకచకా జరిగిపోయాయి. అంతేకాదు.. ఆయన గురువారం ఉదయం సీఎం జగన్ను కలుసుకోవడం.. ఆయన ఆశీర్వాదంతో వైసీపీలోకి చేరిపోవడం కూడా అయిపోయాయి. తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాజా మాజీ …
Read More »కాంగ్రెస్లో ఇంటర్వ్యూలు.. షర్మిల ఫార్ములా!
ఏపీలో ఎన్నికల సందడి పెరిగింది. దీంతో టికెట్ల కేటాయింపు కూడా దాదాపు కొలిక్కి వస్తోంది. ఈ క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలు.. సర్వేలు, అభ్యర్థుల గుణ గణాలు, ఆర్థిక పరిస్థితి వంటివాటిని బేరీజు వేసుకుని టికెట్లు కేటాయిస్తున్నాయి. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. ఈ పార్టీ కూడా.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ ఇంటర్వూ చేసేందుకు రెడీ అయింది. …
Read More »కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ?
తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లే అనుమానంగా ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రు. 55 కోట్ల దుర్వినియోగం విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపైన రెరా బాలకృష్ణ కేసులో తగులుకున్నారు. రెరా డైరెక్టర్ గా ఉన్న బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చి తనకు కావాల్సిన నిర్మాణ సంస్ధల నుండి కోట్లరూపాయలు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను అర్వింద్ ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ చేయడానికి ఏసీబీ రెడీ …
Read More »పవన్కు ముద్రగడ సంచలన లేఖ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ సంధించారు. బుధవారం జరిగిన జెండా సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ లేఖ సంధించడం గమనార్హం. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారని అనుకున్నారు. కానీ, కారణాలు తెలియక పోయినా.. ఆయన దూరంగానే ఉన్నారు. మరోవైపు తాడేపల్లి గూడెం సభలో పవన్ మాట్లాడుతూ.. తనతో వచ్చే వాళ్లంతా పోరాడే …
Read More »100 పార్లమెంట్ స్థానాలు : ఫస్ట్ లిస్ట్ ఖాయమేనా ?
తెలంగాణా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈరోజు మొదటి జాబితాను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోని 100 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈvమధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనే ఈరోజు తెలంగాణా మొదటిజాబితా ప్రకటనపైన అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. తెలంగాణాలోని 17 స్ధానాల్లో మొదటి జాబితాలో ఎన్నిvసీట్లలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి. పార్టీvవర్గాల …
Read More »నారా లోకేష్ బలహీనతలు కాదు బలం చూడు!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ప్రజల ఆశీస్సులు.. ఎన్నికల మూడ్ వంటివి నాయకుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఎవరూ ఎప్పుడూ విఫలం కావాలని కూడా ఉండదు. ఇదే ఫార్ములాను.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫాలో అవుతున్నారు. 2019లో తొలిసారి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేశారు. అప్పటి అంచనాల మేరకు.. ఆయన విజయం `పక్కా` అని టీడీపీ నాయకులు …
Read More »భారమంతా చంద్రబాబుదేనా ?
రాబోయే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వీటిల్లో నాలుగు స్ధానాల్లో అసమ్మతి అట్టుడికిపోతోంది. అసమ్మతి నేతలతో మాట్లాడటం, బుజ్జగించటం, దారికి తెచ్చుకోవటం అభ్యర్ధుల వల్లే అయ్యేట్లు లేదు. అందుకనే అసమ్మతి నేతలతో మాట్లాడి దారికితెచ్చే బాధ్యతలు నలుగురు అభ్యర్థులు చంద్రబాబుపైనే పెట్టేశారు. విషయం ఏమిటంటే కల్యాణదుర్గం, శింగనమల, మడకశిర, పెనుకొండలో అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యతిరేక వర్గాలు రెచ్చిపోతున్నాయి. దాంతో అభ్యర్థుల్లో …
Read More »వైసీపీ విముక్తం కోసమే టీడీపీ – జనసేన పొత్తు: చంద్రబాబు
వైసీపీ విముక్తం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైసీపీ దొంగలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు తమదని.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. …
Read More »భీమవరం అభ్యర్ధి ఫైనలైపోయారా ?
పశ్చిమగోదావరి జిల్లాలో ఎంత కీలకమైన భీమవరం నియోజకవర్గంలో జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్ధి ఫైనల్ అయిపోయారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే భీమవరం నుండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి వీరాంజనేయులు పోటీ చేయబోతున్నారు. ఇన్నిరోజులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. టీడీపీ మాజీ ఎంఎల్ఏ …
Read More »‘ఇబ్బందులు పడుతున్నా.. రాజకీయాల నుంచి తప్పుకొంటా’
“అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకొంటా. ఇప్పటికే అన్ని విధాలా సర్దుకుని రాజకీయాల్లో ఉన్నా. పైగా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి” అని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మె ల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒంగోలు పేద ప్రజల కోసం ఇళ్ల పట్టాలను ఇవ్వాలని అడిగానని.. ఇది తన స్వార్థం కోసం కాదని బాలినేని చెప్పారు. అయితే.. ఇదేదో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates