Political News

వైఎస్ వ్యతిరేకిస్తే .. జగన్ ముద్దాడుతున్నాడు

లోక్ సభ ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుండి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి అసలు పోటీ చేయకుండానే జెండా ఎత్తిన షర్మిల ఆంధ్రా రాజకీయాల్లో విజయం సంగతి ఏమో గానీ జగన్ కు నష్టం చేయడం గ్యారంటీ అని …

Read More »

మంటలు రేపిన మంగళసూత్రం !

‘’కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంపడం ఖాయం’’ అని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్న మాటలు మంటలు రేపుతున్నాయి. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. ‘నా మంగళసూత్రం తెంపే దమ్ము ఎవడికి ఉంది ? మీరు కట్టిన మాంగళ్యం విలువ తెలియదు కాబట్టి మీరు తాళికట్టిన ఆడబిడ్డ ఎక్కడో అమాయకంగా …

Read More »

కొండా కాదు.. కోట్ల విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. !!

తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఇంటి పేరు కొండా. కానీ, ఇప్పుడు ఆయ‌న ఆస్తులు, సంప‌ద తెలిసిన త‌ర్వాత‌.. ఆయ‌న‌ను కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కాదు.. కోట్ల విశ్వేశ్వ‌ర‌రెడ్డి అంటున్నారు నెటిజ‌న్లు. తాజాగా కొండా త‌న స్థానానికి నామినేష‌న్ వేశారు. రెండు సెట్ల నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆయ‌న దాఖ‌లు …

Read More »

పేద‌ల‌కు 2 నుంచి 3 సెంట్ల స్థ‌లం ఉచితం: బాబు

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సమ‌యం చేరువ అవుతున్న కొద్దీ.. పార్టీల మ‌ద్య పోటీ కూడా అంతే తీవ్రంగా మారుతోంది. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇచ్చే హామీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికేసూప‌ర్ సిక్స్‌ వంటి కీల‌క ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల ముందు వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా మ‌రో సంచ‌ల‌న హామీ కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే.. పేద‌ల‌కు 2 సెంట్ల నుంచి 3 సెంట్ల భూమి ఇస్తామ‌ని చెప్పారు. అంతేకాదు.. …

Read More »

టీడీపీ చేయాల్సిన వీడియోలు జనసేన చేస్తోంది!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు మీడియా..మరోవైపు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇలా తమ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని ఇరుకున పడేసేలా వీడియోలు చేయడంలో టీడీపీ కాస్త వెనుకబడి ఉంటే…టీడీపీ చేయాల్సిన పనిని జనసేన చేస్తోంది అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. …

Read More »

పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవట

మెగాస్టార్ చిరంజీవి ఓపెన్‌గా జనసేనకు, అలాగే ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం వైసీపీ వాళ్లకు అస్సలు రుచిస్తున్నట్లు లేరు. ఒక టైంలో చిరు.. ఏపీ సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగారు. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా మద్దతు పలికారు. ఆ టైంలో చిరు, వేరు పవన్ వేరు అని.. తమ్ముడికి అన్న మద్దతు వేరని వైసీపీ వాళ్లు ప్రచారం చేశారు. కానీ ఇటీవల చిరు …

Read More »

సూరత్ : లోక్ సభలో బోణి కొట్టిన బీజేపీ

అదే లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న కదా మరి అప్పుడే ఫలితం ఎలా వెల్లడయింది అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు చదివింది నిజమే. పార్లమెంటు ఎన్నికల్లో చాలా అరుదయిన గెలుపు భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరిపోయింది. సూరత్ ఎంపీ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వజ్రాల నగరం సూరత్ పై కాషాయ జెండాను రెపరెపలాడించింది. దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు విడతల్లో …

Read More »

పురందేశ్వరికి వ్యతిరేకంగా బీజేవైసీపీ కుట్ర.?

బీజేపీ గురించి అందరికీ తెలిసిందే.! మరి, ఈ బీజేవైసీపీ ఏంటి.? భారతీయ జనతా పార్టీలో వైసీపీ మద్దతుదారుల గురించే ఈ బీజేవైసీపీ ప్రస్తావన వస్తోంది.! పురంధరీశ్వరి అంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 2024 ఎన్నికల నిమిత్తం, అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ అధినాయకత్వం పురంధీశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. అప్పటినుంచీ, పార్టీని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు దగ్గుబాటి పురంధీశ్వరి. అయితే, …

Read More »

  గ్రేట‌ర్‌పై ప‌ట్టుకు రేవంత్ ప్లాన్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా పీసీసీ అధ్య‌క్షుడు, సీఎం రేవంత్ రెడ్డి సాగుతున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డైతే బ‌ల‌హీనంగా ఉందో గుర్తించి ఆ చోట్ల పార్టీ పుంజుకోవ‌డానికి ఆయ‌న క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌పై రేవంత్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది కానీ గ్రేట‌ర్ …

Read More »

జ‌నాల్లోకి కేసీఆర్‌.. బ‌స్సుయాత్ర‌తో బాగుప‌డేనా?

ఓ వైపు పార్టీలో నుంచి నాయ‌కుల జంపింగ్‌లు.. మ‌రోవైపు వివిధ కార‌ణాల‌తో పార్టీపై వ్య‌తిరేక‌త‌.. కార్య‌క‌ర్త‌ల్లో, జ‌నాల్లో పార్టీపై పోతున్న న‌మ్మ‌కం.. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకు బ‌స్సుయాత్ర‌ను మార్గంగా ఎంచుకున్నారు. ఏప్రిల్ 22 నుంచి కేసీఆర్ బ‌స్సుయాత్ర చేస్తార‌ని బీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా …

Read More »

నేత‌లకు పొలిటిక‌ల్ వ‌డ‌దెబ్బ‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేత‌ల‌కు ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయాల నుంచి సెగ ఏమేర‌కు త‌గులుతున్నా.. ఎండల తీవ్రత కార‌ణంగా.. రాజ‌కీయ సెగ మాత్రం త‌గులుతోంది. సాధార‌ణంగా.. సార్వ‌త్రిక స‌మ‌యం ఏప్రిల్‌తో ముగిసిపోతుంది. పోవాలి కూడా. 2019, 2014లోనూ ఇలానే ఏప్రిల్ రెండో వారానికి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. దీంతో నాయ‌కులు స‌జావుగానే ప్ర‌చారం చేసుకున్నారు. ఎండ‌ల తీవ్ర‌త ఉన్న మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంట‌ల మ‌ధ్య మాత్రం ప్ర‌చారాన్ని …

Read More »

వ్య‌తిరేక‌త అర్థ‌మ‌వుతోందా జ‌గ‌న్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీకి తిరుగేలేదు? ఈ సారి 175 సీట్లు గెలుస్తాం అనే అతివిశ్వాసంతో ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సాగుతున్నారా? క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు వ్య‌తిరేకంగా మారినా అర్థం చేసుకోవ‌డం లేదా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా బ‌స్సుయాత్ర‌లో వివిధ వ‌ర్గాల నుంచి ఎదుర‌వుతోన్న అసంతృప్తి సెగ‌, వ్య‌తిరేక‌తే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా కాకినాడ‌లో కాలేజీ విద్యార్థులు జ‌గ‌న్ ముందే ప‌వ‌న్‌కు …

Read More »